రుషి కొండ ప్యాలెస్ వినియోగం ఎలా.. కేబినెట్ సబ్ కమిటీ తుది సమావేశం తేలుస్తుందా?

Publish Date:Jun 17, 2026

Advertisement

విశాఖపట్నంలోని అందమైన రుషికొండకు బోడి గుండు కొట్టి మరీ,  గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన   ప్యాలెస్  భవితవ్యం  ఏమిటో తేలిపోనున్నది.  రిషికొండ ప్యాలెస్  లగ్జరీ భవనాల వినియోగం,  ఆదాయాన్ని రాబట్టడం ఎలా?  అన్న విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ   కసరత్తు తుది దశకు వచ్చింది. విశాఖలోనే   మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది.  మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయస్వామి సభ్యులుగా ఉన్న ఈ సబ్ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా వచ్చిన ప్రతిపాదనలను, నివేదికలను  పరిశీలించింది. బుధవారం జరిగే  భేటీలో అధికారుల అభిప్రాయాలను సేకరించి, భవనాల వాడకంపై ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం..  వచ్చే కేబినెట్ మీటింగ్‌లోనే  కమిటీ నివేదిక ఆధారంగా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  

అసలు రుషికొండ భవన నిర్మాణాల వెనుక ఉన్న లెక్కలు, వివాదాల విషయానికి వస్తే..  జగన్ హయాంలో.. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో   453 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ  ప్యాలెస్ నిర్మాణం జరిగింది. ఇంత భారీ స్థాయిలో ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ఈ ప్యాలెస్‌ను వృథాగా వదిలేయకుండా..  వీలైనంత త్వరగా ప్రజా వినియోగంలోకి.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే..  ప్రభుత్వ ఆదాయ మార్గాల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీటీడీసీ   కూడా ఈ భవనాల నిర్వహణ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ భవన సముదాయంతో పాటు, దాని పక్కనే ఖాళీగా ఉన్న మరో 9 ఎకరాల భూమిని కూడా లీజుకు ఇస్తామని ప్రకటించడంతో దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పోటీ పడ్డాయి.

ప్రముఖ తాజ్ గ్రూప్, విశాఖలో ఇప్పటికే బేపార్క్‌ను నిర్వహిస్తున్న ఫెమా గ్రూప్, అంతర్జాతీయ స్థాయి అట్మాస్పియర్ కోర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈ ప్యాలెస్ దక్కించుకోవడానికి బిడ్లు దాఖలు చేశాయి. అయితే..  ఇక్కడే ఒక అనూహ్య ట్విస్ట్ ఎదురైంది. ఈ భవనాలను ఒక లగ్జరీ హస్పిటాలిటీ లేదా హోటల్ రంగం వైపు తిప్పాలని కమిటీ భావించినప్పటికీ..  అంతర్జాతీయ హోటల్స్ గ్రూప్స్ మాత్రం ఈ నిర్మాణాలు నేరుగా హోటల్ వ్యాపారానికి అనువుగా లేవని తేల్చి చెప్పాయి. ఈ ప్యాలెస్‌లో భారీగా మార్పులు చేర్పులు చేయాలని, లేదా మరికొన్ని కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇస్తేనే తాము ముందుకు వస్తామని అన్నాయి.

అంతేకాకుండా.. ఏపీటీడీసీ ఆఫర్ చేసిన 9 ఎకరాల ఖాళీ స్థలంలో దాదాపు 7 ఎకరాల భూమి కోస్తా నియంత్రణ జోన్ అంటే సీఆఆర్ జడ్  పరిధిలోకి వస్తుందని అధికారులు గుర్తించారు. దీనివల్ల అక్కడ కొత్త నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు రావడం కష్టం. దీంతో.. నిబంధనలను ఉల్లంఘించకుండా ఏ మేరకు మార్పులు చేయవచ్చు, ఏ రకమైన ప్రతిపాదనలు ఆచరణ సాధ్యమవుతాయనే కోణంలో సబ్ కమిటీ  అధ్యయనం చేస్తోంది.  ఈ కమిటీ సమగ్ర నివేదికను సీఎం చంద్రబాబునాయుడికి సమర్పిస్తుంది.  ఆ తరువాతనే రుషికొండ ప్యాలెస్ భవిష్యత్ ఏమిటన్నది తేలుతుంది. 

By
en-us Political News

  
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.