Publish Date:May 14, 2026
వికారాబాద్ జిల్లా తాండూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కిడ్నాప్ కేసులో అరెస్టైన ఓ నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచే పోలీసుల కళ్లుగప్పి పరారైనట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్కు చెందిన అజీమ్ (ఆసిఫ్ అలియాస్ అజిమ్) తాండూరులోని ఓ సెలూన్లో పని చేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తున్న 17 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు తాండూరు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు హైదరాబాద్లో నిందితుడిని అరెస్టు చేసి తాండూరుకు తీసుకువచ్చి రిమాండ్ ప్రక్రియ కొనసాగిస్తున్న సమయంలో, అనూహ్యంగా నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచే పరారైనట్లు సమాచారం... ఐదు రోజులుగా సీక్రెట్ గా ఉంచిన ఈ ఘటన ఇప్పుడు బయటకు రావడంతో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఈ ఘటన పలు అనుమా నాలకు దారితీస్తోంది. ఇప్పటికే పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ ప్రాంతానికి పంపినట్లు తెలుస్తోంది. అంతర్రాష్ట్ర స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగు తున్నాయి. ఈ ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణలతో ఇద్దరు పోలీస్ సిబ్బందిపై వేటు పడే అవకాశం ఉంది..పోలీసులు మాత్రం అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటన తాండూరు పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/accused-absconds-from-tandur-police-station-36-219735.html
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
హైదరాబాద్ మహానగరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్లో శనివారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
డిజిటల్ విప్లవంలో దూసుకుపోతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధిపై సరికొత్త ముందడుగు వేశారు.
అమెరికాలో ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి.అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో దేశం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడి ప్రతాపం కారణంగా దేశ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.
హ్యోసంగ్ భారీ పరిశ్రమ సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్ సెమికండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టేహ్యుంగ్ లీతో సమావేశమవుతారు. ఇక జులై 7న ఎల్జీ కెమ్ గ్లోబల్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ ఎల్జీ ఓవర్ సీస్ కంపెనీస్ హెడ్ యున్ జు కోహ్ ఎల్జీ టవర్స్లో ఏర్పాటుచేసిన విందు సమావేశంలో పాల్గొంటారు.
అధిక వడ్డీలు ఇస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి, వారి నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి చివరకు చేతులెత్తేసిన
బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది.. తాము ఈ అక్రమాల ప్రచారాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామనీ, ఆలయ పవిత్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనూ సమించేది లేదనీ పేర్కొన్నారు నిజానిజాలను నిరూపించేందుకు ప్రత్యేక విచారణ కమిటీని వేసినట్లు చెప్పిన ఆయన ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
విజయవాడ సమీపంలో కంటైనర్ను ఢీకొట్టిన కారు..!
ప్రస్తుతం ఏక్నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నిరంతరం వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ తగిన చికిత్స అందిస్తోంది.
ఈ లీగల్ బ్యాటిల్లో ప్రశ్న రావణ్ తరఫున వాదించడానికి ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ రంగంలోకి దిగారు. రావణ్ పై ఎన్ని కేసులైనా పెట్టుకోండి, అతడిని బెయిలుపై బయటకు తీసుకువస్తానని జడశ్రావణ్ కుమార్ ప్రకటించారు.
వ్యాపార పెట్టుబడుల పేరుతో నమ్మించి, విదేశాల నుంచి మహిళలను రప్పించి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష కాండలో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ సమీప బంధువు ప్రధాన నిందితుడిగా ఉండటం పాక్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 7వేల పోస్టులలో ఇప్పటికే 5వేల పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోలను జారీ చేసింది. మిగిలిన 2వేల పోస్టులకు సంబంధించిన జీవోలు కూడా నేడో రేపో వెలువడనున్నాయని అధికార వర్గాల సమాచారం.