ఆంధ్ర, తెలంగాణాలలో వైకాపా ప్రత్యమ్నాయ రాజకీయ శక్తిగా ఎదగగలదా

Publish Date:Oct 27, 2014

Advertisement

 

 

వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఓటమి ప్రభావం నుండి క్రమంగా బయటపడి మళ్ళీ మెల్లగా పార్టీని బలోపేతం చేసుకొనే పనిలోపడినట్లుంది. తెలంగాణాలో మళ్ళీ పార్టీ కార్యకలాపాలు ఆరంభించి వచ్చే ఎన్నికలనాటికి అక్కడ కూడా పార్టీని బలోపేతం చేసుకొనేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తెలంగాణాలో తను స్వయంగా అడుగుపెట్టే పరిస్థితి లేదు కనుక తనకు బాగా అచ్చివచ్చిన షర్మిలాస్త్రాన్ని బయటకు తీసి ప్రయోగించబోతున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే రాష్ట్ర విభజన జరుగుతోందని పసిగట్టగానే మూటాముల్లె సర్దుకొని రాత్రికి రాత్రే తెలంగాణా నుండి బయటపడి సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసిన వైకాపాను తెలంగాణా ప్రజలు ఆధారిస్తారా లేదా? అనే సంగతి మున్ముందు తెలుస్తుంది.

 

ఇక ఆంధ్ర, తెలంగాణా రెండు రాష్ట్రాలలోను పార్టీని నిర్వహించదలచుకొన్నారు కనుక పార్టీని జాతీయపార్టీగా మార్చి రెండు రాష్ట్రాలకు ప్రత్యేక శాఖలు, పాలకవర్గాలు, పార్టీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న పార్టీ కార్యాలయాన్ని తెలంగాణకు కేటాయించవచ్చును కనుక ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడలో కొత్తగా పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ప్రకటించారు. అదే విధంగా రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో పార్టీకి కమిటీలను నియమించి అన్ని సామాజిక వర్గాలకు చెందినవారికి వాటిలో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని ఆయన చెప్పారు.

 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని సామాజిక వర్గాలకు ముఖ్యంగా బీసీలకు పార్టీలో తగిన ప్రాధాన్యతనిచ్చి తమ పార్టీ యావత్ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తుందనే స్పష్టమయిన సంకేతం ఈయడం వలన, అన్ని సామాజిక వర్గాలకు వారు ఆ పార్టీలో చేరడంతో ఆపార్టీకి అన్ని వర్గాల నుండి ఓట్లు పడటంతో ఎన్నికలలో ఘన విజయం సాధించగలిగింది. కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం ఒకటి రెండు సామాజిక వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి తన పార్టీ ఓటమికి తనే కారకుడయ్యారని చెప్పవచ్చును.

 

గత ఐదేళ్ళలో గ్రామస్థాయి నుండి కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీని బలోపేతం చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కేవలం ఓదార్పు యాత్రలకి, సమైక్య యాత్రల ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇప్పుడు పార్టీకి అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసుకొని వాటిలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పడం గమనిస్తే వైకాపా తన తప్పును గ్రహించినట్లు అర్ధమవుతోంది. కానీ కమిటీలలో అందరికీ మొక్కుబడిగా చోటు కల్పించి సరిబెట్టకుండా, వారికి కూడా పార్టీలో సమాన గౌరవం, వారిని కూడా పార్టీ నిర్ణయాలలో భాగస్వాములు చేసినప్పుడే ఏమయినా ప్రయోజనం ఉంటుంది.

 

అయితే అధికారంలో లేని పార్టీ కమిటీలలో సభ్యులుగా చేరడం వలన పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం కోసం మరో ఐదేళ్ళపాటు జేబులో నుండి డబ్బులు ఖర్చవుతాయే తప్ప వేరే ప్రయోజనమేమీ ఉండబోదని అందరికీ తెలుసు. తీరాచేసి ఎన్నికలు వచ్చినప్పుడు ఈ కమిటీలను, సభ్యులను పక్కనబెట్టి భారీగా డబ్బు ఖర్చు పెట్టగలవారికే ప్రాధాన్యం ఇస్తారనే సంగతి కూడా అందరికీ తెలిసిన రహస్యమే. కానీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా అవసరం కనుక ఆసక్తిగలవారితో ఏర్పాటు చేసుకోక తప్పదు.

 

ఇక జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ విశ్వసనీయతకు మారుపేరుగా తరచూ చెప్పుకొంటారు. కానీ ఆ పార్టీలో సరిగ్గా అదే లోపించింది కనుకనే ఆ పార్టీని ఎన్నికలలో ప్రజలు తిరస్కరించారనే సంగతి ఆయన బహిరంగంగా అంగీకరించకపోయినా, కనీసం ఇకనుండయినా చిత్తశుద్ధితో కార్యక్రమాలు నిర్వహిస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉండవచ్చును. ఏమయినప్పటికీ 11 సీబీఐ చార్జ్ షీట్లలో ఏ-1, ఏ-2 నిందితులుగా ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్ మరియు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మెడలపై సీబీఐ కేసులు కత్తుల్లా వ్రేలాడుతున్నంత కాలం పార్టీ బలోపేతం చేయడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్, తెదేపాలకు ప్రత్యామ్నాయ శక్తిగా వైకాపా దృడంగా నిలబడటం కష్టమేనని చెప్పక తప్పదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.