జగన్ సర్కార్ విద్యుత్ సంస్థలకు డబ్బులు ఎగ్గొట్టేందుకు కొత్త పన్నాగం పన్నింది. ఏపీ డిస్కమ్ లు దివాళా తీశాయనీ, చెల్లింపులకు డబ్బులు లేవనీ చెబుతోంది. ఏపీ విద్యుత్ సంస్థలు ఏకంగా తమకు విద్యుత్ సరఫరా చేసిన సంస్థలకు చెల్లించేందుకు తమ వద్ద డబ్బులు లేవని కోర్టుకు విన్నవించాయి. వాస్తవానికి సాంప్రదాయేతర విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ కు పీపీఏల ప్రకారం చెల్లింపులు చేసి తీరాల్సిందేనని గత మార్చి 15న విస్పష్ట తీర్పు ఇచ్చిన ఏపీ హై కోర్టు ఆ చెల్లింపులకు ఆరు వారాల గడువు ఇచ్చింది.
అయితే ఆ తీర్పును ఏ మాత్రం ఖాతరు చేయని ప్రభుత్వం ఈ ఆరు వారాల పాటూ ఎటువంటి చెల్లింపులూ చేయలేదు. ఇప్పుడు తమ వద్ద డబ్బులు లేని కారణంగా చెల్లింపు చేయలేని పరిస్థితి ఉందని కోర్టుకు చెబుతోంది. వాస్తవానికి గత ప్రభుత్వం సాంప్రదాయేతర విద్యుత్ సంస్థలతో చేసుకున్న పీపీఏలను వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే రద్దు చేసింది. ఆ సంస్థలు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు పీపీఏల ప్రకారం ముందుకు పోవలసిందేనని తీర్పు ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బిల్లులు చెల్లించడం నిలిపివేసింది. దీంతో ఆ కంపెనీలు మళ్లీ కోర్టును ఆశ్రయించాయి. ఈ సారి కోర్టు మరింత విస్పష్టంగా పీపీఏల ప్రకారం చెల్లింపులు చేయాలని, బకాయిలు, భవిష్యత్ లో ధరలు కూడా పీపీఏలలో పేర్కొన్న ప్రకారమే చెల్లించాలని తేల్చి చెప్పింది. దీంతో ఏపీ సర్కార్ విద్యుత్ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు రమారమి రూ.20 వేల కోట్లుగా తేలింది. కోర్టు ఆదేశాల మేరకు ఆ సొమ్ము చెల్లించి తీరాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇదిగో ఇక్కడే సర్కార్ కొత్త ఎత్తుగడకు తెరలేపింది. డిస్కమ్ లు రుణాల ఊబిలో కూరుకున్నాయనీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న డిస్కమ్ లు ఇప్పుడు చెల్లింపులు చేసే పరిస్థితిలో లేవనీ కోర్టుకు విన్నవించుకుంది. వాస్తవానికి ఏపీ సర్కార్ పీపీఏల బకాయిలు ఎగ్గొట్టే ఎత్తుగడతోనే వాటి నుంచి విద్యుత్ తీసుకోకుండా అంతకంటే అధికదర చెల్లించి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసిన సందర్భాలు బోలెడున్నాయి.
పీపీఏల విషయంలో ఏపీ తీరును కేంద్రం కూడా ఆక్షేపించింది. పీపీఏలను సమీక్షించడం సరికాదని జగన్ సర్కార్ ను హెచ్చరించింది. దీని వల్ల పెట్టుబడిదారులు ఏపీని బ్లాక్ లిస్ట్ లో పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయినా వినకుండా జగన్ సర్కాన్ మూర్ఖత్వంతోనో, మొండి తనంతోనో, గత ప్రభుత్వంవి అన్నీ రద్దు చేయాలన్న ఉద్దేశంతోనో పీపీఏల సమీక్షతో ముందుకు సాగింది. ఫలితమే ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, అలాగే పీపీఏలకు భారీ మెత్తంలో బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు కోర్టులో ఏపీ వాదనపై తీర్పు ఏ విధంగా వస్తుందన్నది వేచి చూడాలి. అయినా విద్యుత్ కంపెనీలకు పీపీఏల ప్రకారం చెల్లింపులలో ఏపీ విఫలమైతే నేరుగా ఆర్బీఐ నుంచి రాష్ట్ర నిధులు చెల్లిస్తామని గతంలోనే కేంద్ర విద్యుత్ మంత్రి హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ దివాళా ఎత్తుగడ ఫలించే అవకాశం లేదనీ, ఆర్బీఐ నుంచి పీపీఏలకు బకాయిలను రాష్ట్ర వాటా నుంచి కేంద్రమే చెల్లించే అవకాశాలే మెండుగా ఉన్నానీ పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-discums-bankrupt-jagan-new-strtagy-to-avoid-payments-to-ppas-25-135457.html
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.