ఆల్ ఫ్రీ.. బట్ కండీషన్స్ అప్లై !

Publish Date:Jun 7, 2023

Advertisement

ఆయన ఏమన్నారు? ఇలా ప్రమాణ స్వీకారం  చేయడం, అలా ఫైవ్ గ్యారెంటీలకు పచ్చ జెండా ఊపడం, అని కదా, అన్నారు. అవును, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  ప్రతి సభలో  అక్షరం పొల్లుపోకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే  తొలి మంత్రి వర్గ భేటీలోనే ఐదు గ్యారెంటీల అమలుకు పచ్చ జెండా ఊపుతామని కర్ణాటక ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ  ఏమి జరిగింది. ఏమి జరుగుతోంది.  పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనో మరో అనామక నేతో కాదు. ఏకంగా పార్టీ అగ్రనేత, కీలక నేత, పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోంది.

రాహుల్ గాంధీ నిర్ణయించిన ఉమ్మడి  ముహూర్తం పక్కన పెట్టేసింది. ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క ముహూర్తం నిర్ణయించింది. అయినా తొందరేముంది, ఐదేళ్ళు సమయం వుంది.  అయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెపుతున్నాం కదా..  ఇంకేం కావాలని, దబాయింపులు మొదలు పెట్టింది. ఐదింటిలో ఒకే ఒక్కటి ‘శక్తి’ పథకానికి మాత్రమే  తొలి నెలలో (జూన్ 11) పచ్చజెండా ఊపేందుకు నిర్ణయించింది. అయితే ఆ ఒక్క పథకం విషయంలోనూ  కండీషన్స్ అప్లై  అంటూ, కొర్రీలు పెట్టింది సిద్దరామయ్య సర్కార్. ఇక్కడికెళ్ళు అక్కడికెళ్ళు.. ఎక్కడి కెళ్ళినా మహిళలలందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ అని చెప్పిన కాంగ్రెస్ ఇప్పడు ఫ్రీ యే  కానీ.. అన్ని బస్సుల్లో కాదు.. ఓన్లీ   ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు (ఎర్ర’)బస్సుల్లో మాత్రమే ఫ్రీ.. అని మెలిక పెట్టింది.

అంతే కాదు  ఈప్రయోజనం పొందాలంటే సేవ సింధు రిజిస్ట్రేషన్ అవసరమని, అందుకు అదార్, రేషన్ కార్డు ఇంకా అనేక ఇతర గుర్తింపు కార్డులు కావాలని కొత్త షరతు విధించారు. అలాగే  భవిష్యత్ లో మరిన్ని మెలికలు పెట్టేందుకు వీలుగా ఆదాయ  పరిమితులు ఇతరత్రా షరతులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి ఇంకా ఇతర కారణాలు లేవని కాదు ఉన్నాయి. కానీ, ఎగ్జిట్ పోల్స్  లెక్కలను కూడా తప్పు చేస్తూ కాంగ్రెస్ పార్టీ   భారీ మెజారిటీ తో గెలవడానికి మాత్రం ఆ ఐదు గ్యారెంటీలే కారణం. అందులో సందేహం లేదు. అయితే అంతటి భారీ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ  ముఖ్యమంత్రి సిద్దరామయ్య...ఇప్పుడు తీరిగ్గా ఆ ఐదు పథకాల అమలును వాయిదా వేయడమే కాదు  పథకాలకు కోతలు పెడుతున్నారు. 

ముఖ్యంగా అన్నివర్గాల ప్రజలను హస్తం గుర్తుకు ఓట్లు గుద్దేలా చేసిన ఫ్రీ పవర్ ప్రామిస్ (ఉచిత విద్యుత్ హామీ) విషయాన్నే తీసుకుంటే  ఆ పథకం రాహుల గాంధీ వాగ్దానం చేసిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకు ఆగష్టు నుంచి మొదలవుతుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. అంతే కాదు  ఎన్నికల  ప్రచార సమయంలో గృహ జ్యోతి పథకం పరిధిలో 200 యూనిట్ల వరకు ముఖ్యమంత్రి సహా అందరికీ ఫ్రీ అని స్వయంగా సిద్దరామయ్యే ప్రకటించారు. కానీ ఇప్పుడు విడుదల చేసిన ఉత్తర్వులలో  అందరికీ  200 యూనిట్లు ఉచితం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుత సగటు వినియోగానికి అదనంగా మరో పది శాతం వినియోగం వరకు మాత్రమే ఉచితం ఆపైన, ఎంత ఎక్కువ వాడుకుంటే అంతకు చార్జీలు చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఒక కుటుంబం 70 యూనిట్లు వినియిస్తుంటే, ఆగష్టు తర్వాత ఆ కుటుంబం 77 యూనిట్ల వరకు మాత్రమే ఉచిత విద్యుత్ వినియోగించుకునే సదుపాయం ఉంటుంది. ఆపైన  ఒక్క యూనిట్ ఎక్కువ వినియోగించుకున్నా అదనపు వినియోగం వాగ్దానం చేసిన 200 యూనిట్ల లోపలే ఉన్నా, ఆ అదనపు వినియోగానికి బిల్లు చెల్లించవలసి ఉంటుంది. ఇక్కడ మరో కొస మెరుపు ఏమంటే ఉచిత  విద్యుత్ ఆగష్టు నుంచి అమలవుతుంది కానీ అధికారంలో వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన ( యూనిట్ కు రూ.2.89)   విద్యుత్ చార్జీలు మాత్రం వెంటనే  అమలులోకి వచ్చాయి.

ఇదలా ఉంటే ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే సేవ సింధు పోర్టల్లో ఎన్రోల్ కావాలని విధ్యత్ శాఖ మంత్రి ప్రకటించారు. నిజానికి మహిళకు ఉచిత ప్రయాణ సదుపాయం ప్రామిస్ చేసిన శక్తి పథకం, అలాగే ఉచిత్ విద్యుత్ పథకం అదే విధంగా ఇతర పథకాలు అన్నిటికీ  కూడా  సేవా సిందు పోర్టల్ లో ఎన్రోల్ తప్పనిసరి చేశారు. అయితే సేవాసిందు పోర్టల్ రిజిస్ట్రేషన్  తప్పనిసరి చేయడంతో పథకం ప్రయోజనాలు పేద ప్రజలకు అందకుండా పోతాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి, ఈ ఐదు పథకాలు కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించదమే కాదు, రానున్న రోజుల్లో తెలంగాణ సహా అసెంబ్లీ ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాలలోనూ హస్తం పార్టీని అందలం ఎక్కిస్తాయని లెక్కలు వేస్తున్నారు. అయితే, కర్ణాటకలో ఈ పథకాలకు బ్రేకులు పడితే ఆ ప్రభావం ఇతర రాష్ట్రాలపై ఉంటుందని అంటున్నారు.

By
en-us Political News

  
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.