ఏపీ మద్యం కుంభకోణం కేసు.. తెలుగు రాష్ట్రాలలో ఈడీ సోదాలు
Publish Date:Apr 24, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు చోటుచేసు కున్నాయి. వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. శుక్రవారం(ఏప్రిల్ 24) తెల్లవారు జామునుంచే తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొత్తం 20 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఏపీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి పలువురు కీలక వ్యక్తుల ఇళ్లు, కార్యాల యాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు జరిపిన ఏపీ సిఐడి సమర్పించిన నివేదిక ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఏపీ సి ఐ డి తన విచారణ లో భారీ స్థాయిలో అక్ర మాలు జరిగినట్లు నిర్ధారించడంతో ఈడీ చర్యలు మరింత వేగం పుంజుకు న్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడి అధికారులు హైదరా బాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్70లో ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో నగరం లోని మరికొందరు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా అధికారులు రికార్డులు, డిజిటల్ పరిక రాలు, ఆర్థిక లావాదే వీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు ఉదయం నుంచి కొనసా గుతుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాం శంగా మారాయి. అలాగే ఇదే సమయంలో తిరుపతి, విజయవాడ లోనూ పలువురు నిందితుల ఇళ్లలో సోదాలు కొనసాగుతు న్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిగా , ధనుంజయరెడ్డి, చాణిక్య, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, అవినాష్గౌడ్, ముప్పిడి అవినాష్, సజ్జల శ్రీధర్ రెడ్డి తదితరుల నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు వైసీపీ సీనియర్ నాయకుడు చెవిరెడ్డి నివాసానికి వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. అలాగే ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆయన నివాసం బయట ఈడీ అధికారులు వేచి చూస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు, షెల్ కంపెనీలు, బీనామీ ఆస్తులు, మద్యం సరఫరా ఒప్పందా లకు సంబంధించిన కీలక ఆధారాలను అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. ఏపీ సిఐడి నివేదిక ప్రకారం ఈ లిక్కర్ స్కాం ద్వారా వేల కోట్ల రూపాయలు అక్రమంగా మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈడీ గతంలో పలువురు నిందితుల నుంచి స్టేట్మెంట్లు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజా సోదాల ద్వారా మరిన్ని కీలక ఆధారాలు బయట పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి లో జరుగుతున్న ఈ సోదాలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ కేసు ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతు న్నారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని కీలక వ్యక్తులు ఈ కేసులో బయటపడే అవకాశం ఉందని సమాచారం.
http://www.teluguone.com/news/content/ap-liquor-scam-case-36-218139.html





