'ప్రత్యేక' ప్రకటనకి కారణం పవనా? చంద్రబాబా?

Publish Date:Sep 1, 2016

Advertisement

ప్రత్యేక హోదా... మొన్నటి వరకూ ఇదే ప్రయోగం వినిపించేది ఎక్కడ చూసినా! కాని, ఇప్పుడు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్రకటన అనేది వినిపిస్తోంది! అంటే ఏంటో ఇప్పటికిప్పుడు ఎవరికీ తెలియదు. కాని, ప్రత్యేకమైన ప్రకటన ఒకటి ఏపీ కోసం చేస్తారని మాత్రం అందరి అంచనా. అందుకు తగ్గట్టే ఢిల్లీలో అలజడి కూడా వుంది. వెంకయ్య, సుజనా చౌదరి లాంటి ఏపీ నేతలు బిజీబిజీగా మీటింగ్ లకు అటెండ్ అవుతున్నారు. జైట్లీ, షా లాంటి హస్తిన పెద్దలు కూడా ఏపీపైన దృష్టి పెట్టినట్టే కనిపిస్తోంది.... 


ప్రత్యేక హోదా ఇస్తామని గత యూపీఏ ప్రభుత్వం చట్ట సభలో అధికారికంగా చెప్పింది. అందుకు కారణం కూడా వెంకయ్య నాయుడే. ఆయనే ఒంటరిగా లేచి నిల్చుని ప్రత్యేక హోదా కావాలని నినదించారు. మన్మోహన్ తో ప్రకటన చేయించారు. అయితే, ఇప్పుడు అదే బీజేపి పెద్దలకు తలనొప్పిగా మారింది! ప్రత్యేక హోదా ఇవ్వటం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత తేలిక కాదు. ఒక్క ఆంద్రప్రదేశ్ కు ఇస్తే అది అక్కడితో ఆగేది కూడా కాదు. ఇంకా చాలా రాష్ట్రాలు అదే డిమాండ్ తో ముందుకు వస్తాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కూడా స్పెషల్ స్టేటస్ కోరే ఛాన్స్ వుంది. ఇలాంటి పొలిటికల్ ప్రాబ్లమ్స్ మాత్రమే రాజ్యాంగ బద్ధంగా కూడా అనేక సమస్యలు వచ్చే అవకాశం వుంది ప్రత్యేక హోదా విషయంలో. అందుకే, ప్రత్యేక హోదా ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ లేదా ప్రత్యేక ప్రకటనగా మారిపోయింది. ఇంతకీ ప్రత్యేక ప్రకటనలో వుండేదేంటి? 


ప్రత్యేక ప్రకటనలో మోదీ సర్కార్ ఏపీకి ఇచ్చేదేంటో ఇప్పుడే తెలియదు. కాని, ప్రత్యేక హోదాలో వుండే అన్ని లాభాలు ఇందులో వుంటాయని అంటున్నారు. కాని, అంత పెద్ద వరాల చిట్టా హఠాత్తుగా కేంద్రం ఇప్పుడెందుకు విప్పుతోంది? కారణం పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభ అనుకున్నారు చాలా మంది. ఎందుకంటే, పవర్ స్టార్ సభ పెట్టి బీజేపిని ఇస్టానుసారం విమర్శించాకే ఢిల్లీలో కదలిక వచ్చింది. కాని, ఇప్పుడు కొన్ని వర్గాల సమాచారం ప్రకారం మరో విషయం తెలుస్తోంది!. ఎన్డీఏలో టీడీపి భాగస్వామి. మోదీతో ఎన్నికల ముందు చాలా పార్టీలు జట్టు కట్టటానికి వెనుకంజ వేశాయి. కాని, అలాంటి సమయంలోనే చంద్రబాబు స్నేహ హస్తం అందించారు. ఓటింగ్ కంటే ముందే ఎన్డీఏలో భాగస్వామిగా వుండి నవ్యాంధ్రలో బీజేపి గెలుపుకు వీలైనంత సహకరించారు. 2014 తరువాత కూడా గత రెండేళ్లుగా శివసేన లాంటి ఎన్డీఏ పక్షాల్లాగా టీడీపీ అల్లరి పెట్టలేదు. ఎన్డీఏలో క్రమశిక్షణగానే మెదులుతూ వచ్చింది. 


రెండేళ్లుగా టీడీపీ ఎన్డీఏకు ఎంతగా సహకరించినా ప్రత్యేక హోదా విషయంలో మోదీ క్యాబినేట్ ఎలాంటి డెసీషన్ తీసుకోలేదు. దీని వల్ల చంద్రబాబు గవర్నెమెంట్ జనం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. అంతే కాదు, ఏపీకి మేలు జరగకున్నా ఎందుకు ఎన్డీఏలో వుంటున్నారనే వారు కూడా ఎక్కువైపోతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో చంద్రబాబు తన అంతిమ అస్త్రంగా ఎన్డీఏ నుంచి బయటకు వస్తామని చెప్పారంటున్నారు. కేంద్రం పెద్దలకు బాబు ఇక మా వల్ల కాదు మేం గుడ్ బై చెప్పేస్తాం అనటంతోనే కాస్త కదలిక వచ్చిందట! దాని ఫలితమే ప్రత్యేక ప్రకటన కసరత్తు అని కూడా తెలుస్తోంది...
నిజంగా చంద్రబాబు వారెంట్ ఇచ్చారో లేదో తెలియదుగాని ఏదో ఒక కారణం చేత రాష్ట్రానికి మేలు జరిగితే అదే చాలు! 

By
en-us Political News

  
తన కృషికి తగిన గుర్తింపు రాలేదన్న కినుకతో ఏబీవీ ఉన్నట్లు కనిపిస్తున్నారు.ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని చేపట్టలేదు. జగన్ హయాంలో జరిగిన అవకతవకలపై విమర్శలతో పాటుగా, ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలనూ ప్రశ్నించడం ఆరంభించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తూ లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవనీ కుండబద్దలు కొట్టేశారు.
రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి.
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.