టీ-న్యూస్ ఛానల్ కి ఏపీ పోలీస్ నోటీసు జారీ

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా చంద్రబాబు-స్టీఫెన్ సన్ మాట్లాడినవి చెప్పబడుతున్న టేపులను టీ-న్యూస్ ఛానల్ జూన్ 7వ తేదీ రాత్రి 8.30 గంటలకు ప్రసారం చేసి, టెలిగ్రాఫిక్ చట్టంలో సెక్షన్: 19ని ఉల్లంఘించినందుకు విశాఖనగర ఎసిపి రమణ నిన్న అర్ధరాత్రి ఆ చానల్ సిఈఓ నారాయణ రెడ్డికి నోటీసు అందజేశారు. మూడు రోజులలోగా ఆ నోటీసుకి సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. టీ-న్యూస్ ఛానల్, సాక్షి న్యూస్ ఛానల్ మరియు ఆంధ్రా, తెలంగాణాకి చెందిన కొందరు రాజకీయ నేతలు ఉద్దేశ్యపూర్వకంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నందున వారిపై తగిన చర్యలు చేప్పట్టవలసిందిగా విశాఖపట్నంలో ప్రముఖ న్యాయవాది యన్.వి.వి. ప్రసాద్ తన పిర్యాదులో కోరారు. ఆయన పిర్యాదు ఆధారంగానే టీ-న్యూస్ ఛానల్ కి నిన్న నోటీసు జారీ చేయబడ్డాయి. బహుశః సాక్షి ఛానల్ కి కూడా త్వరలోనే నోటీసులు ఇస్తారేమో?