ప్రభాస్ ను రాముడిగా అంగీకరిస్తారా?

Publish Date:Jun 7, 2023

Advertisement

సీటు వదులుతారు సరే.. ప్రభాస్  రాముడంటే హనుమంతుడు నమ్మాలిగా!

శ్రీరాముడు అనగానే మన తెలుగువారికి, అందునా సినీ ప్రియులకు ముందుగా నందమూరి తారక రామారావు గుర్తుకొస్తారు. అంతలా శ్రీరాముడి పాత్రలో పరకాయప్రవేశం చేశారు ఎన్టీఆర్. ఆయన సుందర రూపం, సుమధుర స్వరం ప్రేక్షకులను కట్టిపడేశాయి. రాముడంటే ఇలాగే ఉంటాడు అనుకునేలా చేశాయి. మనకు రాముడంటే ఎన్టీఆర్ పేరు గుర్తుకు రావడం ఎంత సహజమో.. నీలి వర్ణంలో మీసాలు గడ్డాలు లేని సుందర రూపంలో ఉన్న రాముని ముఖం కళ్ళముందు కదలాడటం కూడా అంతే సహజం. రాముడి రూపం ఇలాగే ఉంటుందని మన హృదయాల్లో బలమైన ముద్ర పడిపోయింది. అందుకే ఎన్టీఆర్ అనే కాదు.. రాముని పాత్ర ఎవరు పోషించినా మీసాలు గడ్డాలు లేకుండా నీలి వర్ణంలో సాధ్యమైనంత అందంగా కనిపించడానికి ప్రయత్నించారు. అయితే వారెవరూ ఎన్టీఆర్ని మైమరిపించలేకపోయారు. అలా అని వారు వేషధారణ విషయంలో విమర్శలు ఎదుర్కోలేదు. కానీ మొదటిసారి ఆ విమర్శలకు ఆస్కారం ఇచ్చాడు ప్రభాస్.

ప్రభాస్ ఆరడుగుల అందగాడు. అయితే ఆరడుగులు ఉండి, అందంగా ఉన్నంత మాత్రాన శ్రీరాముడు అయిపోరు. ఆహార్యంలో, వాచకంలో, ఆంగికంలో అణువణువునా రాముడు కనిపించాలి. ప్రభాస్, శ్రీరాముడి పాత్ర పోషించిన 'ఆదిపురుష్' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఆ మూవీ ట్రైలర్స్ చూస్తుంటే నిజంగా ప్రభాస్, శ్రీరాముడి పాత్రే పోషించాడా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఇందులో ఆయన మీసాలు, గడ్డాలతో ఓ రాజులా, ఓ యోధుడిలా కనిపిస్తున్నాడు. ప్రజలు రాముడిని రాజుగా కంటే దేవుడిగా చూడటానికే ఇష్టపడతారు. ఈ భూమ్మీద రాముడంత అందంగా మరెవరూ ఉండరనే భావన చాలామందిలో ఉంది. అదే ప్రభాస్ పాలిట శాపంగా మారింది. ట్రైలర్స్ లో చూస్తుంటే ఏదో బాహుబలి సెట్స్ నుంచి డైరెక్ట్ గా ఆదిపురుష్ సెట్స్ కి వచ్చి.. కాస్ట్యూమ్ మార్చుకొని విల్లు పట్టుకున్నట్టుగా ఉంది కానీ, రాముడి రూపంలో కనిపించడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు అనిపించట్లేదు. పైగా డైలాగ్ డెలివరీ కూడా ఏదోలా ఉంది. స్వరంలో ఉండాల్సిన మాధుర్యం, సున్నితత్వం కరువయ్యాయి. ఏదో బాహుబలి ఊపిరి బిగబట్టి డైలాగ్ లు చెప్పినట్టుగా ఉంది. 

గతంలో రామాయణం ఆధారంగా ఎన్ని సినిమాలు వచ్చినా హంగు ఆర్భాటాలకు పోలేదు. పాత్రల ఆహార్యం, చిత్రీకరణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని.. ఆ గాధలో ఉన్న గాఢతను అర్థంచేసుకొని భావోద్వేగాల మీద చిత్రాలను నడిపిస్తూ అద్భుతంగా నడిపించారు. కానీ 'ఆదిపురుష్' ట్రైలర్స్ చూస్తుంటే ఇది రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా అని స్వయంగా ప్రభాస్ చెప్పినా నమ్మలేకపోతున్నాం. ఏదో హాలీవుడ్ నుంచి యానిమేషన్ సినిమానో, సూపర్ హీరో సినిమానో తెలుగులో డబ్ అవుతుంది అనిపిస్తోంది. అలా అని గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయనుకుంటే పొరపాటే. శాకుంతలంకి ఎక్కువ, బాహుబలికి తక్కువ అన్నట్టుగా ఉన్నాయి.

రూపం రాముడిలా లేదు. హంగు ఆర్భాటాలు తప్ప ఇది రామాయణం అనే భావన కలగట్లేదు. మరి ఇలాంటి సినిమాతో ప్రభాస్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. పైగా ఆదిపురుష్ ప్రదర్శించే ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ఒక సీటు వదులుతాం అంటున్నారు. అసలు హనుమంతుడు థియేటర్ కి రావాలంటే అది రామాయణం అని, అతను రాముడు అని హనుమంతుడుకి అనిపించాలిగా. మీసాలు, గడ్డాలతో ఉన్న బాహుబలి రూపాన్ని చూసి ఈయన మా రాముడు కాదనుకొని థియేటర్ దాకా వచ్చి వెనక్కి వెళ్లినా ఆశ్చర్యంలేదు.

By
en-us Political News

  
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉండి ఇటీవల మరణించిన రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించినట్లు సమాచారం. వివేకా మర్డర్ కేసులో ఫస్ట్ నుంచి సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరుగురు సాక్షులు ఇలా మరణించడంతో, ముఖ్యంగా కీలక సాక్షి రంగన్న మృతి తర్వాత, ప్రభుత్వం ఈ వరుస మరణాలపై దృష్టి సారించి సిట్ ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి సిట్ అధికారులు పులివెందులలో ఉంటూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కాశ్మీర్ ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న నేప‌థ్యంలో హైదరాబాద్‌లో ఉంటున్న న‌లుగురు పాక్ పౌరుల‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరు షార్ట్ వీసాల‌తో ఉంటున్న‌ట్లు గుర్తించారు. రేప‌టిలోగా నగరం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. కాగా, భాగ్య‌న‌గ‌రంలో మొత్తం 213 మంది పాకిస్థానీయులు ఉన్న‌ట్లు పోలీసుల త‌నిఖీల్లో తేలింది. ఉగ్రదాడి నేపథ్యంలో భార‌త ప్ర‌భుత్వం పాకిస్థానీల‌ను దేశం నుంచి వెళ్ల‌గొడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును కోరింది. అందుకు కోర్టు నిరాకరించింది. నూతన న్యాయ చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జిషీట్ తీసుకోలేమని పేర్కొంది. కాగా, మనీలాండరింగ్ కేసు ఛార్జిషీట్లో కాంగ్రెస్ అగ్రనేతలు శామ్ పిట్రోడా, సుమన్ దూబేలను కూడా ఈడీ నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే.సుమారు రూ. 5,000 కోట్ల మేర మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఈ చార్జిషీట్‌లో ఆరోపించింది
అనుచిత వ్యాఖ్యలు, అడ్డగోలు దౌర్జన్యాలు, కిడ్నాప్ లు, బెదరింపులకు పాల్పడిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నదంట. ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, అలాగే నారాలోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు ేసినప్పుడూ, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి ఉసికొల్పిన సమయంలోనూ.. అదే కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించినప్పుడూ నోరెత్తిని ఆ గొంతు ఇప్పుడు లేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ముఖ్యంగా తెలంగాణ లోని పలు జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే నిన్న సాయంత్రం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ.. తీవ్ర ఉక్కపొతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత రెండు వారాలుగా ఎండ తీవ్రతలు అధికంగా ఉండటంతో 30 మంది వరకు వడదెబ్బ కారణంగా మరణించారు. అలాగే మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్ర అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు
ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఆశించిన మంత్రి పదవి దక్కలేదనో? ఏమో? ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు. సర్కారుని ఇరుకున పెట్టేలా తాజాగా బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ విజయవంతం అవుతుందంటూ దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల‌ను విడుద‌ల చేసింది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్స‌రానికి సంబంధించిన నిధుల‌ను విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ఖ‌జానాలో రూ. 1121.20 కోట్ల నిధులు జ‌మ‌య్యాయి. ఇందులో 70 శాతం గ్రామ పంచాయ‌తీల‌కు, మండ‌ల ప‌రిష‌త్‌ల‌కు 20 శాతం, జిల్లా ప‌రిష‌త్‌ల‌కు 10 శాతం చొప్పున నిధుల‌ను కేటాయించ‌నున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ సాధారణం ఉంది. టోకెన్లు లేని భక్తులకు సుమారు 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి 26 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉంది. శుక్రవారం 64వేల 536 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 30వేల 612మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా భక్తులు 3 కోట్ల 36 లక్షల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరవ నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని శుక్రవారం(ఏప్రిల్ 25) సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు.
అవినీతి అనగానే రాజకీయ నాయకులే గుర్తొస్తారు. అందులోనూ ప్రభుత్వ భూముల ఆక్రమణ,అంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అయ్యే పని కాదని అనుకుంటాము, కానీ, అది సంపూర్ణ సత్యం కాదు. రాజకీయ నాయకులలో ఎక్కడో అక్కడ ఒకరో ఇద్దరో నిజాయతీ పరులు ఉన్నట్లుగానే, ప్రభుత్వ అధికారులలోనూ, ప్రభుత్వ భూములను ఇతరత్రా భూమలను అక్రమంగా సొంత చేసుకోగల సమర్ధులు ఉంటారు.ఉన్నారు.అంతే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అవినీతి గ్రాఫ్’ కు పార్లర్’గా అవినీతి అధికారుల గ్రాఫ్’కూడా పెరుగుతోందని’ అధికార వర్గాల్లోనే వినిపిస్తోంది.నిజానికి ఇంటి దొంగను ఈశ్వరుడు అయిన పట్టలేరు అంటారు, కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సార్ల భూదందా, అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే వుంది. సంచలనం అవుతోంది.
పాకిస్థాన్‌ను దెబ్బకొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ ర్యాలీలో పాల్గొని ఉగ్రవాద చర్యలను ఖండించారు.
వక్ఫ్‌ సవరణ చట్టంను సమర్థిస్తూ మోదీ సర్కార్ సుప్రీంకోర్టు లో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. వక్ఫ్‌ (సవరణ) చట్టం-2025 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సమాధానంగా కేంద్రం కౌంటర్‌ అఫిడవిట్‌ వేసింది. ఈ చట్టం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ చట్టంలో చేసిన పలు సవరణలు మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కులను హరిస్తాయనే తప్పుడు ప్రాతిపదికపై పిటిషన్లు ఉన్నాయని ఆరోపించింది. ఆర్టికల్‌ 32 ప్రకారం ఒక చట్టాన్ని సుప్రీంకోర్టు సమీక్షించవచ్చని తెలిపింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ.. కేంద్ర నిర్ణయానికి కూటమి ప్రభుత్వం మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధానిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. సుమారు రూ. లక్ష కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రోడ్‌మ్యాప్‌ తయారు చేసింది.వెలగపూడి సచివాలయం వెనక అమరావతి పునఃప్రారంభ పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. అదే రోజు రోడ్‌షో కూడా ఏర్పాటు చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.