కేసీఆర్ కు బాబు భయం?

Publish Date:Jun 8, 2023

Advertisement

తెలంగాణలో పూర్వ వైభవం సంతరించుకొనేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఆ క్రమంలో హైదరాబాద్‌లోనే కాకుండా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నసభలకు జనం పోటెత్తుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల వేళ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు టీడీపీ నుంచి కూడా గట్టి పోటీ తప్పదనే విషయం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్పష్టంగా అర్ధమైంది.   ఆ క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ జోరు పెంచేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ వర్గాల్లో కూడా దాదాపుగా ఇదే రకమైన చర్చ సాగుతోంది.  

ఓ వేళ కేసీఆర్.. ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడితే.. తెలుగుదేశం అధినేత  చంద్రబాబు తెలంగాణలో  తన ప్రతాపాన్ని ప్రదర్శించడమే కాకుండా..  అటు కాంగ్రెస్ కు లేదా     ఇటు బీజేపీకి కానీ మద్దతు ఇస్తే.. భారీగా ఓట్లు చీలిపోయే ప్రమాదం  ఉందని.. ఇఅదే జరిగితే కారు టైర్ పంక్చర్ అవ్వడం ఖాయమనీ పరిశీలకులు అంటున్నారు. దీంతో  సైలెంట్‌గా ఉండి.. తెలంగాణలో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకొంటే.. ఆ తర్వాత  సంగతి తరువాత చూసుకోవచ్చుననే  ఆలోచనలో బీఆర్ఎస్ అధినేత ఉన్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో  హల్‌చల్ చేస్తున్నది.  ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభమైనా,  ఆ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడానికి కూడా కారణం అదేనని పరిశీలకులు అంటున్నారు. అలాగే విశాఖపట్నం వేదికగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్రణాళికలు సైతం సిద్ధం చేసినా ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని చెబుతున్నారు.

అయితే ఏపీలో కేసీఆర్ అడుగు పెట్టకపోవడం వెనుక పెద్ద తతంగమే ఉందన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో మొదలైంది.  ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సీఎం కేసీఆర్ సొంతంగా... పలు సర్వేలు  చేయించుకొన్నారని.. ఆ వివరాల ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ పార్టీ పోటీ చేస్తే.. వచ్చే అనుకూల ఫలితాల కంటే.. తెలంగాణలో ప్రస్తుతం చేతిలో ఉన్న అధికారం కూడా చేజారే అవకాశాలు మెండుగా ఉన్నాయని... అదే విధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నేతగా, టీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్... ఆంధ్రులను లక్ష్యంగా చేసుకొని చేసిన వ్యాఖ్యలు ఇంకా వారి మనస్సు పొరల్లో భద్రంగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో  బీఆర్ఎస్ పార్టీ పట్ల.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని సదరు నివేదికలు క్లియర్‌కట్‌గా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 


మరోవైపు రాష్ట్ర విభజనతో రాజధాని హైదరాబాద్‌ని ఆంధ్రులు కోల్పోయారని.. ఆ సమయంలో అంటే 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి.. ఆ దిశగా ఆయన అడుగులు వేశారని.. అంతలో 2019 ఎన్నికలు రానే వచ్చాయని.. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్... ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం.. ఆ తర్వాత.. ఆయన ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటించడంతో.. రాజధాని అమరావతిని సైతం కోల్పోయిన పరిస్థితికి దాదాపుగా వచ్చేశామని.. దీంతో రాష్ట్ర విభజనకే కాదు.

గత ఎన్నికల్లో వైయస్ జగన్‌ గెలుపునకు పూర్తి సహాయ సహకారాలు అందించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తన వంతు పాత్ర పోషించారని... ఈ నేపథ్యంలో గులాబీ బాస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత సైతం వ్యక్తమవుతోందనే చర్చ సైతం సదరు సర్వే నివేదికల్లో స్పష్టమైనట్లు తెలుస్తోంది. అటువంటి వేళ గులాబీ బాస్ కేసీఆర్.. తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసి.. ఆ తర్వాత ఎప్పటిలాగా లోక్‌సభ ఎన్నికలపై దృషి సారించే అవకాశాలు ఉన్నాయని కారు పార్టీలో ఓ ముచ్చట అయితే ముచ్చటగా సాగుతోంది.

By
en-us Political News

  
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.