పాకిస్థాన్ లో సైనిక పాలన?

Publish Date:Aug 19, 2026

Advertisement

పాకిస్థాన్ లో సైనిక పాలన  దిశగా అడుగులు పడుతున్నాయా? ఆ దిశగా పాక్ మిలిటరీ అడుగులు వేస్తున్నదా అంటే.. పరిశీలకులు ఔననే అంటున్నారు. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ స్థానంలో అధ్యక్ష తరహా పాలనను  పాక్ మిలిటరీ   కసరత్తు చేస్తోందని విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ చెబుతున్నారు.   ఈ మేరకుర ఇప్పటికే..  పాలనలో, ముఖ్యమైన నిర్ణయాధికారాల్లో సైన్యానికి శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలంటూ.. సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్‌కు   ఆప్తులైన వర్గాలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. 

ఈ ప్రతిపాదిత సమగ్ర ప్రణాళిక కేవలం తాత్కాలిక   మార్పులకే పరిమితం కాకుండా..   దేశ రాజకీయ, ఆర్థిక నిర్మాణాలను పూర్తిగా పునర్వ్యవస్థీకరించేలా ఉన్నట్లు సమాచారం. కొత్త  రాష్ట్రాలు , నూతన  పాలనా విభాగాల ఏర్పాటుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాబడి, ఆర్థిక వనరుల పంపిణీ నియమాలనూ సవరించేలా ఉంది. శతాబ్దాలుగా పాక్ రాజకీయాలు, విదేశాంగ విధానంలో సైన్యం వెనుకుండి చక్రం తిప్పుతున్నప్పటికీ, ఈ పదేళ్ల ప్రణాళిక ద్వారా సైనాన్ని చట్టబద్ధంగా ప్రభుత్వ భాగస్వామిగా నిలబెట్టాలని భావిస్తున్నారు.

పాలనా సంస్కరణల కోసం పాకిస్థాన్ మిలిటరీ, గా తుర్కియే, ఈజిప్ట్ దేశాల్లో అమలవుతున్న పాలనా వ్యవస్థల నమూనాలను మోడల్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. తీసుకుంటోంది. పార్లమెంటరీ వ్యవస్థ కంటే అధ్యక్ష తరహా పాలన వల్ల విధానపరమైన నిర్ణయాలు   వేగంగా, సమర్ధంగా తసుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఆ ప్రతిపాదన విస్పష్టంగా పేర్కొంది.  

 ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన ప్రాథమిక  దశలోనే ఉన్నప్పటికీ, పాకిస్థాన్ సైన్యం    రాజకీయ వ్యవస్థ మార్పు బలంగా కోరుకుంటుండటంతో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర పడే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

 Presidential Rule in Pakistan, Pakistan Army Power, Field Marshal Asim Munir, Pakistan Constitutional Reforms, Pakistan Political Crisis

By
en-us Political News

  
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో  దోషిగా  తీహార్ జైళ్లో  శిక్ష అనుభవిస్తున్న సజ్జన్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను జైలు అధికారులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.  
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల సవరణ బిల్లుఅలాగే  ఏపీ ఉన్నత విద్య నియంత్రణ,  పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లుకు కూడా శాసనమండలి  ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అలాగే..  విద్యారంగంలో ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు సైతం సభ ఆమోదం పొందింది.
 దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన చంద్రబాబు నొక్కి చెప్పారు.  అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను సమర్థవంతంగా అనుసంధానిస్తూ కుప్పం మీదుగా ప్రత్యేక బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు  ప్రతిపాదించారు.
హర్మూజ్ జలసంధిలోని దక్షిణ మార్గంలో, ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా నియంత్రణలోని ఈ ప్రత్యేక కారిడార్‌..  సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి  ఇంధన ఉత్పత్తి దేశాల నుంచి చమురు నింపుకున్న ట్యాంకర్లతో పాటు, ఖాళీగా తిరిగొచ్చే నౌకలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తూ రవాణాను సమన్వయం చేస్తున్నది.
ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి,  రేచర్ల బొగ్గు బ్లాకులను ఎంపిక చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ వేలం ప్రక్రియ ద్వారా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఈ రెండు  బొగ్గు బ్లాకులను దక్కించుకుంది.
దాదాపు వెయ్యి కోట్ల రూపాయల  విదేశీ చెల్లింపుల  వ్యవహారంలో పన్ను ఎగవేత, యు అక్రమ నిధుల మళ్లింపు ఆరోపణలపై ఐటీ అధికారులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏకకాలంలో  13 ప్రాంతాలలో సోదాలు చేపట్టారు.  ఈ సోదాల్లో డిజిటల్ ఆధారాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో తన వాటాను 9.99 శాతానికి పెంచుకోవడానికి ఎల్‌ఐసికి ఆర్బీఐ అనుమతి లభించింది. ఈ వార్తతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు ధర 1% పెరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ డోపింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. కొకైన్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ITIA అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్ కప్ పూల్ డి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ 5 3 తేడాతో సంచలన విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో చెలరేగి జట్టుకు ఘన విజయాన్ని అందించిన పూర్తి వివరాలు చూడండి.
బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో పీవీ సింధు, ఆయుష్ శెట్టి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. సాత్విక్ చిరాగ్ జోడీకి వాకోవర్ లభించగా, లక్ష్యసేన్ తీవ్ర పోరాటంలో ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ ఫలితాలు, కీలక గణాంకాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
అంతర్జాతీయ చెస్ రంగాన్ని ఏలుతున్న భారత్! ప్రతిష్టాత్మక సింక్‌ఫీల్డ్ కప్‌లో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించి అగ్రస్థానానికి చేరుకున్న ఆర్. ప్రజ్ఞానంద. మరోవైపు ఆసియాన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత అండర్ 11 బాలికల జట్టు బ్రాంజ్ మెడల్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. పూర్తి వివరాలు చదవండి.
నాసా ప్రతిష్టాత్మక స్విఫ్ట్ గామా-రే టెలిస్కోప్ రెస్క్యూ మిషన్ విఫలమైంది. $30 మిలియన్ల వ్యయంతో చేపట్టిన రోబోటిక్ క్రాఫ్ట్ నియంత్ పిలవకపోవడంతో మిషన్‌ను నాసా రద్దు చేసింది. త్వరలోనే భూ వాతావరణంలో మండిపోనున్న స్విఫ్ట్ టెలిస్కోప్ పూర్తి వివరాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.