కింగ్ నాగార్జున కబ్జా చేశారా?
posted on Apr 10, 2013 6:13PM
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కు సంబందించిన ఎన్.కన్వెన్షన్ పై లోకాయుక్తలో కేసు నమోదైంది. ఈ కన్వెన్షన్ సెంటర్ పై వచ్చిన అబియోగాలపై విచారించి నివేదిక ఇవ్వాలని లోకాయుక్త అదికారులను ఆదేశించింది. మాదాపూర్ లోని తమ్మిడి చెరువును నాగార్జున ఆక్రమించి దీనిని నిర్మించారన్నది ఈ కేసులో మోపబడిన అబియోగం. ఈ చెరువు గురుకుల ట్రస్ట్ భూములలో ఉంది. దీనికి సంబంధించిన 14 ఎకరాల భూమిని ఆక్రమించి వైఎస్ హయాంలో నాగార్జున రెగ్యులరైజ్ చేసుకున్నాడని టీడీపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాజాగా చంచల్ గూడ జైలులో నిమ్మగడ్డ ప్రసాద్ ను కలిసిన నాగార్జున తనను టీడీపీ నాయకులు ఎందుకు టార్గెట్ చేశారో అర్ధం కావడంలేదని అన్నారు. దీంతో పాటు అన్నపూర్ణ స్టూడియోను నాగార్జున వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.