సీపీఐ నారాయణ కోర్టుకెక్కుతారుట!

 

ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య అవిచ్చినంగా సాగుతున్న యుద్ధంలో ఎవరిది పైచేయి అవుతుందో తెలియదు. కానీ ఆంద్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు పొరుగింటి పుల్ల కూరే బాగుందని తెగ మెచ్చేసుకొంటుంటే, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మాత్రం మీ కూరబాలేదు...మాకూర బాలేదు అంటూ తెరాస మీద కూడా చిందులు వేస్తున్నాయి. లెఫ్ట్ పార్టీలు కూడా ఇంచుమించు అలాగే డిసైడ్ అయిపోయాయి. కానీ ఎవరి వాదనలు వారు ఎడాపెడా వినిపించేస్తుంటే సీపీఐ నారాయణ ఇక సహించలేక, హైకోర్టులో పిటిషన్లు పడేసేందుకు ఫిక్స్ అయిపోయారుట! ఓటుకి నోటు వ్యవహారం, దానితో బాటు గత ఆర్నెల్లుగా తెలంగాణాలో జరుగుతున్న రాజకీయ కుప్పిగంతుల పోటీల గురించి హైకోర్టులో ఒకటో రెండో పిటిషన్లు వేసేందుకు సిద్దమవుతున్నారుట!