దేశ రాజధాని హస్తినలో ఎంపీ పప్పుయాదవ్ పై దాడి యత్నం జరిగింది. బిహార్లోని పూర్ణియా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా విజయం సాధించిన రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్పై హస్తినలో ఆయన అధికారిక నివాసంలోనే దాడి జరగడం కలకలం రేపింది. వ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆదివారం (ఆగస్టు 2) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పప్పూయాదవ్ పై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు.
అదే సమయంలో మరో వ్యక్తి.. కత్తితో దాడికి ప్రయత్నించాడు. పప్పు యాదవ్ సిబ్బంది, మద్దతుదారులు అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దాడితో ప్రెస్మీట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ మద్దతుదారులు చెప్పు విసిరిన వ్యక్తిపై భౌతిక దాడికి ప్రయత్నించారు.
అయితే.. ఎంపీ పప్పు యాదవ్ ఆ దాడి జరగకుండా నివారించారు. అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సాధు సంత్ ల పట్ల పప్పు యాదవ్ అనుచితంగా మాట్లాడారనే ఆగ్రహంతోనే తాను ఈ చర్యకు పాల్పడినట్లు నిందితుడు తెలిపినట్లు సమాచారం. కాగా ఈ దాడి ఘటనపై పప్పుయాదవ్ మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిర విరాళాల విషయంలో తీవ్రమైన అవకతవకలు, అక్రమాలు జరిగాయని తాను బహిరంగంగా ఆరోపించినప్పటి నుంచీ, తనకు నిరంతరం బెదిరింపులు వస్తున్నాయన్నారు.
కొందరైతే తన 51 లక్షల రివార్డు ప్రకటించారని తెలిపారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిజాలను నిర్భయంగా మాట్లాడే ప్రజాప్రతినిధులపై ఇలాంటి దాడు దాడులు దారుణమని పప్పుయాదవ్ అన్నారు.
Pappu Yadav shoe thrown, Purnia MP attack Delhi, Ram Mandir donation controversy, Pappu Yadav knife attack attempt, Telugu One
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/attack-on-pappu-yadev-36-227828.html
బోనం కింద పడటంతో జోగిని శ్యామలతో పాటు పలువురు జోగినులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. జాతర సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించేందుకు వచ్చిన తమకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పలాంటిర్ టెక్నాలజీస్ మరియు అర్మాడా సంయుక్తంగా షిప్పింగ్ కంటైనర్లలో ఎన్విడియా B300 AI యాక్సిలరేటర్లతో పనిచేసే మొబైల్ వార్ డేటా సెంటర్లను ఆవిష్కరించాయి. ఇంటర్నెట్ మరియు క్లౌడ్ కనెక్షన్ లేకపోయినా యుద్ధ రంగంలోనే స్వతంత్రంగా పనిచేసే ఈ వినూత్న టెక్నాలజీ విశేషాలు చూడండి.
సోనీ సంస్థ తన 10 ఏళ్ల మైలురాయిగా విడుదల చేసిన అత్యంత విలాసవంతమైన 1000X కలెక్షన్ వైర్లెస్ హెడ్ఫోన్స్పై మొదటిసారి 15 శాతం పరిమిత కాలపు డిస్కౌంట్ను ప్రకటించింది. DSEE ఆల్టిమేట్ టెక్నాలజీ, 12 మైక్రోఫోన్ల నోయిస్ క్యాన్సిలేషన్ మరియు 24 గంటల బ్యాటరీ లైఫ్ ఉన్న ఈ ప్రీమియం ఆడియో డివైజ్ పూర్తి వివరాలు మరియు ఆఫర్ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ లిమిటెడ్ ఐపిఓ ప్రైస్ బ్యాండ్ రూ. 200 212 గా నిర్ణయించబడింది. ఆగస్టు 7 నుండి 11 వరకు సబ్స్క్రిప్షన్ కి అందుబాటులో ఉండే ఈ ఐపిఓ పూర్తి వివరాలు, లాట్ సైజ్ మరియు లిస్టింగ్ తేదీలను ఇక్కడ తెలుసుకోండి.
8వ వేతన సంఘం 8th Pay Commission వార్షిక ఇంక్రిమెంట్ ప్రతిపాదనలపై కీలక వివరాలు. 3%, 5%, మరియు 6% ఇంక్రిమెంట్ల ఆధారంగా లెవెల్ 1, 2, 3 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనం 5 ఏళ్లలో ఎలా పెరుగుతుందో సమగ్రంగా తెలుసుకోండి.
మదర్సాలు ఉగ్రవాదులను తయారు చేసే కర్మాగారాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని పరిశీలించినా పౌరులందరికీ సమానమైన చట్టాలు అమలులో ఉన్నాయన్న తస్లీమా.. ఇండియాలో మాత్రం మహిళలు ఇప్పటికీ చట్టపరంగా, సామాజికంగా వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగస్టు 3న భారత స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల దిశగా దూసుకుపోతున్నాయి. తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు, రూ. 20,200 కోట్ల ఎఫ్పిఐ పెట్టుబడులు మరియు ఆర్బిఐ పాలసీ అప్డేట్స్తో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వ్యాపారంలో చెల్లించని లేదా బాకీ ఉన్న ఖర్చులను పన్ను మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చా? రూ. 8 కోట్ల నష్టపరిహార వివాదంలో ఐటీఏటీ ITAT ముంబై ఇచ్చిన సంచలన తీర్పు, పన్ను మినహాయింపు నిబంధనలు మరియు మ్యాచింగ్ ప్రిన్సిపుల్ సమగ్ర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గ్, జూబ్లీహిల్స్ వంటి ప్రైమ్ ఏరియాల్లో నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న 10 అంతస్తుల ఇందిరమ్మ LIG హౌసింగ్ టవర్లు, 7,680 ఫ్లాట్లు మరియు పూర్తి ప్రాజెక్ట్ వివరాలను తెలుసుకోండి.
శ్రీలంకతో జరిగే 2 టెస్టుల సిరీస్కు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. ఆయన స్థానంలో జమ్మూకశ్మీర్ పేస్ సంచలనం ఆకిబ్ నబీకి జట్టులో చోటు దక్కింది. నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా కూడా గాయపడటంతో టీమిండియా పరిస్థితి ఏమిటో పూర్తి వివరాలు తెలుసుకోండి.
తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్లో వియత్నాం షట్లర్ లిన్ ఎంగుయెన్ను 21 16, 21 16తో ఓడించి తన్వి శర్మ చారిత్రాత్మక టైటిల్ గెలుచుకుంది. 18 ఏళ్ల తర్వాత సైనా నెహ్వాల్ రికార్డును పునరావృతం చేస్తూ తొలి బిడబ్లూఎఫ్ వరల్డ్ టూర్ 300 టైటిల్ను సొంతం చేసుకుంది.
ఎంఎస్ ధోనీ కంటే ఆశిష్ నెహ్రాకే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్ ఉందంటూ ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ మొయిన్ అలీ చేసిన సంచలన వ్యాఖ్యలు, నెహ్రా కోచింగ్ శైలి వెనుక ఉన్న అసలు కారణాలు మరియు వారి క్రికెట్ గణాంకాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.