ఏడిస్తే ఎన్ని లాభాలో...
మనిషి అన్నవాడికి స్పందించడం అవసరం అంటే కొన్ని సందర్భాలలో ఆనందం తో కన్నీరు వస్తే. బాధతో కన్నీరు వస్తుంది. అలా కన్నీరు పెట్టుకుంటే లాభమే. అని పరిశోదనలో తేల్చారు.కన్నీరు వల్ల లాభామ నష్టమా అన్న విషయం లో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందామా మరి. కొందరికి కన్నీరు అస్సలు రాదు.కొందరికి కన్నీరు అతికష్టం మీద వస్తుంది. కొందరికి కన్నీరు అలవోకగా వస్తుంది.వాళ్ళ నెత్తిన నీళ్ళ కుండ ఉందేమో అని అనిపించే విధంగా అదే ధారగా కన్నీరు పెట్టుకుంటూ దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తారు.కొందరు మనసులో ఉన్న బాధను దుఖం రూపం లో బయటికి వెళ్ళ గాక్కుతారు.పొర్లి పొర్లి ఏడుస్తూ ఉంటారు.గతం తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. బాహాటంగా మనస్పూర్తిగా ఏడవడం లేదా కుళ్ళి కుళ్ళి ఏడవడం మనం గమనించ వచ్చు.అసలు కన్నీరు పెట్టుకుంటే లాభమా నష్టమా చూద్దాం. మనిషి ఏడవడం దుఃఖించడం ఒక సాధారణ ప్రక్రియ.ఒక్కోరిలో ఒక్కో భావనలు ఉంటాయి.దానికి బదులుగా దుఃఖం పెల్లుబికి బయటికి వస్తూ ఉంటుంది.అసలు మనిషి ఎందుకు ఏడు స్తాడో దుఃఖం తో ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో తెలుసా? మీరు ఆలోచించారా ? ఈమేరకు శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలు పలు ఆశక్తి కరమైన అంశాలు వెలుగు చూసాయి.మనము ఏడవడం ద్వారా మనశరీరం, మెదడు రెండూ కీలక మని కనుగొన్నారు.అప్పుడే దానిఫలితాలు మనకు అందుతాయని అన్నారు. పిల్లవాడు పుట్టిన వెంటనే మొదటి సారి ఏడుస్తాడు.అసలు ఏడవడం ద్వారా వచ్చే లాభాము మీకు తెలియదు. ఏడవడం వల్ల వచ్చే లాభాలు అశక్తి కలిగించే అంశాలు తెలుసుకుందాం. 1)శరీరం డీ టాక్సీ ఫై అవుతుంది. *కన్నీరు మూడు రకాలు... *రిఫ్లెక్స్ ద్వారా వచ్చే కన్నీరు... *అదే పనిగా వచ్చే కన్నీరు... *భావనాత్మ కంగా వచ్చే కన్నీరు... *రిఫ్లెక్స్ వల్ల వచ్చే కన్నీరు... కంటిలో పేరుకు పోయిన మట్టి,ఇతర పనికిరాని చెత్త అది కంటిని శుభ్రం చేస్తుంది. అదే పనిగా కంటి నుండి కన్నీరు ప్రవహిస్తుంటే అది మీ కళ్ళు చేమ్మగిల్లినట్లు. ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది.భావనాత్మకంగా వచ్చే కన్నీరు ఒత్తిడి వల్ల,లేదా ఉద్వేగాల వల్ల కన్నీరు బయటికి వస్తుంది.అవి మరల వేరే టాక్సిన్స్ ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కన్నీరు మన శరీరం లో ఉన్న వస్తువుల్ని శరీరం నుండి బయటికి వస్తుంది. మిమ్మల్ని మీరు శాంతింప చేసుకోవడం కన్నీరు సహకరిస్తుంది.. మన మనస్సు శాంత పరుచుకోవాలంటే ఏడవడం మంచి పద్ధతి.పరిశోదనలో ఏడవడం ద్వారా సింథటిక్ నర్వస్సిస్టం యాక్టివేట్ కావడాన్ని గమనించవచ్చని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. తద్వారా మన శరీరానికి కొంత ఉపశమనం కల్పించడం లో సహకరిస్తుంది.కొంత సేపు ఏడ్చిన తరువాత శాంతం గా ప్రాశంతం గా ఉన్నట్లు అనుభూతి పొందుతారు. మీకు సహకారం లభిస్తుంది.. ఒక వేళ మీరు నిరాశ చెందినట్లయితే ఏడవడం ద్వారా మీ చుట్టుపక్కల ఉన్నవారికి మీకు సపోర్ట్ అవసరం.అని భావిస్తారు.చిన్న పిల్లలు సైతం తమ పై దృష్టి పెట్టాలంటే ఏడవడం ఆయుధం గా వాడతారు.ఇలా చేయడం ద్వారా తాము అనుకున్న లక్ష్యం పూర్తి చేసామని భావిస్తారు. దుఃఖం నుండి బయటికి రావడానికి దోహదం చేస్తుంది.. ఏడవడం లేదా దుఃఖించడం అన్నది ఒక ప్రక్రియ దుఃఖం పడడం,ఆగ్రహంతో కూడా దుఃఖం వస్తుంది.ఎడుస్తున్నప్పుడు ఏడ్చే సమయంలో ఒక పద్ధతి ప్రకారం ఏడవడం అవసరం దీనిద్వారా దుఃఖం నుండి బయటికి వచ్చినట్లు బరువు దిగి పోయినట్లు భావిస్తారు. నొప్పి నివారిస్తుంది.. దీర్ఘ కాలం పాటు ఏడవడం వల్ల ఆక్సిటోసిన్ మరియు ఎండార్ఫిన్ విడుదల అవుతుంది.ఇది ఫీల్ గుడ్ కెమికల్స్ గా పేర్కొన్నారు.శారీరక భావనాత్మక రెండువైపులా ఉన్న భావనను మనసులోని బాధను నివారించేందుకు సహకరిస్తుంది.ఒక్కో సారి ఎండోర్ఫిన్ విడుదల అయినప్పుడు మీ శరీరం ఒక నియమిత హద్దు వరకు వినే ప్రయత్నం చేస్తుంది.మన శరీరంలో ఉన్న ఆక్సిటోసిన్ ప్రశాంతత ఇస్తుంది. మూడ్ లో మార్పు వస్తుంది.. మన బాధను నొప్పిని తగ్గించడం లో సహకరిస్తుంది.ఏడవడం ద్వారా మీ మూడ్ కూడా బాగా అద్భుతంగా ఉంటుది.సత్వరంగా స్వేచ్చగా ఉండే విధంగా మీ మెదడు చల్ల బడుతుంది.మీ మెదడులో ఉన్న వేడి తగ్గినప్పుడు మెదడు చల్ల బడుతుంది.మీ మెదడులో ఉన్న వేడి తగ్గినప్పుడు చల్ల బడుతుంది.శారీరకంగా బాగా తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది. భావనలను నియంత్రిస్తుంది... ఏడవడం అన్నది బాధ పడడం అన్నది మరొకరి బాధకు ఏడుపుకు జవాబుగా కాదు.చాలా సార్లు ఎప్పుడు ఏదైనా చాలా ఆనందం గా ఉంటారు. భయం లేదా ఒత్తిడి లో యాలె విశ్వ విద్యాలయం పరిశోధకులు అంటున్న మాట ఏమిటి అంటే ఈ విధంగా బాధపడడం వల్ల మిమ్మల్ని మీరు నియంత్రించు కునేందుకు సహకరిస్తుంది. అసలు సహజంగా ఎప్పుడు ఎప్పుడు ఏడుస్తారు.. భయంకర మైన ఒత్తిడిలో ఉన్నప్పు డు ,లేదా తాను అనుకున్న లక్ష్యం లో ఓటమి పాలై నప్పుడు.తనకు కావాల్సిన ఆప్తులైన వారు దూరమై నప్పుడు. లేదా తమకి ఇష్టమైన వారే తమను తీవ్రంగా ద్వేషించి నప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడవడం పొర్లి పొర్లి ఏడవడం.మనకు కనిపిస్తుంది. మానసిక భావోద్వేగాలతో ముడి పడిన సంఘటనలకు కారణంతామే అని భావించిన వారు.అనుకోని విధంగా అనూహ్య విజయం సాధించినందుకు ఆనంద భాష్పాలు కంటినుండి వస్తాయి. వైద్య చికిత్స ఎప్పుడు అవసరం... ఏడవడం ఎలాంటి వస్తువంటే మీకు సుఖం లభిస్తుంది.బాధ కలుగుతుంది.అందుకు ప్రతిగా మీరు ఏడుస్తారు అది సర్వసాధారణం మీరు ఏడవడం వల్ల మీరు బాగా ఉన్నట్లు భావిస్తారు.ఇలా చేస్తున్నందుకు సిగ్గు పడవద్దని ఏడుపు వచ్చినప్పుడు మనస్త్రుప్తిగా ఏడవండి. ఆబాధనుండి విముక్తి పొందండి. ఏదైనా విషయం లో ఆనందం లభిస్తుందో.లేదా దుఃఖం కలిగిస్తుందో చాలా సార్లు అప్పుడు కూడా ఏడుస్తారు.అత్యంత సుఖంగా ఉన్నప్పుడు ఒత్తిడులు ఉన్నప్పుడు కూడా ఏడుస్తారు.అత్యంత సుఖంగా ఉన్నప్పుడు ఒత్తిడులు ఉన్నా ఎడుస్తారని ఏలే విశ్వవిద్యాలయం శాస్త్రజ్ఞులు అంగీకరిం చారు.ఏడవడం వల్ల భావనాత్మక నియంత్రణ బయటికి వస్తుంది.సహాయ పడుతుంది. ఏడుపు మంచిదే. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreటీతో బిస్కెట్లు తినే అలవాటుందా.. కొంపమునిగినట్టే.. ఇవి తింటే ...
ఉదయం లేవగానే రోజు మొదలుపెట్టాలంటే టీ కావాలి. డ్యూటీ మధ్యలో కాస్త బయటకు వెళ్ళాలంటే టీ బెస్ట్ సాకు, సాయంత్రం స్నేహితులతో కలసి టీ కొట్టు దగ్గర కబుర్లు చెబుతూ చాయ్ తాగితే ఆ ఫీల్ వేరు. టైమ్ పాడు లేకుండా టీ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీ కొట్టు ఓపెన్ చేశాక కట్టేసేవరకు స్టౌ మీద టీ ఉడుకుతూనే ఉంటుందంటే టీ కి ఉన్న గిరాకీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టీ కహానీ ఎందుకంటారా? టీ అంటే అందరికీ ఇష్టం. మరీ ముఖ్యంగా వేడి వేడి టీలో బిస్కెట్లు ముంచుకుని తింటే మరీ ఇష్టం. ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు, అప్పటికప్పుడు హాట్ హాట్ గా బేక్ చేసిన బిస్కెట్లు.. ఓయబ్బో టీ పక్కనే వయ్యారాలు పోతాయి బిస్కెట్లు. కానీ టీతో బిస్కెట్లు తినడం మహా ఇష్టమైన వారికి బ్యాడ్ న్యూస్.. దీని వల్ల బోలెడు నష్టాలున్నాయి. టీతో బిస్కెట్ తింటే కలిగే నష్టాలేంటి? టీ తో ఏం తింటే ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి? పూర్తీగా తెలుసుకుంటే.. భారతదేశంలో టీ తాగేవారు ఎక్కువ. ఇక టీ బిస్కెట్ కాంబినేషన్ కు ఫ్యాన్స్ ఎక్కువ. అయితే టీ బిస్కెట్ వల్ల ఆరోగ్య నష్టాలున్నాయి. యువతలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి టీ తో బిస్కెట్ తినడం ఒక కారణంగా తెలుస్తోంది. టీ బిస్కెట్ కాంబినేషన్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. బిస్కెట్లలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెజబ్బులకు ప్రధానకారణం అవుతుంది. బిస్కెట్ల తయారీకి శుద్ది చేసిన పిండి, శుద్ది చేసిన పంచదార ఉపయోగిస్తారు. ఇది శరీరంలో ఇన్సులిన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ అసమతుల్యత కారణంగా మధుమేహం ప్రమాదం పెరుగుతుంది. మరొకవైపు ఇది జీర్ణక్రియను కూడా దెబ్బతీస్తుంది. దీని వల్ల మలబద్దకం వస్తుంది. బిస్కెట్లు ఎక్కువగా ప్రాసెస్ చేయబడే ఆహారం. ఇందులో BHA (butylated hydroxyanisole), BHT (butylated hydroxytoluene) ఉంటాయి. ఇవి మానవ శరీరంలో ఉండే DNA ను దెబ్బతీస్తాయి. మరీ ముఖ్యంగా బిస్కెట్లలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ ఉంటుంది. ఇది శరీరంలో హార్మోన్లను డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. టీతో వేయించిన శనగలు తింటే.. వేయించిన శనగలు ఆరోగ్యానికి చాలా మంచిదం. టీ టైమ్ లో స్నాక్ గా వేయించిన శనగలు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. వేయించిన శనగలు ఇన్సులిన్ ను కంట్రోల్ చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే బి-కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది కాబట్టి బి-విటమిన్ లోపాన్ని జయించవచ్చు. ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, మెగ్నీషియం శనగలలో పుష్కలంగా ఉంటుంది. శనగలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అయిన కోలిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లకు బదులు వేయించిన శనగలు తింటే మంచిది. *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreబలహీనంగా .. నీరసంగా అనిపిస్తుందా? మీ సమస్య ఇదే కావచ్చు..
శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. అయితే ఈ పోషకాల విషయానికి వస్తే, చాలా మందికి ఐరన్, కాల్షియం, ప్రోటీన్ లేదా ఫైబర్ గురించి మాత్రమే తెలుసు. ఇవన్నీ శరీరానికి చాలా అవసరం. కానీ వీటికంటే ప్రభావవంతమైనది, శరీరానికి తప్పనిసరిగా కావాల్సినది మరొకటి ఉంది, ఇది శరీరం మెరుగైన పనితీరుకు అవసరం. ఇది లోపిస్తే శరీరం అంతా నీరసంగానూ, ఏ చిన్న పనిచేసినా అలసటగానూ అనిపిస్తుంది. ఎన్ని పోషకాలు తీసుకున్నా, ఎంత బలవర్థకమైన ఆహారం తీసుకున్నా ఈ ఒక్కటి తక్కువై శరీరం నిలదొక్కుకోలేదు. అంతటి శక్తివంతమైన పదార్థం మెగ్నీషియం. మెగ్నీషియం కేవలం శారీరక బలానికే కాదు అనేక మానసిక భావోద్వేగాలకు కూడా ఇది ఎంతో అవసరం. ఇది శరీరంలో కండరాలను నిర్మించడానికి నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపం ఏర్పడితే కండరాల తిమ్మిరి, నరాల బలహీనత, కండరాలు మెలితిప్పినట్లు, శరీరంలోని వివిధ ప్రాంతాల్లో తిమ్మిరి లేదా జలదరింపు వంటి అనేక లక్షణాలను కనిపిస్తాయి. శరీరంలో మెగ్నీషియం లోపం ఎన్నో కారణాల వల్ల ఏర్పడుతుంది. విటమిన్ డి లోపం వల్ల మెగ్నీషియం లోపిస్తుంది, యాంటాసిడ్ల మితిమీరిన వినియోగం, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, తీవ్రమైన విరేచనాలు, ఆహారంలో తక్కువ మెగ్నీషియం గల ఆహారాలను చేర్చకపోవడం వంటి అనేక కారణాల వల్ల శరీరంలో ఈ ముఖ్యమైన మూలకం లోపం ఏర్పడుతుంది. ఇది మాత్రమే కాకుండా, గర్భధారణ సమయంలో మెగ్నీషియం లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. మెగ్నీషియం లోపాన్ని నివారించడానికి ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. ఈ కింది ఆహారాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. బాదంపప్పులో మెగ్నీషియం ఉంటుంది. 10గ్రాముల బాదం పప్పులో రోజువారీ శరీరానికి కావలసిన మెగ్నీషియంలో 20% (76 mg) లభిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, మెగ్నీషియం శరీరానికి అందడానికి ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులను తినడం మంచి మార్గం. గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది తమ ఆహారం ద్వారా మెగ్నీషియం తగినంతగా పొందలేరు. ప్రతి 100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 262 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని గుమ్మడి గింజలు తింటూ ఉంటే ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు. అరటిపండ్లు ఎముకలను బలపరిచే పొటాషియం అధికంగా ఉండే పండు. ఒక మధ్యస్థ అరటిపండు 10.3 mg విటమిన్ సి, 32 mg మెగ్నీషియంను అందిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. పాలకూర అందరికీ అందుబాటులో ఉంటే ఆకుకూర. పాలకూరలో మెగ్నీషియం మాత్రమే కాదు ఐరన్ కూడా సమృద్దిగా ఉంటుంది. కాబట్టి ఐరన్, మెగ్నీషియం లోపంతో ఇబ్బంది పడేవారు పాలకూరను తప్పనిసరిగా తీసుకోవాలి. జీడిపప్పులో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా జీడిపప్పులో ఉంటాయి. ప్రతిరోజూ కాసింత జీడిపప్పు తీసుకోవడం వల్ల ఇది మెగ్నీషియంతో పాటు, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా పొందవచ్చు. ఇవి కాకుండా, వోట్మీల్, బ్రౌన్ రైస్, వేరుశెనగ నూనె, చియా గింజలు, బీన్స్లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreబంగాళదుంప కొంపలు ముంచుతుందని తెలుసా
బంగాళదుంప చాలా మందికి ఇష్టమైన దుంప కూరగాయ. పేరుకు ఇది కూరగాయ కానీ ఇది అన్ని రకాలుగా తినడానికి అనుకూలంగా ఉంటుంది. కూరల్లో అయినా, బజ్జీలలో అయినా, వేపుళ్లలో అయినా, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి నోరూరించే తినుబండారాలలో అయినా బంగాళదుంప చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఏ కూర చేస్తున్నా సరే..అందులో బంగాళదుంప ముక్కలు జోడిస్తే కూరలకు రుచి రెట్టింపు అవుతుంది. ఎంతో రుచిగా ఉండే బంగాళదుంపను తినడానికి చాలా మంది చాలా ఆసక్తి చూపిస్తారు. అయితే బంగాళదుంపలను ఎడా పెడా తింటే మాత్రం కొంపలు ముంచుతుందట. ఇంతకీ బంగాళదుంపలు ఆరోగ్యానికి చేసే చేటు ఏంటో తెలుసుకుంటే.. ఊబకాయం.. బంగాళదుంపలను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారట. బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి అదనపు కేలరీలుగా పొట్టలో కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. దీని కారణంగా బరువు ఈజీగా పెరుగుతారు. రక్తపోటు.. రక్తపోటు లేదా బీపీ ఇప్పట్లో చాలామందికి వస్తున్న సమస్య. చిన్న వయసులోనే బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఉంటున్నారు. ఇలాంటి వారు బంగాళదుంపలను ఎక్కువగా తీసుకోకూడదట. బంగాళదుంపలు బీపీ సమస్యను మరింత పెంచుతాయట. ఆర్థరైటిస్.. ఆర్థరైటిస్ సమస్య చలికాలంలో చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సాధారణ రోజులలో కూడా ఆర్థరైటిస్ సమస్య కారణంగా ఎముకలు, కీళ్ల సమస్యలు పెరుగుతాయి. బంగాళదుంపలు తింటే ఆర్థరైటిస్ సమస్య మరింత తీవ్రం అవుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు ఆర్థరైటిస్ నొప్పిని పెంచుతాయి. జీర్ణసమస్యలు.. బంగాళదుంపలలో పిండి పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది గ్యాస్, ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు సృష్టిస్తుంది. బంగాళదుంపను అతిగా తింటే పై సమస్యలు అధికం అవుతాయి. మధుమేహం.. మధుమేహం ఉన్నవారికి నిషేధించిన ఆహారాలలో బంగాళదుంప కూడా ఒకటి. బంగాళదుంపలు తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య మరింత పెరుగుతుంది. బంగాళదుంపలలో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతాయి. కంటి సమస్యలు.. బంగాళదుంపలలో సోలనిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది కంటి సమస్యలను కలిగిస్తుంది. బంగాళదుంపలను ఎక్కువగా తీసుకునేవారు తొందరగా కంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreపసుపు, తేనె కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
పసుపు, తేనె భారతీయ వంటగదిలో రెండు ప్రధాన పదార్థాలు. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. పసుపులో కుర్కుమిన్ ఉంటుంది, అలాగే తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పసుపును శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇది కీళ్ల నొప్పులు , చర్మ వ్యాధులు, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది . సహజ తీపి, ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన తేనె గొంతు నొప్పి, దగ్గు, గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. పసుపు మరియు తేనె కలయిక ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, దానిని తీసుకునే ముందు సరైన మోతాదు, దాని దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. దీని గురించి తెలుసుకుంటే.. వాపును తగ్గించడంలో సహాయపడతాయి.. పసుపులో ఉండే కర్కుమిన్, తేనెలోని యాంటీఆక్సిడెంట్లు కలిసి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కలయిక కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, ఇతర శోథ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. రోగనిరోధక శక్తి.. పసుపు, తేనె రెండూ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ కలయిక ముఖ్యంగా సీజన్ మారే సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియ.. పసుపు, తేనె మిశ్రమం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే అధిక వినియోగాన్ని నివారించాలి. చర్మ ఆరోగ్యం.. మొటిమలు, మచ్చలు, మంట వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి పసుపు, తేనెను ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్గా ఉపయోగించడం వల్ల చర్మం ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఎలా తీసుకోవాలి..? పసుపు, తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి, టీగా లేదా పాలతో కలిపి వివిధ రకాలుగా తీసుకోవచ్చు. అయితే, దాని పరిమాణం, తీసుకునే సమయం వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి ఉండాలి. గర్భిణీ స్త్రీలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreనిమ్మరసం నీళ్లు తాగితే.. షుగర్ తగ్గుతుందా?
నిమ్మకాయ చాలా పానీయాలలో ఉపయోగిస్తారు. అటు వంటలలోనూ, ఇటు స్వీట్ల లోనూ, మరొక వైపు రిఫ్రెషింగ్ పానీయాలలోనూ నిమ్మకాయను ఉపయోగిస్తారు. చాలామంది ఉదయాన్నే నీటిలో నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అయితే నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల శరీరంలో షుగర్ కూడా తగ్గుతుందని కొందరు అంటారు. ఈ కారణంగా చాలామంది షుగర్ పేషెంట్ లు నిమ్మరసం కలిపిన నీళ్లు తాగుతూ ఉంటారు. అయితే నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల నిజంగానే శరీరంలో షుగర్ శాతం తగ్గుతుందా? నిమ్మరసం నీరు శరీరంలో షుగర్ తగ్గించడంలో సహాయపడుతుందా? తెలుసుకుంటే.. నిమ్మరసాన్ని నీటిలో కలిపి తాగితే రక్తంలో చక్కెర శాతం తగ్గుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి నిమ్మరసం కలిపిన నీరు రక్తంలో చక్కెరను తగ్గించదు, కానీ చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ రెండింటికి తేడా ఏంటని చాలా మంది అయోమయానికి గురవుతూ ఉంటారు. తీసుకునే ప్రతి ఆహారంలో ఉండే గ్లూకోజ్ పరిమాణాన్ని బట్టి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ను నిర్ణయిస్తారు. అలాగే నిమ్మకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ ను గమనిస్తే ఇది చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఆకస్మికంగా పెరగకుండా చేస్తాయి. నిమ్మకాయలో కరికే ఫైబర్ ఉంటుంది. ఈ కరిగే ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవుతూ రక్తంలో శోషించబడుతుంది. తద్వారా రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచడంలో సహాయపడుతుంది. సహాయపడుతుంది. అలాగే కొన్ని అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే.. నిమ్మరసం కలిపిన నీరు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని చెబుతున్నాయి. నిమ్మకాయ నీరు హైడ్రేషన్ ను నిర్వహిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుంది. ఈ కారణంగా నిమ్మరసాన్ని వేసవిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే నిమ్మరసానికి చక్కెర, చక్కెర సంబంధిత పదార్థాలు జోడించడం వల్ల షుగర్ ఉన్నవారికి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిమ్మరసంలో విటమిన్-సి ఉంటుంది. ఇది వాపును, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ కారణంగానే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటివి చేసినప్పుడు నిమ్మరసం నీటిలో కాసింత జీలకర్ర పొడి కూడా కలిపి తాగమని చెబుతూ ఉంటారు. నిమ్మకాయ నీరు కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నియంత్రించడంలో సహాయపడుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreకాలేయంలో కొవ్వు ఏర్పడకుండా నిరోధించే చిట్కాలు..!
నేటికాలంలో చాలామందిలో కనిపిస్తున్న సమస్య ఫ్యాటీ లివర్.. చిన్న వయసు వారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. నేటి కాలంలో ఈ ఫ్యాటీ లివర్ సమస్య చాలా సాధారణం అయిపోయింది. కానీ ఇది చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పరిగణించబడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య లివర్ సిర్రోసిస్, ఫైబ్రోసిస్, లివర్ క్యాన్సర్ మొదలైన సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఫ్యాటీ లివర్ అంటే కాలేయ కణాలలో కొవ్వు పరిమాణం సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో పేరుకుపోవడం. సాధారణంగా కాలేయంలో 5% కంటే తక్కువ కొవ్వు ఉండాలి, కానీ ఈ మొత్తం 5-10% మించితే అది ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుంటే.. దేశంలో ప్రతి మూడవ వ్యక్తి ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడవచ్చని గణాంకాలు చెబుతున్నాయి. మధుమేహం, ఇతర జీవక్రియ రుగ్మతల వల్ల కలిగే ఈ వ్యాధి ప్రమాదం మద్యం తాగని వారిలో కూడా వేగంగా పెరుగుతోంది. ఈ రకమైన పరిస్థితిని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అంటారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే అలవాటు, వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, నిద్ర లేకపోవడం, అధిక ఒత్తిడి వల్ల కాలేయంలో కొవ్వు పెరిగే సమస్య పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఊబకాయం, జీవక్రియ సిండ్రోమ్ వంటి పరిస్థితులు కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనాలు చూపిస్తున్నాయి. NAFLD ఉన్నవారిపై జరిపిన పరిశోధనలో దాని బాధితుల్లో 60–70% మంది ఊబకాయంతో బాధపడుతున్నారని తేలింది. ఊబకాయం టైప్ 2 డయాబెటిస్, ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇది కాలేయ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాలేయంలో కొవ్వు ఏర్పడటానికి ఆరోగ్య నిపుణులు పరిగణించే కారణాలు.. తగినంత నిద్ర లేకపోవడం. ధూమపానం అలవాటు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం లేదా అధిక బరువు ఉండటం. ఎనర్జీ డ్రింక్స్ లేదా తీపి పానీయాల అధిక వినియోగం. ఫ్యాటీ లివర్ సమస్యను ఎలా నివారించాలి? జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ కాలేయ సమస్యను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక బరువుతో ఉంటే దానిని 7-10% తగ్గించడం వల్ల కాలేయ సమస్యలను కూడా నివారించవచ్చు. అధిక ఫైబర్, తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వు పదార్థాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారం సహాయంతో కాలేయంలో కొవ్వు సమస్యను కూడా తగ్గించవచ్చు. వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ ద్వారా కూడా కొవ్వు కాలేయాన్ని నివారించవచ్చు. ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించడం వల్ల కాలేయ సమస్యలను కూడా నివారించవచ్చు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreకీళ్లనొప్పితో బాధపడేవాళ్లు ఈ మూడు పనులు చేస్తే చాలు.. మందులు కూడా వాడాల్సిన అవసరం లేదు..!
కీళ్ల నొప్పులు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. ఇది శరీరంలోని ఏ కీలుకు అయినా సమస్యగా మారవచ్చు. మోకాలు, భుజాలు, మోచేతులు, తుంటి, చేతులు లేదా కాలి వేళ్లు వంటివి. నొప్పి తేలికగా, అడపాదడపా ఉండవచ్చు. లేదా రోజువారీ కార్యకలాపాలు చేయడం కష్టతరం చేసేంత తీవ్రంగా కూడా ఉండవచ్చు. సాధారణంగా ఈ సమస్య వృద్ధులలో కనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది చిన్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో దాదాపు 15% మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మందులు ఉపశమనం కలిగించగలిగినప్పటికీ, కొన్నిసార్లు ఈ మందులు దుష్ప్రభావాలను కూడా కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో మందులు లేని కొన్ని సహజ నివారణలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల కారణాలు, లక్షణాలను బట్టి ప్రతి వ్యక్తికి చికిత్స మారవచ్చు. ఆర్థరైటిస్ ప్రధానంగా రెండు రకాలు.. అవి.. ఇన్ఫ్లమేటరీ, నాన్-ఇన్ఫ్లమేటరీ. నాన్-ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో కొన్ని చర్యలు మందులు లేకుండా కూడా ఉపశమనం కలిగిస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. వ్యాయామం.. కీళ్ల నొప్పులను తగ్గించడంలో క్రమం తప్పకుండా వ్యాయామం, శరీరాన్ని సాగదీయడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. యోగా, ఈత, చురుకైన నడక వంటి తక్కువ ప్రభావ వ్యాయామాలు కీళ్లలో వశ్యతను పెంచుతాయి, కండరాలను బలోపేతం చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం 'ఉదయం 10-15 నిమిషాలు శరీరాన్ని సాగదీయడం వల్ల కీళ్లలో సరళత ఉండి దృఢత్వం తగ్గుతుంది.' యోగాలో, తడసాన, వజ్రాసాన, భుజంగాసాన వంటి ఆసనాలు కీళ్లకు ప్రయోజనకరంగా ఉంటాయి. కూల్, హాట్ ట్రీట్మెంట్.. కీళ్ల నొప్పులు, వాపు నుండి ఉపశమనం పొందడానికి హాట్, కూల్ ట్రీట్మెంట్ ఒక సహజ మార్గం. ప్రభావిత కీళ్లపై 15-20 నిమిషాలు వేడి నీటి బాటిల్ లేదా హీటింగ్ ప్యాడ్ను ఉంచాలి. వేడి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, కండరాలను సడలిస్తుంది, దృఢత్వాన్ని తగ్గిస్తుంది. కీళ్లలో వాపు లేదా తీవ్రమైన నొప్పి ఉంటే కోల్డ్ థెరపీ (ఐస్ కంప్రెస్) ప్రయత్నించాలి. ఐస్ను ఒక గుడ్డలో చుట్టి, కీలు మీద 10-15 నిమిషాలు అప్లై చేయాలి. ఇది వాపు, నొప్పిని నియంత్రిస్తుంది. బరువు.. అధిక శరీర బరువు కీళ్లపై, ముఖ్యంగా మోకాళ్లు, తుంటిపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల నొప్పి వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 5-10% బరువు తగ్గడం వల్ల కీళ్ల నొప్పులకు గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఫైబర్, ప్రోటీన్, ఆకుపచ్చ కూరగాయలు కలిగిన సమతుల్య ఆహారం బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. చక్కెర, వేయించిన ఆహార ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఎక్కువ సేపు ఏసి లో గడిపే వారికి ఈ షాకింగ్ నిజాలు తెలుసా?
వేసవి కాలం అంటేనే చాలా ఇబ్బంది కాలం. అందులోనూ మునుపటి కంటే ప్రతి ఏడాది ఎండల తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. ఈ కారణంగా మధ్యతరగతి కుటుంబాలు కూడా ఏసి ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఏసి ఏర్పాటు చేయించుకోవడం అయితే జరుగుతుంది కానీ.. ఏసి గురించి, ఏసి లో ఉండటం వల్ల జరిగే పరిణామాలు కానీ చాలా మందికి తెలియవు. వేసవి కాలం నడుస్తున్నందున ఏసిలో ఎక్కువ సమయం గడిపే వారికి కొన్ని షాకింగ్ నిజాలను ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో తెలుసుకుంటే.. AC సురక్షితమైనదే కానీ AC ఉన్న ప్రదేశాలలో మంచి వెంటిలేషన్ వ్యవస్థ ఉండాలి. అంటే సరైన గాలి ప్రసరణ ఉండాలి. ఏసీని వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశంలో ఏర్పాటు చేస్తే తలనొప్పి, పొడి దగ్గు, తలతిరుగుడు-వికారం, ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తలనొప్పి, మైగ్రేన్ ప్రమాదం.. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువసేపు ఏసీలో ఉండేవారిలో తలనొప్పి, మైగ్రేన్ ప్రమాదం పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి, AC గది గాలి నుండి తేమను గ్రహిస్తుంది, దీని వలన గాలి చాలా పొడిగా ఉంటుంది. ఈ పొడి గాలి సైనస్లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ పొడి వాతావరణం కళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. అకస్మాత్తుగా చల్లని, AC వాతావరణం నుండి వేడిలోకి మారినప్పుడు ఉష్ణోగ్రతలో ఈ ఆకస్మిక మార్పు కొంతమంది సున్నితమైన వ్యక్తులలో మైగ్రేన్ సమస్యను ప్రేరేపిస్తుంది. శ్వాసకోశ సమస్యల ప్రమాదం.. ఏసీలో ఎక్కువసేపు గడిపే వ్యక్తులకు ఇతరుల కంటే శ్వాసకోశ సమస్యలు అనగా.. నాసికా రంధ్రాలలో చికాకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే AC నుండి వెలువడే చల్లని, పొడి గాలి నేరుగా తాకినప్పుడు ముక్కు, గొంతు సున్నితమైన పొరలను ఎండిపోయేలా చేస్తుంది. దీనివల్ల చికాకు, నొప్పి, పొడిబారడం జరుగుతుంది. ఆస్తమా-బ్రోన్కైటిస్ సమస్యలు ఉన్నవారు ఏసీలో ఎక్కువ సమయం గడపకుండా ఉండాలి. జీవక్రియపై ప్రభావం.. కొన్ని అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాల ప్రకారం, ACలో స్థిరమైన చల్లని ఉష్ణోగ్రతలో ఉండటం వల్ల శరీర జీవక్రియ కూడా ప్రభావితమవుతుంది. సాధారణ పరిస్థితులలో శరీరం వేర్వేరు ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు దాని అంతర్గత ఉష్ణోగ్రతను నిర్వహించడానికి కొంత శక్తిని ఖర్చు చేస్తుంది. మనకు వేడిగా అనిపించినప్పుడు, మనకు చెమట పడుతుంది, చల్లగా అనిపించినప్పుడు, శరీరం వేడిని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలలో కేలరీలు కాలిపోతాయి. నియంత్రిత వాతావరణంలో ఏసీలో గడపడం వల్ల ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి శరీరం అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల తక్కువ కొవ్వును కాల్చేస్తారు. అంతేకాకుండా, చల్లని వాతావరణంలో సాధారణం కంటే తక్కువ నీరు తాగుతారు. ఇది జీర్ణ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ పరిస్థితులు మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి ఏసీ లో ఎక్కువ సమయం గడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. *రూపశ్రీ.
read moreమందు చేసే మాయ మీకు తెలుసా?
"అవును! ఇంతకీ పార్టీ ఎప్పుడు?" ఎవరు ఏ శుభవార్త చెప్పినా ఎదుటి వ్యక్తి నుండి వచ్చే మొదటి ప్రశ్న ఇది. 'పార్టీ' అనే దానికి ఇప్పుడు అర్ధం చాలా వరకు మారిపోయింది. 'డ్రింక్స్' లేని పార్టీ పార్టీయే కాదు అనే మిత్రులూ మన మధ్య ఉన్నారు. ఇలా ఏదో సరదాకి ప్రారంభమై ఈ మధ్యపానానికి బానిసలై పీడింపబడుతున్న వాళ్లు, ప్రాణాల్ని కూడా కోల్పోయిన వాళ్లు ఎందరో ఉన్నారు. 'బాధల్ని మరచిపోవడానికి ఇదే మంచి మందు' అంటూ మందు కొట్టడాన్ని ప్రారంభించి మరిన్ని బాధల్లో కూరుకుపోయిన వాళ్లూ కోకొల్లలు ఉంటారు. ఏవో కొన్ని కథల్లో చదివో, కొన్ని సినిమాల్లో చూసో ప్రేమ విఫలమైనా, కష్టాలు వచ్చినా ఇలా మందు ఒక్కటే మార్గమని భావించే అమాయకులూ మనలో లేకపోలేదు.. కారణమేదైనా పర్యవసానమే 'ముందు'కి బానిస కావడం! సరదాకి ప్రారంభించి సమస్యయి కూర్చుంటుంది. విశ్రాంతి కలిగిస్తుందని తీసుకుంటున్నది కాస్తా ఆరోగ్యాన్ని చెడగొట్టి, అవిశ్రాంతిని పెంచుతుంది!!! బాధల్ని మరచిపోవాలని మొదలు పెట్టింది. మరింత బాధాకరంగా తయారవుతుంది!!! మనిషిలో ఒంటరితనాన్ని, హింసా ప్రవృత్తిని పెంచుతుంది!!! అన్ని రకాల మద్య పానాలలోను ఉండేది ఇథైల్ ఆల్కహాల్. ఇది పులియబెట్టడం వలన వస్తుంది. త్రాగడం ప్రారంభించిన ప్రతి పదిమందిలోను ఒకళ్లు తప్పక దానికి బానిసలైపోతున్నారు. ఆల్కహాలు మనసుని ఉత్తేజపరచదు. కేంద్రనాడీ మండలాన్ని నిరుత్సాహ పరచి మెదడు, వెన్నెముకల పని తీరుని తగ్గిస్తుంది. మద్యాన్ని సేవిస్తే అది మిగతా పదార్థాలలా జీర్ణమై రక్తంలో కలువదు. సరాసరి రక్తంలో కలుస్తుంది. అందుకని త్రాగిన క్షణాల్లోనే శరీరంలోని అన్ని భాగాలకు చివరకు మెదడుకు కూడా ఇది ప్రవహిస్తుంది. మెదడుని మొద్దుబారేట్లు చేస్తుంది. దాంతో త్రాగిన వ్యక్తి ప్రవర్తనలో మార్పు కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. దీనివల్ల ఆ వ్యక్తికి, అతని తాలూకు వాళ్లకి ఎన్నో నష్టాలు కలుగవచ్చు. ఒక డ్రింక్ త్రాగిన 45 నిమిషాల తరువాత మాత్రమే ఆ ఆల్కహాల్ని లివర్ బ్రధ్ధలు కొట్టగలదు. అందుకనే నిర్దేశించిన కాలంలో ఇంతకన్నా ఎక్కువ ఆల్కహాల్ త్రాగితే లివర్ దెబ్బతింటుంది. అందరూ అనుకున్నట్టు చన్నీటి స్నానం, మజ్జిగ, కాఫీ, భోజనం మొదలైనవేవీ ఆ వ్యక్తిని మామూలు స్థితిలోకి తీసుకురాలేవు. కేవలం త్రాగిన పరిమాణానికి తగ్గ సమయము తర్వాతే మామూలు స్థితికి రాగల్గుతాడు. రెండు పెగ్గులు తాగితే అది తగిన గంటలోపు చెమటలు పట్టడం, విచక్షణ కొద్దికొద్దిగా తగ్గడం మొదలవుతుంది. మూడు పెగ్గులకి తల తిరగడంతో పాటు విచక్షణ బాగా దెబ్బతింటుంది. అయిదారు పెగ్గులకి సరిగ్గా కనిపించకపోవడం, మాటలు తడబడడం, రికలక్షన్స్ బాగా నెమ్మదైపోవడం జరుగుతుంది. ఎనిమిది, తొమ్మిది పెగ్గులైతే బాలన్స్ పూర్తిగా తప్పుతుంది. ఒకళ్ళు ఇద్దరుగా కనిపిస్తారు, స్పృహ తప్పిపోవచ్చు. అంతకు మించితే ప్రాణమూ పోవచ్చు. తన అలవాటుమీద ఎప్పుడైతే తన అదుపు తప్పిందో అప్పుడే ఆ వ్యక్తి కష్టాలలో పడ్డట్లు. ఈ మద్యపాన అలవాటుని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ 1956లోనే ఒక జబ్బుగా గుర్తించాయి. మానాలనే ధ్యాస ఉండాలే గాని ఈ 'జబ్బు'ని నయం చేయడం అసాధ్యమేమీకాదు. త్రాగుడు అలవాటే ఓ జబ్బు. అంతేగాని ఇది ఏ జబ్బుకీ లక్షణం కాదు. అందుకని దీని ద్వారా వచ్చే జబ్బుల్ని వేటిని నయం చేయాలన్నా మొదట ఈ అలవాటుని మానిపించాలి. ఈ జబ్బుని నయం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే రోజురోజుకి పెరిగిపోతుంది. రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటున్న చాలా కాలమయ్యే సరికి దాని ప్రభావం ఆరోగ్యం మీద ఉండి తీరుతుంది. మొదట్లో కొద్ది పరిమాణమే ఆనందాన్ని కలిగించవచ్చు. కానీ శరీరం త్వరలోనే దానికి అలవాటు పడడంతో అంతకన్నా ఎక్కువ తీసుకుంటేగాని 'కిక్' ఫీలవ్వరు. ఇలా క్రమక్రమంగా ఈ అలవాటు పెరిగిపోతుంది. ఆల్కహాల్లో ఉండేవి 'ఎంప్టీ కాలరీస్' అందుకని సరైన ఆహారం తీసుకోకపోతే శరీరం ఇంకా త్వరగా దెబ్బతింటుంది. ఇదీ మందు చేసే మాయ.. ◆నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreరాత్రి పడుకునే ముందు ఈ పొరపాట్లు చేస్తే జాంబీలుగా మారిపోతారు!
జాంబీ అనే పదం సినిమాలలో వినే ఉంటారు. కేవలం సినిమాలలో వినడమే కాదు, జాంబీలు ఎలా ఉంటారో కూడా చూసి ఉంటారు. కళ్లు బాగా ఉబ్బిపోయి, కళ్లకింద నల్లటి వలయాలు, మచ్చలు ఉంటాయి. వారి నడక నుండి ప్రవర్తన వరకు అంతా భయంకరంగా ఉంటుంది. నిజానికి రాత్రి పడుకునే ముందు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల సాధారణ మనుషులు కూడా ఇలా జోంబీలుగా మారిపోతారట. అసలు రాత్రి పడుకునే ముందు చాలామంది చేస్తున్న తప్పేంటి? దీనివల్ల అంత పెద్ద ప్రమాదం ఎందుకు కలుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. చాలామంది రాత్రి సమయంలో ఆహారం తీసుకునే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. కొందరు రాత్రి పడుకోవడానికి అరగంట ముందు భోజనం చేస్తే.. మరికొందరు అలా తినగానే ఇలా నిద్రపోతారు. కానీ ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినడమే కాకుండా అధిక బరువుకు కారణం అవుతుంది. మరికొంతమంది ఇలాంటి విషయాల మీద అవగాహన ఉన్న కారణంగా రాత్రి సమయంలో పడుకోవడానికి ముందు ఆహారం ఆలస్యమైతే ఇక రాత్రి భోజనాన్ని స్కిప్ చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకమరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రి సమయంలో తినగానే నిద్రపోవడం ఎంత ప్రమాదకరమో.. అస్సలు తినకుండా ఖాళీ కడుపుతో నిద్రపోవడం కూడా అంతే ప్రమాదం. పైపెచ్చు రాత్రి సమయంలో ఆహారం ఎగ్గొట్టడం వల్ల శరీరంలో విటమిన్-బి12, విటమిన్-డి, కాల్షియం, ప్రోటీన్ మొదలైనవి లోపిస్తాయి. వీటి లోపం కారణంగా శరీరం చాలా నష్టపోతుంది. కొన్ని అనుకోని పరిస్థితులలో ఖాళీ కడుపుతో నిద్రపోవడం ఎప్పుడో ఒకసారి జరిగితే అదేమీ అంత ప్రమాదం చూపించదు. కానీ ఇది ప్రతిరోజూ అలవాటు అయితే మాత్రం క్రమంగా శరీరం జోంబీలాగా మార్పు చెందుతుందట. కడుపుకు సరైన ఆహారం లేకపోతే రాత్రి సమయంలో నిద్రపట్టడం కూడా కష్టమే. మరొక విషయం ఏమిటంటే రాత్రి సమయంలో ఆహారం తీసుకోకపోతే శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగి పొట్ట, పిరుదులు వంటి భాగాల్లో పేరుకుప్రమాదం ఉంటుందట. అందుకే ప్రతి ఒక్కరూ రాత్రి పడుకోవడానికి కనీసం రెండు నుండి 3 గంటలలోపు ఆహారం తీసుకోవడం ముగించాలని చెబుతున్నారు. దీనివల్ల పడుకునే సమయానికి ఆహారం దాదాపుగా జీర్ణమై జీర్ణాశయం కూడా విశ్రాంతి దశలోకి వెళుతుంది. ఇవన్నీ జరగటం వల్ల జోంబీలుగా మారటం ఏంటి పిచ్చికాకపోతే అని చాలామందికి అనుమానం వస్తుంది. కానీ ఇవన్నీ ధీర్ఘకాలం కొనసాగితే ఎదురయ్యే పరిస్థితి మాత్రం అదే అని పరిశోధకులు చెబుతున్నారు. *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreమునగాకుతో ఇన్ని లాభాలా...
మునగాకు మొరింగా ఓలేఫెరా దీని అసలు పేరు. దీనిని డ్రమ్స్టిక్స్ అంటే తెలుగులో చెప్పాలంటే మునగ ఆకు. దీనుండి అనేక ఔషడ లాభాలు ఉన్నాయి అని అంటున్నారు. దాదాపు వెయ్యి సంవత్సరాలుగా మునగ చెట్టు భారత్ లోని హిమాలయ ప్రాంతాలలో ఆసియాలో పుట్టిందని అంటారు మునగ చెట్టు ద్వారా ఆరోగ్య కరమైన యాంటీ యాక్సిడెంట్స్ లభిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.దీనిని బయో ఆక్టివ్ ప్లాంట్ కొమ్పౌండ్స్ మునగాకు ట్రో ఫిక్స్, ప్రాంతాలలో పెరుగు తాయి. మునగ ఆకు ఆకులు,మునగ కాయలు పచ్చగా బలంగా ఉంటాయి. దీనుండి వచ్చే రూట్స్ తో వైద్యానికి మందుగా వాడతారని నిపుణులు పేర్కొన్నారు. మునగ ఆకు పప్పులో వాడడం మరో విశేషం. మునగ ఆకు రక్త హీనతకు, ఆర్థరైటిస్,ఇతర కీళ్ల నొప్పులు.ముఖ్యంగా రొమటిస్మ్ ,ఆస్తమా,కాన్సర్, మాల బద్దకం,డయబెటిస్ ,డయేరియా,పొట్ట,ఇతర ఇంటర్ స్టైనల్ లో వచ్చే ఆల్సర్ర్స్ స్పశమ్,తల నొప్పిహై బ్లడ్ ప్రెషర్,హృద్రోగ సమస్యలు.కిడ్నీలో రాళ్ళు.ఫ్లూయిడ్ తిరిగి రావడం. తైరోయిడ్ సమస్యలు. పరాస్టిక్ ఇన్ఫెక్షన్ ,ఇమ్యూన్ బూస్టర్ గా మునగ పని చేస్తుంది.స్త్రీలలో వక్షోజాలలో పాల ఉత్పత్తి పెరుగు తుంది.దీనిని కొందరు న్యూట్రిష్నల్ సుప్లి మెంట్స్ గా వాడతారు. లేదా టోనిక్ గా వాడడం విశేషం.ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ప్రధాన ఆహారం గా వాడుతున్నారు.మునగ ఆకు లో చాలా రకాల మినరల్స్లభిస్తాయి.మునగని భా రత్ ఆఫ్రికా లో పోషక విలువలు తక్కువ ఉన్నచోట దీనిని వినియోగించడం ఒక ఉద్య్మంగా పేర్కొన్నారు .మునగ కాయలు బీన్స్ వండిన మాదిరిగా వాడతారు అలాగే ఆంధ్రప్రదేశ్లో మునగ కాయతో పచ్చడి చేస్తున్నారు.మునగ ఆకులను పాలకూర మాదిరిగానే వండు కోవచ్చు అని లేదా మునగ ఆకు పొడి గా కూడా వాడవచ్చు. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఆలివ్ ఆయిల్ వల్ల లాభాలు..
గుండె సంబంధిత అనారోగ్యం, మరణం నుండి తపోపించు కోవాలంటే ఆలివ్ ఆయిల్ ఉపయోగ పడుతుంది.మనం అన్నం వండడానికి నూనెను వాడడం సహజం. అయితే కొన్ని రకాల నూనెలు లాభ దాయకంగా ఉంటాయి.అలాగే హాని కారకం కూడా నేడు మీముందుకు తీసుకువస్తున్న అంశం ఆలివ్ నూనె వల్ల లాభాలు.ఆలివ్ ఆయిల్ ను తీసుకోవడం వల్ల మీరు సమయానికి ముందే మరణం నుంచి తప్పించుకోవచ్చ.అన్నది ప్రశ్న?ఈ విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు. ఒక పరిశోదనలో తేలిన విషయం ఏమిటి అంటే గుండె సంబంధిత అనారోగ్యం మరణం నుండి తప్పించు కోవాలంటే ఒక్కో సారి ప్రాణాలతో చలగాటం ఆడడమే.అయితే ఆలివ్ ఆయిల్ కు గుండెకు సంబంధం ఉందని అంటున్నారు నిపుణులు.హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో జరిగిన పరిశోదనలో ఎవరైతే 28 ఏళ్ల పాటు ఆలివ్ ఆయిల్ ను అర చంచా 1 /2 చంచా లేదా 7 గ్రాములు కంటే ఎక్కువ ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటె ఇతరులతో పోలిస్తే వారిలో 19% మరణాలు తగ్గాయని తేలింది.ఎవరైతే ఆలివ్ ఆయిల్ తీసుకోలేదో వారిలో కొన్ని సమస్యలు తలెత్తినట్టు పరిశోదనలో తేలింది. ఆలివ్ ఆయిల్ అంటే ఏమిటి?... పేరులోనే ఉంది కదా ఆలివ్ నుండి వచ్చే నూనె సహజంగా ఈ నూనెను అన్నం వండేటప్పుడు,లేదా సలాడ్ లోసర్దేటప్పుడు.ఆలివ్ ఆయిల్ ను వాడతారు. ఆలివ్ ఆయిల్ లో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎగస్ట్రా వర్జీన్ ఆలివ్ ఆయిల్,లేదా శుద్ది చేసిన ఆలివ్ ఆయిల్,లేదా రీ ఫైండ్ చేసిన ఆలివ్ ఆయిల్ కేవలం ఆలివ్ ఆయిల్ మాత్రం అందుబాటులో ఉంటుంది.వీటి అన్నిటిలో ఎగస్ట్రా వర్జీన్ ఆలివ్ ఆయిల్ మాత్రమే నాణ్యత ఉంటుందని రీ ఫైండ్ చేసిన,లేదా కేవలం ఆలివ్ ఆయిల్ లో కూడా నాణ్యత లేని నాసిరకం నూనెలు ఉన్నట్లు చెపుతున్నారు కాగా మిగిలి పోయిన ఆయిల్ ను మరీ నొక్కి తీసి మార్కెట్ కు తరలించడం కీలకం. ఆలివ్ ఆయిల్ నూనె ఆరోగ్యంగా ఉంచుతుందా?... ఆలివ్ ఆయిల్ నూనెలో చాలా రకాల ప్రమాదాలు తగ్గించేందుకు సహాయ పడుతుంది. వీటన్నిటి వెనక ఒకటే తత్వం వోనో అన స్యాచురేటేడ్ ఫ్యాటీ యాసిడ్ వంటివి సంపూర్ణంగా ఉంటాయి. శరీరం లో ఉన్న పాడై పోయిన కొలస్ట్రాల్ శాతం తగ్గించడం.లో ఆలివ్ ఆయిల్ కీలక పాత్ర పోషిస్తుంది. అత్యధిక కొలస్ట్రాల్ లేదా మంచి కొలస్ట్రాల్ స్థాయి లో ఉన్నందున చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.అని వివరించారు ఒక అధ్యయనం లో తేలిన విషయం ఏమిటి అంటే యాంటీ ఆక్సిడే టివ్ పై ప్రామాదం ఏర్పడ వచ్చు.అధ్య యనం లో ఎవరైతే ఎక్కువగా ఆయిల్ ను వినియోగించారో వారిలో గుండె సంబంధిత అనారోగ్యం మరణాలు19% ఉండగా. తీవ్రత తక్కువ స్థాయిలో 17% మాత్రమే ఉన్నాయని నిపుణులు నిర్ధారించారు. ముఖ్యంగా న్యూరో జనరేటివ్ వ్యాధులు అంటే పా ర్కిన్ సన్స్, అల్జీమర్స్ మరణించే వారి సంఖ్య 18% ప్రమాదాల నుంచి తప్పించుకోగలిగారు. ఆలివ్ ఆయిల్ బరువు తగ్గిస్తుందా ?... బరువు పెరగడం అన్నది ఒక అంశం పై ఆధార పది ఉంటుంది. మీరు తీసుకునే ఆహారం ఎన్నిక్యాలరీలు ఉంటుందో దాని ఆధారంగా బరువు పెరుగుతారని మీ ఆహారంలో క్యాలరీల శాతం పెరిగిందో బరువు పెరగడం సహజం. అలాగే బరువు తగ్గించేందుకు తక్కువ శాతం క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలాని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఆలివ్ ఆయిల్ ను తక్కువ స్థాయిలో వినియోగించడం ఆరోగ్యకరం అని నిపుణులు సూచిస్తున్నారు. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreపింక్ టీ.. దీని ఉపయోగాలు తెలిస్తే షాకవుతారు..!
ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటాము. వంటగది నుండి తోట వరకు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించే చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో రోజా కూడా ఒకటి. ఈ పువ్వు అందానికి చిహ్నం మాత్రమే కాదు, దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కావాలంటే గులాబీని పచ్చిగా నమలవచ్చు లేదా గులాబీ ఆకులతో తయారు చేసిన టీ తాగవచ్చు. ఇది అన్ని విధాలుగా ప్రయోజనం చేకూర్చడంలో సహాయపడుతుంది. రోజ్ టీని పింక్ టీ అని కూడా పిలుస్తారు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి, మనసుకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, సహజ లక్షణాలు దీనిని ప్రత్యేకమైన హెర్బల్ టీగా చేస్తాయి. రోజ్ టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుంటే.. బరువు తగ్గడంలో ప్రయోజనకరమైనది.. రోజ్ టీలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి లక్షణాలు ఉన్నాయి. ఈ టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనివల్ల జీవక్రియ కూడా పెరుగుతుంది. రోజ్ టీ తాగడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. బరువు తగ్గడం సులభం అవుతుంది. దీనితో పాటు రోజ్ టీలో కేలరీల కంటెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీనిని ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణిస్తారు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. రోజ్ టీ తయారీలో ఏలకులు, దాల్చిన చెక్కను ఉపయోగిస్తారు. ఇవన్నీ కలిసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మానికి మేలు చేస్తుంది.. రోజ్ టీలో మంచి మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇది చర్మాన్ని శుభ్రంగా, ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచుతుంది. ఇది శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.. గులాబీల సువాసన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అటువంటి పరిస్థితిలో గులాబీ టీ తాగితే , ఒత్తిడి, ఆందోళన, చిరాకు నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది సహజ మూడ్ బూస్టర్గా పనిచేస్తుంది. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. రోజ్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. గులాబీలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారించడానికి రోజ్ టీ తాగవచ్చు. రోజ్ టీ ఎలా తయారు చేయాలి? ముందుగా నీటిని మరిగించాలి. అందులో ఎండిన గులాబీ ఆకులను వేసి 5-7 నిమిషాలు మూతపెట్టి ఉంచండి. దీన్ని వడకట్టి ఒక కప్పులో పోయాలి, మీకు కావాలంటే ఇందులో ఏలకులు, దాల్చిన చెక్క కూడా వేసి ఉడికించుకోవచ్చు. మరింత రుచి కోసం దానికి తేనె వేసి త్రాగచ్చు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreపిత్తాశయంలో రాళ్లు ఎందుకు వస్తాయో తెలుసా?
ఇంతకు ముందు రోజుల్లో కిడ్నీలో రాళ్లు అనే విషయాన్ని ఎక్కువగా వినేవాళ్లం. కానీ ఇప్పట్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ అని ఎక్కువ వింటూ ఉన్నాం. దీన్నే పిత్తాశయంలో రాళ్లు అని అంటారు. చాలా మంది ఈ మధ్య కాలంలో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం అనేది చాలా కారణాల వల్ల జరగవచ్చు. కానీ ముఖ్యంగదా ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం. చెడు జీవనశైలి వల్ల పిత్తాశయంలో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయని చెబుతారు. అయితే అసలు పిత్తాశయంలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి తెలుసుకుంటే.. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి కారణం పిత్తంలో ఉండే బిలిరుబిలిన్, లవణాలు, మూలకాల అసమతుల్యత. ఇవి అసమతుల్యతగా ఉన్నట్టైతే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం అనేది సాధారణంగా ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఊబకాయం ఉన్న వారిలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక కొలెస్ట్రాల్ పిత్తాశయంలో రాళ్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మహిళలలో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడితే అది హార్మన్లలో మార్పులు, ముఖ్యంగా అధిక ఈస్ట్రోజెన్ స్థాయిల వల్ల జరుగుతుందని అంటున్నారు. వీటి వల్లే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయట. ఆహారంలో ఫైబర్ లేకపోవడం, జీర్ణ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది పిత్త అసమతుల్యతకు, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి దారి తీస్తుంది. అందుకే ఆహారంలో ఫైబర్ ను తీసుకోవాలి. అలాగే జీర్ణ సమస్యలు ఏవీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జీర్ణసమస్యలు వస్తే వెంటనే పరిష్కారం అయ్యేలా చూసుకోవాలి.పోషకాలు అధికంగా ఉన్న, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఒత్తిడి హార్మోన్ ఏది..ఇది ఎలా పనిచేస్తుంది?
శరీరం సరిగ్గా పనిచేయడంలో 'బ్యాలెన్స్' ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది ఆహార సమతుల్యత అయినా లేదా హార్మోన్ల సమతుల్యత అయినా, రెండూ ముఖ్యమైనవే. హార్మోన్లు మన శరీరంలో దూతలుగా పనిచేసే రసాయనాలు. శారీరక పెరుగుదల, అభివృద్ధి, జీవక్రియ, జీర్ణక్రియ, వ్యాధులతో పోరాడటం, వ్యక్తులను సంతోషంగా లేదా విచారంగా ఉంచడంలో హార్మోన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కార్టిసాల్ అటువంటి హార్మోన్లలో ఒకటి, దీని గురించి తెలుసుకుంటే.. చాలామంది ఒత్తిడిగా ఉంది అంటూ ఫిర్యాదు చేస్తుంటారు. ఇలా ఒత్తిడికి గురి కావడం వెనుక కార్టిసాల్ అనే హార్మోన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ కార్టిసాల్ హార్మోన్ ను ఒత్తిడి హార్మోన్ అని కూడా పిలుస్తారు. కార్టిసాల్ అనేది అడ్రినల్ గ్రంథులు తయారుచేసే స్టెరాయిడ్ హార్మోన్. ఇది ప్రాథమికంగా ఒత్తిడి హార్మోన్ అని పిలుస్తారు, ఇది ఒత్తిడితో కూడిన పరిస్థితులకు శరీరం ప్రతిస్పందనను నియంత్రించడంలో సహాయపడుతుంది. కార్టిసాల్ విధులు దీనికి మాత్రమే పరిమితం కాదు, ఇది శరీరంలో అనేక ఇతర పాత్రలను కలిగి ఉంది. ఒత్తిడి హార్మోన్.. ఆరోగ్య నిపుణులు కార్టిసాల్ను ఒత్తిడి హార్మోన్ అని పిలుస్తారు. కానీ ఇది శరీరంలోని దాదాపు ప్రతి అవయవం, కణజాలాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన హార్మోన్ అని అంటున్నారు. శరీరం శక్తి కోసం గ్లూకోజ్ ను ఎలా ఉపయోగిస్తుంది, వాపు, రక్తపోటును నియంత్రించడం, నిద్ర-మేల్కొలుపు చక్రాన్ని నియంత్రించడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో కార్టిసాల్ అధికంగా ఉన్న వ్యక్తులు కాలక్రమేణా అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. కార్టిసాల్ పనిచేసే తీరు.. శరీరం ఒత్తిడి ప్రతిస్పందనను నిర్వహించడంలో కార్టిసాల్ కీలక పాత్ర పోషిస్తుంది. కొద్దిసేపు ఒత్తిడికి గురైనా, శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. ఒత్తిడి సమయాల్లో, మిమ్మల్ని అధిక అప్రమత్తంగా ఉంచడానికి శరీరం కార్టిసాల్ను విడుదల చేస్తుంది. భయం, భావోద్వేగ ఉద్దీపనలు వంటి భావోద్వేగాలను నియంత్రించే మెదడులోని భాగం అమిగ్డాలా. ఒత్తిడితో కూడిన పరిస్థితులలో, ఇది మెదడులోని ఒక భాగమైన హైపోథాలమస్కు ఒత్తిడి సంకేతాలను పంపుతుంది. ప్రతిగా హైపోథాలమస్ పిట్యూటరీ-అడ్రినల్ గ్రంథిని కార్టిసాల్ ఉత్పత్తి చేయమని సంకేతాన్ని ఇస్తుంది. కార్టిసాల్ పెరిగితే వచ్చే సమస్యలు.. కార్టిసాల్ సాధారణ స్థాయిలో ఉంటే పర్వాలేదు కానీ కార్టిసాల్ స్థాయిలు ఎక్కువ ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. బరువు పెరగడం, అధిక రక్తపోటు, మధుమేహం, వెడల్పు ఊదా రంగు బొడ్డు మచ్చలు, ఆస్టియోపోరోసిస్కు దారితీస్తుంది. పెరిగిన హార్మోన్ స్థాయిలు కాలేయం, కండరాలతో సహా అనేక ఇతర భాగాలను ప్రభావితం చేస్తాయి. కార్టిసాల్ ను తగ్గించాలంటే.. కార్టిసాల్ స్థాయి తరచుగా ఎక్కువగా ఉంటే దాని గురించి వైద్యుడిని సంప్రదించాలి. దినచర్యలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కార్టిసాల్ను నియంత్రించవచ్చు. నిద్రలేమితో బాధపడేవారిలో లేదా రాత్రి షిఫ్టులలో పనిచేసేవారిలో కార్టిసాల్ స్థాయిలు పెరగవచ్చు. కాబట్టి, రాత్రి బాగా నిద్రపోవాలి. క్రమం తప్పకుండా శారీరక శ్రమ నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. శ్వాస వ్యాయామాలు, ధ్యానం కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. నవ్వుతూ సంతోషంగా ఉండటం వల్ల ఎండార్ఫిన్ హార్మోన్ల స్రావం పెరిగి కార్టిసాల్ తగ్గుతుంది. కాబట్టి సరదా కార్యకలాపాల్లో పాల్గొనాలి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఎండ ఎక్కువగా ఉందని చెరకు రసం తాగుతున్నారా? ఈ నిజాలు తెలుసా?
వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని, శక్తిని అందించడానికి చెరకు రసం చాలా మంచి పానీయం. చెరకు రసం ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ సీజన్లో భారతదేశంలోని కూడళ్లలో, వీధి మూలల్లో చెరకు రసం సులభంగా లభిస్తుంది. మండే వేడి నుండి ఉపశమనం పొందడానికి చాలామంది చెరకు రసం తాగడానికి ఇష్టపడతారు. నీటికి బదులుగా చెరకు రసం తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, దాహం కూడా తీరుతుందని నమ్ముతారు. కానీ బలమైన సూర్యకాంతిలో చెరకు రసం తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి హాని కలుగుతుందట. దీన్ని త్రాగే సమయం, పద్ధతి సరిగ్గా లేకపోతే అది ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుంది. బలమైన ఎండలో చెరకు రసం తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? దానిని త్రాగడానికి సరైన సమయం, మార్గం ఏమిటో తెలుసుకుంటే.. బలమైన ఎండలో చెరకు రసం తాగితే.. మండే ఎండకు శరీరం ఇప్పటికే వేడిగా మారి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో చల్లని చెరకు రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం లేదా కడుపు తిమ్మిరి వంటి సమస్యలను కలిగిస్తుంది. చెరకు రసం సహజంగా చల్లదనాన్ని ఇస్తుంది. వేసవిలో చెమటతో కూడిన శరీరం అకస్మాత్తుగా ఏదైనా చల్లని పదార్థాన్ని తీసుకున్నప్పుడు అది గొంతు నొప్పి లేదా జలుబు, దగ్గుకు దారితీస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో విక్రయించే చెరకు రసంలో పరిశుభ్రత లోపించి ఉండవచ్చు. బలమైన సూర్యకాంతిలో చెరకును బహిరంగ ప్రదేశంలో ఉంచడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ లేదా కడుపు ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. చెరకులో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఎండకు అలసిపోయిన శరీరానికి వెంటనే దీన్ని తాగడం వల్ల చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది తలతిరగడం లేదా అలసటకు దారితీస్తుంది. చెరకు రసం తాగడానికి సరైన సమయం ఉదయం లేదా మధ్యాహ్నం చెరకు రసం తాగవచ్చు. కానీ ఎండలోంచి వచ్చిన వెంటనే దానిని తాగకూడదు. నీడలో లేదా చల్లని ప్రదేశంలో కూర్చుని జ్యూస్ తాగాలి. తద్వారా శరీర ఉష్ణోగ్రత సాధారణమవుతుంది. ఖాళీ కడుపుతో చెరకు రసం తాగకూడదు. తేలికపాటి అల్పాహారం తిన్న తర్వాత మాత్రమే తాగాలి. చెరకు రసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందాలనుకుంటే దానిని పరిశుభ్రమైన జ్యూస్ సెంటర్ నుండి కొని త్రాగాలి. లేదా ఇంట్లో తయారు చేసుకుని త్రాగాలి. చెరకు రసం త్రాగడానికి సరైన మార్గం ఏమిటంటే.. చెరకు రసాన్ని నిమ్మకాయ, నల్ల ఉప్పుతో కలిపి త్రాగాలి. ఇది మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎల్లప్పుడూ తాజా చెరకుతో తయారు చేసిన రసాన్ని త్రాగాలి. రసం తాగిన తర్వాత నేరుగా ఎండలో వెళ్లకూడదు. కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. చల్లని రసం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ చాలా చల్లటి చెరకు రసం గొంతు నొప్పి, జలుబుకు కారణమవుతుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి చెరకు రసం చాలా చల్లగా ఉండకూడదు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read more


.webp)
.webp)






.webp)

.webp)


.webp)
.webp)




.webp)
.webp)