శ్రీరామ్‌ హీరోగా సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘కోడి బుర్ర’

ఒకరికి ఒకరు, రోజాపూలు, స్నేహితులు, రాగల 24 గంటల్లో వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శ్రీరామ్‌ కొత్త మూవీ ‘కోడి బుర్ర’ సోమవారం హైదరాబాద్‌ ఫిలింనగర్‌ దైవసన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని వీ4 క్రియేషన్స్‌ బ్యానర్‌ లో కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్‌ గౌడ్‌, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్‌ గౌడ్‌ నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్‌ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. శృతి మీనన్‌, ఆరుషి హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. మహావీర్‌ మరో కీ రోల్‌ పోషిస్తున్నారు. కోడి బుర్ర సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిథిలుగా పాల్గొన్న ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ క్లాప్‌ నివ్వగా, దర్శకుడు భరత్‌ కమ్మ స్క్రిప్ట్‌ అందజేశారు. 

ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ‘కోడి బుర్ర చిత్రాన్ని మా మిత్రులు నిర్మిస్తున్నారు. మంచి కథను ఈ సినిమా కోసం ఎంచుకున్నారు. ప్రేక్షకుల్ని ఈ మూవీ ఆకట్టుకుని ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాం’ అన్నారు.

దర్శకుడు చంద్రశేఖర్‌ కానూరి మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో శ్రీరామ్‌గారిని కొత్తగా చూస్తారు. ఆయన ఇప్పటిదాకా లవ్‌, రొమాంటిక్‌ తరహా చిత్రాలు చేశారు. కోడి బుర్ర సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఇది అందరికీ నచ్చే మంచి క్రైమ్‌ థ్రిల్లర్‌ అవుతుందని నమ్ముతున్నాం’ అన్నారు.

హీరో శ్రీరామ్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా టైటిల్‌ వినగానే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. వీ 4 క్రియేషన్స్‌లో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఒక ఇంట్రెస్టింగ్‌ మూవీలో పార్ట్‌ కావడం హ్యాపీగా ఉంది’ అన్నారు.

నిర్మాత గట్టు విజయ్‌ మాట్లాడుతూ ‘ఈ నెల 22 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్తున్నాం. హీరో శ్రీరామ్‌గారు ఈ కథ విన్న వెంటనే సింగిల్‌ సిట్టింగ్‌ లో ఓకే చేశారు. ఒక మంచి మూవీతో మీ అందరి ముందుకు త్వరలోనే వస్తాం’ అన్నారు.

నిర్మాత కంచర్ల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ‘నా ఫేవరేట్‌ హీరో శ్రీరామ్‌ గారితో సినిమా ప్రొడ్యూస్‌ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఆయన ఒకరికి ఒకరు, పోలీస్‌ పోలీస్‌ సినిమాలను చాలా సార్లు చూశాను. మంచి కథ, మా డైరెక్టర్‌గారు ఎంతో క్రియేటివ్‌గా సినిమా స్క్రిప్ట్‌ చేశారు’ అన్నారు.