కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  కరవు భత్యం (డిఏ) మూడు శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ బుధవారం (సెప్టెంబర్ 16)ఆమోదం తెలిపింది.

 అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వోద్యోగులకు దీపావళి కానుక ఇచ్చేందుకు నిర్ణయించుకున్న మోడీ సర్కార్ డీఏ పెంపునకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇహనో, ఇప్పుడో వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ భేటీలో ఉద్యోగుల డీఏ పెంపుపై చర్చించిన కేబినెట్ ఇందుకు ఆమోదముంద్ర వేసింది.