రాయలసీమ ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాన్ని వైకాపా ప్రేరేపిస్తోందా?

Publish Date:Oct 29, 2014

Advertisement

సార్వత్రిక ఎన్నికలలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో చాలా మంది నేతలు తమ పార్టీ తప్పకుండా ఎన్నికలలో ఘన విజయం సాధించి రాష్ట్రంలోనే కాక కేంద్రంలో కూడా చక్రం తిప్పుతుందని గట్టిగా నమ్మారు. జగన్ తను ముఖ్యమంత్రి అయిపోయినట్లే కలలు కంటూ తను చేయబోయే ఐదు సంతకాల గురించి కూడా జనాన్ని బాగానే ఊదరగొట్టారు. కానీ ఎన్నికలలో పరిస్థితి తారుమారయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే కోరిక నెరవేరలేదు. ఇప్పుడు పార్టీలో నేతలు మరో ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూడక తప్పదు. చూసినా అప్పటి పరిస్థితి ఏవిధంగా ఉంటుదో ఎవరూ చెప్పలేరు. ఈలోగా పార్టీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకొంటాయో కూడా ఊహించడం కష్టం. బహుశః అందుకే ఇప్పుడు చాప క్రింద నీరులా మెల్లగా రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి వైకాపా నిప్పు రాజేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది.

 

ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు ఆ మధ్యన ఒకసారి నంద్యాల మండలంలో పాండురంగపురం గ్రామంలో జరిగిన ఒక గ్రామసభలో మాట్లాడుతూ, తాను ఏనాడు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకోలేదని, కానీ ఇప్పుడు సీమ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నందున ప్రత్యేక రాష్ట్రం కోరుకొంటున్నానని అన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం సాధించుకొంటేనే రాయలసీమ రైతులు బాగు పడతారని ఆయన అన్నారు. వైకాపాలో ఆయన చాలా సీనియర్ నేత. జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీలో మరే సీనియర్ నాయకుడు గానీ ఆయన మాటలను ఖండించకపోవడం గమనిస్తే ఆయన పార్టీ అభిప్రాయాన్నే పరోక్షంగా ప్రకటించినట్లు    భావించవచ్చు. ఇంతకు ముందు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ పోరాడిన వైకాపా ఇప్పుడు రాష్ట్ర విభజన జరగాలని కోరుకోవడం చాలా ఆశ్చర్యకరమయిన విషయమే. వైకాపా నేత చెప్పిన మాటల ప్రకారం చూస్తే వైకాపా రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నిప్పు రాజేయాలనుకొంటున్నట్లు అర్ధమవుతోంది. అంటే జగన్ తను ముఖ్యమంత్రి అవడం కోసం రాష్ట్రాన్ని మరోసారి ముక్కలు చేయడానికి కూడా సంకోచించరని స్పష్టమవుతోంది.


రాయలసీమ అన్నివిధాల వెనుకబడుందనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. అందుకు ప్రధాన కారణం అక్కడి ప్రజాప్రతినిధులలో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన లేకపోవడమే. రాయలసీమ నుండి వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేసుకొంటూ పోయారు తప్ప ఏనాడు సీమను పట్టించుకొన్న పాపాన్నపోలేదు. అయినప్పటికీ సీమతో సహా మిగిలిన జిల్లాల ప్రజలందరూ కూడా హైదరాబాదు మన రాష్ట్ర రాజధానే కదా అనే ఉదారమయిన ధోరణితో ఎన్నడూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అందుకే అందరూ కలిసి హైదరాబాద్ అభివృద్ధిలో పాలుపంచుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవిభజనకు పూనుకొన్నప్పుడు దానికి వ్యతిరేఖంగా చాలా తీవ్రంగా పోరాడారు. ఆ తరువాత రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై వాడి వేడి చర్చ జరుగుతున్నపుడు సీమ ప్రజలు వెనుకబడిన తమ ప్రాంతం అభివృద్ధి చెందాలనే తపనతో కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయమని ఉద్యమించారు తప్ప ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు చేయలేదు. కానీ ఇదే అదునుగా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తప్ప బాగుపడలేమని వైకాపా నేతలు సీమ ప్రజలకు హితబోధ చేయడం కేవలం అధికార కాంక్షతో చేసిన ప్రయత్నమేనని చెప్పకతప్పదు. సీమ ప్రజల అసంతృప్తినే మరింత పెంచిపోషించగలిగితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకొంటుందని వైకాపా నేతల ఆలోచన కావచ్చును. బహుశః అందుకే కొందరు నేతలు చాప క్రింద నీరులా రాయలసీమ ప్రజలను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నట్లు అప్పుడప్పుడు వార్తలు వినపడుతున్నాయి.


ఒకప్పుడు తెరాస నేతలు కూడా తెలంగాణా ఏర్పడగానే ప్రజల జీవితాలలో ఏవో అద్భుతాలు జరిగిపోతాయన్నట్లు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం అందరూ ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజన వల్ల రెండు రాష్ట్రాలకు ఎంత అనర్ధం జరిగిందో, జరుగుతోందో చూసిన తరువాత కూడా వైకాపా నేతలు అధికారం చేజిక్కించుకోవడం కోసం మరోమారు రాష్ట్ర విభజన జరగాలని కోరుకొంటున్నట్లయితే అంత కంటే దారుణమయిన విషయం మరొకటి ఉండబోదు. అందువల్ల ఇకపై ఏ రాజకీయ నేతయినా మరోమారు రాష్ట్ర విభజన జరగాలని హితబోధలు చేసినట్లయితే, సీమ ప్రజలు అటువంటివారికి తక్షణమే బుద్ధి చెప్పాలి. రాయలసీమ జిల్లాలు కూడా మిగిలిన జిల్లాలతో సమానంగా అభివృద్ధి చెందాలని అందరూ కోరుకొందాము. అవసరమయితే అందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరీ సాధించుకొందాము. రాజకీయ నాయకుల స్వార్ధం కోసం మరోసారి మన రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.