కడుపులో లేని ప్రేమ కావలించుకొంటే వస్తుందా?

Publish Date:Oct 30, 2014

Advertisement

 

ఆంధ్రప్రజలపై, పాలకులపై, ప్రభుత్వంపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న విద్వేషం గురించి తెలియనిది కాదు. కానీ ఆయన అప్పుడప్పుడు వారిపై కూడా అకారణంగా ప్రేమ ఒలకబోస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. నిన్న మీర్‌పేటలోని జరిగిన ఒక సభలో కేసీఆర్ మాట్లాడుతూ, “తెలంగాణా లో స్థిరపడ్డ ఆంధ్రావాళ్ళు అందరూ కూడా నా బిడ్డలే. వాళ్ళని కూడా కడుపులో పెట్టుకొని చూసుకొంటాము,” అని ఆయన అన్నారు.

 

ఇదే కేసీఆర్ కొన్ని రోజుల క్రితమే “ఆంధ్రా విద్యార్ధులకు మేమెందుకు ఫీజులు చెల్లించాలి? మా ప్రభుత్వం కేవలం తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ఫీజు రీ ఇంబర్స్ మెంటు చేస్తుంది. మీ పిల్లలకి మీరే చెల్లించుకోండి” అని తెగేసి చెప్పడమే కాకుండా అందుకోసం 1956సం.ని ప్రాతిపాదికగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. చివరికి తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా విద్యార్ధులకి బస్సు పాసులు ఇవ్వడానికి సైతం నిరాకరించారు. కానీ ఇప్పుడు హటాత్తుగా వారిపై ప్రేమ ఒలకబోయడానికి కారణం కూడా ఆయనే స్వయంగా బయటపెట్టుకొన్నారు. “తెలంగాణా అభివృద్ధికి అందరి సహకారం తీసుకొంటాము. ఆంద్ర ప్రాంత పారిశ్రామికవేత్తలకు కూడా మా ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తుంది,” అని అన్నారు. అంటే ఆయన ఆంధ్ర ప్రజలను, ప్రభుత్వాన్ని, పాలకులను ఒకపక్క ద్వేషిస్తూనే, తెలంగాణా అభివృద్ధికి ఆంద్ర పారిశ్రామిక వేత్తల సహకారం తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెపుతున్నారన్న మాట.

 

కానీ ఒకప్పుడు హైదరాబాద్ నగరాన్ని రాష్ట్ర ప్రజలందరూ కలిసి అభివృద్ధి చేసారని, ఆంద్రప్రజలు వాదించినపుడు, ఇదే కేసీఆర్, “హైదరాబాద్ 1956నాటికే అన్ని విధాల అభివృద్ధి చెందింది. ఇందులో మీరు చేసింది ఏముంది?” అని ప్రశ్నించడం కూడా ప్రజలందరికీ తెలుసు.

 

ఇదే సభలో కేసీఆర్ మాట్లాడుతూ “హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేసానని చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పుకొంటున్నారు. కుతుబ్ షా కనుక బ్రతికి ఉండి ఉంటే, ఆయన మాటలు విని ఆత్మహత్య చేసుకొని ఉండేవారేమో?” అని ఎద్దేవా చేశారు. కుతుబ్ షా కాలంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెంది ఉన్నప్పుడు, గత పాలకులు హైదరాబాద్ ని సరిగ్గా అభివృద్ధి చేయలేదని దుమ్మెత్తి పోయడం ఎందుకు? అప్పుడే అభివృద్ధి చెందిన నగరాన్ని మళ్ళీ ఇప్పుడు తను కూడా అభివృద్ధి చేస్తానని చెప్పడం ఎందుకు? హైదరాబాద్ ని చంద్రబాబే ప్రధానంగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసినప్పటికీ ఆయనను ఎద్దేవా చేస్తున్న కేసీఆర్, రేపు తనే తెలంగాణాని అభివృద్ధి చేసానని చెప్పుకొన్నప్పుడు కూడా ప్రత్యర్ధులు ఇదేవిధంగా ఎద్దేవా చేసే అవకాశం ఉంటుందనే సంగతి కూడా గ్రహిస్తే మంచిది.

 

ఆంద్ర వలసవాదులు చాలా దుర్మార్గంగా పాలన చేసారని, హైదరాబాద్ కి ఆంధ్రా వాళ్ళు చేసింది ఏమీ లేదని ఒకవైపు దూషిస్తూనే, తెలంగాణా అభివృద్ధికి ఆంద్ర పారిశ్రామిక వేత్తల సహకారం అవసరమని చెప్పడం ఆయనకే చెల్లు. వారిని ఆకర్షించడానికే ఆయన తెలంగాణాలో స్థిరపడ్డ ఆంద్రప్రజల పట్ల లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ మన అందరిదీ అనే భావనతోనే ఆంధ్రకు చెందిన పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, అక్కడ తమ పరిశ్రమలు, విద్యావైద్య సంస్థలు స్థాపించారు. కానీ కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణా ఉద్యమాలు మొదలయినప్పటి నుండి వారిలో ఒక అభద్రతా భావం మొదలయింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా ముఖ్యమంత్రిగా అధికారం చేప్పట్టిన కేసీఆర్ వారిలో ఆ అభద్రతాభావం తొలగించే ప్రయత్నం చేయకపోగా దానిని తన మాటలతో మరింత పెంచి పోషిస్తూ వచ్చారు. నేటికీ ఆయన మాటలలో ఆంద్ర ప్రజలు, పాలకుల పట్ల ఏహ్యత, తృణీకార భావనలు ప్రస్పుటంగా కనబడుతూనే ఉన్నాయి. అటువంటప్పుడు మళ్ళీ ఆంధ్రా పారిశ్రామికవేత్తల సహాకారం కోరడంలో ఔచిత్యం ఏమిటో ఆయనకే తెలియాలి. కనుక ఇప్పుడు ఆయన ఆంద్ర ప్రజల పట్ల ఎంత ప్రేమ ఒలకబోసినా దానిని నమ్మేందుకు ఎవరూ సిద్దంగా లేరని చెప్పక తప్పదు.

 

బంగారి తెలంగాణా నిర్మిస్తానని పదేపదే చెపుతున్న కేసీఆర్ ముందుగా ప్రజలందరినీ కలుపుకు పోవడం నేర్చుకోవాలి. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో సఖ్యతగా మెలగడం నేర్చుకోవలసి ఉంటుంది. ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అలవరుచుకోవలసి ఉంటుంది. కానీ ఇవేవీ చేయకుండా ప్రతీ సభలో ప్రజలకు రంగుల కలలు చూపించినంత మాత్రాన్న అవన్నీ నెరవేరడం సాధ్యం కాదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.