Publish Date:Nov 20, 2025
నాగార్జునసాగర్ కుడికాలువ కట్టకు గురువారం (నవంబర్ 20)అర్ధరాత్రి గండి పడింది. ఎస్కేప్ ఛానల్ వద్ద కట్టకు గండి పడి నాగులేటి వాగుకు ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. దీంతో వాగు పరీవాహక ప్రాంతాల ప్రజలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పల్నాటి వీరుల తిరునాళ్ల నేపథ్యంలో నాగులేటి వాగుకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలలోకి నీరు చేరింది.
మరో వైపు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోన్న ఆందోళనలో జనం ఉన్నారు. కాగా గండి విషయం తెలుసుకున్న ఎన్నెస్పీ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గండి పూడ్చే పనులు చేపట్టారు.ఇలా ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే కట్టను ధ్వసం చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇలా ఉండగా.. సాగర్ కుడికాలువకు గండిపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే ఆందోళన వద్దంటూ ప్రజలకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చివేత పనులు చేపట్టామనీ, మధ్యాహ్నానికల్లా గండిని పూడ్చేస్తామనీ హామీ ఇచ్చారు. అలాగే గ్రామాలలోకి నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో.. గండి పడటానికి గల కారణాలను నివేదిక రూపంలో అందించాలని మంత్రి నిమ్మల ఆదేశించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/breach-sagar-right-canal-36-209842.html
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.