ఈ ప్రత్యేక మరణాలు ఆగేదెప్పుడు?

Publish Date:Aug 28, 2015

Advertisement

 

ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. కానీ అది రానంత కాలం ప్రతిపక్షాలకు రాజకీయ లబ్ది చేకూర్చే అంశంగా, అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు అది వాటి చేతిలో ఒక బలమయిన ఆయుధంగా ఉపయోగపడుతోంది. కానీ మాంసం తింటారని ఎవరూ ఎముకలు మెళ్ళో వేసుకొని తిరుగనట్లే, ఈ బహిరంగ రహస్యాన్ని రాజకీయ పార్టీలు బయటకి చెప్పుకోవు. ప్రజలే అర్ధం చేసుకోవాలి. ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ కొన్ని వారాల క్రితం తిరుపతిలో జరిపిన బహిరంగ సభలో మునికోటి ఆత్మహత్య చేసుకొన్నప్పుడు, అతని అంత్యక్రియలకు హాజరయిన రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు స్వయంగా అతని పాడె మోశారు. ఎందుకు మోసారో వారికీ తెలుసు, ప్రజలకీ తెలుసు.

 

ప్రత్యేక హోదా కోసం నెల్లూరు జిల్లా వేదాయపాలెంకుచెందిన రామిశెట్టి లక్ష్మయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నాడు. అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరు వెళ్ళారు. మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. అందరూ కలిసి పోరాడి సాధించుకొందాము. కలిసి పోరాడితే చంద్రబాబు నాయుడే కాదు ఆయన నాయిన (తండ్రి) అయినా దిగిరావలసిందే.” అని అన్నారు. అంటే మనుషులు ప్రాణాలు పోతున్నా తన ఉద్యమం కొనసాగిస్తానని చెప్పుతున్నట్లే ఉంది.

 

రామిశెట్టి లక్ష్మయ్య మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ “ప్రత్యేక హోదా గురించి ప్రతిపక్షాలు చెపుతున్న మాటలతో భావోద్వేగానికిలోనయి కొందరు ఆత్మహత్యలు చేసుకొన్నారు. అలా చేస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయనే సంగతి గుర్తుంచుకోవాలి. రాష్ట్రాభివృద్ధి చేసే బాధ్యత నాపై ఉంచినప్పుడు ప్రతిపక్షాల మాటలు విని ప్రజలు ఆందోళన చెంధవలసిన అవసరం లేదు. దయచేసి ఎవరూ ఆత్మహత్యల ఆలోచన కూడా చేయవద్దు,” అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

 

కానీ రాజకీయ పార్టీలు రాజేసిన ఈ అగ్గికి ఇంకా ఎవరో ఒకరు సమిధలుగా మారుతూనే ఉన్నారు. ఈరోజు కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ఉదయ్ భాను(40) అనే వ్యక్తి ప్రత్యేక హోదా రానందుకు ఆత్మహత్య చేసుకొన్నాడు. అతని తల్లి తులసీ రాణి గుడివాడ పట్టాన తెదేపా మహిళాధ్యక్షురాలిగా ఉన్నారు. జిల్లా తెదేపా నేతలు అతని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు పోరాడితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ దాని కోసం అన్యాయంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసిన తరువాత కూడా వారి మరణాలను ఎత్తి చూపిస్తూ తమ ఉద్యమాన్ని కొనసాగించడం మానవత్వం అనిపించుకోదు. మనుషుల ప్రాణాలకంటే ప్రత్యేక హోదా ఏమీ ముఖ్యమయినది కాదు. కనుక అన్ని పార్టీలు ఇకపై ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునివ్వాలి. వీలయితే సినిమా హీరోలు, క్రీడాకారులు తదితర సెలబ్రేటీలు కూడా ప్రజలకు సందేశం ఇస్తే బాగుంటుంది. ముఖ్యంగా రాజకీయాలలో ఉన్న సినీ తారలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రోజా, జూ.ఎన్టీఆర్ వంటివారు సోషల్ నెట్ వర్క్ మరియు టీవీ మాధ్యమం ద్వారా ప్రజలకు సందేశం ఇస్తే దాని వలన కొంత ప్రయోజనం ఉంటుంది.

By
en-us Political News

  
ఇప్పటికే గంటల తరబడి విజయ్ ను విచారించిన సీబీఐ మరో మారు ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు పంపింది. అయితే ఈ వేధింపుల వెనుక ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయేనని పరిశీలకులు అంటున్నారు.
తన కృషికి తగిన గుర్తింపు రాలేదన్న కినుకతో ఏబీవీ ఉన్నట్లు కనిపిస్తున్నారు.ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని చేపట్టలేదు. జగన్ హయాంలో జరిగిన అవకతవకలపై విమర్శలతో పాటుగా, ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలనూ ప్రశ్నించడం ఆరంభించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తూ లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవనీ కుండబద్దలు కొట్టేశారు.
రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి.
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.