Publish Date:Jul 27, 2024
ధూల్ పేట ఒకప్పుడు గుడుంబా తయారీకి అడ్డా... నేడు గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అడ్డా గా మారింది.
హైదరాబాద్లోని దూల్పేట ప్రాంతం గంజాయి హబ్గా మారిందని, ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ఇక్కడే కనిపిస్తున్నాయని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కమలాసన్ రెడ్డి తెలిపారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కొన్నిరోజులుగా మాదక ద్రవ్యాల నిరోధానికి స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఆపరేషన్లో భాగంగా పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దూల్పేటలో గతంలో నాటుసారాను నియంత్రించామని, ఇప్పుడు ఆ ప్రాంతంలో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ గంజాయి దొరికినా తీగలాగితే దూల్పేట పేరు వస్తోందన్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రత్యేకంగా వెయ్యి మంది పోలీసులకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.
పట్టుబడిన నిందితులకు శిక్షలు పడేవిధంగా కేసులను విచారిస్తున్నట్లు చెప్పారు. ఆగస్ట్ 31 లోపు దూల్పేటను గంజాయిరహిత ప్రాంతంగా చేస్తామని శపథం చేశారు. అన్ని ప్రాంతాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. నిందితులు శివారు ప్రాంతాల్లో గంజాయిని నిల్వ చేస్తున్నారని, వాటిని దూల్పేటకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ రెండు మూడు రోజుల్లోనే 66 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/after-gudumba-adda-dhul-peta-with-ganjai-39-181637.html
కృష్ణానది చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీగా వరద వచ్చింది. చరిత్రలోనే తొలిసారిగా గతంలో ఎన్నడూలేని విదంగా 12 లక్షల క్యూసెక్కుల వదర ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి వచ్చింది. ఆ సమయంలో అంటే ఈ నెల 1న భారీ మరపడవలు ఆ వరద ప్రవాహంలో వచ్చి ప్రకాశం బ్యారేసీ గేట్లను బలంగా ఢీ కొన్నాయి. బ్యారేజీ నుంచి దిగువకు నీరు వెళ్లే మార్గంలో అడ్డంగా చిక్కుకున్నాయి. దీంతో వరద ప్రవాహం దిగువకు వెళ్లేందుకు ఆటంకం ఏర్పడింది. బ్యారేజీకి కూడా నష్టం వాటిల్లింది.
తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. శనివారం (సెప్టెంబర్ 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా అనుమతిస్తున్నారు.
ఆయనో రాజకీయ చాణుక్యుడు.. ఆర్థిక వేత్త.. ఐటీ రంగ నిపుణుడు.. టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్.. ఆపదలో ఉన్నవారికి ఆపద్భాందవుడు.. కష్ట కాలంలో అండగా నిలిచే పెద్దన్న.. మొత్తంగా ఆయన ప్రజల మనిషి.. ప్రజా నాయకుడు. ఇంకా చెప్పాలంటే.. ఏపీ ప్రజల క్షేమం కోసం ఎంతదూరమైనా వెళ్లే జననేత.
గణపతి నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సిద్ధమయ్యారు. పట్టణం, పల్లెల్లో వాడవాడలా గణనాథుడి మండపాలు ఏర్పాటు చేశారు. సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడు భక్తుల నుంచి పూజలందుకోనున్నాడు. ప్రతీ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకొంటారు.
తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోందా? పరిస్థితులు చూస్తుంటే ఉప ఎన్నిక జరగక తప్పదన్నట్టు కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పదవికి మరో కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ పోటీ పడ్డారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇకనుంచి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తారని ఎఐసిసి పేర్కొంది.
తోడేళ్లు పగబడతాయా? ప్రతీకారం తీర్చుకుంటాయా? కక్షగట్టి వెంటాడి, వేటాడి మరీ ఉసురు తీస్తాయా? అంటే ఉత్తర ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో జరుగుతున్న వరస సంఘటనలను ఉదాహరణగా చూపిస్తూ ఔననే అంటున్నారు అటవీ శాఖ అధికారులు.
భారీ వర్షాల వల్ల ఎపి అతలాకుతలమైంది. సహాయక చర్యల్లో నిమగ్నమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతూనే ఉన్నారు. నిన్న బుడమేరు వాగు పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రికి తృటిలో రైలు ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో బీజేపీలో కుమ్ములాటలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న కృత నిశ్చయానికి ఆ పార్టీ హైకమాండ్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యం అంటూ బీజేపీ అగ్రనాయకత్వం తీసుకున్న కొన్ని చర్యలు, నిర్ణయాలు బూమరాంగ్ అయ్యాయి. దీంతో అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అనుకున్నంతగా పెర్ఫార్మ్ చేయలేక చతికిల పడింది.
మన భారతీయ న్యాయ వ్యవస్థ చలా గొప్పది. అపరాధులను వదిలిపెట్టదు. నిర్దోషులను శిక్షించదు. న్యాయం విషయంలో తన, పర భేదం చూపించదు. ఇంత గొప్ప న్యాయ వ్యవస్థ వున్న దేశంలో మనం పుట్టినందుకు ఎంతో గర్వించాలి.
మామూలుగా అయితే జగన్ ఈపాటికి లండన్లో విహరిస్తూ వుండాలి. కానీ అలా జరగలేదు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జిట్టా యశోదా హాస్పిటల్ లో చికిత్సపొందుతూ మరణించారు
జాఫర్ కు నలుగురు అన్నదమ్ములు . జాఫర్ దుబాయ్ లోనే డ్రైవర్ ఉద్యోగం చేసేవాడు. ఆర్థికంగా చితికిపోయిన జాఫర్ అన్నదమ్ములు వారసత్వంగా వచ్చిన ఇల్లును విక్రయించాలనుకుంటారు.