ఉద్యోగం
ఆయన వెళ్ళిపోయారు.
నిట్టూర్చాను. హృదయం బరువెక్కింది. నాకళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. రాయిలా గుమ్మందగ్గరేనించున్నాను. ఆయన వెళ్ళిపోతూ అన్నమాటలే చెవుల్లో రింగుమంటు న్నాయి.
"అమ్మ పిలుస్తోంది" అన్నాడు చిట్టి.
కళ్లు తుడుచుకుంటుండగా అడిగాడు " ఏడుస్తున్నావా"
* * * *
జీవితంలో నే నేనాడూ నవ్వలేదు. నాన్న తెలీదు. అమ్మబడిలో సుఖం తెలీదు. వాళ్ళెలా ఉండేవారోగూడా గుర్తులేదు.
నేననుకుంటాను- దేవతలాటి అమ్మ ఆదరణ దేవుడి లాంటి నాన్న వాత్సల్యం పంచుకున్న మనిషి బతుకులో ఏనాటికైనా నవ్వగలడూ అని. నా కా అదృష్టం లేదమరి.
అన్నయ్య ఉన్నాడు. అయినా నేను నవ్వు కునేం దుకు అవకాశ మివ్వవలేదాయన. ఒదినుంది-కానీ ఆమె అమ్మ కాలేదు. కాదు! ఆ యిద్దరి చేతుల్లో పెరిగేను.
నన్ను పెంచుతూన్న అన్నయ్య పదిమందిలో నూ అవుననిపించుకున్నాడు, ఒదిగిన చాలామంది గౌరవించేవారు. వాళ్ళిద్దరూ లోకాన్ని మాయచేయగలరు అంతరంలోలేని ప్రేమని పదిమంది ముందూ ఒలికించగల నేర్పు వాళ్లకుంది.
నాకు చాలా గుర్తులున్నాయి. అన్నయ్య దగ్గిర అక్కయ్య గూడా పెరిగింది. హీనాతి హనంగా పెరిగింది. మగవాడిని, వోర్చుకోగల గుణం గలవాడినిగనక వాళ్ళఅనాదరణకి తలొగ్గేను.
అక్కయ్య తర్వాత నలుగురు పుట్టి అదృష్టవంతులై మరో లోకంలో ఉన్నారు. వాళ్ళందరి తర్వాత నేను సాంప్రదాయానికి వ్యతిరేకంగా నేనే అమ్మనీ, నాన్ననీ కొంచెం తేడాలతో పొట్టని పెటటుకున్నాను.అందుచేత నే అన్నయ్యకి నేనంటే కసి.
కానీ అక్కయ్యమిద అంత అసహ్యమెందుకో తెలిసేదికాదు.
ప్రేమించిన మనిషిని పెళ్ళిచేసుకుంటానని ధైర్యంగా చెప్పడం నీచమైంది. నా కళ్ళముందే అక్కయ్చని మెడపెట్టి గెంటి తలుపుమూసేడు అన్నయ్య. చాతకాక యేడుస్తూన్న నన్ను బరబరా సాక్కుపోయి నోరు మూయించేడు.
నా నోరు యెల్లప్పుడూ మూసుకునే ఉంటుంది. నా కోరికలు సర్వదా చంబడుతూనే ఉంటాయి. నే నెందుకూ పనికిరాని చవటని. కాకపోతే అక్కయ్యకి అంత అవమానం జరుగుతూంటే చూస్తూ వూరుకునేవాడిని కానే కాదు.
ఆ నరకంనుంచి అక్కయ్య తప్పుకున్న తర్వాత నా నెత్తిమిద బాధ్యతలబరువు రెండింతలయింది. ఇంటెడుచాకిరీ నేనొకడ్నే చేయవలసి వచ్చే వదినకి వల్ల మాలిన సుస్తీ అస్తమానూ ఉండేది ఒదిన అన్నయ్యకి మరో ప్రాణం. ఆమెకి తలనొప్పిస్తే నా కారోజు చేతినిండా పని తగిలేది. మందుకి వెళ్ళాలి. వంటచేసి అన్నయ్యనిఆఫీసుకి పంపాలి. దానికో గంటముందునుంచీ వూపిరి సలుపుకోలేనంత ఒత్తడి వల్ల నలిగిపోవాలి.
నేను చేసినవంట నా మొహంలా ఉంటుందట. నా మొహం దరిద్రగొట్టు మొహమని వదినా అన్నయ్యల అభిప్రాయం. అయినా నెలకి యిరవై రోజులు నా చేతివంటే నాకావల్సొచ్చేది వాళ్ళిద్దరికీ వండిపెట్టి నేనింత కతికి స్కూలుకి వెళ్ళేవాడిని! స్కూలునించి రావటంతో టె మళ్ళా పురమాయింపులూ, ఆజ్ఞాలూ, చివాట్లూను.
నా కోరికలు తిన్నవాళ్ళలో ముఖ్యులు వాళ్ళిద్దరు. సగం చచ్చి బతికినందుకు కారణం వాళ్ళేను.
చదివి బాగుపడి నన్ను నేను వుద్దరించుకోవాలనే తపన గలవాడిని. నన్ను నేను చంపుకోవడం యెలా సాధ్యం? పరిస్థితులు అనుకూలించక చదువుమిద శ్రద్ధ చూపించలేని మాట వాస్తవం. ఆ పరిస్థితులకి కారణం మేమిటి?
ఇవన్నీ అన్నయ్య ఆలోచించలేదు. తోందర మనిషి తప్పేనన్న సాకుతో చదువు మాన్సించేడు. హైస్కూలు చదువుతో నా కోరికల మనిషి చచ్చిపోయేడు.
మళ్ళా స్కూలు తెరిచేంతవరకూ నోరువిప్పలేదు. ఒదినా, అన్నయ్యల సాధింపులు విన్నాను ఈ టెల్లాటి మాటల్ని గుండెల్లో నేదాచుకున్నాను. కానీ, స్కూలు తెరిచే ముందు రోజు కోరిక గొంతులో నిలిచింది.అడిగేను-
"అన్నయ్యా.! నన్ను చదివించు."
" అన్నయ్య రుద్రడయ్యేడు.
"ఇలా యేటా తప్పుతూంటే నిన్ను పోషించేందుకు మాదగ్గిర బంగారు గనుల్లేవు. ఈ యింటిపడుచు చేసిన నిర్వాహకం చాలదన్నట్టు నువ్వొహడవి మమ్ముల్నుద్దరించేందుకు తయారవుతున్నావు" ఒదిన మంచం దిగకుండానే అనేసింది.
ఆ క్షణంలో కసికి లొంగిపోయిన మాటనిజం. నోరు జారేనన్న నింద నెత్తినరుద్దేడు అన్నయ్య. నేనన్నదిది-
"నే నెందువల్ల తప్పేను. ఈ యింట్లో చాకిరీ చేయడంవల్లా, మికు నౌఖరు నవ్వడం వల్లాను."
అన్నయ్య నన్ను కొట్టేడు.ఒదిన యేడ్చింది. నన్ను కొట్టినందుక్కాదు. నేను నోరెత్తినందుకు అంతలేసి మాటలన్నందుకు. వచ్చేదుఃఖాన్నీ, కసినీ, అసహాయతనీ దాచేసుకున్నాను.
ఆనాటినుంచీ నేను మరింత హీనంగా బ్రతకవలసి వచ్చింది. అనుక్షణం దెప్పిపొడుపు మాటల్తో కృంగిపోవలసి వచ్చింది ముష్టెత్తి బతుకుదామనుకున్నాను. రాత్రిపూట రిక్షా లాగి, పగలు చదువుకుందామనుకున్నాను.చాలా అనుకున్నాను ఏమి చేయలేకపోయాను.
ఓనాడు- ఒదిన హితబోదనలను ఆలకించి అన్నయ్య అన్నాడు-
" ఎన్నాళ్ళనిచెప్పి యింట్లో గోళ్లు గిల్లుకుంటావ్? ఏదైనా ఉద్యోగం చూసుకోరాదుట్రా!"
"ఉద్యోగం ఏఉద్యోగమొస్తుంది నాకు? ఎవరిస్తారు?కలక్టరవ్వాలని కోరలేదు పంకాంద కూచుని పదిమందిని అజమాయిషి చేయాలని అనుకోలేదు. మామూలు ఉద్యోగిగా బతుకుదామనుకున్నాను. అన్నయ్యలా బతుకుదామనుకున్నాను.
అది ఆ పరిస్థితుల్లో కలగానే నిలిచిపోయింది. 'ఉద్యోగం చూసుకోరాదుట్రా' అని అన్నయ్య చాలా తేలిగ్గా అనే శాడుకానీ, ఆ మాటన్న అన్నయ్యకీ తెలుసూ నేనందుకు అర్హుడనికానని.
నాపాలిటి యమరాక్షసిలా నడుస్తూన్న కాలం నా కోసం ఆగిపోదు. చాలా కాలం తర్వాతగాని దేవుడు నా మొరాలకించలేదు. హైద్రాబాద్ నుంచి ఉత్తరం వచ్చింది. పరపతిని పెంచుకున్న కొండలాంటి మావయ్య రాసిన ఉత్తరం నాకు వెయ్యేనుగుల బలాన్నిచ్చింది.
ఆ నగరంలో నాకో ఉద్యోగం చూపించగల బాధ్యత తాను తీసుకున్నట్టు రాశారు. "వున్నపళంగా నన్ను పంపించేయమని" అన్నయ్యని ఆదేశించేరు. ఆక్షణంలో - చచ్చిన నా కలల మనిషి బతికేడు. అదీ అంతులేని రంగుల కల ప్రారంభమయ్యింది.
