రాత్రి తిండి ఆరోగ్యానికి చేటు

Publish Date:Sep 9, 2016

Advertisement

 

పగటి నిద్ర ఆరోగ్యానికి చేటు అని కొందరు హెచ్చరిస్తూ ఉంటారు. ఇందులో నిజం ఉందో లేదో తెలియదు కానీ, రాత్రి పొద్దుపోయాక తినే తిండి తప్పకుండా మన ఆరోగ్యానికి చేటు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం వారు చెబుతున్న కారణాలు కూడా ఏమంత ఆషామాషీగా కనిపించడం లేదు.

 

- సూర్యోదయ సూర్యాస్తమాలకు అనుగుణంగా మనలో ఒక జీవగడియారం పనిచేస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే! ఈ జీవగడియారాన్ని అనుసరించి పగటివేళ మన శరీరం పనిచేయడానికీ, ఆహారం తీసుకోవడానికీ సిద్ధపడితే, రాత్రివేళల్లో విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంది.

 

- ఈ జీవగడియారాన్ని అనుసరించి మన జీర్ణవ్యవస్థకు రాత్రివేళల్లో కనీసం 12 గంటల విశ్రాంతి అవసరం. అయితే ఇలా జీర్ణవ్యవస్థ విశ్రాంతిగా ఉండాల్సిన సమయంలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనికి రుజువుచేసేందుకు రాత్రివేళల్లో పని చేసే కార్మికులను గమనించినప్పుడు, వారు ఏడాదికి 10-15 కిలోలు అదనపు బరువుని పొందినట్లు తేలింది.

 

- ఇలా వేళాపాళా లేకుండా జీవగడియారాన్ని ఉపేక్షిస్తూ ఆహారం తీసుకోవడం వల్ల ఎసిడిటీ, మలబద్ధం వంటి జీర్ణక్రియ సంబంధ వ్యాధులే కాకుండా జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉన్నట్లు రుజువైంది.

 

- సాధారణంగా రాత్రివేళల్లో మన రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. కానీ రాత్రిళ్లు మరీ ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి లభించక, రక్తపోటు యథావిధిగానే ఉంటున్నట్లు తేలింది. టర్కీలో నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఇందుకోసం దాదాపు 700 మంది ఆహారపు అలవాట్లను, వారి రక్తపోటులోని హెచ్చుతగ్గులను పరిశీలించారు. ఆశ్చర్యకరంగా రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేస్తున్నవారిలో రక్తపోటు తగ్గకపోవడం అనే సమస్య, మూడు రెట్లు ఎక్కువగా ఉందని గమనించారు. ఈ రక్తపోటుతో పాటుగా ఒత్తిడిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తి కూడా అధికంగా జరుగుతున్నట్లు వెల్లడయ్యింది. రాత్రివేళల్లో రక్తపోటు తగ్గకపోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే!

 

- ఏతావాతా నిపుణులంతా చెప్పేదేమిటంటే... నిద్రపోవడానికి కనీసం రెండుగంటల ముందరగానే భోజనం ముగించాలి. ఇంకా వీలైతే రాత్రి ఏడుగంటలకల్లా భోజనాన్ని ముగించేస్తే మరీ మంచిది. ఆ భోజనం కూడా భారీగా కాకుండా అధిక కొవ్వు, తీపిపదార్థాలు, వేపుళ్లు అధికంగా లేకుండా సాదాసీదాగా అరిగిపోయే మితాహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. దురదృష్టవశాత్తూ మన ఆహారపు అలవాట్లు నిపుణులు చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. పగలంతా కష్టపడుతున్నాం కదా అని రాత్రివేళ పొద్దుపోయాక నిదానంగా రకరకాల ఆహారపదార్థాలతో విందుభోజనాన్ని లాగించేస్తున్నాం. ఇక వారానికి ఓసారన్నా బయటకి వెళ్లి విందు చేసుకునే అలవాటూ పెరిగిపోతోంది. అలాంటి అలవాట్లను ఇప్పటికైనా మార్చుకోమన్నదే నిపుణుల ఘోష!                     

 

- నిర్జర.

 

By
en-us Political News

  
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల..
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు...
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు...
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో..
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా..
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు...
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు...
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు..
నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు.  ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు...
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు....
ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి కాలంలో మారిన జీవనశైలి కారణంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక దీర్ఘకాలిక (Chronic) ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప, పూర్తిగా నయం కావడం లేదని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారికి హోమియోపతీ ఒక గొప్ప వరప్రసాదం. కేవలం లక్షణాలను అణచివేయడం...
ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. కానీ నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల మనలో చాలా మంది మలబద్ధకం (Constipation) మరియు మధుమేహం (Diabetes) వంటి సమస్యలతో సతమతమవుతున్నారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.