అదనపు తీపి - అదనపు అనారోగ్యం

Publish Date:Mar 19, 2021

Advertisement

మన రోజువారీ ఆహారంలో ఉప్పుకి ఎంత ప్రాధాన్యత ఉందో తీపికీ అంతే ప్రాధాన్యత ఉంది. శరీరం తనకు కావల్సిన శక్తిని సమకూర్చుకునేందుకు తీపి పదార్థాలలో ఉండే కార్బోహైడ్రేట్లు ఉపయోగపడతాయి. కానీ అవసరానికి మించితే, అదే తీపి మనపాలిట చేదుగా మారే అవకాశం ఉంది. అదెలాగంటే...

 

Added Sugars

తీపి మనకు రెండు రకాలుగా లభిస్తుంది. ఒకటి మనం తీసుకునే ఆహారంలో అది సహజంగా ఉండవచ్చు. ఉదాహరణకు పండ్లు, బియ్యం వంటి పదార్థాలకు అదనంగా ఎవ్వరూ తీపిని చేర్చరు కదా! కానీ కృత్రిమంగా రూపొందించుకునే పదార్థాలు రుచిగా ఉండటానికి, వాటికి విపరీతమైన తీపిని జోడించాల్సి ఉంటుంది. వీటినే Added Sugars అంటారు. అది పంచదార కావచ్చు, తేనె కావచ్చు. ఇలా అదనంగా చేర్చిన తీపితోనే అసలు చిక్కంతా వస్తుంది.

 

ఓ పరిమితి ఉంది

ఇంతకుముందు వరకూ మన రోజువారీ ఆహారంలో ఈ Added Sugars పరిమితి ఎంత ఉండాలి అన్నదాని మీదే రకరకాల ఊహాగానాలు ఉండేవి. కానీ అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ప్రచురించిన ఒక పరిశోధనతో ఆ అయోమయం తొలగిపోయింది. మిరియం వాస్‌ అనే వైద్యుని ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో గత నివేదికలనూ, గణాంకాలనూ పరిశీలించి... 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు రోజుకి 25 గ్రాముల (ఆరు టీస్పూనులు) కంటే ఎక్కువగా Added Sugarsని తీసుకోవడం హానికరం అని తేల్చారు.

 

కారణం!

ఆహారంలో Added Sugars అధికంగా ఉండటం వల్ల పిల్లల్లో ఊబకాయం, అధిక కొలెస్టరాల్‌, ఫాటీ లివర్‌ వంటి సమస్యలు మొదలై అవి భవిష్యత్తులో గుండెజబ్బులకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. అంతేకాదు, Added Sugars వల్ల మన శరీరం ఇన్సులిన్‌ను గ్రహించడంలో సమస్యలు ఏర్పడతాయనీ, దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందనీ పేర్కొంటున్నారు.

 

తీపి ఒక వ్యసనం

Added Sugarsకు అలవాటు పడిన పిల్లల పాలిట అవి ఒక వ్యసనంలా మారిపోతాయి. అవి తింటే కానీ తృప్తిగా ఉండని పరిస్థితులు ఏర్పడతాయి. పైగా వాటి రుచికి అలవాటు పడిన పిల్లలు పండ్లు, కూరగాయలు వంటి సహజమైన ఆహారాన్ని తినేందుకు కూడా ఇష్టపడరు. అందుకనే Added Sugars అనేవి పిల్లల పాలిట మద్యపానం అంత హానికరమైన అలవాటు అంటున్నారు నిపుణులు.

 

సాధ్యమేనా!

పిల్లలు రోజుకి 25 గ్రాములకు మించకుండా Added Sugarsని తీసుకోమని చెప్పడం బాగానే ఉంది. కానీ ఆచరణలో దీనిని అమలుచేయడం ఎంతవరకూ సాధ్యం అన్నదే సమస్య! అందుకనే 2018 నుంచి ఆహారాన్ని విక్రయించేవారు, వాటిలో అదనంలో చేర్చిన తీపిని (Added Sugars) కూడా పేర్కొనేలా చట్టాలు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతవరకూ పిల్లలను తీపి ఎక్కువగా ఉండే కూల్‌డ్రింకులు, బేకరీ పదార్థాలకు దూరంగా ఉంచడమే మనం చేయగలిగిన పని.

- నిర్జర.

By
en-us Political News

  
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు...
వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం..
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల..
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు...
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు...
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో..
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా..
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు...
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు...
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు..
నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు.  ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు...
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.