Publish Date:Apr 25, 2022
రెండేళ్లుగా ప్రపంచ జనాభాను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ గత కొద్ది రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో అందరం ఊపిరి పీల్చుకుంటున్నాం. అయితే.. విజృంభణను కొద్దిగా తగ్గించిన కరోనా పలు రూపాంతరాలు మార్చుకుంటూనే ఉంది. ఇప్పుడు ఒమిక్రాన్ తాజా వేరియంట్లతో మళ్లీ విరుచుకుపడుతోంది. కరోనా పుట్టుకకు మూలకారణం అని ప్రపంచం మొత్తం భావిస్తున్న చైనాలో మళ్లీ విజృంభించి అక్కడి జనజీవనాన్ని అష్టదిగ్బంధనం చేస్తోంది. బ్రిటన్, అమెరికా దేశాల్లో కూడా తన ప్రతాపం చూపిస్తోంది. వాటితో పాటుగా భారతదేశంలో కూడా కరోనా కేసులు గత కొద్ది రోజులుగా కోరలు చాస్తోంది. ప్రజలను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది.
దేశంలో గడచిన 24 గంటల్లో 2 వేల 541 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి వెయ్యి 862 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా మహమ్మారికి 30 మంది బలైపోయారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా మరింత ఎక్కువగా విరుచుకుపడుతోంది. అంతకు ముందు వారంతో పోల్చితే.. ఈ వారం రోజుల్లో ఆ 12 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 16 వేలు దాటిపోయింది. కరోనా వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 5 లక్షల 22 వేల 223 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.
దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 18 నుంచి 24వ తేదీ మధ్య కాలంలో15 వేల 700కు పైగా కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. అంతకు ముందు వారం 8 వేల కేసులు నమోదయ్యాయి. అంటే కొత్త కేసుల సంఖ్య 95 శాతం పెరిగిందన్నమాట. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 187 కోట్ల డోసుల పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించిన గణాంకాలను చూస్తే.. రోజువారీ పాజిటివిటీ రేటు 0.84 శాతం ఉంది. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 16 వేల 522 మంది కరోనాతో బాధపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/again-corona-cases-registering-high-39-134927.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!