మీడియాది బాధ్యతారాహిత్యం.. సీజేఐ.!

Publish Date:Jul 24, 2026

Advertisement

విద్యార్థుల నిరసనల సమయంలో   పోలీసులు లాఠీచార్జీ, దాష్టీకం, దౌర్జన్యాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందంటూ వస్తున్న వార్తలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్   ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ అంశంపై సుప్రీం కోర్టులో రిట్ పిటీషనే దాఖలు కాలేదని పేర్కొన్న ఆయన దాఖలు కాని పిటిషన్ ను విచారణకు స్వీకరించకుండా నిరాకరించడమేంటని నిలదీశారు. మీడియా అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరించిందంటూ ఫైర్ అయ్యారు.  

సుప్రీం కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్  ఈ అంశాన్ని ప్రస్తావించారు.   డిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యంపై దాఖలైన పిటిషన్ ను పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయని పేర్కొన్న ఆయన మీడియా   బాధ్యతారాహిత్యంగా ఇటువంటి కథనాలను వండివార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల వరకూ ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల ఉక్కుపాదానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాలేదని స్పష్టం చేశారు.  

కేవలం లేఖ రూపంలో వచ్చిన ఒక వినతిపత్రాన్ని   రిట్ పిటిషన్‌గా ఎలా పరిగణిస్తామన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి..  ఎవరో  పంపిన లేఖ ఆధారంగా న్యాయస్థానం విచారణకు నిరాకరించిందని ప్రచారం చేయడం సరికాదన్నారు. 

ఇటీవల ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసులు లాఠీఛార్జ్, బాష్పవాయుగోళాలు ప్రయోగించారనే ఆరోపణలపై అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని, వీడియో ఆధారాలను పరిశీలించాలని ఒక న్యాయవాది  మౌఖికంగా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, మెన్షనింగ్ సమయంలో వీడియోలు చూసేందుకు తమ వద్ద సమయం లేదని ధర్మాసనం పేర్కొంది. సరైన నియమావళి ప్రకారం పిటిషన్ దాఖలు కాకుండానే, సీజేఐ కేసును తిరస్కరించారంటూ వార్తలు రావడంతో సీజేఐ ఈ వివరణ ఇచ్చారు.

CJI Surya Kant, Supreme Court Police Brutality Petition, Reckless Media Reporting

By
en-us Political News

  
ఈ సందర్భంగా ఆలయ ప్రదక్షిణ మార్గంలో పొర్లు దండాలు పెట్టి మొక్కు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో సరికొత్త విప్లవం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.
కొత్త చట్టం తెస్తున్న కేంద్ర ప్రభుత్వం..వచ్చే వారమే పార్లమెంట్‌లో బిల్లు..!
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతంపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది.
కేటీఆర్ జన్మదిన వేడుకలలో శుక్రవారం (జులై 24నపాల్గొన్న ఆయన తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం నిరాధారమైన ప్రచారం, వదంతులు మాత్రమేనని స్పష్టత ఇచ్చారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రతిష్ఠకు భంగం కలిగేలా పింక్ డైమండ్ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేశారంటూ గతంలో దాఖలైన పరువు నష్టం కేసు విచారణ ఇప్పుడు తుది దశకు వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యింది.
ద్యార్థుల హక్కుల కోసం ఒక పోరాట యోధుడిలా నిలబడిన వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఆయన వైద్య చికిత్సను నిరాకరించి నిరశన కొనసాగించడంతో కేంద్రం దిగివచ్చింది.
దీంతో ఆయనను స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మోకాలి గాయానికి గురువారం విజయవంతంగా సర్జరీ జరిగింది.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ఖండించడమే కాకుండా.. దేశ విద్యావ్యవస్థలో ఇంతటి భారీ అక్రమాలు జరిగినా బాధ్యత వహించకపోవడం సరికాదనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ లో ఇసుమంతైనా మార్పు లేదనీ విస్పష్టంగా ప్రకటించింది.
హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన, ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది.
తాను ఆడిన నాలుగో టి20 ఇంటర్నేషనల్ లోనే ప్రపంచ రికార్డు తిరగరాశాడు. జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం (జులై 23) జరిగిన టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ క్రికట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు.
2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ WTC ఫైనల్ తేదీలు, వేదికను ఐసీసీ ప్రకటించింది. లార్డ్స్ మైదానాన్ని తప్పించి ది ఓవల్ మైదానంలో జూన్ 9 నుంచి 13 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.