దేనికయినా రాసిపెట్టి ఉండాలి: డి.శ్రీనివాస్

Publish Date:Aug 29, 2015

Advertisement

 

కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తనకు రెండవసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వనందుకు కాంగ్రెస్ పార్టీతో సుమారు నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని పుటుక్కున త్రెంచుకొని తెరాసలో చేరిపోయారు. ఆయనను ఎవరూ సంజాయిషీలు అడగనప్పటికీ గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లుగా తను పదవులు, అధికారం కోసం తెరాసలో చేరడం లేదని చెప్పుకొని తన అంతర్యం ఆయనే బయట పెట్టుకొన్నారు. ఊహించినట్లే ఆయన తెరాసలో చేరిన నెల రోజుల్లోగానే క్యాబినెట్ హోదా గల ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ అనుభవాన్ని గుర్తించి తనకు ఆ పదవి ఇచ్చి గౌరవించారని ఆయన చెప్పుకొన్నారు. ఆయన బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా పదవులు రావాలంటే రాసిపెట్టి ఉండాలని అన్నారు. ధర్మాధర్మాలు, న్యాయన్యాయాలు అన్నీ పైనున్న భగవంతుడే చూసుకొంటాడని అన్నారు. తన టాలెంట్ చూసే కేసీఆర్ ఈ పదవి ఇచ్చారని, దానిని బంగారి తెలంగాణా కోసం ఉపయోగిస్తానని అన్నారు. తెరాసలో కొత్త బ్యాచి, పాత బ్యాచి అని రెండు గ్రూపులు ఏవీ లేవని, అందరూ కలిసి పనిచేస్తున్నామన్నారు. తెలంగాణా కోసం తను జలగం వెంగళరావు కాలం నుండి వైయస్ కాలం వరకు పోరాటాలు చేసానని అన్నారు.

 

తన ట్యాలంట్ చూసే తనకు ఈ పదవి ఇచ్చారని డి.శ్రీనివాస్ చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయనలో నిజంగా అంత ట్యాలెంట్ ఉండి ఉంటే పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలున్న పార్టీగా పేరుమోసిన కాంగ్రెస్ పార్టీలోనే రాణించగలిగేవారు. కానీ ఆయనకి ఎన్నిసార్లు పార్టీ టికెట్ ఇచ్చినా గెలవలేకపోయారు. చివరికి ఎమ్మెల్యేల కోటాలో రెండవసారి ఎమ్మెల్సీ అవ్వాలనుకొని భంగపడటంతో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ అదే అదునుగా ఆయనకు ఈ ఆఫర్ ఇచ్చి తనవైపు త్రిప్పుకొన్నారు.

 

డీ.యస్. తను కూడా చిరకాలంగా తెలంగాణా కోసం పోరాడానని చెప్పుకొన్నారు. కానీ తెరాస ప్రభుత్వంలో కాబినెట్ హోదా పదవి పొందేందుకు అది అర్హత కాబోదు. అటువంటి అర్హత ఉన్నవాళ్ళు తెరాసలో కొన్ని వేల మంది ఉన్నారు. అయినా వైయస్ హయం వరకే తాను తెలంగాణా కోసం పోరాడానని చెప్పుకోవడం చూస్తే ఆ తరువాత నుండి తెలంగాణా కోసం ఆలోచన కూడా చేయలేదని ఆయనే ఒప్పుకొన్నట్లుంది.

 

అలాగే తన ట్యాలెంట్ చూసి కేసీఆర్ ఆయనకి ఆ పదవి ఇచ్చారనుకోవడానికి లేదు. ఒకవేళ ట్యాలెంట్ ఉన్నవాళ్లకే ఆ పదవిని ఇవ్వాలనుకొంటే తెరాసలోనే అంతకంటే గొప్ప ట్యాలెంటు ఉన్నవాళ్ళు అనేకమంది ఉన్నారు. వారందరినీ కాదని ఆయనకు ఆ పదవి ఎందుకు ఇచ్చారంటే కాంగ్రెస్ పార్టీని త్యజించి తెరాసలో చేరినందుకేనని భావించాల్సి ఉంటుంది. పదవులు రావాలంటే రాసిపెట్టి ఉండాలని చెప్పిన మాట అక్షరాల తెరాస నేతలకు సరిపోతుంది. ఆయనకి కాదు. పదేళ్ళపాటు కేసీఆర్ తో కలిసి తెలంగాణా కోసం పోరాడిన వాళ్ళలో చాలా మందికి పదవులే దక్కలేదు. ఎందుకంటే వారికి రాసి పెట్టిలేదనుకోవాలి. కానీ నిన్నగాక మొన్న తెరాసలో చేరిన డి.శ్రీనివాస్ కి నెల తిరక్క ముందే క్యాబినెట్ హోదా గల పదవి దక్కింది.

 

అయితే ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చేరు కదా అని ఆయన తన ట్యాలెంట్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కి చూపిద్దామని ప్రయత్నిస్తే మళ్ళీ భంగపాటు తప్పకపోవచ్చును. నిజానికి కేసీఆర్ కి ఎవరి సలహాలు అవసరం లేదు. ఆయన తీసుకొనే నిర్ణయాలని చూస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. ఆయనకు మాట ఇచ్చినందున ఏదో రాజకీయ ఉపాది కల్పించాలి గాబట్టి ఆ పదవి ఇచ్చారనుకోవలసి ఉంటుంది. కనుక డి.శ్రీనివాస్ తనకు దక్కిన ఆ హోదాని హాయిగా అనుభవిస్తూ కాలక్షేపం చేసుకోవడమే అన్ని విధాల మంచిది.

By
en-us Political News

  
ఇప్పటికే గంటల తరబడి విజయ్ ను విచారించిన సీబీఐ మరో మారు ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు పంపింది. అయితే ఈ వేధింపుల వెనుక ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయేనని పరిశీలకులు అంటున్నారు.
తన కృషికి తగిన గుర్తింపు రాలేదన్న కినుకతో ఏబీవీ ఉన్నట్లు కనిపిస్తున్నారు.ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని చేపట్టలేదు. జగన్ హయాంలో జరిగిన అవకతవకలపై విమర్శలతో పాటుగా, ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలనూ ప్రశ్నించడం ఆరంభించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తూ లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవనీ కుండబద్దలు కొట్టేశారు.
రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి.
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.