‘ఆసరా’ పేరుతో పథకమా?.. ‘గడపగడపకూ’లో అంబటి అజ్ణానం

Publish Date:May 12, 2022

Advertisement

జగన్ ఆదేశంలో వైసీపీ నేతలు అయిష్టంగానైనా గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం కొందరు మంత్రుల అజ్ణానం బయటపడి ప్రభుత్వం మరింత అభాసు పాలౌతోంది. అసలే గడప గడపలో ఎదురౌతున్న నిరసనలతో ప్రతిష్ట మసకబార్చుకున్నజగన్ సర్కార్...ఈ కార్యక్రమంలో మంత్రుల అజ్ణానం బట్టబయలై పరువు మంటగలుపుకుంటోంది. విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడే అంబటి రాంబాబుకు ప్రభుత్వ పథకాలపై ఇసుమంతైనా అవగాహన లేదని ఈ కార్యక్రమం సాక్షిగా బట్టబయలైపోయింది. గడప గడపకూ వైసీపీ అంటూ చేపట్టతలచిన కార్యక్రమాన్ని ప్రజాగ్రహం భయంతో గడప గడపకూ ప్రభుత్వంగా మార్చినా కూడా ప్రజాగ్రహ సెగ వైసీపీ నేతలకు తగులుతూనే ఉంది. అధికారులను వెంటబెట్టుకుని వెళ్లినా జనం నీలదీతతో బెంబేలెత్తే పరిస్థితి ఉందని మంత్రులూ, ఎమ్మెల్యేలే వాపోతున్నారు. అంబటి రాంబాబు నిర్వాకంతో జగన్ సర్కార్ లో మంత్రులకు ప్రభుత్వ కార్యక్రమాలపై ఇసుమంతైనా అవగాహన లేదని తేటతెల్లమైపోయింది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగాలలో తడబాటు, తప్పులతో నవ్వుల పాలౌతుండగా... యథారాజా తథా ప్రజా అన్నట్లుగా అంబటి కూడా ప్రభుత్వ పథకాలపై తన అవగాహనా లేమిని గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం సాక్షిగా చాటుకున్నారు. మాటల తూటాలతో విపక్షంపై విమర్శలతో విరుచుకు పడటంలో ముందుంటానని చెప్పుకునే తాజా మంత్రి అంబటి రాంబాబు, అవగాహనా లేమిలోనూ, అజ్ణానంలోనూ కూడా తానే ముందని నిరూపించుకున్నారు.పల్పాడు జిల్లా గోళ్లపాడు గ్రామంలో జరిగిన ‘గడపగడపకూ’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటికి ప్రజలు సమస్యలు ఏకరవు పెట్టారు. మూడేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వానికి ఎన్నికల ముందు తాము గుర్తొచ్చామా అని నిలదీశారు.ఆసరా పథకం అందడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి కంగుతిన్నారు. ఆసరా ఏమిటి?.. ఆ పేరుతో పథకం ఉందా? అని ఆశ్చర్యపోయారు. ఇదే విషయాన్ని పక్కనే ఉన్న వాలంటీర్ ను అడిగి తెలుసుకున్నారు. దీంతో మంత్రి అంబటి అవగాహనా రాహిత్యం బట్టబయలైంది. మంత్రి వాలంటీర్ ను ఆసరా గురించి అడుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో క్షణాల్లో వైరల్ అయిపోయాయి. సొంత ప్రభుత్వ పథకాల గురించే అవగాహన లేని మంత్రి అంబటికి తాను నిర్వహిస్తున్న శాఖ ఏమిటన్నదైనా తెలుసా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కనీసం పోలవరంపైనైనా అవగాహన ఉందా అంటు ప్రశ్నిస్తున్నారు.

By
en-us Political News

  
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.