చంద్రబాబుకు సమస్యగా మారిన వంశీ?
Publish Date:May 23, 2012
Advertisement
జగన్ తో సన్నిహితంగా మాట్లాడి ఇటీవల సంచలనం సృష్టించిన విజయవాడ తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ మరో కొత్తచిక్కులో చిక్కుకున్నారు. జగన్ తో మాట్లాడినందుకే ఆగ్రహం తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వంశీపై వచ్చిన కొత్త ఆరోపణలు తలనొప్పిగా మారాయి. కృష్ణాజిల్లాలో మద్యం సిండికేట్ల జాబితాలో ప్రధానంగా భావిస్తున్న23మందిలో వంశీ తొమ్మిదోవాడు. ఈ జిల్లాలో 41షాపులు సిండికేట్ పాలనలో నడుస్తున్నాయి. అయితే అధికారులతో కుమ్మక్కయి మొత్తం వ్యవహారం భారం మోస్తున్నది మాత్రం 23మందే. ఈ జాబితాను కోర్టులో సమర్పించిన ఎసిబి డిఎస్పీ మొత్తం సిండికేట్ బాధ్యతనంతా ఆ 23మందే మోస్తున్నారని స్పష్టం చేశారు. న్యాయమూర్తికి ఈ జాబితా సమర్పించినందుకు కోర్టులో వంశీ హాజరుకావల్సి ఉంటుంది. ఇటీవల జగన్ తో మాట్లాడిన వంశీ తాను జూనియర్ ఎన్టీఆర్ గ్రూపుగా పరోక్షంగా పరిచయం చేసుకోవటం, దాన్ని కాదని జూనియర్ ఎన్టీఆర్ ఖండించటం అందరికీ తెలిసిందే. దీంతో చంద్రబాబు కూడా ఇది కుటుంబసమస్యగా మారుతుందని మొదట్లో హెచ్చరించినా తరువాత తగ్గారు. కానీ, ఇప్పుడు ఏకంగా సిండికేట్ జాబితాలో తొమ్మిదో పేరు వంశీది కావటంపై ఎటువంటి స్పందన చూపుతారోనని తెలుగుదేశం శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రత్యేకించి క్రమశిక్షణాచర్య దాకా వెళ్లినా వెళ్లవచ్చని భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/-tdp-vallabhaneni-vamsi-24-14248.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





