ఇదో నవశకమా...'అదే' నాసిరకమా ...

Publish Date:Dec 24, 2013

Advertisement

 

 

 

ఏదైతేనేం ఆమాద్మీ అనే సరికొత్త పార్టీ తొలిసారి భారతరాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డుల్ని స్వంతం చేసుకుని సగర్వంగా అధికారాన్ని అలంకరించనుంది. సామాన్యుడి పక్షం అనే ఆకర్షణీయమైన నినాదంతో అవినీతిని ఊడ్చేస్తాననే అద్భుతమైన ఆశాదీపం వెలుగుల్లో దూసుకొచ్చిన ఈ పార్టీని జనం ఆదరించిన తీరు ... సంప్రదాయ పార్టీల పట్ల ప్రజల్లో నెలకొన్న తీవ్ర నిరాశా నిస్పృహలకు నిలువుటద్దంగా నిలిచింది. ఈ నేపథ్యంలో అధికారానికి అవసరమైనన్ని సీట్లు రాకపోయినా ప్రజాభిప్రాయం మేరకు పాలనా పగ్గాలు చేపడుతున్నట్టు ప్రకటించిన ఆమాద్మీ ఇకపై ఎలా పనిచేస్తుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. విఐపి సంస్కృతికి చరమగీతం పాడడం, ఢిల్లీకి స్వయంప్రతిపత్తి కలిగించడం, కాలనీల క్రమబద్ధీకరణ, పక్కా ఇళ్ళ నిర్మాణం ... వంటి ఎన్నో జనాకర్షక, విప్లవాత్మకమైన ప్రణాళికలను ప్రకటించిన ఆమాద్మీ ఆచరణలో అదీ మైనారిటీ ప్రభుత్వంతో ఎలా అమలు చేస్తుందనేది ప్రతిఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తించేదే. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవడానికి అంగీకరించడం ఆమాద్మీకి తొలి మైనస్ పాయింట్. సరే ... ఇప్పుడు తప్పనిసరై తీసుకున్నామనో, ప్రజలు చెప్పారు కాబట్టి అంగీకరించామనో సమర్థించుకోవచ్చు. అయితే అధికారం కోసం భవిష్యతులో కాంగ్రెస్ అడుగులకు మడుగులొత్తడం అనేది చేయకుండా, అవసరమైతే పదవుల్ని తృణప్రాయంగా వదులుకోగాలగాలి. అప్పుడే ఆమాద్మీ నిఖార్సయిన సామాన్యుడి పార్టీగా మనగలుగుతుంది.


విప్లవాత్మకమైన ఆలోచనలతో ముందుకొచ్చిన పార్టీలు ఎక్కువకాలం కొనసాగడం, పాలనా పరంగానూ విజయవంతం కావడం తమ రాజకీయ భవిష్యత్తుకు ఎంత మాత్రం మంచిది కాదనే వాస్తవం తెలుసు కాబట్టి ... మిగిలిన పార్టీలు, వాటికి అండగా ఉండే కార్పొరేట్లు, వ్యాపారవేత్తలు, మాఫియాలు ... ఆమాద్మీ తరహా రాజకీయం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందనే భయంతో ఉన్న బలమైన నేతలు... కేజ్రీవాల్ కు అడుగడుగునా అడ్డంకులు సృస్టిస్తారనే విషయంలో సందేహం లేదు. వీటన్నింటినీ తట్టుకుని, అధికారం అనే ఆకర్షక వలయంలో చిక్కుకోకుండా ఐదేళ్ళ పాటు ఆమాద్మీ స్వచ్చమైన పాలనను, జవాబుదారీ వ్యవస్థను అందించగలిగితే ... అది నిజంగా అద్భుతమే. అలా జరగాలని ఆశిద్దాం. ఆ అద్భుతం భారతదేశ రాజకీయాల్ని మలుపు తిప్పాలని కోరుకుందాం.

By
en-us Political News

  
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.