వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే సత్తు ఫుడ్స్..!

వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు.  వేసవి వచ్చిందంటే సత్తు పానీయం చాలా ఎక్కువగా తీసుకుంటారు.  ఇది శరీరాన్ని కూల్ గా ఉంచడమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది.  కాల్చిన శనగలతో తయారు చేసే సత్తు పౌడర్ ను సత్తు పానీయం కోసం ఉపయోగిస్తారు. అయితే.. సత్తు పొడితో కేవలం సత్తు పానీయమే కాకుండా.. చాలా రకాల పదార్థాలు తయారు చేసుకుంటారు.  వేసవిలో అటు శరీరాన్ని కూల్ గా ఉంచుతూ, ఇటు శరీరానికి బోలెడు పోషకాలు అందించే సత్తు పొడితో ఏమేం వంటకాలు బాగుంటాయో తెలుసుకుంటే.. సత్తు పేడ.. వేసవిలో  నీరసంగా అనిపిస్తే సత్తు పేడను తయారు చేసుకుని తినవచ్చు.. ఇది  ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తిన్న తర్వాత  శరీరం పూర్తి చురుకుగా ఉంటుంది. సత్తు పిండిని నెయ్యి వేసి బాగా వేయించి అందులో పంచదార పొడి వేసి సన్న మంట మీద గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సత్తు పేడ రెఢీ.. ఇది చాలా రుచిగా ఉంటుంది. సత్తు మజ్జిగ.. వేసవి కాలంలో సత్తుతో మజ్జిగ తయారు చేసుకుని తాగవచ్చు. ఇది  శరీరాన్ని తేమగా ఉంచుతుంది.  పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టపడతారు. దీనిని ప్రతిరోజూ తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. సత్తు లడ్డు.. సత్తు లడ్డూలను సత్తు పొడితో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. సత్తు లడ్డులు తినడం వల్ల  శరీరం బలపడుతుంది. సత్తు లడ్డులో డ్రై ప్రూట్స్, నట్స్, నెయ్యి వేసి తయారు చేసుకుని తినవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. సత్తు షార్డ్ బ్రెడ్.. వేసవిలో కూడా కారంగా తినాలని అనుకునే వారు చాలామంది ఉంటారు.  అలాంటి వారికి సత్తు షార్ట్ బ్రెడ్ చాలా మంచి ఫుడ్. సత్తు పిండిని వేయించి అందులో బంగాళదుంప,  బఠాణీ వంటి కూరగాయలు వేసి ముద్దగా చేసుకుని దీన్ని తడి చేసిన బ్రెడ్ మధ్యలో ఉంచి బ్రెడ్ ను బోండా లాగా రౌండ్ చేసి నూనెలో డీప్ ప్రై చేయాలి.  చాలా రుచిగా ఉంటాయి. సత్తు లిట్టి చోఖా.. లిట్టి చోఖా అనేది బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో చాలా ఫేమస్ ఫుడ్.  వేయించిన శనగపిండిని గోధుమ పిండిలో స్టఫ్ చేసి వాటిని కాలుస్తారు.  వీటిని లిట్టి అంటారు.  వీటిని నెయ్యితోనూ,  వంకాయ, టమాటా,  బంగాళాదుంపతో చేసిన చోఖా అనే వంటకంతో కలిపి వడ్డిస్తారు. ఈ పూర్తీ కాంబోను లిట్టీ చోఖా అంటారు.  ఇది చాలా రుచిగా ఉంటుంది.  చోఖా లేకపోయినా లిట్టిని వివిధ రకాల చట్నీలతో కూడా తింటారు.                                       *రూపశ్రీ.

read more
దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోపతీతో శాశ్వత పరిష్కారం: ఒక సమగ్ర అవగాహన

ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి కాలంలో మారిన జీవనశైలి కారణంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక దీర్ఘకాలిక (Chronic) ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప, పూర్తిగా నయం కావడం లేదని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారికి హోమియోపతీ ఒక గొప్ప వరప్రసాదం. కేవలం లక్షణాలను అణచివేయడం కాకుండా, వ్యాధిని మూలాల నుండి తొలగించే అద్భుత శక్తి హోమియోపతీకి ఉంది.  Renowned Homeopathy expert Dr Praveen Kumar చెప్పిన మరిన్ని విషయాలు ఈ  TeluguOne Health Video Link క్లిక్ చేసి తెలుసుకుందాం. మనం హోమియోపతీని ఎందుకు ఎంచుకోవాలి? (Why Homeopathy?) దీర్ఘకాలిక వ్యాధులలో తిరుగులేని చికిత్స: హోమియోపతీ యొక్క అసలు బలమే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం. బ్రాంకియల్ ఆస్తమా వంటి జెనెటిక్ డిజార్డర్లను కూడా సమూలంగా తొలగించడానికి హోమియోపతీలో మార్గం ఉంది. సంపూర్ణ ఆరోగ్య దృక్పథం (Holistic Approach): ఇతర వైద్య విధానాలు కేవలం వ్యాధి మీద దృష్టి పెడితే, హోమియోపతీ 'రోగి' (Patient) మీద దృష్టి పెడుతుంది. అంటే మీ వేలికి నొప్పి ఉంటే కేవలం వేలిని మాత్రమే కాకుండా, మీ శరీరాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి చికిత్స అందిస్తుంది. శాస్త్రీయమైనది: ఒకప్పుడు హోమియోపతీ కేవలం ప్లాసిబో (Placebo) అని విమర్శలు ఉండేవి. కానీ నేడు IIT ముంబై మరియు IISc బెంగళూరు వంటి సంస్థలు చేసిన పరిశోధనల్లో హోమియోపతీ మందులలో 'నానో పార్టికల్స్' (Nano Particles) ఉంటాయని నిరూపితమైంది. దుష్ప్రభావాలు లేని వైద్యం: ఇది సహజ సిద్ధమైన పద్ధతిలో పనిచేస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ భయం ఉండదు. చికిత్స ప్రక్రియ ఎలా ఉంటుంది? (How it works?) హోమియోపతీలో చికిత్స అనేది చాలా లోతుగా సాగుతుంది. దీనిని 'కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్' అంటారు. కేస్ టేకింగ్: డాక్టర్ మీతో దాదాపు గంట సేపు మాట్లాడుతారు. మీ అలవాట్లు, మీ ఇష్టాయిష్టాలు, మీకు ఎప్పుడు కోపం వస్తుంది, మీ గత చరిత్ర (Past history) వంటి అంశాలన్నింటినీ అడిగి తెలుసుకుంటారు. ఇది మీ 'జర్నీ ఆఫ్ లైఫ్'ను అర్థం చేసుకునే ప్రక్రియ. మయాజమ్స్ (Miasms): ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాలు ఉన్నట్లే, హోమియోపతీలో సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనే మూడు మయాజమ్స్ ఉంటాయి. వీటి ఆధారంగానే మీ వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. పొటెంటైజేషన్: మందులను డైల్యూట్ చేసే ప్రక్రియను 'డైనమైజేషన్' అంటారు. ఇందులో మందు పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, దాని శక్తి (Power) చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం చేయకూడదు? (What Not to Do?) సమాచారాన్ని దాచకండి: డాక్టరుకు మీ శారీరక, మానసిక లక్షణాలను స్పష్టంగా చెప్పాలి. ఏదైనా విషయాన్ని దాచడం వల్ల సరైన మందును ఎంపిక చేయడం కష్టమవుతుంది. స్వయం వైద్యం వద్దు: హోమియోపతీ మందులు తీపి మాత్రల్లా కనిపిస్తాయి కదా అని సొంతంగా వాడకూడదు. వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్ ఇచ్చే పొటెన్సీ (30CH, 200CH లేదా 1M) మారుతూ ఉంటుంది. అపోహలు నమ్మకండి: హోమియోపతీ ఆలస్యంగా పనిచేస్తుందనేది ఒక అపోహ మాత్రమే. సరైన మందు పడితే అక్యూట్ కండిషన్స్ (జ్వరం, జలుబు) కూడా చాలా వేగంగా తగ్గుతాయి. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్ర: 30CH అంటే ఏమిటి? జ: ఇది హోమియోపతీలో ఒక రకమైన పొటెన్సీ (శక్తి). ఒక భాగం మందును 99 భాగాల వెహికల్ (ఆల్కహాల్ లేదా షుగర్ ఆఫ్ మిల్క్)తో కలిపి చేసే ప్రక్రియ ద్వారా 30CH తయారవుతుంది. ఇది అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. ప్ర: హోమియోపతీ మందులు ఘాటుగా ఎందుకు ఉంటాయి?  జ: మందులను పిల్స్ (మాత్రలు) మీద వేయడానికి ఆల్కహాల్‌ను వెహికల్‌గా ఉపయోగిస్తారు. ఆ ఆల్కహాల్ వల్ల ప్రారంభంలో కొంచెం ఘాటుగా అనిపించవచ్చు, కానీ ఆ మాత్రలు తియ్యగానే ఉంటాయి. ప్ర: మానసిక సమస్యలకు హోమియోపతీ పనిచేస్తుందా?  జ: అవును. హోమియోపతీలో మనిషి యొక్క సైకీ (Psyche) లేదా మానసిక స్థితిని బట్టి హైయర్ పొటెన్సీ మందులు ఇవ్వడం జరుగుతుంది, ఇవి మానసిక ఆరోగ్యంపై అద్భుతంగా పనిచేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి హోమియోపతీ ఒక ఆశాకిరణం. ఇది కేవలం వ్యాధిని తగ్గించడమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి

read more
ads
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
ఉగాది పచ్చడిలోని ఆరోగ్య రహాస్యం..

డా ..చిరు మావిళ్ళ మురళీ మనోహర్.. ఉగాది అంటే ఉగాది పచ్చడి మాత్రమే అని అనుకుంటారు. కానీ ఉగాది పచ్చడిలో ఉన్న ఆయుర్వేద ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా?ఇప్పుడు చైత్ర మాసం లో వసంత రుతువు లో ఉన్నాం ఆకు రాలిన తరువాత కొత్త కొత్త గా రేకు విచ్చినట్లు చిగుర్లు తోడుగుతాయి. ఆప్రాంతం అంతా పచ్చటి తివాచి పరిచినట్లు పచ్చగా విరబూస్తాయి. పువ్వులు పరిమళాలు.మావిడి పూత సువాసనలు, మామిడి చెట్లపై కొత్తగా చిగురులు తొడిగిన మామిడి పూత గుత్తులు,మామిడి పిందెలు ఆ వసంత శోభ అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది మది పులక రిస్తుంది. కొత్త కొత్త పూతని ఆస్వాదించాలని అనిపిస్తూ ఉండడం సహజం.ప్రకృతి లో మార్పు వచ్చింది శీతకాలం నుండి ఎండా కాలానికి వాతావరణం మారుతుంది ఇక ఎండవేడి ని తట్టుకోవ దానికి మన శరీరం సన్నద్ధం కావాలి.వాతావరణం లో మార్పులకు తగ్గట్టుగా శరీరంలో వేడిమి ని,తట్టుకోవడం. శరీరం దానంతట అదే చల్లబడే సహజ లక్షణాన్ని వృద్ది   చేయడంకీలకం.ముఖ్యంగా ఎండాకాలం లో వేడికి శరీరం నీర సించి పోవడం.ఒక్కో సారి అతిసారం బారిన పడడం. ముఖ్యంగా డయాబెటీస్, గుండె సంబధిత సమస్యలు ఉన్న రోగులలో వచ్చే హార్ట్ బీట్ లో మార్పులు.లేదా శరీరంలో రక్త ప్రసరణలో సమస్యలు వస్తూ ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ విశ్లేషించారు.ఈ క్రమం లో మనం ఉగాది రోజున తీసుకున్నే ఆరు రకాల లో ఉన్న ఆరోగ్య రహస్యాలు, వాటిలో  ఉండే పోషక విలువల గురించి తెలుగు వన్ హెల్త్ కు  వివరించారు. మనం పండగ పూట లేదా కొన్ని సందర్భాలాలో తీసుకున్న ఆహారం శరీరంలో తామస ,రజో గుణాలు పెంచు తాయని  శరీరంలో వేడి వల్ల వచ్చే సమస్యల ను అధిగమించాలి సత్వ ప్రాధాన మైనగుణాన్ని అలవారచుకోవాలాంటే ఉగాది పచ్చడి ఉపయోగ పడుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ పేర్కొన్నారు. వేసవి రాగానే శరీరం లో కొన్ని రకాల రసాయన చర్యల వల్ల శరీరం లో సమతౌల్యం లోపిస్తుందని సమ తౌల్యాన్ని నియంత్రించే శక్తి ఉగాది పచ్చడి సమతుల పోషకాలు అందిస్తయాని అన్నారు డాక్టర్ చిరుమావిళ్ళ మురళీ మనోహార్. సాంప్రదాయ పద్దతిలో ఉగాది పచ్చడి కావాల్సిన పదార్ధాలు... **మట్టి పాత్ర,లేదా కుండ. **వేప పూత ఒక భాగం. **మామిడి పిందెలు  ముక్కలు రెండు భాగాలు.  . **చింత పండు,పా తది. నాలుగు భాగాలు. **ఉప్పు 5 భాగాలు. **బెల్లం ఆరు భాగాలు .ఇంకా అరిటి పండు ముక్కలు  అన్నీ కలిపి నీరు పోయాలి. పైన పేర్కొన్న కావాల్సిన పదార్ధాలలో  మధురం-తీపి  ఆమ్లం-పులుపు. లవణం-ఉప్పు . తి త్తం -చేదు. వగరు వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా తయారు చేసిన వేప పచ్చడిని నింబ కుసుమ భక్షణం అని అంటారు.నింబ కుసుమము అంటే వేప పూత అని అర్ధం. మామిడి ముక్కలు,బెల్లము,పులుపు,చేదు వంటివి చింత పండు అరటి పండు,మిరియాలపొడి,ఉప్పు వంటివి వేసిన నింబ కుసుమ భక్షణం అంటే తింటే మరెన్నో లాభాలు ఔషద గుణాలు ఉన్నాయి.అని డాక్టర్ మురళీ మనోహర్ తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. షడ్రసో పేతం ఉగాది పచ్చడి... ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయని వాటిని షట్ రుచులుగా పేర్కొన్నారు.ఎందుకంటే జీవితానికి ఉగాదికి మానసిక సంబంధమైన సంబంధం ఉందని అంటారు చిరు మావిళ్ళ.అవును మనజీవితం లో తెలుగు వారికి తెలుగు సంవత్సరాది యుగ ఆది అంటే మరో యుగం నికి ఆది అంటే తొలి అడుగు. ఈ సమయం లో మనం ఎదుర్కునే ఎన్నోరకాల సమస్యలు ఒక్కో రుచిని సూచిస్తాయి. అన్ని సమపాళ్ళలో ఉంటె పచ్చడిని ఎలా అస్వాదిస్తామో.కస్టాలు,కడ గళ్ళు,ఆనందం,ఉత్సాహం, కష్టం,నష్టం, వచ్చినా మానసికంగా ఎదుర్కోడానికి మనల్ని సిద్ధం చేసేది ఉగాది అని అంటారు పండితులు.ఉగాది పచ్చడి ఔషద గుణాలు...వేప పువ్వు ,దీనిని బద్ర అని నింబ అని కూడా పిలుస్తారు. నిచిన, నిచినిండిన్ మార్గోసిన్ అనే పదార్ధాలు ఉంటాయని. వేప యాంటి ఫంగల్,యాంటి బ్యాక్టీరియాగా పని చేస్తుందని వేప  వల్ల వివిదరకాల జబ్బులను తగ్గించే గుణం వేపాకు ఉందని స్పష్టం చేసారు చిరుమవిళ్ళ మురళీ మనోహర్.వేపాలో తిత్త రసం ఉందని అంటే చెడు గుణం ఉన్నందున శరీరంలో వచ్చే కఫ,పిత్త దోషాన్ని తొలగించి ఆకలి పెంచుతుందని విశ్లేషించారు.వేపను తీసుకోవడం వల్ల ముఖ్యంగా డయాబెటీస్ ను నియంత్రించే గుణం వేపకు ఉందని వీటితో పాటు కామెర్లు,చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.పిల్లలకు వేపను తినిపించడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు చచ్చిపోతాయని కాబట్టి పిల్లకు మేలు చేస్తుందని.పేర్కొన్నారు. బెల్లం... ఉగాది పచ్చడికి కీలకమైన ఇంగ్రీడియంట్. బెల్లానికి తీపిగుణం ఉంటుంది. బెల్లానికి కఫం పెంచే గుణం ఉంది. బెల్లం ఉగాది నుంచి వాడితే కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ఎండాకాలం లో వచ్చే ఎందవేదిమిని తట్టుకోడానికి ఎండబారిన పడ్డ వారికి నీ రసం  తగ్గించితక్షణ శక్తి నిచ్చేది గ్లుకోజ్ గా బెల్లం పనిచేస్తుంది.బెల్లం ఒక సువాసన,శ్రమ నీరసం తగ్గించి వడ దెబ్బ నుండి కాపాడే శక్తినిచ్చి ప్రోటీన్లను అందించేది బెల్లమే  అయితే బెల్లము అరిటి పండు కలిపి తీసుకుంటే మంచిదని అంటారు చిరుమామిళ్ళ. మామిడి ... ఉగాదిపచ్చడికి ఎన్ని ఉన్న మామిడి ముక్క పుల్లగా తగలనిదే పచ్చడికి రుచి ఉండదు. అని పెద్దలు అంటూ ఉంటారు.ముఖ్యంగా వేసవి కాలం లో చాలామంది కడుపు నొప్పి తో బాధ పడుతూఉంటారు.మామిదిపండులో ఉండే విటమిన్ సి మనలో ఇమ్యునిటీ పెంచుతుంది. మామిడి కాయ వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది.  చింత పండు... దీనిని తెమరందన్ ఇండియా భారత దేశం లో అతి పురాతన మైన విటమిన్లు,పిండి పదార్ధాలు ఉంటాయి. చింతపండులో ముఖ్యంగా పాత చింత పండు ఉష్ణం తగ్గిస్తుంది. వాతాన్ని, బడలిక, జీర్ణ ప్రక్రియను సరి చేస్తుంది. శరీరంలో వచ్చే వేడి తగ్గించి చల్ల దానాన్ని ఇస్తుంది.ముఖ్యంగా చింత అంటే చింతలు తీర్చేది చింత రసం త్వరగా శక్తి నిస్తుంది.మూత్ర విసర్జన సాఫీగా సాగేట్లు సహకరిస్తుంది చింత రసం. అందుకు చింత పండు రసం వేసవి కాలం లో తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు... ఉగాది పచ్చడి రుచిని పెంచేది చవి లేదా లవణం,ఉప్పు మన శరీర అవసరాలకు జీవన శక్తి నిచ్చేది లవణం. ఆహారం లో వేసే ఉప్పు ఆ వంటకు మంచి రుచిని ఇస్తుంది.ఉప్పు త్రిదోషాల ను హరిస్తుంది. అరటి పండు... అరటి పండు లో పోషక విలువలు పొటాషియం, యాంటి ఫంగల్, కూడా అరటి పండు పనిచేస్తుంది.అతిసారం నుండి రక్షించే సంజీవనిగా పేర్కొన్నారు వైద్యులు. అరటి పండు అధిక రక్త పోటు, కిడ్నీ సమస్యలు, రసాయనం గా పనిచేస్తుంది. ఇవి ఉగాది ఔషదం అధ్బుత ఫలితాలు ఉగాది పచ్చడి ఉగాది రోజే తీసుకోవాలా అప్పుడప్పుడూ తీసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఎప్పుడైనా తీసుకుంటే వేసవి కాలం లో ఎన్ని సార్లు తీస్జుకున్న తప్పులేదు. వ్యక్తిలో ఉండే త్రి దోషాల నుండి ముక్తి నిచ్చేది ఉగాది పచ్చడి.   

read more
డయాబెటిస్ కంట్రోల్ చేయాలంటే రోటిలో ఈ 3 పదార్థాలు కలిపి!

  ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. కానీ నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల మనలో చాలా మంది మలబద్ధకం (Constipation) మరియు మధుమేహం (Diabetes) వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రతిరోజూ మాత్రలు మింగడం, ఇన్సులిన్ తీసుకోవడం మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. మీ ఇంట్లోనే, మీ వంటింట్లో ఉండే పదార్థాలతో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తే ఎంత బాగుంటుంది కదా? ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు సూచించిన ఒక అద్భుతమైన "డబుల్ ధమాకా" చిట్కా గురించి ఈ Video Link క్లిక్ చేసిన మనం వివరంగా తెలుసుకుందాం. మనం ఈ మార్పు ఎందుకు చేసుకోవాలి? (Why Should We?) సాధారణంగా మనం తినే రోటీలు కేవలం ఆకలిని తీరుస్తాయి. కానీ వాటికి కొన్ని ప్రత్యేక పదార్థాలను జత చేయడం వల్ల అవి ఔషధాలుగా మారుతాయి: • సహజసిద్ధమైన పరిష్కారం: ఎటువంటి రసాయనిక మందులు లేకుండానే ఉదయం పూట సాఫీగా విరేచనం అయ్యేలా చేస్తుంది. • పోషకాల గని: చియా సీడ్స్ వల్ల శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం మరియు ఫైబర్ అందుతాయి. • దీర్ఘకాలిక ప్రయోజనాలు: కేవలం షుగర్ కంట్రోల్ చేయడమే కాకుండా, భవిష్యత్తులో బరువు పెరగకుండా, హార్మోన్ల అసమతుల్యత కలగకుండా కాపాడుతుంది. • మెదడు ఆరోగ్యం: వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు (అల్జీమర్స్), పార్కిన్సన్స్ వంటి సమస్యలు రాకుండా ఈ పదార్థాలు రక్షణనిస్తాయి. • మందుల వాడకం తగ్గుతుంది: సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఈ రోటీలు తీసుకోవడం వల్ల మీరు వాడే షుగర్ మాత్రల డోస్, ఇన్సులిన్ అవసరం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఎలా తయారు చేసుకోవాలి? (How-to Guide) మీరు రోజూ తినే రెండు పుల్కాలు లేదా రోటీల పిండిలో ఈ క్రింది విధంగా కలపండి: 1. మలబద్ధకం సమస్య ఉన్నవారి కోసం: • చియా సీడ్స్: 2 నుండి 3 టీస్పూన్ల చియా సీడ్స్‌ను 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. • సబ్జా గింజలు: 1 నుండి 1.5 టీస్పూన్ల సబ్జా గింజలను కూడా నానబెట్టుకోవాలి. • ఈ నానబెట్టిన గింజలను నీటితో సహా పిండిలో కలిపేసి రొట్టెలు చేసుకోవాలి. 2. షుగర్ (డయాబెటిస్) నియంత్రణ కోసం: • పచ్చి పనసకాయ పొడి: 2 నుండి 3 టీస్పూన్ల పచ్చి పనసకాయల పొడిని పిండిలో కలపాలి (ఇది ఆన్‌లైన్ లేదా మెడికల్ షాపుల్లో దొరుకుతుంది). • మెంతి పొడి: ఒక టీస్పూన్ వేయించిన మెంతుల పొడిని కలపాలి. • ఈ మిశ్రమంతో రోటీలు చేసుకుంటే మెంతి పొడి వల్ల వచ్చే చేదు కూడా వేడి చేయడం వల్ల తగ్గుతుంది, రుచిగా ఉంటుంది. ఏమి చేయకూడదు? (What Not to Do) • నానబెట్టకుండా వాడకండి: చియా సీడ్స్ లేదా సబ్జా గింజలను నేరుగా పిండిలో కలపకూడదు, కచ్చితంగా నానబెట్టాలి. • పనస పండు వద్దు: షుగర్ ఉన్నవారు పనస పండు తినకూడదు (గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ), కేవలం 'పచ్చి పనసకాయ పొడి' మాత్రమే వాడాలి. • మందులు ఆపకండి: ఈ చిట్కాలు పాటిస్తూనే డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ, షుగర్ లెవల్స్ తగ్గుతున్న కొద్దీ డాక్టర్ సలహాతోనే డోస్ తగ్గించుకోవాలి. • అతిగా వద్దు: ఆరోగ్యానికి మంచిది కదా అని మితిమీరిన పరిమాణంలో పదార్థాలను వాడకండి, పైన చెప్పిన కొలతలు పాటించండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: ఈ రోటీలను పిల్లలకు ఇవ్వవచ్చా? జ: తప్పకుండా ఇవ్వవచ్చు. చిన్న పిల్లలకు ఇచ్చేటప్పుడు పదార్థాల పరిమాణం (డోస్) కాస్త తగ్గిస్తే సరిపోతుంది. ఇది వారి జీర్ణక్రియకు చాలా మంచిది. ప్ర: గింజలను విడిగా నీటిలో కలుపుకొని తాగితే సరిపోదా? రోటీలోనే ఎందుకు కలపాలి?  జ: రోటీలో కలిపి వేడి చేయడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. అలాగే, ఔషధంలా విడిగా తీసుకోకుండా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మానసికంగా కూడా బాగుంటుంది మరియు రుచిగా ఉంటుంది. ప్ర: ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఇవి తీసుకోవచ్చా?  జ: అవును, ఎటువంటి సమస్యలు లేని వారు కూడా వీటిని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో షుగర్, బరువు పెరగడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి మన చేతుల్లోనే ఉంది. చిన్న చిన్న మార్పులతో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ చిట్కాలను పాటించి మీ అనుభవాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆరోగ్యకరమైన చిట్కాల కోసం, ప్రత్యక్ష నిపుణుల సలహాల కోసం మా యూట్యూబ్ ఛానల్  క్లిక్ చేయండి  👉 [www.youtube.com/@Naveenacolumn] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

read more
నానబెట్టిన వాల్నట్స్ తినడానికి ఏ సమయం ఉత్తమం తెలుసా?

  డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.  చాలమంది డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తినడం కంటే వాటిని నానబెట్టుకుని తినడం చాలా మంచిదని చెబుతారు. ఇలా నానబెట్టుకుని తినే డ్రై ప్రూట్స్ లో బాదం,  జీడిపప్పు, ఎండు ద్రాక్ష,  ఖర్జూరం మొదలైనవాటితో పాటు వాల్నట్స్ కూడా ఉంటాయి.  వీటిని నానబెట్టుకుని తినడం వల్ల పోషకాలు లభిస్తాయి. శరీరానికి ప్రోటీన్ లభిస్తుంది.  అలాగే సాధారణంగా ఉన్న డ్రై ఫ్రూట్స్ ను తినడం కంటే.. నానబెట్టిన వాటిని తినడం వల్ల ఎక్కువ పోషకాలు లభిస్తాయి.  అయితే నానబెట్టిన వాల్నట్స్ ను సాధారణంగా రాత్రి నానబెట్టి,  ఉదయాన్నే  తింటుంటారు.  కానీ.. ఇలా నానబెట్టిన వాల్నట్స్ ను ఉదయం కాకుండా వేరే సమయంలో తినడం వల్ల ఫలితాలు బాగుంటాయట.  శరీరానికి మంచి బెనిఫిట్ చేకూరుతుందట.  ఇంతకీ నానబెట్టిన వాల్నట్స్ ను ఏ సమయంలో తినాలి? ఏ సమయంలో తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి? తెలుసుకుంటే.. సాయంత్రం.. నానబెట్టిన వాల్నట్స్ ను సాయంత్రం సమయంలో తినడం చాలా మంచిదని వైద్యులు, ఆహార నిపుణులు అంటున్నారు. వాల్నట్స్ లో ఉండే పోషకాలలో ప్రముఖమైనది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు.  అలాగే మెలటోనిన్ కూడా పుష్కలంగా ఉంటుంది.  అందుకే వీటిని సాయంత్రం సమయంలో తినడం మంచిదని అంటారు. వాల్నట్స్ లో ఉండే ఒమేగా-3 మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మెదడు పని తీరుకు చాలా సహాయపడుతుంది.  అలాగే వాల్నట్స్ లో ఉండే మెలటోనిన్ కూడా శరీరానికి చాలా అవసరం. ఇది నిద్రను మెరుగ్గా ఉంచడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాల్నట్స్ లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెలటోనిన్ మాత్రమే కాకుండా పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను, అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్నట్స్ లో ఉండే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందినవి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుంది. అట్లాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను డీల్ చేయడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. నానబెట్టిన వాల్నట్స్ తింటే జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. ఎందుకంటే వాల్నట్స్ నానడం ద్వారా ఫైబర్ మెరుగవుతుంది.  ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇది మలబద్దకం సమస్యను నివారిస్తుంది. నానబెట్టిన వాల్నట్స్ తింటే ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇది ఆహారం ఎక్కువ తీసుకోవడాన్ని నివారిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంచడం లేదా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
ఏ డ్రై ఫ్రూట్ తింటే ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందంటే..!

డ్రై ఫ్రూట్స్ శరీరానికి చాలా మంచివని చెబుతారు.  డ్రై ఫ్రూట్స్  రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి పోషకాలను,  ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.  అయితే డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంత మంచివో.. వాటిలో ఎంత మంచి పోషకాలు ఉంటాయో.. వాటిని తీసుకునే విధానం సరిగా లేకపోతే అవన్నీ వ్యర్థమయినట్టే అని అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు.. అంతేకాదు.. ఏ డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ శరీరంలో ఏ అవయవానికి మేలు చేస్తుందో తెలుసుకుని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు.  వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే.. బాదం.. బాదంలో పోషకాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.  ప్రయోజనాలు.. మెదడును పదును పెట్టి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.  చర్మాన్ని ఆరోగ్యంగా,  యవ్వనంగా ఉంచుతుంది.   ఎముకలను బలపరుస్తుంది,  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాల్నట్.. వాల్నట్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు.. వాల్నట్స్ ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి,   జ్ఞాపకశక్తికి అద్భుతమైనది.  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.   వాపు,  ఉద్రిక్తతను తగ్గిస్తుంది. జీడిపప్పు.. జీడిపప్పులో మెగ్నీషియం, ప్రోటీన్, భాస్వరం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు.. జీడిపప్పు  ఎముకలు, దంతాలను బలపరుస్తుంది.  చర్మానికి,  జుట్టుకు మంచిది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. పిస్తా పప్పు.. డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పు కూడా ఖరీదైనది.  పిస్తా పప్పులో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..   పిస్తా పప్పు గుండె,  రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.  బరువు నియంత్రణ,  జీర్ణక్రియకు సహాయపడుతుంది.  మెదడు,  కళ్ళకు మేలు చేస్తుంది. ఎండు ద్రాక్ష.. ఎండు ద్రాక్ష భారతీయులు ఎక్కువగా ఉపయోగించే, ఎంతో కాలం నుండి వాడుతున్న డ్రై ప్రూట్..  ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.  ప్రయోజనాలు..   రక్తహీనతను తొలగించడంలో ఎండుద్రాక్ష చాలా బాగా పనిచేస్తుంది. ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది. కడుపు ఆరోగ్యానికి  జీర్ణక్రియకు మంచిది. అంజీర్.. అంజీర్ చాలా శక్తివంతమైన డ్రై ఫ్రూట్. అంజీర్ లో ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..  జీర్ణక్రియ,  మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.  ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది. గుండె,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఖర్జూరం.. ఖర్జూరానికి చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.  ఖర్జూరంలో సహజ చక్కెరలు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంచి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..    ఖర్జూర పండ్లు తింటే తక్షణ శక్తిని ఇస్తుంది. రక్తాన్ని మెరుగుపరచడంలో,  బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. గుండె,  కండరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.                                               *రూపశ్రీ.

read more
వేసవి వచ్చేసింది.. వడదెబ్బ,  డీహైడ్రేషన్ సమస్య రాకూడదంటే ఈ డ్రింక్స్ తాగండి!

వేసవి వచ్చేసింది. వేసవి కాలం దానితో పాటు మండే ఎండలు,  ఎండ వేడిని వెంట పెట్టుకుని వస్తుంది. ఈ సీజన్‌లో చెమట, శరీరం తేమ కోల్పోవడం,   నిరంతరం  అలసటగా అనిపించడం వంటి సమస్యలు పెరుగుతాయి. పెరుగుతున్న వేడి,  వేడిగాలుల కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  వేసవి కాలంలో  హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు తాగుతారు,  కానీ అది శరీరాన్ని చల్లబరచదు. ఎన్ని నీళ్లు తాగినా తృప్తి కలగదు.  మార్కెట్ లో పానీయాలు కొనుగోలు చేయడం,  మరీ ముఖ్యంగా కూల్ డ్రింకుల కొనుగోలు వేసవిలో బాగా పెరుగుతాయి. కానీ వీటిలో రసాయనాలు ఉంటాయి.  ఈ వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే ఇంట్లోనే చేసుకోదగిన కొన్ని పానీయాలు తీసుకోవడం మంచిది. భారతీయులకు ఎంతో సుపరిచితమైన,  ఆరోగ్యానికి మేలు చేస్తూ వేసవి తాపాన్ని తగ్గించే పానీయాలు ఏంటో తెలుసుకుంటే.. బేల్ షర్బత్.. పరమ శివుడి ఆరాధనలో ఉపయోగించే బిల్వ  పత్రం మాత్రమే మనకు తెలుసు. కానీ బిల్వ వృక్షానికి పండ్లు కూడా కాస్తాయి.  వీటినే బిల్వ పండ్లు లేదా బేల్ పండ్లు అని మారేడు కాయలు అని అంటూ ఉంటారు.  ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. బాగా పండిన బిల్వ పండ్లను జ్యూస్ చేసి తాగితే శరీరం చల్లబడుతుంది. కావలసిన పదార్థాలు.. పండిన బిల్వ పండు చల్లని నీరు.. 4 గ్లాసులు బెల్లం లేదా చక్కెర.. 3 నుండి 4 స్పూన్లు నల్ల ఉప్పు.. కొద్దిగా. తయారు విధానం.. బిల్వ పండును పగలగొట్టి గుజ్జు తీయాలి.  ఈ గుజ్డులో నీరు పోసి బాగా బ్లెండ్ చేయాలి.  స్ట్రైయినర్ సహాయంతో వడబోయాలి. ఇందులో బెల్లం లేదా పంచదార,  నల్ల ఉప్పు వేసి బాగా కరిగిన తర్వాత తాగాలి. ఆమ్ పన్నా.. వేసవి అంటే మామిడికాయలు.  పచ్చి మామిడి కాయలతో చేసే ఆమ్ పన్నా రుచిగానే కాకుండా శరీరానికి చలువ చేస్తుంది. కావలసిన పదార్థాలు.. పచ్చి మామిడికాయలు.. 2 బెల్లం లేదా చక్కెర.. 3 టీస్పూన్లు వేయించిన జీలకర్ర పొడి నల్ల ఉప్పు పుదీనా.. తయారీ విధానం.. మామిడికాయలు ఉడకబెట్టి గుజ్జు తీసుకోవాలి.  గుజ్జులో బెల్లం లేదా చక్కెర వేయాలి. ఇందులో కాసింత పుదీనాను వేసి మిక్సీ వేసుకోవాలి.  దీనికి కావలసినంత నీరు కలిపి జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇందులో వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి కలిపి తాగాలి.  ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. జల్ జీరా.. జల్ జీరా పేరు వింటేనే ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది.  ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం,  శరీరానికి చలువ,  గ్యాస్, అజీర్ణం నుండి ఉపశమనం కూడా ఇస్తుంది. కావలసిన పదార్థాలు.. జల్ జీరా పొడి నీరు పుదీనా నిమ్మరసం నల్ల ఉప్పు తయారీ విధానం.. చల్లని నీటిలో జల్ జీరా పొడి,  నిమ్మరసం, నల్ల ఉప్పు,  పుదీనా అన్నీ వేసి బాగా కలిపి తాగడమే.   సత్తు జ్యూస్.. బీహార్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో సత్తును వేసవిలో  తాగుతారు. ఇది చాలా శక్తివంతమైన పానీయం.  కడుపును చల్లబరుస్తుంది,  ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. కావలసిన పదార్థాలు.. సత్తు పొడి.. నల్ల ఉప్పు.. వేయించిన జీలకర్ర పొడి నిమ్మరసం తయారీ విధానం.. నీటిలో సత్తు పొడి, నల్ల ఉప్పు,  వేయించిన జీలకర్ర పొడి అన్ని వేసి బాగా మిక్స్ చేయాలి.  ఇందులో కాసింత నిమ్మరసం కలిపి తాగాలి. మజ్జిగ.. బారతీయులు ఎక్కువగా తాగే ఆరోగ్యకరమైన పానీయం మజ్జిగ.  పెరుగు నుండి  వెన్నను తీయగా మిగిలిన పానీయమే మజ్జిగ.  ఈ మజ్జిగ మరింత రుచిగా ఉండటానికి ఇందులో అల్లం, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు,  పొదీనా వేసి తాగుతారు.  మజ్జిగ మరింత రుచిగా రావడానికి కరివేపాకుతో పోపు పెట్టి తాగుతారు.  ఇందులో కొత్తి మీర వేసుకుంటే రుచి మరింత బాగుంటుంది.                               *రూపశ్రీ.

read more
ఒబెసిటీ వల్ల హార్ట్ ఎటాక్, డయాబెటిస్, క్యాన్సర్ ప్రమాదం!

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం పట్ల మనం చూపే నిర్లక్ష్యం మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 బిలియన్ల మంది ఊబకాయం (Obesity) మరియు దాని సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నారు. ఇది కేవలం శరీర ఆకృతికి సంబంధించిన సమస్య కాదు.. ఇది మన ఆయుష్షును తగ్గించే ఒక నిశ్శబ్ద శత్రువు. ఈ రోజు మనం మన ఆరోగ్యం గురించి గంభీరంగా ఆలోచించకపోతే, రేపు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.  Metabolic and Bariatric Surgeon Dr. Kona Lakshmi చెప్పిన మరిన్ని విషయాలు Video Link క్లిక్ చేసి తెలుసుకోండి. మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? (Why should we care?) ఊబకాయం అనేది ఇతర ప్రమాదకరమైన రోగాలకు ఒక ముఖద్వారం లాంటిది. దీనివల్ల కలిగే నష్టాలు ఊహించలేనంత దారుణంగా ఉంటాయి: గుండె మరియు ఊపిరితిత్తులపై ప్రభావం: మీ బరువు పెరిగేకొద్దీ మీ ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది, ఇది గుండె దెబ్బతినడానికి దారితీస్తుంది. సడన్ కార్డియాక్ డెత్స్‌కు ఊబకాయం ప్రధాన కారణం. క్యాన్సర్ ముప్పు: దాదాపు 13 రకాల క్యాన్సర్లు నేరుగా ఊబకాయంతో ముడిపడి ఉన్నాయి. మెటబాలిక్ వ్యాధులు: డయాబెటిస్ (షుగర్), హై బ్లడ్ ప్రెషర్, మరియు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు బాడీలోని "ఇంజిన్"ను లోపల నుండి దెబ్బతీస్తాయి. కీళ్ల నొప్పులు: అధిక బరువు వల్ల ఆర్థరైటిస్ వంటి కీళ్ల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఏమి చేయకూడదు? (What not to do?) మనం తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు మనల్ని అనారోగ్యం వైపు నెట్టేస్తాయి: పెద్ద సైజు దుస్తులపై ఆధారపడకండి: మార్కెట్‌లో 3XL నుండి 5XL వరకు దుస్తులు దొరుకుతున్నాయి కదా అని, బరువు తగ్గడానికి బదులు పెద్ద సైజు బట్టలు కొనడం అలవాటు చేసుకోవద్దు. మీ డ్రెస్ సైజు పెరుగుతుంటే, మీ అనారోగ్యం పెరుగుతోందని గుర్తించండి. నిర్లక్ష్యం వద్దు: "నేను బాగానే నడుస్తున్నాను కదా, నాకు ఏమీ కాదు" అని భ్రమపడకండి. లోపల షుగర్ లేదా కొలెస్ట్రాల్ ఎంత ఉందో బయటకి కనిపించదు. కెమికల్స్ వినియోగం: ఫుడ్ కలర్స్, పెస్టిసైడ్స్ ఉన్న ఆహారం మరియు విపరీతమైన కెమికల్స్ ఉన్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడటం వల్ల శరీర మెటబాలిజం దెబ్బతింటుంది. ఆరోగ్యం కోసం ఏం చేయాలి? (How to manage?) BMI పర్యవేక్షణ: మీ ఎత్తుకు తగ్గ బరువు (BMI) ఉన్నారో లేదో చూసుకోండి. సాధారణంగా BMI 18 నుండి 24 మధ్య ఉండాలి. ముందస్తు గుర్తింపు: మీకు ఆయాసం వస్తున్నా లేదా 15 నిమిషాలు కూడా నిరంతరంగా నడవలేకపోతున్నా మీ సిస్టమ్ ఫెయిల్ అవుతుందని అర్థం. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. జీవనశైలి మార్పులు: కాలుష్యం, జంక్ ఫుడ్ మరియు కెమికల్స్ కు దూరంగా ఉంటూ, శారీరక శ్రమను పెంచుకోవాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) 1. సన్నగా ఉన్నవారికి కూడా ఊబకాయం సమస్యలు ఉంటాయా?  అవును, బరువు తక్కువగా ఉన్నా మెటబాలిక్ సమస్యలు (షుగర్, బిపి) ఉండవచ్చు. ఊబకాయం అంటే కేవలం బయటకి కనిపించే కొవ్వు మాత్రమే కాదు, శరీర అంతర్గత వ్యవస్థల పనితీరులో లోపం కూడా. 2. 'మార్బిడ్ ఒబేసిటీ' అంటే ఏమిటి? BMI 40 కంటే ఎక్కువ ఉంటే దానిని 'మార్బిడ్ ఒబేసిటీ' అంటారు. ఈ స్థితిలో ఊబకాయం అనేది కేవలం బరువు సమస్య కాదు, అది ప్రాణాపాయ స్థితిని (Life risk) సూచిస్తుంది. 3. బేరియాట్రిక్ సర్జరీ అంటే కేవలం బరువు తగ్గడమేనా?  కాదు, ఈ సర్జరీ వల్ల బరువు తగ్గడంతో పాటు మెటబాలిక్ డిసీజెస్ (డయాబెటిస్, హై బిపి) కూడా కంట్రోల్ అవుతాయి, అందుకే దీనిని మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జరీ అంటారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఊబకాయం అనేది మనకు సమయం ఇస్తుంది, దాన్ని మనం కంట్రోల్ చేయాలి. రేపటి తరానికి ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఇవ్వాలంటే ఈ రోజే మనం మారాలి. ఆరోగ్య విషయాలపై మరింత లోతైన అవగాహన కోసం మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) ఆరోగ్యంగా ఉండండి.. ఆనందంగా జీవించండి!

read more
తిన్న తర్వాత 10నిమిషాలు నడిస్తే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని తెలుసా?

ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం తీసుకోవడం తప్పనిసరి. నేటికాలంలో ఆహారం విషయంలో చాలా సీరియస్ నెస్ వచ్చింది.  నిజానికి నేటికాలంలో పుడీస్ ఎక్కువ అయ్యారు.  నచ్చిన ఆహారం తినడంలో ఎలాంటి కాంప్రమైజ్ కావడం లేదు, నచ్చినంత తినడంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కారు. అయితే ప్రతి రోజూ మూడు పూటలా ఆహారం తీసుకోవడం ఎంత సహాజమో.. ఆహారం తీసుకోగానే 10 నిమిషాలు నడవడం అంత ముఖ్యమని అంటున్నారు వైద్యులు,  ఫిట్‌నెస్ నిపుణులు.  ఆహారం తీసుకున్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు. ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. వాకింగ్.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి కష్టం లేకుండా, డబ్బు ఖర్చుపెట్టకుండా చేయగలిగే అతి తేలిక వ్యాయామం ఏదైనా ఉందంటే అది వాకింగ్ ఏ.  వాకింగ్ ను చాలామంది దినచర్యలో భాగం చేసుకుంటారు.  ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ వెళ్లడం చేస్తుంటారు. కానీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారం తిన్న తర్వాత ఓ 10 నిమిషాలు నడవడం చాలా మంచి అలవాటు అని అంటున్నారు. తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే కలిగే ప్రయోజాలు.. భోజనం తర్వాత ప్రతి రోజూ 10 నిమిషాలు నడిస్తే కాళ్ల కండరాలు బలపడతాయట.  ఇది ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని రోజులలోనే చాలా మంచి ఫలితాలు గమనించవచ్చని అంటున్నారు. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య షుగర్.  రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉండటం వల్ల ఆహారం తీసుకోవడానికి కూడా భయపడుతుంటారు.  అయితే ప్రతిరోజూ ఆహారం తీసుకున్న తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయాలి.  ఇలా చేయడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది అని అంటున్నారు.   ఆహారం తిన్న తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల  బరువు తగ్గడానికి సహాయపడుతుంది.  వాకింగ్ చేయడం వల్ల శరీర కదలికలు జరిగి పేగులు కూడా కదలికలకు లోనవుతాయి.  జీవక్రియ  మెరుగవుతుంది.   ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురయ్యే వారు ఉంటారు.  ఇలాంటి వారు బోజనం చేసిన తర్వాత 10న నిమిషాలు నడవడం అలవాటు చేసుకోవాలి.  ఇది చాలా గొప్పగా సహాయపడుతుంది.  మనసును ప్రశాంత పరుస్తుంది.  ఒత్తిడి తగ్గిస్తుంది. నేటికాలంలో చాలా మంది పొట్ట ఆరోగ్యంతోనే ఇబ్బంది పడుతున్నారు.  చాలామందికి పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంటుంది. నిజానికి ఇలాంటి వారికే డయాబెటిస్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది.  అయితే బోజనం చేయగానే కూర్చోవడం లేదా పడుకోవడం చేయకుండా 10 నిమిషాలు వాకింగ్ చేస్తే పొట్ట వచ్చే అవకాశాలు తగ్గుతాయి. బరువు కూడా తగ్గుతారు.                                   *రూపశ్రీ. 

read more
World Kidney Day.. మూత్రపిండాలను ప్రమాదంలో పడేసే క్రియాటినిన్ గురించి తెలుసా?

శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు.  అయితే  ప్రపంచవ్యాప్తంగా  కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  పెరుగుతున్న కిడ్నీ  వ్యాధి వ్యాప్తి గురించి అవగాహన కల్పించడానికి,  అవగాహన పెంచడానికి,  కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యల గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రతి సంవత్సరం మార్చి రెండవ గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అది ఈ ఏడాది మార్చి 12వ తేదీన వచ్చింది.  అన్ని వయసుల వారిలో కిడ్నీ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. . పిల్లలు కూడా కిడ్నీ సమస్యల ప్రమాదంలో ఉన్నారు. మూత్రపిండాలు  శరీరానికి ఫిల్టర్లలా పనిచేస్తాయి. అవి రక్తం నుండి మలినాలను,  అదనపు నీటిని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా విసర్జిస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం మానేస్తే, శరీరంలో విషపూరితం పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మూత్రపిండాల పరీక్షల సమయంలో క్రియేటినిన్ స్థాయిలు గురించి ప్రస్తావన వస్తూ ఉంటుంది. అసలు క్రియోటినిన్ అంటే ఏంటి?  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. క్రియాటినిన్.. క్రియాటినిన్ అనేది శరీర కండరాలలో ఉత్పత్తి అయ్యే క్రియాటిన్ అనే సమ్మేళనం విచ్ఛిన్నం కావడం ద్వారా ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థం. మనం శారీరక శ్రమలో పాల్గొన్నప్పుడు, మన కండరాలు శక్తిని ఉపయోగిస్తాయి,  ఈ ప్రక్రియలో క్రియాటినిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తంలో నిరంతరం ఉత్పత్తి అవుతుంది.  సాధారణ పరిస్థితులలో మూత్రపిండాలు దానిని రక్తం నుండి వడపోసి మూత్రం ద్వారా విసర్జిస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేసినప్పుడు, రక్తంలో క్రియాటినిన్ స్థాయి సమతుల్యంగా మారుతుంది.  క్రియేటినిన్ పెరగడం అనేది మూత్రపిండాలు రక్తాన్ని తగినంతగా ఫిల్టర్ చేయడం లేదని సంకేతాన్ని ఇస్తుంది. క్రియాటినిన్ స్థాయి.. క్రియాటినిన్ స్థాయి ఎలా ఉండాలి? రక్త పరీక్ష ద్వారా క్రియాటినిన్ స్థాయిలను గుర్తిస్తారు.    పురుషులలో సాధారణ క్రియాటినిన్ స్థాయిలు 0.7 నుండి 1.3 mg/dL వరకు ఉంటాయి. మహిళల్లో, ఇది 0.6 నుండి 1.1 mg/dL మధ్య  ఉంటే అది సాధారణం అని పరిగణిస్తారు. క్రియాటినిన్ స్థాయి నిరంతరం పెరుగుతూ ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. క్రియాటినిన్ స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే,  మూత్రపిండాలు అంత ప్రమాదంలో ఉంటాయి. క్రియాటినిన్ ఎక్కువైతే ఏ సమస్యలు వస్తాయి.. మూత్రపిండాల వడపోత సామర్థ్యం బలహీనపడటంతో క్రియాటినిన్ స్థాయిలు పెరుగుతాయి, దీని వలన శరీరంలో యూరియా,  ఇతర విషపదార్థాలు పేరుకుపోతాయి.   మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, తరచుగా నొప్పి నివారణ మందులు వాడటం,  శరీరం ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వడం మొదలైనవన్నీ మూత్రపిండాలను దెబ్బతీస్తాయి,  అధిక క్రియాటినిన్ స్థాయిలకు దారితీస్తాయి. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే, ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. క్రియాటినిన్ పెరగడం వల్ల మూత్రపిండాలే కాకుండా మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు, శరీరంలో ద్రవం,  ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వలన పాదాలు, ముఖం లేదా చేతులు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,  రక్తపోటు సమస్యలు పెరుగుతాయి. రక్తంలో విషపదార్థాలు పేరుకుపోవడం వల్ల అలసట, బలహీనత, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.  కొన్ని సందర్భాల్లో,  పొటాషియం స్థాయిలు అసమతుల్యంగా మారడం,  హృదయ స్పందనలు క్రమబద్దంగా లేకపోవడం వంటి సమస్యలకు కారణమవుతుంది. క్రియాటినిన్ పెరిగితే ఏం చేయాలి? క్రియాటినిన్ స్థాయి తరచుగా ఎక్కువగా ఉంటే, కిడ్నీ సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికి  ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. మందులతో పాటు, క్రియాటినిన్ స్థాయిలను నియంత్రించడానికి  ఆహారాన్ని మెరుగుపరుచుకోవాలి.   మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గించే ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తక్కువగా తినాలి.  ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాల పరిమాణాన్ని పెంచాలి. ఉదాహరణకు పండ్లు,  కూరగాయలు. రక్తపోటును అదుపులో ఉంచడానికి, ఉప్పు,  ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. నీరు పుష్కలంగా త్రాగాలి. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజూ 2-3 లీటర్ల నీరు త్రాగడం చాలా అవసరం.                        *రూపశ్రీ.

read more
ఈ పండ్లు మూత్రపిండాల ఆరోగ్యానికి గొప్ప వరం..!

మూత్రపిండాలు శరీరంలో వడపోత  అవయవాలు. ఇవి రక్తాన్ని శుద్ది చేస్తాయి. అలాగే శరీరంలో ద్రవాల నుండి వెలువడే వ్యర్థాలను మూత్రం రూపంలో విసర్జించడానికి సహాయపడతాయి. అయితే నేటి కాలంలో చాలామంది మూత్రపిండాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  కిడ్నీ ఫెయిల్యూర్,  మూత్రనాళ ఆరోగ్యం దెబ్బతినడం, కిడ్నీలలో రాళ్లు..ఇలా మూత్రపిండాలకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి.  మూత్రపిండాల ఆరోగ్యం బాగుండాలన్నా, వాటి పనితీరు మెరుగ్గా ఉండాలన్నా కొన్ని పండ్లు చాలా బాగా సహాయపడతాయి.  ఈ పండ్లు మూత్రపిండాల ఆరోగ్యానికి వరం అని చెప్పవచ్చు.  ఆ పండ్లు ఏమిటో.. ఆ పండ్లు మూత్రపిండాల ఆరోగ్యానికి ఎందుకు సహాయపడతాయో తెలుసుకుంటే.. బెర్రీస్.. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  అలాగే పొటాషియం తక్కువగా ఉంటుంది.  ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది.  మూత్రపిండాల ఆరోగ్యానికి మంచివి. చెర్రీస్.. చెర్రీస్ ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, ముత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేసే యూరిక్ ఆమ్లాన్ని తగ్గించడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా కలిగి ఉంటాయి.   ద్రాక్ష.. ద్రాక్ష పండ్లలో రెస్వెరాట్రాల్ ఉంటుంది.  ఇది గుండె మరియు మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.  ద్రాక్షలో పొటాషియం తక్కువగా ఉంటుంది.   పైనాపిల్.. పైనాపిల్ పొటాషియం అధికంగా కలిగి ఉంటుంది. ఇది ఉష్ణ మండల పండు. ఇందులో బ్రోమెలైన్ అధికంగా ఉంటుంది.  ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉన్న ఎంజైమ్. పుచ్చకాయ.. పుచ్చకాయ చర్మాన్ని హెడ్రేట్ చేస్తుంది.  శరీరంలో టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది వాపును కూడా తగ్గిస్తుంది.  మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.  యాపిల్స్.. యాపిల్స్ లో పొటాషియం తక్కువగా ఉంటుంది.  ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ,  శరీరంలో ఉండే వాపును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. పీచ్.. పీచ్ పండ్లలో పొటాషియం తక్కువగా ఉంటుంది. కానీ విటమిన్-ఎ,  విటమిన్-సి అధికంగా ఉంటాయి. ఇది మూత్రపిండ రోగులకు చాలా మంచి పండు.  అందులోనూ ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. అంతేకాదు.. ఈ పండు వేసవిలో విరివిగా దొరుకుతుంది. క్రాన్బెర్రీ.. క్రాన్బెర్రీ పండ్లు మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది.  అలాగే కాల్ఫియం,  ఆక్సలేట్ తో  మూత్రపిండాలలో తయారయ్యే రాళ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. బేరి.. బేరి పండ్లలో జీర్ణక్రియకు సహాయపడే ఫైబర్ ఉంటుంది.  అలాగే ఈ పండులో సోడియం తక్కువగా ఉంటుంది.  ఇది రక్తపోటును నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పైన చెప్పుకున్న పండ్లన్నీ మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో బాగా సహాయపడతాయి.  మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే పైన పేర్కొన్న పండ్లను తప్పక తినండి.                                  *రూపశ్రీ.

read more
RO వాటర్ ఆరోగ్యానికి మంచివా? చెడ్డవా? వైద్యులు చెప్పిన షాకింగ్ నిజాలివీ..!

మంచి నీరు అంటే నేటికాలంలో అందరికీ మినరల్ వాటర్ ఏ తెలుసు. ఇక చాలామందికి తాగే నీరు అంటే RO వాటరే. ఇప్పట్లో ధనికుల ఇళ్ళ నుండి మధ్య తరగతి కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఇంట్లో రివర్స్ ఆస్మాసిస్ టెక్నాలజీ ఉపయోగించే ఫ్యూరిఫైయర్లు వాడుతున్నారు.  వీటినే సింపుల్ గా RO ఫ్యూరిఫైయర్లు అని అంటున్నారు. నీటిలో ఉండే  మలినాలను, భారీ లోహాలను,  ఇతర హానికరమైన కలుషితాలను తొలగించడంలో ఈ ప్యూరిఫైయర్లు బాగా సహాయపడతాయని చెబుతారు.  ఈ కారణంగానే ప్రతి ఇంట్లో వాటర్ ఫ్యూరిపైయర్లు వాడటం సహజం అయిపోయింది. ప్రతిరోజూ ఆర్.ఓ వాటర్ తాగడం సహజం.  అయితే ప్రతిరోజూ ఈ ఆర్.ఓ వాటర్ ను తాగడం మంచిదేనా?  ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుందా లేదా చెడు చేస్తుందా? వైద్యులు దీని గురించి ఏం చెబుతున్నారు?  తెలుసుకుంటే.. ఆర్.ఓ శుద్దీకరణ ఎలా పనిచేస్తుంది? RO టెక్నాలజీలో, నీరు పొర గుండా వెళుతుంది, బ్యాక్టీరియా, వైరస్‌లు, కరిగిన లవణాలు, భారీ లోహాలు,  ఇతర హానికరమైన మూలకాలను తొలగిస్తుంది. అందుకే ఆహార కాలుష్యం లేదా మలినాలకు గురయ్యే ప్రాంతాలలో నీటిని శుద్ధి చేయడంలో RO వ్యవస్థ ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. అయితే ఈ ప్రక్రియ నీటిలోని కాల్షియం,  మెగ్నీషియం వంటి కొన్ని సహజ ఖనిజాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. అందుకే చాలామంది RO నీరు అధికంగా శుద్ధి చేయబడిందని, ఈ నీటిలో  అవసరమైన పోషకాలు ఉండవని చెబుతారు.   ఖనిజ లోపాలు.. ఆహారం.. శరీరానికి అవసరమైన ఖనిజాలకు  ప్రధాన వనరు నీరు కాదని,  మనం రోజువారీ తీసుకునే  ఆహారమే ఖనిజాలు భర్తీ చేస్తుందని  పోషకాహార నిపుణులు అంటున్నారు. త్రాగునీటి నుండి శరీరం పొందే ఖనిజాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. చాలా పోషకాలు ఆహారం నుండి లభిస్తాయి, అయితే ప్రతిరోజూ సమతుల్య,  పోషకమైన ఆహారం తీసుకుంటే, RO నీటిలో కొద్దిగా ఖనిజాలు లోపం ఉన్నా అదేమీ సమస్య కాదని అంటున్నారు. . పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు,  ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు శరీర పోషక అవసరాలను సులభంగా తీర్చగలుగుతాయని అంటున్నారు. ఆర్.ఓ నీరు.. మూత్రపిండాల ఆరోగ్యం.. మూత్రపిండ వైద్యులు, నిపుణుల అభిప్రాయం ప్రకారం, RO నీరు సాధారణంగా మూత్రపిండాల ఆరోగ్యంపై ఎటువంటి పెద్ద ప్రతికూల ప్రభావాలను చూపదట.  నీటి నుండి మలినాలను తొలగించడానికి, త్రాగడానికి సురక్షితంగా చేయడానికి RO వ్యవస్థ రూపొందించబడిందని వైద్యులు అంటున్నారు. ఈ ప్రక్రియలో కొన్ని ఖనిజాలు కోల్పోవచ్చు, మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండటానికి నీరు తగినంతగా తాగడం చాలా ముఖ్యమట. సమతుల్య ఆహారం తీసుకోవడం,  ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం. శుభ్రమైన,  సురక్షితమైన నీటిని తాగడం మూత్రపిండాలకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఆర్.ఓ నీరు.. ఎలక్ట్రోలైట్లు.. కొంతమంది RO నీటిని ఎక్కువ కాలం తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుందని చెబుతారు. కానీ ఆరోగ్యవంతమైన వ్యక్తులలో ఇది చాలా అరుదని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు. శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యత మూత్రపిండాల హార్మోన్లు,  ఆహారం నుండి పొందిన పోషకాల ద్వారా నియంత్రించబడుతుంది. సోడియం, పొటాషియం, కాల్షియం,  మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు ప్రధానంగా ఆహారం నుండి లభిస్తాయి. కాబట్టి సాధారణ సమయాలలో ఆర్.ఓ నీరు తాగడం వల్ల ఎలాంటి ఎలక్ట్రోలైట్ సమతుల్యత ప్రబావితం కాదు.                                  *రూపశ్రీ.

read more
60 ఏళ్ల తర్వాత కూడా స్పష్టంగా వినాలనుకుంటున్నారా.. చెవి సమస్యలకు శాశ్వత పరిష్కారం!

మన జీవితంలో వినికిడి అనేది కేవలం ఒక ఇంద్రియ జ్ఞానం మాత్రమే కాదు, అది మన ఆత్మీయులతో మనల్ని కలిపే ఒక వారధి. వయసు మళ్లుతున్న కొద్దీ కంటి చూపు తగ్గడం సహజమని ఎలా భావిస్తామో, వినికిడి తగ్గడాన్ని కూడా అలాగే గమనించాలి. ముఖ్యంగా 50 నుండి 60 ఏళ్ల మధ్య వయసు వారికి మాటలు వినిపిస్తున్నా, అవి స్పష్టంగా అర్థం కాకపోవడం ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇది కేవలం శారీరక సమస్యే కాదు, మనుషులతో కలవలేకపోవడం వల్ల వచ్చే మానసిక వేదన కూడా. మీ వినికిడి ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవడానికి ENT Specialist Dr. PLVN Murthy గారు చెప్పిన విషయాలను ఈ  Video Link క్లిక్ చేసి  తెలుసుకోండి. మనం ఎందుకు వినికిడి పరీక్షలు చేయించుకోవాలి? (Why Should We?) వయసు పెరిగే కొద్దీ వచ్చే వినికిడి లోపాన్ని 'ప్రెస్ బై అక్యూసిస్' (Presbycusis) అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే కలిగే నష్టాలు ఇవే: సామాజిక దూరం (Social Withdrawal): ఎదుటివారు మాట్లాడే మాటలు అర్థం కాకపోవడం వల్ల, ఫ్యామిలీ ఫంక్షన్లలో లేదా స్నేహితులతో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది. మానసిక ఒత్తిడి: సరిగ్గా వినిపించకపోవడం వల్ల ఎదుటివారు ఎగతాళి చేస్తారేమో అన్న భయంతో డిప్రెషన్ మరియు మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. జ్ఞాపకశక్తి తగ్గడం: వినికిడి లోపం వల్ల మెదడు యొక్క పనితీరు (Cognitive function) మందగించే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్య పర్యవేక్షణ: ముఖ్యంగా డయాబెటిస్ (చక్కెర వ్యాధి), బీపీ (రక్తపోటు) ఉన్నవారిలో వినికిడి నరాలు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు రెగ్యులర్ గా పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఏమి చేయకూడదు? (What Not To Do) గూగుల్ వైద్యం వద్దు: వినికిడి సమస్య రాగానే గూగుల్‌లో చూసి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదా మందులు వాడటం చేయకండి. ఇది చాలా సున్నితమైన అవయవం కాబట్టి నిపుణులైన ఈఎంటి (ENT) డాక్టర్ని మాత్రమే సంప్రదించాలి. లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి: "వయసు పెరిగింది కదా, వినిపించకపోవడం సహజం" అని సరిపెట్టుకోవద్దు. అధిక శబ్దాలకు దూరంగా ఉండండి: ఫ్యాక్టరీల్లో లేదా అధిక శబ్దాలు వచ్చే ప్రదేశాల్లో పని చేసే వారు తగిన రక్షణ లేకుండా ఉండకూడదు. పరీక్షలు మరియు చికిత్స - ఎలా? (How To) మీ వినికిడి స్థాయిని తెలుసుకోవడానికి డాక్టర్లు సాధారణంగా ఈ క్రింది పరీక్షలు చేస్తారు: ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ (Pure Tone Audiometry): ఇది వినికిడి లోపాన్ని గుర్తించడానికి అత్యంత కీలకమైన (Gold Standard) పరీక్ష. దీని ద్వారా ఏ ఫ్రీక్వెన్సీలో ఎంత లోపం ఉందో తెలుస్తుంది. టెంపనోమెట్రీ (Tympanometry): మధ్య చెవిలో ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా నీరు చేరిందా అని తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తారు. ఓటో ఎకౌస్టిక్ ఎమిషన్స్ (OAE): చెవిలోని లోపలి భాగంలో ఉండే 'ఔటర్ హెయిర్ సెల్స్' పనితీరును ఇది గుర్తిస్తుంది. పరీక్షల కాలపరిమితి: 45 నుండి 50 ఏళ్ల మధ్యలో ఒకసారి బేస్‌లైన్ టెస్ట్ చేయించుకోవాలి. సాధారణంగా ప్రతి 2 నుండి 3 ఏళ్లకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. డయాబెటిస్, బీపీ లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు ప్రతి ఏటా వినికిడి పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: నాకు మాటలు వినిపిస్తున్నాయి కానీ అర్థం కావడం లేదు, ఎందుకు?  సమాధానం: దీనిని 'వర్డ్ డిస్క్రిమినేషన్' (Word Discrimination) సమస్య అంటారు. వయసు రీత్యా హై ఫ్రీక్వెన్సీ వినికిడి లోపం ఉన్నప్పుడు శబ్దం వినిపిస్తుంది కానీ మాటలోని స్పష్టత లోపిస్తుంది. ప్రశ్న: ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారికి కూడా వినికిడి సమస్యలు వస్తాయా?  సమాధానం: అవును, మంచి లైఫ్ స్టైల్ ఉన్నప్పటికీ వయసుతో పాటు వినికిడి నరాలు బలహీనపడటం వల్ల సమస్యలు రావచ్చు. అలాగే డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నా ఇది త్వరగా వచ్చే అవకాశం ఉంది. ప్రశ్న: ఏవైనా మందుల వల్ల వినికిడి తగ్గుతుందా?  సమాధానం: అవును, కొన్ని రకాల క్యాన్సర్ డ్రగ్స్ లేదా మరికొన్ని ఆటోటాక్సిక్ డ్రగ్స్ వాడటం వల్ల వినికిడి శక్తిపై ప్రభావం పడవచ్చు. వినికిడి లోపం అనేది కేవలం చెవికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అది మీ జీవన ప్రమాణాన్ని ప్రభావితం చేసే అంశం. సరైన సమయంలో స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా మీ సామాజిక జీవితాన్ని, ఆనందాన్ని తిరిగి పొందవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం, అందులో వినికిడి ఆరోగ్యం అత్యంత ముఖ్యం! మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. వినికిడి లోపం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడిండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

read more
కిడ్నీలో రాళ్ళు & యూరిన్ ఇన్ఫెక్షన్ కి పరిష్కారం!

• కిడ్నీలో రాళ్ళు ఉన్న • యూరిన్ ఇన్ఫెక్షన్ / యూరిన్ ప్రాబ్లెమ్స్ • కిడ్నీ డిసీజ్ & వారి కుటుంబ సభ్యులు • సహజమైన ఆయుర్వేదం / యూనానీ వైద్యం  • సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్ ట్రీట్‌మెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఈ రోజుల్లో మనల్ని వేధిస్తున్న ఎన్నో ఆరోగ్య సమస్యలకు ప్రకృతిలోనే అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వంటి ఇబ్బందులతో బాధపడేవారికి ఒక తీపి కబురు. కేవలం ఒక పండుతో మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్ళు (Kidney Stones) & యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ వీడియోలో ప్రముఖ యూనానీ వైద్య నిపుణులు Dr. SGV Satya గారు కిడ్నీ స్టోన్స్ కి సహజమైన & శాశ్వతమైన పరిష్కారం గురించి వివరంగా చెప్తున్నారు. సర్జరీ లేకుండా కిడ్నీ రాళ్ళు కరిగించే అద్భుతమైన పండు గురించి, యూరిన్ ప్రాబ్లెమ్స్ కి యూనానీ ట్రీట్‌మెంట్ గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. పైనాపిల్: మీ కిడ్నీలకు మరియు సర్వ రోగాలకు ఒక సంజీవిని పైనాపిల్ కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, వందల ఏళ్ల నాటి యునాని వైద్యంలో దీనికి విశిష్ట స్థానం ఉంది. శరీరంలోని మలినాలను తొలగించి, మిమ్మల్ని తాజాగా ఉంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మనం పైనాపిల్ ఎందుకు తీసుకోవాలి? (Why Should We?) 1. కిడ్నీ మరియు మూత్రపిండాల రక్షణ: పైనాపిల్‌లో 'డయూరిటిక్ ఎఫెక్ట్' ఉంటుంది. ఇది యూరిన్ ఫ్రీగా వచ్చేలా చేసి, కిడ్నీలో రాళ్లు (Kidney Stones) మరియు ప్రోస్టేట్ సమస్యలను నివారిస్తుంది. 2. వాపుల నివారణ (Anti-inflammatory): యునాని వైద్యంలో దీనిని 'ఇల్తహాబ్' (వాపు) తగ్గించడానికి వాడుతుంటారు. కీళ్ల నొప్పులు (Arthritis), సైనసైటిస్, గొంతు ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలకు ఇది మేలైన పరిష్కారం. 3. శరీర ప్రక్షాళన (Detoxification): శరీరంలోని హానికరమైన వ్యర్థాలను (Morbid material) బయటకు పంపడంలో పైనాపిల్‌ను మించినది లేదు. 4. మెదడు మరియు గుండె ఆరోగ్యం: నిరంతరం కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేసే వారికి, మెమరీ లాస్ ఉన్న వారికి ఇది మేధోశక్తిని పెంచుతుంది. అలాగే రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా (Blood clotting) చూస్తూ గుండెను కాపాడుతుంది. 5. దంత ఆరోగ్యం: పళ్లపై పేరుకుపోయిన గార (Plaque) తొలగించడానికి మరియు చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నేరుగా పైనాపిల్ ముక్కలు తినడం ఎంతో మంచిది. ఏం చేయకూడదు? (What Not to Do?) • అపెండిక్స్ సర్జరీ అయిన వారు: అపెండిక్స్ తీసేసిన వారు నేరుగా పండు తినకూడదు, కేవలం జ్యూస్ మాత్రమే తాగాలి. • అతిగా తీసుకోవద్దు: పైనాపిల్ ఆరోగ్యానికి మంచిదే కదా అని అతిగా, మరీ పుల్లగా ఉన్నవి తీసుకోకండి. దీనివల్ల కొన్నిసార్లు జలుబు లేదా ఆస్తమా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. • డయాబెటిస్ ఉన్నవారు: షుగర్ ఉన్నవారు పండును లేదా జ్యూస్‌ను తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఎలా ఉపయోగించాలి? (How to Use?) • ప్రయాణాల్లో వాంతులు (Motion Sickness): బస్సుల్లో ప్రయాణించేటప్పుడు వాంతులు అయ్యే వారు, చిన్న బాక్స్‌లో పైనాపిల్ ముక్కలు పెట్టుకుని, టూత్‌పిక్‌తో అప్పుడప్పుడు తింటూ ఉంటే ఆ సమస్య తగ్గుతుంది. • పిల్లల్లో కడుపులో పురుగులు: పిల్లలకు తరచుగా పైనాపిల్ తినిపిస్తే, పేగుల్లో ఉండే పురుగులు (Intestinal worms) నశిస్తాయి. • డయాబెటిస్ నియంత్రణకు: పైనాపిల్ ఆకులు మరియు వేర్లను నీళ్లలో మరిగించి ఆ కషాయం తాగితే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. • శ్వాసకోస సమస్యలకు: జలుబు, దగ్గు ఉన్నప్పుడు పైనాపిల్ జ్యూస్‌ను డైల్యూట్ చేసి తీసుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్రశ్న: కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పైనాపిల్ తీసుకోవచ్చా?  జవాబు: తప్పకుండా! బాడీలో ఎక్కడ స్టోన్స్ ఉన్నా వాటిని బ్రేక్ చేయడంలో, ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ తొలగించడంలో పైనాపిల్ జ్యూస్ పాత్ర సాటిలేనిది. ప్రశ్న: పైనాపిల్ తింటే జలుబు చేస్తుందా?  జవాబు: ఇది చాలా మందిలో ఉన్న అపోహ. పైనాపిల్ వల్ల జలుబు రాదు, కానీ అతిగా పుల్లని పండు తింటే సమస్య రావచ్చు. సరైన పద్ధతిలో తీసుకుంటే ఇది లంగ్స్ మరియు గొంతు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రశ్న: శరీర నొప్పులకు పైనాపిల్ పనిచేస్తుందా? జవాబు: అవును, ఇందులో అనాల్జిసిక్ (Analgesic) గుణాలు ఉండటం వల్ల వెన్నునొప్పి, కడుపునొప్పి వంటి బాడీ పెయిన్స్ తగ్గడానికి సహాయపడుతుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన పండును మీ డైట్‌లో భాగం చేసుకోండి. "ఏతదాలే అక్లాత్" అంటే శరీరంలోని నాలుగు ధాతువులను సమతుల్యంగా ఉంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడంలో పైనాపిల్ ఎంతో కీలకం. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు నిపుణుల సలహాల కోసం మా యూట్యూబ్ మా Youtube"TeluguOne Health"ఛానెల్‌ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి! Disclaimer: ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ట్రీట్‌మెంట్ ప్రారంభించే ముందు మీ డాక్టర్‌ని సంప్రదించండి.

read more
బోన్ సిస్ట్: కౌమార దశలో వచ్చే ఈ వ్యాధి గురించి తెలుసా?

బోన్ సిస్ట్.. దీన్నే ఎముక తిత్తి అని అంటారు. ఎముక తిత్తి అనేది ఎముక సంబంధిత సమస్య, దీని గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఇది చాలా అరుదైన వ్యాధి, కానీ ఎవరికైనా ఇది వచ్చినప్పుడు, వారి సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. ఎముక తిత్తి అభివృద్ధి చెందినప్పుడు, ఆ ప్రాంతంలోని ఎముక నెమ్మదిగా కరిగిపోవడం ప్రారంభమవుతుంది.  తరచుగా ఈ సమస్యను  క్యాన్సర్‌తో  రిలేటెడ్ గా పరిశీలిస్తారు. కానీ ఇది క్యాన్సర్ కు సంబందం లేని వ్యాధి. బోన్ సిస్ట్ సమస్య ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది.  మరీ ముఖ్యంగా  కౌమారదశలో పిల్లలను ప్రభావితం చేస్తుంది.  చిన్న గాయం కారణంగా అకస్మాత్తుగా ఎముక విరిగినప్పుడు ఎముక తిత్తులు వస్తాయి.  ఒక అధ్యయనం ప్రకారం, ఈ తిత్తులు సాధారణంగా ఎముకల చివర్లలో అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ పెరుగుదల ప్లేట్లు చురుకుగా ఉంటాయి, ఈ తిత్తులు సాధారణంగా రెండు రకాలు: అనూరిస్మల్ ఎముక తిత్తులు  యునికార్న్యుయేట్ ఎముక తిత్తులు. ప్రారంభం..  ఈ వ్యాధి ప్రారంభం లక్షణాలు ప్రభావిత ప్రాంతంలో వివరించలేని నొప్పి,,  ఎక్స్-కిరణాలు ఆ ప్రాంతంలో ఎముక సాంద్రత తగ్గినట్లు వెల్లడిస్తాయి. అదృష్టవశాత్తూ, ముందుగానే గుర్తిస్తే, దీనిని పూర్తిగా నయం చేయవచ్చు. కౌమార దశలో దీని ప్రమాదం ఎక్కువ ఎందుకు? కౌమారదశలో ఎముకలు వేగంగా పెరుగుతాయి.  ఈ సమయంలో ఎముకల లోపల ద్రవ పీడనం లేదా రక్త నాళాలలో మార్పులు తిత్తులు ఏర్పడటానికి దారితీస్తాయి.  వైద్యులు, నిపుణుల అభిప్రాయం ప్రకారం..  ఇది సాధారణంగా 5 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలో కనిపిస్తుంది, ఎందుకంటే ఈ కాలంలో ఎముక ఎదుగుదల,  ఎముకలలో మార్పుల  ప్రక్రియ వేగంగా జరుగుతుంది. లక్షణాలు.. ఎముక తిత్తులు ఎలాంటి స్పష్టమైన లక్షణాలను కలిగి ఉండవు,  కొన్నిసార్లు ప్రభావిత ప్రాంతంలో నొప్పిని కలిగిస్తాయి, కానీ చాలా సందర్భాలలో ఎముక బలహీనపడి విరిగిపోయే వరకు నొప్పి ఉండకపోవచ్చు. ఈ వ్యాధి తరచుగా ఆటలు ఆడే  సమయంలో గాయాలు తగలడం జరిగినప్పుడు చేసే  ఎక్స్-రే వాపు లేదా చిన్న బెణుకుల ద్వారా గుర్తించబడుతుంది. పిల్లలు పెద్ద గాయం లేకుండా ఒకే ప్రాంతంలో పదే పదే నొప్పి లేదా పగుళ్లను ఎదుర్కొంటుంటే, అది ఎముక తిత్తికి ముందస్తు సంకేతం కావచ్చు. చికిత్స.. వైద్యులు తరచుగా చిన్న తిత్తులను పర్యవేక్షిస్తారు, ఎందుకంటే చాలా సందర్భాలలో అవి వయస్సుతో పాటు వాటంతట అవే నయం అవుతాయి. తిత్తి పెద్దగా ఉండి, పగులు వచ్చే ప్రమాదం ఉంటే, 'క్యూరెట్టేజ్' ప్రక్రియ ద్వారా ద్రవాన్ని తొలగించడం ద్వారా 'బోన్ గ్రాఫ్టింగ్' చేస్తారు. కొన్ని సందర్భాల్లో, ఈ తిత్తులను శస్త్రచికిత్స లేకుండానే స్టెరాయిడ్ ఇంజెక్షన్ల ద్వారా కూడా చికిత్స చేయవచ్చు. తిత్తి పెద్దదిగా మారితే  శస్త్రచికిత్సను కూడా సూచించవచ్చు. ఇది చాలా అవసరం.. ఎముక తిత్తి సమస్య   సరైన సమయంలో గుర్తించబడితే  సకాలంలో చికిత్స చేయడం ద్వారా దీనిని పూర్తిగా నయం చేయవచ్చు. ప్రభావిత ప్రాంతంలో కణజాలం  బయాప్సీ చేసిన తర్వాత మాత్రమే నిపుణులు ఈ సమస్యను  నిర్ధారిస్తారు. బయాప్సీ నివేదిక ఎముక తిత్తిని నిర్ధారించిన తర్వాత, చికిత్స ప్రారంభిస్తారు. పిల్లలకు ఎముకల విషయంలో ఏదైనా అనుమానాస్పదంగా సమస్య కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయంకుడా ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.                                       *రూపశ్రీ.

read more
బట్టతల రావడానికి కారణాలు ఏమిటి?

బట్టతల మరియు జుట్టు రాలడం :  కారణాలు నివారణలు  ఆధునిక చికిత్సలు జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన అందానికి మరియు ఆత్మవిశ్వాసానికి చిహ్నం. అద్దంలో చూసుకున్నప్పుడు జుట్టు పలచబడటం గమనిస్తే కలిగే ఆందోళన అంతా ఇంతా కాదు. ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన వారిలో కనిపించే బట్టతల సమస్య, నేడు మారుతున్న జీవనశైలి వల్ల 13-14 ఏళ్ల చిన్న వయసులోనే మొదలవుతోంది. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనిని అరికట్టడం సాధ్యమేనా?  Dr. Sunaina Shaik చెప్పిన మరిన్ని విషయాలు ఈ  TeluguOne Health Video Link క్లిక్ చేసి తెలుసుకుందాం. మనం జుట్టుపై ఎందుకు శ్రద్ధ వహించాలి? (Why Should We?) • ముందస్తు గుర్తింపు (Early Diagnosis): జుట్టు పూర్తిగా ఊడిపోయిన తర్వాత తిరిగి రావడం అసాధ్యం. ప్రారంభ దశలోనే గుర్తిస్తే మందుల ద్వారా జుట్టును కాపాడుకోవచ్చు. • ఆత్మవిశ్వాసం: జుట్టు రాలడం వల్ల కలిగే మానసిక ఒత్తిడి మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వల్ల మనల్ని మనం ఉత్సాహంగా ఉంచుకోవచ్చు. • మెరుగైన ఫలితాలు: జుట్టు పల్చబడే దశలో (Hair Thinning) చికిత్స ప్రారంభిస్తే, ఉన్న జుట్టును ఒత్తుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) • సొంత వైద్యం వద్దు: డాక్టర్ పర్యవేక్షణ లేకుండా మినాక్సిడిల్ (Minoxidil) వంటి మందులను వాడకూడదు. • గర్భధారణ సమయంలో జాగ్రత్త: గర్భం దాల్చిన వారు లేదా ప్లాన్ చేస్తున్న వారు మినాక్సిడిల్ వాడటం వల్ల పుట్టబోయే పిల్లల్లో లోపాలు వచ్చే అవకాశం ఉంది. • అతిగా ఆశించవద్దు: హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ద్వారా గతంలో ఉన్నంత సహజమైన సాంద్రత (Density) రాకపోవచ్చు; ఇది కేవలం పలచబడిన ప్రాంతాన్ని కవర్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. • ఒత్తిడిని నిర్లక్ష్యం చేయకండి: ఆధునిక పరిశోధనల ప్రకారం, ఒత్తిడి (Stress) అనేది బట్టతలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారుతోంది. జుట్టును ఎలా కాపాడుకోవాలి? (How to - Treatment Steps) 1. కారణాన్ని గుర్తించండి: పురుషులలో వచ్చే బట్టతలను 'ఆండ్రోజెనెటిక్ అలోపేసియా' అంటారు, ఇది ఎక్కువగా జన్యుపరంగా వస్తుంది. మహిళల్లో జుట్టు మధ్యలో పలచబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2. వైద్య చికిత్సలు:     ◦ మినాక్సిడిల్: ఇది సీరం, లోషన్, ఫోమ్ లేదా టాబ్లెట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ◦ PRP మరియు GFC: ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (PRP) మరియు గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ (GFC) చికిత్సల ద్వారా మీ స్వంత రక్తం నుండి తీసిన పోషకాలను తలకు ఇంజెక్ట్ చేసి జుట్టు సాంద్రతను పెంచుతారు. ◦ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్: జుట్టు పూర్తిగా ఊడిపోయిన చోట వేరే ప్రాంతం నుండి జుట్టును తీసి నాటుతారు. 3. సప్లిమెంట్స్: డాక్టర్ సూచన మేరకు అవసరమైన విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. సాధారణ సందేహాలు - సమాధానాలు (Q&A) ప్ర: బట్టతల అనేది కేవలం జన్యుపరంగానే వస్తుందా?  జ: పురుషులలో ఇది ప్రధానంగా జన్యుపరంగా వస్తుంది. కానీ మహిళల్లో జన్యువులతో పాటు హార్మోన్ల మార్పులు మరియు ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. ప్ర: PRP చికిత్సతో కొత్త జుట్టు వస్తుందా?  జ: లేదు. PRP లేదా GFC చికిత్సలు ఉన్న జుట్టును ఒత్తుగా (Thickening) చేయడానికి మరియు రాలకుండా ఆపడానికి మాత్రమే ఉపయోగపడతాయి. జుట్టు లేని చోట కొత్తగా జుట్టు రావాలంటే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ఒక్కటే మార్గం. ప్ర: శరీరంలోని ఇతర భాగాల నుండి జుట్టును తీసి తలకు వాడవచ్చా?  జ: అవును, చాతి లేదా గడ్డం వంటి భాగాల నుండి జుట్టును తీసి ట్రాన్స్ ప్లాంట్ చేయవచ్చు. కానీ తలపై ఉన్న జుట్టు ఇచ్చినంత సహజమైన ఫలితాలు వీటితో రాకపోవచ్చు. జుట్టు రాలడం అనేది ఒక సమస్యే కావచ్చు, కానీ సరైన సమయంలో స్పందిస్తే దానికి పరిష్కారం తప్పక ఉంటుంది. భయపడకుండా నిపుణులైన డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి. మరింత సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానెల్ సందర్శించండి: జుట్టు సంరక్షణ మరియు మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!

read more
పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరమా? సైన్స్ ఏం చెబుతోందంటే..!

బిజీగా గడిపిన తర్వాత పురుషుల కంటే మహిళలు ఎక్కువగా అలసిపోయినట్లు కనిపిస్తారు. ఆడవాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని చాలామంది మగాళ్లు అనుకుంటూ ఉంటారు. కానీ సైన్స్ మాత్రం ఆడవారి పరిస్థితి నిజమేనని చెబుతోంది.   సైన్స్ కూడా మహిళలు  పురుషుల కంటే ఎక్కువ  అలసిపోతారని,  వారికి ఎక్కువ నిద్ర అవసరమని చెబుతోంది.  ఇది కేవలం సోమరితనం లేదా విశ్రాంతి తీసుకోవడానికి చెబుతున్న విషయం కాదని, దాని వెనుక చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో అర్థం తెలుసుకుంటే..   మల్టీ టాస్కింగ్..  మెదడు సంక్లిష్టత.. నిద్ర యొక్క అతి ముఖ్యమైన విధి మెదడును బాగుచేయడానికి,  తిరిగి శక్తిని  నింపడానికి సమయం కేటాయించడం. పరిశోధన ప్రకారం స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ పనులు చేస్తారు.  ఇల్లు, పిల్లలు, ఉద్యోగం,  భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒకేసారి ఆలోచిస్తారు. మెదడును  తీవ్రంగా,  ఎక్కువ కాలం ఇలా ఆలోచించినప్పుడు, అది కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. మహిళల మెదళ్ళు రోజంతా ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి. కాబట్టి వారికి మరింత గాఢ నిద్ర అవసరం అవుతుంది. హార్మోన్ల మార్పులు.. జీవితంలోని వివిధ దశలలో మహిళల శరీరాలు గణనీయమైన హార్మోన్ల మార్పులకు లోనవుతాయి. ఋతుస్రావం, గర్భధారణ, మెనోపాజ్  వంటి సమయాలలో ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. గర్భం.. గర్బం దాల్చిన కాలంలో శరీర బరువు పెరగడం,  శారీరక మార్పులు అలసటను పెంచుతాయి. మెనోపాజ్.  మెనోపాజ్  దశలో వేడి ఆవిర్లు,  చెమటలు పట్టడం వంటి సమస్యలు తరచుగా నిద్రకు అంతరాయం కలిగిస్తాయి.  దీని కారణంగా శరీరానికి పూర్తి విశ్రాంతి లభించదు. అందుకే ఎక్కువగా నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుంది. నిద్ర నాణ్యత.. పురుషుల కంటే స్త్రీల నిద్ర తక్కువగా ఉంటుంది. ఇంట్లో శబ్దాలు, పిల్లలు ఏడుపు లేదా ఏదైనా చిన్న కదలికలకు కూడా వారు తొందరగా మేల్కొంటారు. ఇంకా మహిళలు నిద్రలేమి,  రెస్ట్‌లెస్ కాళ్ల సిండ్రోమ్ వంటి సమస్యలకు ఎక్కువగా గురవుతారు. తరచుగా నిద్ర అంతరాయాల కారణంగా, శరీర మరమ్మత్తుకు అవసరమైన గాఢ నిద్ర వారికి లభించదు. అందువల్ల  ఉదయం మేల్కొనేటప్పుడు అలసటగా,  ఇంకాసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది. మానసిక ఆరోగ్యం,  ఒత్తిడి.. సామాజిక,  కుటుంబ బాధ్యతల కారణంగా మహిళలు తరచుగా ఎక్కువ మానసిక ఒత్తిడి,  ఆందోళనను అనుభవిస్తారు. ఒత్తిడి నేరుగా నిద్రను ప్రభావితం చేస్తుంది. మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. తగినంత నిద్ర లేకపోవడం ఈ ఒత్తిడిని మరింత పెంచుతుంది, ఇది ఒక చక్రంలా కొనసాగుతుంది. బాగా నిద్రపోవడానికి ఏమి చేయాలి? మహిళలకు నిద్ర లేకపోవడం అలసటను మాత్రమే కాదు..  గుండె జబ్బులు, ఆందోళన,  నిరాశ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. పడుకోవడానికి, మేల్కొనడానికి ఒక సమయాన్ని నిర్థేశించుకోవాలి. నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు మొబైల్,  ల్యాప్‌టాప్ వాడటం మానేయాలి. మధ్యాహ్నం తర్వాత టీ, కాఫీ తాగకూడదు.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more