కేసీఆర్ కు బాబు భయం?

Publish Date:Jun 8, 2023

Advertisement

తెలంగాణలో పూర్వ వైభవం సంతరించుకొనేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఆ క్రమంలో హైదరాబాద్‌లోనే కాకుండా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నసభలకు జనం పోటెత్తుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల వేళ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు టీడీపీ నుంచి కూడా గట్టి పోటీ తప్పదనే విషయం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్పష్టంగా అర్ధమైంది.   ఆ క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ జోరు పెంచేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ వర్గాల్లో కూడా దాదాపుగా ఇదే రకమైన చర్చ సాగుతోంది.  

ఓ వేళ కేసీఆర్.. ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడితే.. తెలుగుదేశం అధినేత  చంద్రబాబు తెలంగాణలో  తన ప్రతాపాన్ని ప్రదర్శించడమే కాకుండా..  అటు కాంగ్రెస్ కు లేదా     ఇటు బీజేపీకి కానీ మద్దతు ఇస్తే.. భారీగా ఓట్లు చీలిపోయే ప్రమాదం  ఉందని.. ఇఅదే జరిగితే కారు టైర్ పంక్చర్ అవ్వడం ఖాయమనీ పరిశీలకులు అంటున్నారు. దీంతో  సైలెంట్‌గా ఉండి.. తెలంగాణలో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకొంటే.. ఆ తర్వాత  సంగతి తరువాత చూసుకోవచ్చుననే  ఆలోచనలో బీఆర్ఎస్ అధినేత ఉన్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో  హల్‌చల్ చేస్తున్నది.  ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభమైనా,  ఆ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడానికి కూడా కారణం అదేనని పరిశీలకులు అంటున్నారు. అలాగే విశాఖపట్నం వేదికగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్రణాళికలు సైతం సిద్ధం చేసినా ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని చెబుతున్నారు.

అయితే ఏపీలో కేసీఆర్ అడుగు పెట్టకపోవడం వెనుక పెద్ద తతంగమే ఉందన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో మొదలైంది.  ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సీఎం కేసీఆర్ సొంతంగా... పలు సర్వేలు  చేయించుకొన్నారని.. ఆ వివరాల ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ పార్టీ పోటీ చేస్తే.. వచ్చే అనుకూల ఫలితాల కంటే.. తెలంగాణలో ప్రస్తుతం చేతిలో ఉన్న అధికారం కూడా చేజారే అవకాశాలు మెండుగా ఉన్నాయని... అదే విధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నేతగా, టీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్... ఆంధ్రులను లక్ష్యంగా చేసుకొని చేసిన వ్యాఖ్యలు ఇంకా వారి మనస్సు పొరల్లో భద్రంగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో  బీఆర్ఎస్ పార్టీ పట్ల.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని సదరు నివేదికలు క్లియర్‌కట్‌గా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 


మరోవైపు రాష్ట్ర విభజనతో రాజధాని హైదరాబాద్‌ని ఆంధ్రులు కోల్పోయారని.. ఆ సమయంలో అంటే 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి.. ఆ దిశగా ఆయన అడుగులు వేశారని.. అంతలో 2019 ఎన్నికలు రానే వచ్చాయని.. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్... ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం.. ఆ తర్వాత.. ఆయన ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటించడంతో.. రాజధాని అమరావతిని సైతం కోల్పోయిన పరిస్థితికి దాదాపుగా వచ్చేశామని.. దీంతో రాష్ట్ర విభజనకే కాదు.

గత ఎన్నికల్లో వైయస్ జగన్‌ గెలుపునకు పూర్తి సహాయ సహకారాలు అందించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తన వంతు పాత్ర పోషించారని... ఈ నేపథ్యంలో గులాబీ బాస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత సైతం వ్యక్తమవుతోందనే చర్చ సైతం సదరు సర్వే నివేదికల్లో స్పష్టమైనట్లు తెలుస్తోంది. అటువంటి వేళ గులాబీ బాస్ కేసీఆర్.. తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసి.. ఆ తర్వాత ఎప్పటిలాగా లోక్‌సభ ఎన్నికలపై దృషి సారించే అవకాశాలు ఉన్నాయని కారు పార్టీలో ఓ ముచ్చట అయితే ముచ్చటగా సాగుతోంది.

By
en-us Political News

  
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని హైదరాబాదులోని వారి నివాసానికి వెళ్లి సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల సుజనా చౌదరి లండన్ లో ఓ ప్రమాదంలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఇంటికెళ్ళి ఆయన ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్థికశాస్త్ర నిపుణుడు, నోబెల్‌ అవార్డు గ్రహీత అభిజిత్‌ బెనర్జీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఆదాయాన్ని పెంచేందుకు ఉన్న మార్గాలు తదితర అంశాలపై చర్చించారు
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిశారు.శనివారం సాయంత్రం నారా లోకేశ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి దేశ రాజధాని దిల్లీకి చేరుకున్నారు. అనంతరం, ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
రైతుబజార్‌లో కూరగాయలు కొని ముఖ్యమంత్రి చంద్రబాబు డిజిటల్ పేమెంట్ చేశారు. అనంతరం కూరగాయలు వ్యాపారి అయిన మహిళను ఫోన్ పే చేశాను అమ్మ ఒకసారి చెక్ చేసుకో సీఎం చంద్రబాబు అన్నారు.
కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ సైనిక దళం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలో తిరుపతి, తూర్పుగోదావరి, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతల్లో కరెంట్ అంతరాయం ఏర్పడింది. అటు తెలంగాణలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీలో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గోన్నారు.
పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని రాజ్యసభ నేత కపిల్ సిబల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉపా చట్టాన్ని ఉపయోగించాలని ఆయన సూచించారు.
భారత్‌, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ నేటి నుంచి పున:ప్రారంభం కానుంది. పఠాన్‌ కోట్‌, జమ్ములో పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడుల నేపథ్యంలో మే 8న ధర్మశాలలో దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో.. తొమ్మిది రోజుల అనంతరం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పునఃప్రారంభం కానుంది.
ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. 138 దేశాలతో పోటీపడి ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలవడంపై సీవీ ఆనంద్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబుకు హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. 2017లో కాళేశ్వరం ప్రాజెక్టుకు భూసేకరణ సమయంలో ఆయనపై నమోదైన కేసును కొట్టిసింది.
విజయవాడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ వల్లభనేని వంశీకి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. వివిధ కేసుల్లో రిమాండ్‌ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీ మీద తాజాగా మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. గన్నవరంలో భారీగా అక్రమ మైనింగ్‌ కేసుకు పాల్పడ్డారని ఆరోపణల మీద ఒక కేసు, నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలతో మరో కేసును నమోదు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.