Publish Date:Aug 22, 2022
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హీరో ఎన్టీఆర్ తో లంచ్ భేటీ తరువాత.. ఆయనతో భేటీ ఎంతో సంతోషాన్నిచ్చిందంటూ ట్వీట్ చేశారు. ఆయనో అద్భుత నటుడని పేర్కొన్న అమిత్ షా.. ఆయన ఇటీవల నటించిన సినీమాలో ఆయన నటన చూసిన తరువాత ఆయనను ఒక సారి కలవాలని భావించాననీ, ఆయనతో భేటీ ఎంతో సంతృప్తిని ఇచ్చిందనీ పేర్కొన్నారు. మునుగోడులో బీజేపీ బహిరంగ సభ అనంతరం అమిత్ షా హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ను తనతో డిన్నర్ సమావేశానికి అమిత్ షా ఆహ్వానించిన సంగతి విదితమే. ఆ ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్కు అమిత్ షా పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతించారు.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఆయనను శాలువాతో సత్కరించారు. వీరి మధ్య ఆ తర్వాత దాదాపు 45 నిమిషాలపాటు సమావేశం జరగింది. అందులో దాదాపు 20 నిమిషాల సేపు అమిత్ షా, ఎన్టీఆర్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అనంతరం అమిత్ షా, కిషన్రెడ్డి, తరుణ్ఛుగ్, బండి సంజయ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి భోజనం చేశారు. ఈ భేటీలో ప్రధానంగా ఎన్టీఆర్ నటన, రాజకీయ జీవితం గురించిన ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన విశ్వామిత్ర, దానవీర శూర కర్ణ తదితర సినిమాలను తాను చూసినట్లు అమిత్ షా చెప్పారనీ, అలాగే ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో అధికారుల పనితీరు బాగుండేదనీ అన్నట్లు సమాచారం.
అదలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షాల భేటీపై ఉభయ తెలుగు రాష్ట్రాలలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరువురి మధ్యా ప్రస్తావన కు వచ్చిన అంశాలపై పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నారు. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారనీ, అందుకు జూనియర్ ఎన్టీఆర్ సున్నితంగా నిరాకరించారనీ చెబుతున్నారు.
ఒక వేళ బీజేపీలోకి రావడం ఇష్టం లేకుండా తెలంగాణ తెలుగుదేశం సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిందిగా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ కు సూచించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ రానున్న రోజులలో తెలుగుదేశం, బీజేపీలు దగ్గరయ్యే అవకాశాలను మెరుగుపరిచాయని విశ్లేషకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amit-shah-praises-juniour-ntr-as-wonderful-actoe-39-142397.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.