Publish Date:Oct 11, 2019
వైయస్ఆర్ రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితాలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు కూడా ఉండటం కలకలం రేపింది.ఒక్కసారిగా అధికారులు కూడా హుటాహుటిన ఆయన పేరును తొలగించేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల్లో ప్రారంభించనున్న వైయస్ఆర్ రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను రాష్ట్రమంతా విడుదల చేశారు. ఈ జాబితాలో మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు కూడా చోటుచేసుకుంది. త్రిపురాంతకం మండలం, గణపవరం మండలంలో విడుదల చేసిన జాబితాలో మంత్రి పేరుంది. విషయం తెలుసుకున్న మంత్రి ఈ పొరపాటు ఎలా జరిగిందో విచారణ జరిపించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. జాబితాలో పొరపాటు జరిగిందన్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పథకాల లబ్ధిదారుల జాబితాను విడుదల చేసే ముందు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని సూచించారు మంత్రి ఆదిమూలపు సురేష్.
ఆదిమూలపు సురేష్ పేరు ఆయన కోడ్,డీటైల్స్ ఆయన తండ్రి పేరు అన్నీ చాలా స్పష్టంగా వైయస్ఆర్ రైతు భరోసా గ్రామ అర్హుల జాబితాలో ఉంది. క్రమ సంఖ్య 223 అలాగే పట్టాదారుల ఖాతా 1881 చాలా స్పష్టంగా ఉంది. ఆయన కూడా దీనిని అంగీకరించారు.ఈ వివరాలన్ని తనవేనని, కానీ ఇందులోకి ఎలా వచ్చాయో అన్న విషయం పై విచారణ జరిపిస్తున్నట్లు తెలియజేశారు.ఈ పధకం కింద లబ్దిపొందాలంటే దాదాపుగా ఐదెకరాలకు మించి పొలం ఉండకూడదు అలాగే ఆదాయపు పన్ను కడుతున్నా కూడా దీనికి అర్హులు కారు. అయితే మంత్రి సురేష్ పేరు ఇక్కడ రావడంతో ఆయన ఇంతకు ముందు గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో కూడా ఈ రైతు భరోసా పథకం కింద ఏమన్నా లబ్ధిదారిగా ఉన్నారా లేకపోతే కొత్తగా ఈయన పేరు నమోదు చేశారా అనే విషయం కూడా విచారణకు స్వీకరించారు. ప్రస్తుతం ఐతే పేరును తోలగించడమే కాక విచారణ జరుపుతున్నట్లు తెలియజేస్తున్నారు అధికారులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-minister-adimoolapu-suresh-name-in-ysr-rythu-bharosa-scheme-list-25-89967.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!