జగన్ లో ఎన్నికల భయం

Publish Date:Jun 8, 2023

Advertisement

నిండా మునిగిన వాడికి చలేమిటంటారు. అయితే ఈ నానుడి ఏపీలో అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి వర్తిస్తున్నట్లు లేదు. అన్ని వైపుల నుంచీ వ్యతిరేకత వెల్లువెత్తుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో ఎన్నికల భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బుధవారం (జూన్ 7) జరిగిన కేబినెట్ భేటీలో ఆయన మాటల్లో ఈ విషయం  తేటతెల్లమైంది.

గడపగడపకూ వైఫల్యంపై మంత్రులపై ఆగ్రహం లేదు. టికెట్ ఇవ్వబోనన్న హెచ్చరికల్లేవు. పని తీరుపై సమీక్షలు లేవు. ఇవేమీ లేకపోగా బాబ్బాబు ఓ తొమ్మిది నెలలు కష్టపడి పని చేయడం చాలు మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామన్న వినతులు, విజ్ణప్తులే కనిపించాయి. ఇక కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే 2019 ఎన్నికలకు ముందు చెప్పిన అబద్ధాలనే కొత్తగా 2024 ఎన్నికల ముందు మరోసారి వల్లెవేయడం వినా మరో కొత్త వ్యూహాలు కానీ, కార్యాచరణ ప్రణాళికలు కానీ ఉన్నట్లు కనిపించలేదు. ప్రభుత్వ వ్యవహారాలు, రాష్ట్ర ప్రగతిపై దృష్టి సారించే సమయమే కరవైన జగన్ కు  ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వినా మరో గత్యంతరం లేదన్న విశ్లేషణలు ఇటీవలి కాలంలో వెల్లువెత్తాయి. అసలు బుధవారం (జూన్ 7) నాటి కేబినెట్ భేటీ ముందస్తు ప్రకటన కోసమేనని కూడా ఊహాగానాలు వెల్లువెత్తాయి. రాజకీయ పరిశీలకులు కూడా ముందస్తే జగన్ కు మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం అన్న రీతిలో విశ్లేషణలు చేశారు.

అసలు ముందస్తు ముచ్చట తీసుకు వచ్చింది కూడా స్వయంగా జగనేనని తెలిసిందే. అలాగే ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎప్పటికప్పుడు ముందస్తు ముచ్చటను సజీవంగా ఉంచడంలో తన వంతు ప్రయత్నం చేశారు. స్వయంగా ఆయన నోటితోనే జగన్ ముందస్తు యోచనలో ఉన్నారని కూడా చెప్పారు. సరే వీటన్నిటినీ పక్కన పెడితే ఇటీవల హస్తిన పర్యటనకు వెళ్లిన జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అర్ధరాత్రి భేటీ తరువాత.. అక్కడి నుంచే కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు చేయడంతో ఇక ముందస్తే అని అంతా భావించారు. అయితే వారం రోజుల వ్యవధిలో అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి.  

ముందస్తుకు వెడితే ముందే మునిగిపోవడం ఖాయమన్న ఇంటెలిజెన్స్ నివేదికలతో జగన్ తన నిర్ణయం మార్చుకున్నారని అంటున్నారు. ముందస్తైనా కాకున్న మునక ఖాయమని తేలిపోయిన తరువాత ముందుగా అధికారం కోల్పోవడమెందుకన్న భావనతోనే ఆయన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అంటూ కొత్త పల్లవి అందుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు గడపగడపకూ ఉద్దేశమే చేసిన పనులు చెప్పుకుని విపక్షానికి ఎన్నికల ప్రిపరేషన్ కు సమయం లేకుండా చేసి ముందస్తుకు వెళ్లడమే. అయితే గడపగడపకులో వెల్లువెత్తిన నిరసన సెగలు, పార్టీలో రోజురోజుకూ తీవ్రమౌతున్న అసంతృప్తి చూసిన తరువాత ఇక ఏ మాత్రం ఆలస్యం చేసినా మొదటికే మోసం తప్పదన్న భావన పార్టీ శ్రేణుల్లోనే ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే జగన్  కూడా ముందస్తు సంకేతాలు ఇస్తూనే వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా కానిచ్చేయాలని ప్రణాళికలు కూడా రచించారు.

ఇందుకు హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు చెబుతున్నారు. ముందస్తుకు వెళ్లకుంటే రాష్ట్రంలో జగన్ సర్కార్ పై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతకు..   మోడీ ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసి మొత్తానికే మోసం వస్తుందన్న భావన వైసీపీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులు కూడా ముందస్తు తథ్యమనే నిర్ణయానికి వచ్చేశారు. అయితే అనూహ్యంగా ముందస్తు విషయంలో జగన్ వెనకడుగు వేశారు. ఇందుకు ఓటమి భయమే కారణమని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. 
రాజమహేంద్రవరం మహానాడులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా మినీ మేనిఫెస్టో ప్రకటించడంతో.. జగన్ వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవడం అన్న విషయంలో మైండ్ బ్లాంక్ అయిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేకపోవడంతో  జనం కూడా ఫిక్సైపోయారనీ, ఓటమి తప్పించుకోవాలంటే.. మిగిలిన తొమ్మిది నెలల కాలంలో  జగన్ సర్కార్ అద్భుతాలు చేయాల్సి ఉంటుందని జగన్ నియమించుకున్న ఐప్యాక్ సర్వేలే తేటతెల్లం చేయడంతో జగన్ ముందస్తు విషయంలో వెనక్కు తగ్గారని అంటున్నారు. ముందస్తుగా అధికారం కోల్పోవడమెందుకు చివరి వరకూ అధికారంలో ఉండి ఈ తొమ్మది నెలల కాలంలో మళ్లీ ఉచితాలు, వాగ్దానాలతో ప్రజలను మరోసారి మాయ చేయాలని జగన్ భావిస్తున్నారు. ఎవరేమన్నా ఏమనుకున్న పార్లమెంటు ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలకు వెళితే.. అటు మోడీ ప్రభుత్వ యాంటీ ఇంకంబెన్సీ కూడా తోడై జగన్ పార్టీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమన్న అంచనాల నేపథ్యంలో  జగన్ ముందస్తు యోచన చేసినా ముందస్తైనా వెనకస్తైనా ఫలితం ఒకటే కదా.. అన్న భావనతో జగన్ వెనకడుగు వేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.