బండి వెర్సెస్ ఈటల.. ముదురుతున్న యుద్ధం!

Publish Date:Jun 23, 2025

Advertisement

భారతీయ జనతా పార్టీ  తెలంగాణ రాష్ట్ర శాఖలో సందడి మొదలైంది. కారణాలు ఏవైనా చాలా కాలంగా స్తబ్దుగా  ఉన్న కమలదళం నాయకుల్లో కదలిక వచ్చింది. అయితే..  కదలికతో పాటు  కయ్యాలకు తెర లేచింది. అఫ్కోర్స్.. పార్టీ స్తబ్దుగా ఉన్నా, మరోలా ఉన్నా.. బీజేపీలో అంతర్గత కుమ్ము లాటలు,నాయకుల మధ్య విభేదాలు, వివాదాలు నిత్యకృత్యంగా సాగుతూనే ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. అయితే..   తాజాగా పాత గొడవలు కొత్తగా తెర పైకి రావడంతో పార్టీ క్యాడర్  నారాజ్  అవుతున్నారు.  పార్టీ ముఖ్య నాయకులు, వ్యవహరిస్తున్న తీరు, మరీ ముఖ్యంగా ఈ ఇద్దరు కీలక నేతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో  బహిరంగంగా పరస్పర విరుద్ద ప్రకటనలు చేయడం పార్టీ ఇమేజ్ ని దెబ్బ తీస్తోందని పార్టీ వర్గాల్లో అందోళన, పార్టీ క్యాడర్ లో ఆవేదన వ్యక్తమవుతున్నాయి.

నిజానికి..  కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద మోదీ, సారధ్యంలోని  ఎన్డీఎ ప్రభుత్వం ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని  సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో మల్కా జ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో ఆదివారం(జూన్ 22) వికసిత్‌ భారత్‌ సంకల్ప సభ జరుగతున్న సమయంలోనే.. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్  సభకు హాజరు కాకపోవడమే కాకుండా..  అదే సమయంలో  కరీంనగర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసీ మరీ,కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో.. గతంలో ఈటల చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా తప్పు పట్టారు.అంతే కాదు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో బీజేపీ స్టాండ్ ఎప్పుడూ ఒక్కటే అంటూ..  కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అయిందని గతంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన మాట, తీసుకున్న స్టాండ్ లో ఈ రోజుకూ ఇసుమంతైనా  మార్పు లేదని కుండబద్దలు కొట్టేసినట్లు చెప్పారు. అంత వరకు అయితే కొంతవకు ఓకే.. బండి అక్కడితో ఆగలేదు బీజేపీలో ఉన్న ఎవరైనా  బీజేపీ స్టాండే తీసుకోవాలనీ..  వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండదని పరోక్షంగా ఈటలకు చురకలు అంటించారు.  

అంతే కాదు..  కాళేశ్వరం ప్రాజెక్టు సమబందించి అప్పటిరాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని, మాజీ మంత్రి హోదాలో ఈటల ఒకటికి పదిసార్లు చెప్పడమే కాకుండా,కాళేశ్వరం ప్రాజెక్టుకు కాబినెట్ ఆమోదం లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పు కుంటానని కాంగ్రెస్ నేతలకు సవాలు కూడా విసిరారు. అయితే, బండి సంజయ్ ఈటల సవాలును సింపుల్ గా తీసి పారేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈటల రాజేందర్ అభిప్రాయానికి పార్టీ స్టాండ్ పూర్తి భిన్నమని బండి పేర్కొన్నారు. కేసీఆర్ కాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారంటే.. ఎవరూ నమ్మరన్నారు. అంటేఈటల చెప్పింది తప్పు, కాంగ్రెస్ చెప్పిందే సత్యం అని బండి, కాంగ్రెస్ పార్టీకి సర్టిఫికేట్ ఇచ్చారు.  

విషయంలోకి వెళితే, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ లో మూడు పిల్లర్లు కూలిన సంఘటన, ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలు, ఆర్థిక ఆకతవకలపై విచారణ జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ పీసీఘోష్ కమిషన్‌  ఏర్పాటు చేసిన విషయం  అందరికీ తెలిసిందే. ఈ కమిటీ ఎదుట ఈటల రాజేందర్, బీజేపీ ఎంపీగా కాకుండా..  గతంలో  కేసీఆర్  మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి,  మాజీ మంత్రి హోదాలో ఇటీవల హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో , ఆర్థిక విషయాలకు సబంధం లేని  కాబినెట్ ఆమోదం వంటి కొన్ని సాంకేతిక అంశాలకు సంబంధించి  కేసీఆర్  ప్రభుత్వానికి సానుకూలంగా మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు, ఈటల వ్యాఖ్యల, పూర్వాపరాలు, పర్యవసానాలపై, పార్టీలో చర్చ జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట, ఈటల మాజీ మంత్రిగా హాజరయ్యారే కానీ, బీజేపీ ఎంపీగా హాజరు కాలేదని స్పష్టం చేశారు. సరే.. అది ఎంత వరకు సమంజసం అనే విషయాన్నిపక్కనపెడితే.. అంతర్గతంగా చర్చించవలసిన  అంశాలను  బహిరంగా అది కూడా  బీజేపీ దేశ వ్యాప్తంగా, భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగంగా మోదీ ప్రభుత్వం విజయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ అభియాన్ లో  భాగంగా రాష్ట్రంలో వికసిత భారత్ సంకల్ప సభ నిర్వహిస్తున్న  సమయంలో.. పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్దేశపూర్వకంగా వివాదాన్ని సృష్టించదాన్ని పార్టీ పెద్దలు తప్పుపడుతున్నారు. అలాగే..  ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య రాజుకున్న ఈ వివాదం ఎటు దారి తెస్తుంది, ఎందాకా పోతుంది అనేది  ఇప్పడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. అలాగే..  పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుంటేనే కానీ, బండి వర్సెస్ ఈటల మధ్య ముదురుతున్న యుద్ధం చల్లారదని అంటున్నారు.

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.