తదుపరి లక్ష్యం ఇంటర్నెట్ కేబుల్స్.. ఇరాన్ సంకేతాలు!

Publish Date:Apr 23, 2026

Advertisement

అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇప్పుడు సరికొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు ముడి చమురు రవాణాకు అడ్డుకట్ట వేస్తామంటూ హెచ్చరిస్తున్న ఇరాన్..  ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చిది. సముద్ర గర్భంలో ఉన్న అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్ ఇప్పుడు ఇరాన్ లక్ష్యంగా మారే అవకాశం ఉందన్న సంకేతాలను పంపుతోంది. ఇరాన్  అధికారిక వార్తా సంస్థలల విశ్లేషణలు అదే చెబుతున్నాయి.  ఈ కేబుల్స్ ను ఇరాన్ లక్ష్యం చేసుకుంటే.. గల్ఫ్ దేశాల డిజిటల్ వ్యవస్థ కుప్పుకూలే ప్రమాదం ఉంది.  

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీ తో సంబంధం ఉన్న తస్నీమ్ వార్తా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. హోర్ముజ్ జలసంధి కేవలం చమురు, గ్యాస్ రవాణాకే కాకుండా..  ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థకు కూడా ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ జలసంధి గుండా కనీసం ఏడు ప్రధాన అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్స్ వెళ్తున్నాయి. వీటిలో ఫాల్కన్, ఏఈఈ-1, టీజీఎన్-గల్ఫ్, మరియు ఎస్ఈఏ ఎమ్ ఇ, విఈ  వంటి అతిపెద్ద కేబుల్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ కేబుల్స్ ద్వారానే ఆసియా, ఐరోపా,  మధ్యప్రాచ్య దేశాల మధ్య ఇంటర్నెట్ డేటా వేగంగా ప్రవహిస్తుంది.

ఒకేసారి పలు కేబుల్స్ దెబ్బతింటే లేదా కావాలని దెబ్బ తీస్తే..  పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో తీవ్రమైన ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడుతుంది. దుబాయ్, దోహా వంటి నగరాల్లో స్టాక్ మార్కెట్లు స్తంభించిపోవడమే కాకుండా, ఈ-కామర్స్, బ్యాంకింగ్ లావాదేవీలు  విమానయాన సేవలు పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది. ఇరాన్ ఈ కేబుల్స్ ద్వారా ఇతర అరబ్ దేశాలపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తోందని అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి దేశాలు డిజిటల్ సేవల కోసం ఈ సముద్రగర్భ కేబుల్స్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.

గతంలో ఎర్ర సముద్రంలో కేబుల్స్ దెబ్బతిన్నప్పుడు భారత్, పాకిస్థాన్ సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ వేగం గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు హోర్ముజ్ జలసంధిలో అటువంటి పరిస్థితే తలెత్తితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రాతితీవ్రమైన  ప్రభావం చూపుతుంది. చమురు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవచ్చని, కానీ సముద్రగర్భ కేబుల్స్ దెబ్బతింటే వాటిని పునరుద్ధరించడానికి నెలల సమయం పడుతుందని, అంతవరకు డిజిటల్ సేవలు స్తంభించిపోతాయని తస్నీమ్ తన కథనంలో పేర్కొంది. 

రానున్న రోజుల్లో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగితే..  ఇరాన్ ఈ కేబుల్స్‌ను ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల డేటా సెంటర్లు గల్ఫ్ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేబుల్స్ భద్రత ఇప్పుడు ప్రపంచ దేశాలకు సవాలుగా మారింది. మొత్తంమీద, హోర్ముజ్ జలసంధి ఇప్పుడు కేవలం 'ఎనర్జీ చొక్ పాయింట్' గానే కాకుండా 'డిజిటల్ చొక్ పాయింట్' గా కూడా మారిపోయింది.

By
en-us Political News

  
ఢిల్లీ హత్యాచార నిందితుడు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే నోరెళ్ల పెడుతున్నారు
ఒంటిమిట్ట అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశ జనాభా పెరుగుదల రేటు కంటే విద్యార్థుల ఆత్మహత్యల రేటు వేగంగా పెరుగుతోంది. 15 నుండి 20 ఏళ్ల లోపు యువతలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.
ర్యాంకు ఒక లక్ష్యం కాదు.. గుర్తింపుగా సమస్యగా మారుతుంది. పదమూడు ఏళ్ల వయసులోనే జేఈఈ చేయాలి అనే సందేశం బాల్యాన్ని ముందుగానే ముగిస్తుంది. దాని తరువాత వస్తున్న జీవితాన్ని ఎలా జీవించాలో మాత్రం ఎవ్వరూ నేర్పరు. ఫలితంగా, అడ్మిషన్ తర్వాత కలిగే శూన్యత, అపరాధ భావం, వెనుకబడిపోతానేమోనన్న భయం ఇవన్నీ కలిసి కలిసి మానసిక కృంగుబాటుగా మారతాయి.
డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అగ్గి రాజేస్తోంది.
విశాఖకు ఎక్కువ పరిశ్రమలు వచ్చాయని, ఇంకా రాబోతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేశ రాజధానిలో ఢిల్లీలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది.
ప్రతి బ్యాంకు శాఖ జీరో మ్యూల్ అకౌంట్స్ లక్ష్యంగా పనిచేయాలని, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఫిర్యాదుల ఆధా రంగా శాఖల పని తీరును అంచనా వేసుకోవాలని పేర్కొన్నారు.బ్యాంకు ఉద్యోగుల కీలక పనితీరు సూచికల్లో ఖాతాల సంఖ్యకన్నా కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్‌లో తిలక్ వర్మ ప్రదర్శన చూస్తుంటే.. అతడొక సంపూర్ణ బ్యాటర్ అన్నవిషయం అదర్ధమౌతోందన్న ఆకాశ్ చోప్రా.. ముంబై ఇండియన్స్ కు తిలక్ వర్మ భవిష్యత్ కెప్టెన్ కాగల అన్ని అర్హతలూ ఉన్నబ్యాటర్ అని పేర్కొన్నాడు. తిలక్ వర్మ ఐపీఎల్ జట్టును నడిపించే రోజు ఎంతో దూరంలో లేదన్నాడు.
ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తి ఇలా ఆకస్మికంగా తప్పుకోవడం ఇప్పుడు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల కొన్ని రోజులుగా సుదన్ గురుంగ్‌పై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంతో పాటు, మనీ లాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ భట్టా సంస్థల్లో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు బయటపడటంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
పాకిస్థాన్ జెండా కలిగిన నౌకలకు మాత్రమే ఇరాన్ ప్రత్యేక అనుమతులు మంజూరు చేయడంతో మధ్యవర్తిత్వం పేరుతో సొంత ప్రయోజనాల లావాదేవీలకు పాకిస్థాన్ ప్రాధాన్యత ఇస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ చర్యలు ఇరాన్-అమెరికా మధ్య దౌత్యపరమైన విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పాకిస్థాన్ తీసుకున్న కొన్ని దౌత్యపర చర్యలు ఇరాన్ కు అనుకూలమని కనిపించినా.. వాస్తవానికి ఇరాన్, అమెరికా మధ్య ఉన్న సున్నిత సమతౌల్యాన్ని అవి దారుణంగా దెబ్బతీశాయని అంటున్నారు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై అనుమతి షరతులు, పాక్ నౌకలకే ప్రత్యేక అనుమతులు, అలాగే ఇస్లామాబాద్ లో ఇరాన్–అమెరికా చర్చలపై వస్తున్న వార్తలు.. ఇవన్నీ కలిసి పాకిస్థాన్ దౌత్యం నమ్మకం మీద ఆధారపడినదిగా కాకుండా, లావాదేవీల మీద ఆధారపడినదిగా మార్చేశాయి.
కోరుకొడ మండలం కాపవరం పరిధిలోని పాండవుల మెట్టపై పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పాండవుల మెట్టపై పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారుల ప్రకటనతో ఒక్కసారిగా ఆప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.