Publish Date:Aug 22, 2022
పిల్లాడు పెరట్లో ఆడుతూంటే చెట్టు దగ్గర మట్టిలో స్టీలు స్పూను కనిపించింది. అమాంతం దాన్ని తీసుకుని తల్లి దగ్గరికి వెళ్లాడు. దీనికోసం రెండ్రోజులుగా వెతుకుతున్నా ఎలా దొరికింది అంటే పిల్లాడు వివరంగా చెప్పాడు. ఇది తప్పకుండా పనిపిల్ల పనే అని విసుక్కుంది, మరో ఇంట్లో దాదాపు ఇలానే ఒక గిన్నె కని పించింది. ఆ ఇంటి ఇల్లాలు వాళ్ల పనిపిల్ల పనే అనుకుని తిట్టి తరిమేసింది. ఇలాంటివి సర్వసాధారణం. కానీ ఈథన్ అనే రెండేళ్ల పిల్లాడికి ఏకంగా ఒక పెద్దామె కనిపించింది!
జార్జియాకి చెందిన బ్రిటానీ మూర్, ఆమె పిల్లాడు రెండేళ్ల ఈథన్ని ఇంటి పెరట్లో ఆడిస్తోంది. బంతి విసి రితే వాడు తెస్తున్నాడు. కొంత సేపయ్యాక ఆటలో భాగంగా బంతికోసం పెరట్లో ఓ మూలగా పొదల మాటు న ఏదో కదులుతున్న అనుమానం వచ్చి అలా చూస్తుండిపోయాడు. చెట్లు కదులుతున్నాయని వాడికి అమితాశ్యర్యమేసిందేమో! ముందుకు వెనక్కి కదిలి అక్కడికి వెళ్లాలా వద్దా అని సంశయించాడు. ఆఖరికి బాగా దగ్గరికి వెళ్లి చూశాడు. వాడికి మనిషి పాదాలు కనిపించి గట్టిగా అరిచాడు. తల్లి పరుగున వెళ్లింది. అక్కడేదో కరిచిందో, కుట్టిందో అని. తీరా చూస్తే మనిషి పాదాలు కనిపించాయి. ఆమె కూడా భయం భయంగానే పొదలు తొలగించి చూస్తే ఓ పెద్దామె స్పృహ లేకుండా పడి ఉంది.
వెంటనే భర్తని పిలిచి ఆమెను ఇంట్లోకి తీసికెళ్లింది. ఆమె పై దుమ్ము ధూళీ తుడిచి మొహం మీద నీళ్లు చల్లితే ఆ పెద్దామె తేరుకుంది. చుట్టూ ఉన్నవారిని పరికించి చూసింది. వీళ్లెవరో కొత్తవారిలా ఉన్నారు, తననెందుకో ఇక్కడికి పట్టుకొచ్చారనే అనుకుంది. మీరెవరు, నన్నెందుకు ఇక్కడికి తీసుకు వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాననీ హెచ్చరించింది. అమ్మ.. మసలావిడా.. పొదల్లో పడి ఉందని లోపలికి తీసుకొచ్చి సేవలు చేస్తే ఎంత మాటంటోంది వదినా.. అన్నది బ్రిటానీ తన పక్కింటావిడతో!
కొంతసేపటికి బ్రిటానీ భర్త పోలీసుల్ని పిలిచాడు. ఆమెను పరిశీలించి, ఆమె బంధువుల గురించి అడి గారు. ఇంత చేస్తే ఆమె నాలుగయిదు వీధుల అవతల ఉండే పెద్దావిడ అని తేలింది. ఆమె బంధువు, ముని మనవరాలూ వచ్చి అందరికి సారీ చెప్పింది. ఆమెకు దారుణమైన మతిమరుపు. అలా తిరుగుతూ ఎవరింట్లోకో వెళ్లి కబుర్లు చెబుతూనే ఉండిపోతూంటుందిట. మరి వీళ్ల ఇంట్లో పెరట్లోకి ఎలా వచ్చిందనే ఇప్పటికీ అనుమానమే. ఏమైనప్పటికీ ఆ 86 ఏళ్ల పెద్దామె పేరు నీనా.
కానీ ఆమెను రక్షించి బయటికి తీసుకొచ్చిన రెండ ఏళ్ల ఈథన్ ని మాత్రం ఆ ఇంటివాళ్లంతా ఎంతో సత్క రించారు. పక్కింటాళ్లంతా బుగ్గలు గిల్లారు, పోలీసులు శభాష్ బేటా అన్నారు. నీనా మాత్రం నవ్వి ఊరుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/toddler-found-missing-woman-39-142395.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.