బరువు తగ్గాలా...మీకు తెలియని రహస్యం ఇదే! మహిళలు సాధారణంగా ఎదుర్కునే పెద్ద సమస్య అధిక బరువు. పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక చాలామంది శరీరం నమ్మలేనంతగ షేపవుట్ అవుతుంది. అయితే అందరూ చేసే ఒక పొరపాటు బరువు పెరగడానికి, బరువు తగ్గకుండా ఉండటానికి కారణం అవుతుంది. అదేంటో తెలుసుకుంటే.. మన శరీరం  పనితీరు శరీరంలో అన్ని అవయవాల ఆరోగ్యానికి సంబంధించినది. అంటే శరీరంలోని ఏదైనా భాగంలో ఏదైనా సమస్య ఉంటే, అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. జీవక్రియకు బరువు పెరగటానికి ఉన్న  లింకు కూడా ఇదే. సాధారణంగా, బరువు పెరిగిన వారు దానిని తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.  ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బరువు తగ్గడంతో లేదంటే శరీరంలో మెటబాలిజం తక్కువ ఉందని అర్థం.  జీవక్రియ  ఆహారాన్ని శక్తిగా మార్చే ఒక రసాయన ప్రక్రియ. ఇది శరీరంలో కేలరీలను బర్నింగ్  చేసే రేటును కూడా ప్రభావితం చేస్తుంది. తక్కువ జీవక్రియ ఉంటే శరీరంలో కేలరీల బర్న్ కూడా తగ్గిపోతుంది, ఇది బరువుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. జీవక్రియను ఎలా పెంచవచ్చో.. ఇది బరువు తగ్గించడంలో  ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుంటే.. బరువుపై జీవక్రియ ప్రభావం.. జీవక్రియ రేటు సాధారణం కంటే తక్కువగా ఉన్నప్పుడు, కేలరీలు బర్న్ అయ్యే ప్రక్రియ కూడా మందగిస్తుంది, అంటే శరీరంలో కొవ్వు పరిమాణం పెరిగిపోతుంది.  అదే జీవక్రియ వేగంగా ఉంటే ఎక్కువ కేలరీలు  బర్న్ చేయగలుగుతారు.  ఎక్కువగా తింటున్నప్పటికీ, అది శక్తి రూపంలో సరిగ్గా ఉపయోగించబడుతుంది.  శరీరంలో కొవ్వు పరిమాణం పెరగదు. అందుకే ప్రతి ఒక్కరూ జీవక్రియను ఆరోగ్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జీవక్రియ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎలాంటి ఏమి చెయ్యాలో తెలుసుకుంటే.. ఎక్కువ నీరు త్రాగాలి.. రోజంతా ఎక్కువ నీరు త్రాగే వ్యక్తులు బరువును తగ్గడంలో, బరువును నియంత్రించడంలో చక్కని  ప్రయోజనాలు పొందుతారు. నీరు  జీవక్రియను తాత్కాలికంగా వేగవంతం చేస్తుంది. 500 మి.లీ.ల నీటిని తాగడం వల్ల సాధారణం కంటే జీవక్రియ రేటు 30% వరకు పెరుగుతుంది.  బరువును తగ్గించుకోవాలనుకుంటే, ఎక్కువ నీరు త్రాగటం ప్రయోజనకరంగా ఉంటుంది.  వర్కవుట్‌ లు.. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) వర్కవుట్లు  జీవక్రియను పెంచడంలో,  బరువు తగ్గించడంలో  ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది జీవక్రియ రేటును పెంచడం ద్వారా  కొవ్వును బర్న్ చేయడంలో  సహాయపడుతుంది. ఇతర రకాల వ్యాయామాల కంటే జీవక్రియను పెంచడంలో,  బరువు తగ్గించడంలో ఈ వ్యాయామాలు ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటాయి.  చక్కని చిట్కా.. బరువు పెరగడానికి ప్రధాన కారణం ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం. మహిళలు, ఆఫీసుల్లో పనిచేసేవారు ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు. ఇది బరువు పెరగడంలో ప్రభావం చూపిస్తుంది. అందుకని వీలైనంత వరకు కూర్చోవడాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించండి. నడవడం, నిలబడటం వంటి పనుల్ ద్వారా శరీరంలో కొవ్వు పేరుకునే వ్యవస్థను బ్రేక్ చేయొచ్చు.  *నిశ్శబ్ద.

ప్రీక్లాంప్సియా.. గర్భవతులకు అతిపెద్ద గండం ఇంతకూ ఈ సమస్య ఏంటంటే? గర్భం  ప్రతి స్త్రీకి చాలా ప్రత్యేకమైన దశ. ఇదెంత ప్రత్యేకమో.. అంతే సవాలుగా ఉంటుంది కూడా. సాధారణ సమయాలలో కంటే గర్భవతులుగా ఉన్న సమయాల్లో స్త్రీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే గర్భవతుల ఆరోగ్యం పుట్టబోయే బిడ్డను కూడా ప్రభావితం చేస్తుంది. మహిళలు తినడం, త్రాగడం, యోగా, వ్యాయామం  తప్పకుండా చేయాలి.  చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో మధుమేహానికి గురవుతారు, దీనిని గర్భధారణ మధుమేహం అంటారు. అదేవిధంగా, కొన్ని పరిస్థితులు అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతాయి, దీనిని వైద్య భాషలో ప్రీక్లాంప్సియా అంటారు. ఈ సమస్య గురించి తెలుసుకుంటే..  ప్రీక్లాంప్సియా అంటే.. ప్రీక్లాంప్సియా అనేది గర్భం వచ్చిన 20వ వారం తర్వాత లేదా డెలివరీ తర్వాత ఎదురయ్యే  పరిస్థితి, దీనిని ప్రసవానంతర ప్రీక్లాంప్సియా అని కూడా పిలుస్తారు. అధిక రక్తపోటుతో పాటు, మూత్రంలో ప్రోటీన్ అధిక స్థాయిలు ఉండవచ్చు, ఇది మూత్రపిండాల నష్టం (ప్రోటీనురియా) , శరీరంలో అవయవ నష్టానికి దారితీస్తుంది. ప్రీక్లాంప్సియా ఎక్లాంప్సియా ప్రమాదాన్ని కూడా కలిగి ఉంటుంది, ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలను కలిగించే ప్రమాదకర పరిస్థితి, అరుదైన సందర్భాల్లో మరణానికి కూడా దారితీస్తుంది.  ఈ సమస్య గురించి తెలుసుకోవడం, చికిత్స పొందడం ద్వారా తల్లి,  బిడ్డ ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకోవచ్చు. లక్షణాలను ఎలా గుర్తించాలి? ప్రీఎక్లాంప్సియా ప్రాథమికంగా అధిక రక్తపోటు, ప్రోటీన్యూరియా లేదా మూత్రపిండాలు, ఇతర అవయవాలకు హాని కలిగించవచ్చు. గర్భధారణ పరీక్షల సమయంలో ప్రీక్లాంప్సియా లక్షణాలు తరచుగా స్పష్టంగా కనిపిస్తాయి, అయితే కొన్ని సాధారణ సమస్యల ఆధారంగా కూడా సమస్యను గుర్తించవచ్చు.  మూత్రంలో అధిక ప్రోటీన్ లేదా మూత్రపిండాల సమస్యల ఇతర సంకేతాలు. రక్తంలో ప్లేట్‌లెట్ స్థాయిలు తగ్గడం (థ్రోంబోసైటోపెనియా). కాలేయ సమస్యలను సూచించే కాలేయ ఎంజైమ్‌ల పెరుగుదల. తీవ్రమైన తలనొప్పి - దృష్టిలో మార్పులు, అస్పష్టమైన దృష్టి లేదా వెలుగు భరించలేకపోవడం. ఊపిరితిత్తులలో ద్రవం కారణంగా శ్వాస ఆడకపోవడం. పొట్ట పైభాగంలో నొప్పి, సాధారణంగా కుడి వైపున ఉన్న పక్కటెముకల క్రింద. ఈ సమస్య ఎందుకు వస్తుంది? ప్రీక్లాంప్సియా అనేక కారణాల వల్ల వస్తుంది. గర్భధారణ సమయంలో పిండాన్ని పోషించే అవయవమైన ప్లాసెంటాలో ఇది ప్రారంభమవుతుంది. గర్భధారణ ప్రారంభంలో, కొత్త రక్త నాళాలు అభివృద్ధి చెందుతాయి. మావికి ఆక్సిజన్, పోషకాలను సరఫరా చేయడంలో సహాయపడతాయి.  ప్రీక్లాంప్సియా ఉన్న స్త్రీలలో, ఈ రక్త నాళాలు అభివృద్ధి చెందవు లేదా సరిగా పనిచేయవు. గర్భిణీ స్త్రీ రక్తపోటులో అసమానతలు మావి ద్వారా రక్త ప్రసరణను తగ్గించడం లేదా ప్రభావితం చేస్తాయి. ఇది శిశువు ఆరోగ్యానికి మంచిది కాదు. దీర్ఘకాలిక అధిక రక్తపోటు, గర్భధారణకు ముందు మధుమేహంతో సమస్యలు, మూత్రపిండాల వ్యాధి లేదా స్వయం ప్రతిరక్షక రుగ్మతలు ఈ సమస్యలను కలిగిస్తాయి. శిశువు ఆరోగ్యంపై ప్రభావాలు, నివారణ పద్ధతులు ప్రీక్లాంప్సియా మాయకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనులను ప్రభావితం చేస్తుంది కాబట్టి, పిండానికి తగినంత రక్తం లభించకపోతే, అది అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. అనేక వ్యాధుల ప్రమాదానికి గురవుతుంది. అకాల ప్రసవానికి కారణమవుతుంది.  ఈ సమస్యను నివారించడానికి, మీరు గర్భిణీల జీవనశైలి, ఆహారాన్ని సరిగ్గా తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ రెండు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, చాలా వరకు ప్రమాదాలను తగ్గించవచ్చు.                                        ◆నిశ్శబ్ద.

మహిళలు రోజూ ఇవి ఫాలో అయితే అద్భుతమైన ఫిట్నెస్ సొంతమవుతుంది! ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుందని అంటారు. కానీ దురదృష్టవశాత్తు మహిళలే ఇంట్లో అందరికంటే పేలవమైన ఆరోగ్యాన్ని కలిగున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఉరుకులు పరుగుల నీద సాగిపోతుంది సగటు మహిళ జీవితం. పిల్లలు, భర్త, అత్తమామలు వీరికి కావల్సినవి సమకూర్చి పెట్టడంలో సగటు మహిళ తనని తాను పట్టించుకోదు.  మరీ ముఖ్యంగా ఇప్పటి కాలంలో మహిళలు చాలా వరకు ఉద్యోగాలు చేసేవారే. ఇంటి పనులకు తోడు ఉద్యోగాలు మహిళలను తొందరగా అలసిపోయేలా చేస్తాయి. అందుకే మహిళలు ఆరోగ్యపరంగా దృఢంగా ఉండటం చాలా ముఖ్యం. రోజంతా పనిచేస్తూనే ఉన్నాం కదా ఇదే పెద్ద వ్యాయామం అనుకునేవారు తమ ఆలోచనలను మార్చుకోవాలి. రోజంతా చేసే పనులలో శరీరంలో శక్తి మొత్తం తగ్గిపోతే దాన్ని తిరిగి సంపాదించుకోవడం ప్రతి ఒక్కరికీ ముఖ్యం. కేవలం ఆహారం ద్వారా లభించేది శక్తి అనిపించుకోదు.  దీనికోసం శరీరానికి శక్తి కూడదీసుకునే వ్యాయామాలు, యోగా అవసరం. ఈ కింది వాటిని రోజులో భాగం చేసుకుంటే శారీరకంగా ఫిట్ గా ఉండొచ్చు. యోగ భారతీయులకు అందిన గొప్ప ఐశ్వర్యం అని చెప్పవచ్చు. యోగా సాధన కోసం కనీసం 30-45 నిమిషాలు,  వారానికి కనీసం 3 సార్లు కేటాయించడం ద్వారా అద్భుతం జరుగుతుంది. ఉదయాన్నే చేసే యోగ చాలా అనువైనది. యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన అభ్యాసాలతో రోజును ప్రారంభించడం ద్వారా మిగిలిన రోజంతా ఉల్లాసంగా గడిచిపోతుంది. శక్తి తిరిగి పుంజుకుంటుంది.   ఇందుకోసం సూర్య నమస్కారాలు బెస్ట్ ఆప్షన్. సూర్య నమస్కారంలో మొత్తం 8 ఆసనాలు ఉంటాయి. కుడి, ఎడమకు వైపులు కలిపి మొత్తం  12 దశలతో ఇది ఉంటుంది. . సూర్య నమస్కారాన్ని ప్రారంభించినప్పుడు, కుడి వైపు నుండి ప్రారంభించాలి, ఎందుకంటే సూర్యుని శక్తి ఈ వైపు ద్వారా ప్రతీకాత్మకంగా సూచించబడుతుంది, అయితే చంద్రుడు ఎడమ వైపున ప్రాతినిధ్యం వహిస్తాడు. రెండు వైపులా కవర్ చేసినప్పుడు ఒక చక్రం పూర్తవుతుంది. ఇది 24 గణనలతో తయారు చేయబడి ఉంటుంది.  సూర్య నమస్కారంలో ఇమిడిపోయిన ఆసనాలు.. ప్రాణం ఆసనం  హస్త ఉతానాసన  పాదహస్తాసనం  అశ్వ సంచలనాసన  సంతోలనాసనం  అష్టాంగ నమస్కార ఆసనం  భుజంగాసనం అధో ముఖ స్వనాసన  అశ్వ సంచలనాసన  పాదహస్తాసనం  హస్త ఉతానాసనం ప్రాణం ఆసనం  ఇవన్నీ వేస్తే ఒక చక్రం పూర్తవుతుంది. ఇలాంటివి 11 చక్రాలు ప్రతిరోజూ చేస్తుంటే శరీరం చాలా దృడం అవుతుంది. ఇవి మాత్రమే కాకుండా విశ్రాంతి స్థితిలో ప్రాణాయామం, కపాల బాతి వంటివి రోజులో కొన్ని నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయడం వల్ల శరీరంలో జరిగే అద్భుతం చూసి ఎవరికి వారు ఆశ్చర్యపోవాల్సిందే..                                     ◆నిశ్శబ్ద.

మహిళలు వర్కౌట్స్ చేయడం మంచిదే కానీ.. ఈ పొరపాట్లు మాత్రం చేయకండి! మహిళలు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలని, కేవలం ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే అది శరీరాన్ని దృఢంగా ఉంచదని ఈ మధ్య కాలంలో తెలుసుకుంటున్నారు. ఇందుకోసం చాలామంది మహిళలు వర్కౌట్స్ చేస్తుంటారు. ఇలా వర్కౌట్స్ చేయడం మంచిదే.. కొందరు జిమ్ లలో శిక్షకుల సమక్షంలో వర్కౌట్స్ చేస్తే అధిక శాతం మంది ఆన్లైల్ లో వివిధ ఆసనాలు, ఎక్సర్సైజులు చూసి వాటిని ఫాలో అవుతుంటారు. అయితే అవహాహన లేకుండా వీటిని ఫాలో అవ్వడం చాలా తప్పు. దీనివల్ల శరీరం ఫిట్ గా మారడం కథ దేవుడెరుగు, ఉన్న ఫిట్నెస్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంతకీ వర్కౌట్స్ విషయంలో అందరూ తెలియకుండానే చేస్తున్న పొరపాట్లు ఏమిటో తెలుసుకుంటే.. బరువు తగ్గాలనే ఆలోచనతో చాలా మంది ఎక్కడైనా ఎవరైనా ఒక ఆసనం లేదా వ్యాయామం గురించి ప్రస్తావిస్తే దాన్ని చాలా భీభత్సంగా ఫాలో అవుతారు. అందుకే దేన్నైనా మొదట తేలికగా మొదలుపెట్టడం ఉత్తమం. వర్కౌట్లు చేయడానికి ముందు వార్మప్ ఫాలో కావాలి. దీనివల్ల శరీరంలో కండరాలు, వివిధ అవయవాలు వ్యాయామానికి తగిన విధంగా సిద్దమవుతాయి. వార్మప్ వల్ల శరీరం సాగదీయబడుతుంది. ఇది లేకుండా వ్యాయామం చేస్తే శరీరంలో కండరాలు, వివిధ భాగలు ఎక్కడివక్కడ పట్టుకుపోతాయి. ముఖ్యంగా కాళ్ల కండరాలు, నడుము, పిక్కలు, తొడలు, భుజాలు వంటివి  పట్టుకుపోతాయి. వర్కౌట్స్ చేసి శరీరాన్ని మార్చుకోవాలని అనుకునేవారు నెలల తరబడి వ్యాయామం ఫాలో అవ్వాలి . అన్నిరోజులూ ఒకే రకమైన వ్యాయామం పాలో అవ్వడం  చాలా బోరింగ్ గా ఉంటుంది. అందుకని విభిన్న రకాల వ్యాయామాలను ఎంచుకోవాలి. వీటిని మార్చి మార్చి చేస్తుండాలి. మరీ ముఖ్యంగా వ్యాయామాలు ప్రతిరోజు ఒకే సమయానికి పాలో కావడం మంచిది. దీనివల్ల శరీరం వ్యాయామానికి తగిన విధంగా యాక్టీవ్ అవుతుంది. శరీరంలో మార్పు ఒక క్రమపద్దతిలో సాగుతుంది. బరువు తగ్గడానికో, ఫిట్నెస్ గా ఉండటానికో వ్యాయామం ఫాలో అవుతుంటే అది శరీరం మీద గణనీయంగా ప్రభావం చూపిస్తుంది, వ్యాయామం చేసేటప్పుడు ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గడానికి డైటింగ్ ఫాలో అవుతూ, వ్యాయామం కూడా చేయడం మంచిది కాదు. దీని వల్ల శరీరం దారుణంగా దెబ్బ తింటుంది. కాబట్టి ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి. శరీరంలో కేలరీలు బర్న్ చేయడానికి వ్యాయామాలను కూడా ఫాలో అవ్వాలి వ్యాయామం తరువాత అందరూ ఇక పనులలో మునిహిపోవడం చేస్తుంటారు. కానీ వ్యాయామానికి ముందు శరీరాన్ని ఎలాగైతే వార్మప్ చేశారో, అలాగే శరీరాన్ని కూల్ డౌన్ కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల వ్యాయామం వల్ల ఉత్తేజితమైన కండరాలు, శరీర అవయవాలు మెల్లిగా సాధారణ స్థితికి వస్తాయి. మహిళలు తెలిసీ తెలియక ఈ పొరపాట్లు అన్నీ చేస్తుంటారు. వీటిని సవరించుకుంటేనే శరీరం ఫిట్నెస్ గా మారుతుంది.                                                    *నిశ్శబ్ద.

మహిళల్లో మైగ్రేన్ సమస్యకు మూడు సింపుల్ ఆసనాలు.. మ్యాజిక్ చేస్తాయివి.. అసలు ఏ జబ్బు లేదు అనే మనుషులు ఈ కాలంలో లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మహిళల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య మైగ్రేన్.  తలపై ఎవరో ఒకవైపు సుత్తితో మోదుతున్నట్టు, వికారంగానూ, అసహనాన్ని అనుభవిస్తున్న మహిళల శాతం ఎక్కువగానే ఉంది.  మైగ్రేన్ ఉన్నవారు లైటింగ్ చూసినా, శబ్దాలు విన్నా నరకం అనుభవించినట్టే ఉంటుంది. అయితే మూడు మోగాసనాలు వేయడం ద్వారా మైగ్రేన్ తలనొప్పి ఉపశమనం పొందవచ్చు. అసలు మైగ్రేన్ సమస్య ఎందుకు వస్తుంది? దీన్ని ఎలా నయం చేయాలి? మైగ్రేన్ అనేది నాడీ సంబంధిత రుగ్మత, ఇది తీవ్రమైన తలనొప్పి . దీని వల్ల కొన్నిసార్లు వికారం, వాంతులు ఉంటాయి. కానీ  ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా దీనిని నయం చేయవచ్చు. యోగా వల్ల  శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం అవుతుంది.  కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఈ  కారణంగా మైగ్రేన్ లక్షణాలు మెల్లిగా తగ్గడం ప్రారంభిస్తాయి. అధోముఖ స్వానాసనం.. ఈ ఆసనం వేయడానికి మొదట బోర్లా పడుకోవాలి.  చేతులను భుజాల క్రింద ఉంచాలి. ఇప్పుడు  చేతులను కొద్దిగా ముందుకు తీసుకెళ్లండి. తర్వాత కాలి వేళ్లపై బరువు తీసుకొచ్చి, శ్వాస వదులుతూ తుంటిని పైకి లేపాలి. మోకాళ్లను నిటారుగా ఉంచి తలను చేతుల మధ్య ఉంచాలి. ఇప్పుడు నడుము నిటారుగా ఉంచి, నెమ్మదిగా  చీలమండలతో నేలను తాకాలి. మార్జాలాసనం.. ఈ యోగా ఆసనం చేయడానికి ,  మోకాళ్ల మీద కూర్చోవాలి. మీ చేతులను  ముందుకు చాచి వెన్నెముకను సమాంతరంగా ఉంచాలి.  శ్వాసను వదులుతున్నప్పుడు ఛాతీని, కడుపును లోపలికి తీసుకుంటూ వెన్నెముకను వంచాలి. ఆ తరువాత మళ్ళీ సాధారణ శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజీషన్ కు రావాలి. ఇది సాధారణమైన తర్వాత మళ్లీ అదే విధానాన్ని రిపీట్  చేయాలి. పద్మాసనం.. పద్మాసనం చిన్నప్పటి నుండి అందరికీ అనుభవంలో ఉన్నదే. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా ఉద్యోగాల నుండి భోజనం చేయడం వరకు అన్ని పనులు  కుర్చీలలో కూర్చుని చేసుకుంటున్నాం. కానీ పద్మాసనం ఇప్పుడు మైగ్రేన్ సు చక్కని మందుగా మారింది. కాళ్ళను మడిచి అటూ ఇటూ చేసుకుని కూర్చోవాలి. ఇప్పుడు కుడిపాదాన్ని  బయటికి తీసి ఎడమ తొడ మీద ఉంచాలి. తరువాత ఎడమ పాదాన్ని బయటకు తీసి కుడి తొడ మీద ఉంచాలి. ఈ స్థితిలో కొద్దిసేపు సాధారణంగా శ్వాస తీసుకోండి. ఈ  పొజిషన్ ను కాళ్లు అటూ ఇటూ మార్చి మళ్లీ వేరుగా చేయాలి. ఈ మూడు ఆసనాలు రోజూ వేస్తుంటే మహిళల్లో మైగ్రేన్ సమస్య చాలా వరకు కంట్రోల్ అవుతుంది.                                                         *నిశ్సబ్ద

బరువు తగ్గడం కోసం పండ్ల రసాలు తాగేవారు ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే..! అధికబరువు  ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఈ సమస్య ఎవ్వరినీ వదలడం లేదు. బరువు తగ్గడం కోసం ఒక్కొక్కరు ఒక్కో ప్రయోగం చేస్తుంటారు. కొందరు జిమ్ చేస్తారు, కొందరు ఆహారం దగ్గర జాగ్రత్తలు  పాటిస్తారు. మరికొందరు బరువు తగ్గించే డ్రింక్స్ తాగుతుంటారు. మొత్తానికి బరువు  తగ్గడం కోసం ఎక్కడ ఏ చిట్కాలు కనిపిస్తే అవి ఫాలో అయిపోయేవారున్నారు. అయితే మహిళలలో చాలామంది బరువు తగ్గడం కోసం ఫాలో అయ్యే అలవాటు పండ్లరసాలు తీసుకోవడం. పండ్లరసాలు బాగా తీసుకుంటే బరువు తగ్గడం చాలా ఈజీ అని అనుకుంటారు. ఈ కారణంగానే ఆహారాన్ని నియంత్రించి పండ్ల రసాలు ఎక్కువగా తాగుతుంటారు. అయినా సరే బరువు తగ్గడం జరగదు. ఇంత ఆరోగ్యకరమైన అలవాటు ఫాలో అయినా అసలెందుకు బరువు తగ్గడం లేదని తల పట్టుకుంటూ ఉంటారు. అయితే బరువు తగ్గడానికి పండ్లరసాలు తాగడం అనేది చాలా ప్రమాదకమైన చర్య అనే షాకింగ్ నిజం బయటపడింది. బరువు తగ్గడానికి చాలామంది పండ్ల రసాలు తీసుకుంటారు. ఇలా పండ్ల రసాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరిగే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా లిక్విడ్ డైట్ ఫాలో అయ్యేవారు చాలా తొందరగా ఊబకాయానికి గురవుతారు. అంటే పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం ఊబకాయానికి దారితీస్తుంది. పండ్ల రసాలలో ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెరలు ఉంటాయి. బరువు పెరగడంలో కారణమవుతాయి. అప్పుడప్పుడు పండ్లరసాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే.. కనీసం రోజుకు ఒకసారి అయినా పండ్లరసం తీసుకోవడం  ఫర్వాలేదు. కానీ ఆహారాన్ని స్కిప్ చేసి మరీ పండ్లరసం తీసుకోవడం శరీరంలో చక్కెరలు ఎక్కువగా చేరడానికి కారణం అవుతుంది. ఇలా చక్కెరలు ఎక్కువగా చేరితే శరీరంలో కేలరీలు కూడా పెరిగిపోతాయి. పండ్లరసాలు ఎక్కువగా తాగితే  పొట్ట చుట్టూ కొవ్వు పెరిగి చాలా సులువుగా పొట్ట పడుతుంది. సాధారణంగా పండ్లలో ఫైబర్ ఉంటుంది. నేరుగా పండ్లను తింటే పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణాశయానికి మంచిది, అదే విధంగా ఫైబర్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఆకలి నియంత్రణలో ఉంటుంది. అదే విధంగా  బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కానీ ఈ ఫైబర్ తప్పించి కేవలం పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటే శరీరంలోకి కేవలం చక్కెరలు మాత్రమే ఎక్కవగా చేరతాయి. ఇది బరువు పెంచుతుంది.   పండ్ల రసాలు తాగడాన్ని గమనిస్తే సాధారణంగా ఒక్కపండు తిన్నదానికంటే  ఒక గ్లాసు పండ్ల రసంకోసం ఉపయోగించే పండ్లు ఎక్కువ. ఒక గ్లాసు పండ్ల రసం కోసం కనీసం మూడు, నాలుగు పండ్లను వినియోగించాల్సి ఉంటుంది. ఫైబర్ ఏమీ లేకుండా కేవలం పండ్ల రసంతీసుకుంటే చక్కెరలు భారీగానే ఉంటాయి. ఇకపోతే కొందరు ఒకటి లేదా రెండు పండ్లనుండి రసం తీసి అందులో పంచదార, తేనె వంటివి జోడిస్తారు. ఇది కూడా శరీరంలో చక్కెరలు, కేలరీలు చేరడానికి కారణం అవుతుంది. కాబట్టి పండ్ల రసం ఎటు చూసినా బరువు పెరగడానికే తప్ప, బరువు తగ్గడానికి సహాయపడదు. పండ్ల ద్వారా బరువు తగ్గాలని అనుకునేవారు నేరుగా పండ్లను తినడమే మంచిది. దీనివల్ల ఫైబర్ బాగా అందుతుంది. విటమిన్లు కూడా లభిస్తాయి. అదే విధంగా పండ్లరసంతో బరువు తగ్గాలని అనుకుంటే ముఖ్యంగా ప్రోటీన్లు శరీరానికి అందవు. ఎందుకంటే పండ్ల రసాలలో ప్రోటీన్లు ఏమీ ఉండవు. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు పండ్లను తీసుకోవచ్చు. అలాగే ప్రోటీన్లు బాగా ఉన్న ఆహారాన్ని తీసుకోవచ్చు. పండ్ల రసం మాత్రం  అవాయిడ్ చెయ్యాలి.                                 *నిశ్శబ్ద  

ఈ డ్రింక్స్ తాగుతే బరువు తగ్గుతారు.! మారిన జీవనశైలి కారణంగా ఊబకాయం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇంటి ఫుడ్ కంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు ప్రజల జీవనాన్ని ప్రమాదంలోకి నెట్టిస్తోంది. బిజీ లైఫ్ తో వ్యాయామానికి సమయం దొరకడం లేదు. అలాంటి పరిస్థితుల్లో చెడు ఆహారపు అలవాట్లను వదిలించుకోవడం..మన ఆహారంలో పోషకాహారాన్ని చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజు కొన్ని డ్రింక్స్ గురించి తెలసుకుందాం. అవి మీ శరీరంలోని కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. అయితే ఈ డ్రింక్స్ మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. నిమ్మరసం: నిమ్మకాయ నీళ్లను ఇంట్లో తయారు చేసుకోవడం ఎంత సింపుల్‌గా, సులభంగా ఉంటుందో తెలుసా? దీన్ని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా అంతే గొప్పవి. మీరు చక్కెర, ఉప్పు లేకుండా కేవలం నిమ్మకాయ పిండిన నీటిని తాగుతే.. కొవ్వు బర్నింగ్ ప్రారంభమవుతుంది. లెమన్ వాటర్ క్యాలరీ ఫ్రీ డ్రింక్. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. జీవక్రియను పెంచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. బ్లాక్ కాఫీ: బ్లాక్ కాఫీలో తక్కువ కేలరీలు ఉంటాయి. కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి.మీరు బరువు తగ్గాలనుకుంటే..బ్లాక్ కాఫీని తాగవచ్చు. బ్లాక్ కాఫీ తాగడం వల్ల జీవక్రియలు పెరిగి శరీరానికి శక్తిని అందిస్తుంది. మానసిక చురుకుదనాన్ని పెంచడంలో కెఫిన్ వినియోగం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రీన్ టీ: గ్రీన్ టీలో కూడా తక్కువ కేలరీలు ఉంటాయి.ఇది బరువు తగ్గడంలో.. బొడ్డు కొవ్వును తగ్గించడంలో వేగంగా ప్రభావాన్ని చూపుతుంది. గ్రీన్ టీ తాగుతే శరీరం కూడా హైడ్రేట్ గా ఉంటుంది. నెల రోజుల పాటు రోజూ ఉదయం, సాయంత్రం గ్రీన్ టీ తాగితే బరువులో మార్పు కనిపిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్: యాపిల్ సైడర్ వెనిగర్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్ని నిత్యం తీసుకుంటే బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది.  యాపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా యాపిల్ వెనిగర్ వేసి కలపాలి.  నీటిని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగవచ్చు. అధికంగా కాకుండా మోతాదుగా తాగాలని గుర్తుంచుకోండి. 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ పండ్లు తినాల్సిందే..! కాస్త బొద్దుగా ఉన్నా సరే చాలామంది అమ్మాయిలు తెగ ఫీల్ అయిపోతారు.  సన్నగా నాజుగ్గా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం అనేమాట అటుంచితే మంచి బట్టలు వేసుకోవచ్చు, అందంగా కనిపించవచ్చు అనేది వారి ఇన్నర్ ఫీలింగ్. అయితే బరువు పెరిగినంత ఈజీగా బరువు తగ్గడం జరగదు. చాలామంది బరువు కారణంగా డిప్రెషన్ లోకి కూడా వెళుతుంటారు. అయితే  ప్రతిరోజూ ఆహారంలో పండ్లు చేర్చుకోవడం వల్ల బరువు సులువుగానే తగ్గవచ్చు. బరువు తగ్గడానికి ఉపయోగపడే పండ్లు ఏంటో తెలుసుకుంటే.. పుచ్చకాయ.. పుచ్చకాయ వేసవికి ఎంతోమంది ఫెవరేట్ పండు. అదికశాతం నీటితో నిండిన ఈ పండు తీసుకుంటే బరువు ఈజీగా తగ్గవచ్చు. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఈ పండు తింటే కడుపు నిండిన ఫీల్ ఉంటుంది. బీపి, కడుపు సంబంధ సమస్యలు,  అధిక బరువు, కాలేయం సమస్యలు అన్నీ తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. బరువు తగ్గే ప్రయత్నాలలో ఉన్నప్పుడు పుచ్చకాయ కనబడితే దాన్ని అస్సలు వదలకండి. అరటి పండ్లు.. అరటిపండ్లు అందరికీ బెస్ట్ ఫ్రెండ్లు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. అరటిపండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిలో పొటాషియం, విటమిన్-బి6 సమృద్దిగా ఉంటాయి. కేలరీలు కూడా తక్కువే. పైబర్ ఉండటం మూలాన ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ కలిగిస్తుంది. నూనెలు, అధిక చక్కెర, అధిక కార్భోహైడ్రేట్లు ఉన్న ఆహారానికి బదులు రోజులో రెండు అరటి పండ్లు తీసుకుంటూ ఉంటే బరువు తగ్గడం సులువు అవుతుంది. యాపిల్స్.. యాపిల్స్ లో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటాయి. పైపెచ్చు యాపిల్ లో పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. ఒక యాపిల్ తినగానే ఇక కడుపు నిండిపోయిందని అంటుంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి కూడా ఉంటాయి. ఈ  పండ్లలో ఉండే ఫాలీపెనాల్స్ బరువు తగ్గిస్తాయి. జామ.. జామ పండ్లను మధుమేహరోగులకు ది బెస్ట్ అని చెబుతారు. అయితే మధుమేహం ఉన్నవారికే కాదు.. బరువు తగ్గాలని అనుకునే వారికి కూడా ఇది గొప్ప ఫలితాలు చేకూరుస్తుంది. జామపండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది. విటమిన్స్, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ.. దానిమ్మ పండు కూడా బరువు తగ్గించడంలో aచాలా సహాయపడుతుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి. శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ దానిమ్మను తీసుకుంటూ ఉంటే ఈజీగా బరువు తగ్గుతారు.                                           *నిశ్శబ్ద.

ఈ నాలుగు తింటే యవ్వనంగా ఉండటమే కాదు తెల్లజుట్టు నల్లగా మారిపోద్ది!   తెల్లజుట్టుతో కనిపించాలని ఎవరూ కోరుకోరు. కానీ వద్దంటే రాకుండా అది ఆగనే ఆగదు. కొందరిలో చిన్నవయసులోనూ, మరికొందరిలో ఒక వయసు దాటిన తరువాత తెల్లజుట్టు వచ్చే తీరుతుంది. పెద్ద వయసులో తెల్లజుట్టు వస్తే కాసింత కాంప్రమైజ్ అయ్యి దానికి హెన్నానో, హెయిర్ డై వంటివి పెట్టి కవర్ చేస్తారు. కానీ చిన్నవయసులోనే తెల్లజుట్టు వస్తేమాతం వయసు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తారు. రసాయనాలతో కూడిన హెయిర్ డైలు పెడితే మెదడు ఆరోగ్యానికే ప్రమాదం. అందుకే వివిధ రకాల షాంపూలు, హెయిర్ ఆయిల్స్ ప్రయత్నిస్తుంటారు. కానీ తెల్లజుట్టుకు నివారణకు చెయ్యాల్సింది నూనెలు పూయడం కాదు. లోపలినుండి జుట్టు నల్లబడేలా చెయ్యాలి. ఆ పనిని ఈ కింద చెప్పుకోబోయే నాలుగు ఆహారాలు సమర్థవంతంగా చేస్తాయి. అవేంటో తెలుసుకుని పాటించడమే తరువాయి.. ఉసిరికాయలు.. ఉసిరికాయలు  నవంబర్, డిసెంబర్ నెలల్లో అందుబాటులోకి వస్తాయి. ఫిబ్రవరి, మార్చి నెలల వరకు దొరుకుతాయి. పచ్చి ఉసిరికాయలను మిక్సీ వేసి జ్యూస్ చేసుకుని దాన్ని కాసిన్ని నీళ్లలో కలుపుకుని తాగాలి.  లేదంటే పచ్చి కాయలు అయినా తినచ్చు. ఉసిరికాయను ఎండబెట్టి పొడిచేసుకుని ఏడాది పొడవునా ఉపయోగించుకోవచ్చు. రోజూ ఉసిరికాయను తీసుకుంటూ ఉంటే తొందరలోనే తెల్లజుట్టు తగ్గిపోతుంది. నల్ల ద్రాక్ష.. ద్రాక్షలో రెండు రకాలున్నాయి. వీటిలో నల్ల ద్రాక్ష తెల్లజుట్టుకు భలే మ్యాజిక్ చేస్తుంది. తాజా నల్ల ద్రాక్ష లేదా.. ఎండిన నల్లద్రాక్షను ప్రతిరోజూ తింటూ ఉంటే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. ఎండిన నల్ల ద్రాక్షను రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తినవచ్చు కూడా. నల్లనువ్వులు.. నల్లనువ్వులు ఆడవాళ్లకు చాలా మంచిది. అమ్మాయిలు రజస్వల అయినప్పుడు. మహిళలు డెలివరీ అయిన తరువాత, ఆపరేషన్లు అయినవాళ్లు నల్లనువ్వులు తింటే నడుము బలపడుతుందని, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతారు. ఇందులో కాల్షియం, ఐరన్ సమృద్దిగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య కూడా అస్సలుండదు. కరివేపాకు.. కరివేపాకును నూనె తయారీలో ఎక్కువగా వాడతారు. కానీ కరివేపాకును ప్రతిరోజూ తింటూ ఉంటే జుట్టు భలే నల్లగా మారుతుంది. ఇందులో విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-సి, విటమిన్-బి12 మొదలైనవి మెండుగా ఉంటాయి. కరివేపాకుతో వివిధ రకాల వంటలు చేసుకుని తింటే రుచికి రుచి, తెల్లజుట్టు మటాష్.                                            *నిశ్శబ్ద.

 ఈ పండ్లు తిని..నీళ్లు తాగకూడదు ఎందుకో తెలుసా..   మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు నీరు కూడా చాలా ముఖ్యం. తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజూ పండ్లు తినే అలవాటు చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అయితే కొన్ని పండ్లు తినేప్పుడు నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ పండ్లు తింటూ  నీరు త్రాగడం ఆరోగ్యానికి హానికరం. అంటే అజీర్ణం, అసౌకర్యాన్ని ప్రేరేపిస్తాయి. అయితే ఎలాంటి పండ్లు తినేప్పుడు నీళ్లు తాగకూడదు. తాగితే ఏమౌతుంది. ఇఫ్పుడు తెలుసుకుందాం. ఆమ్ల ఫలాలు: నారింజ, ద్రాక్షపండ్లు, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు చాలా నీటిని కలిగి ఉంటాయి. ఈ పండ్లను ఎక్కువ నీటితో తీసుకోవడం వల్ల కడుపు నొప్పి లేదా నిండిన అనుభూతి కలుగుతుంది. వీటిని మితంగా తీసుకోవడం మంచిది. ఈ పండ్లను తిన్న తర్వాత నీరు త్రాగడానికి కాసేపు వేచి ఉండటం మంచిది. అరటిపండ్లు: అరటిపండ్లలో కరిగే ఫైబర్ ఉంటుంది. అరటిపండ్లు తిన్నప్పుడు నీళ్లు తాగడం వల్ల కడుపులోని గ్యాస్ట్రిక్ జ్యూస్‌లు పలచబడతాయి. ఇది అంతిమంగా జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. అందుకే అరటి పండు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. పెరుగు: పెరుగు అనేది ప్రోబయోటిక్స్ కలిగిన పాల ఉత్పత్తి. ఇది పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగు తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల ఈ ప్రోబయోటిక్స్ కడిగి వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. మీరు పెరుగుతో ఏదైనా తాగాలనుకుంటే, కొద్దిగా నీరు త్రాగాలి. అన్నం:  అన్నం తినే ముందు లేదా తర్వాత ఒక గ్లాసు నీరు త్రాగడం ఉత్తమం అయితే, అన్నం ఆధారిత ఆహారాలు తినేటప్పుడు ఎక్కువ నీరు త్రాగడం మానుకోండి. ఎక్కువ నీరు త్రాగడానికి ముందు అన్నం జీర్ణం కావడానికి కొంత సమయం ఇవ్వండి. మసాలా ఆహారాలు: మసాలా ఆహారాలు లేదా వేడి సాస్‌లు వంటి స్పైసీ ఫుడ్‌లు పెద్ద మొత్తంలో నీటితో కలిపి ఉన్నప్పుడు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కడుపులో మండే అనుభూతిని మరింత తీవ్రతరం చేస్తుంది. స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు నోరు చల్లబరచడానికి పాలు లేదా పెరుగు వంటి పాల ఉత్పత్తులు మంచి ఎంపికలు.

కొందరికి పొట్ట తగ్గడం పెద్ద సమస్యగా మారుతుంది. బెల్లీ ఫ్యాట్ అనేక కారణాల వల్ల కలుగుతుంది. ఈ సమస్యను ఒక్కసారిగా అదుపు చేయడం కష్టం. ఆహారాలలో కొన్ని మీరు బరువు తగ్గడానికి, బొడ్డు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.   మనం తీసుకునే అల్పాహారం కొవ్వును అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. బ్రేక్ ఫాస్టులో ఎలాంటి ఆహారం తీసుకుంటే పొట్ట తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అల్పాహారంలో ప్రోటీన్ ప్రాముఖ్యత: కేలరీలు, చక్కెర, శుద్ధి చేసిన పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు మీ ఆరోగ్యానికి హానికలిగిస్తాయి. తక్కువ కేలరీలు, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. అదనంగా, మీరు మీ భోజనం తినే విధానం కూడా చాలా ముఖ్యమైనది. మీ ఉదయం అల్పాహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూడాలని పోషకనిపుణులు చెబుతున్నారు. ఇది పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని అణచివేస్తుంది: ప్రోటీన్ ఆకలిని అణిచివేస్తుంది. తరచుగా తినాలనే కోరికను తగ్గిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండే భోజనం జీవక్రియను పెంచుతుంది. మీ కడుపును నిండుగా ఉంచుతుంది. ఇది పొట్టలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.  దీనికి విరుద్ధంగా, అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్న భోజనం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తుంది.  కొవ్వు నిల్వకు దారితీస్తుంది. కాబట్టి, మన అల్పాహారాన్ని "ప్రోటీన్"గా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రోటీన్ కంటెంట్‌ను పెంచే సాధారణ బ్రేక్‌ఫాస్ట్‌లు: పోహా: పోహాలో 7 నుండి 8 వేరుశెనగ లేదా బఠానీలను జోడించండి. ఉప్పిట్టు: ఈ ఆరోగ్యకరమైన వంటకంలో బీన్స్ , 7 నుండి 8 వేరుశెనగలను వేయండి. పరాఠాలు: పరాఠాలు చేయడానికి గోధుమ పిండి, చిక్‌పా పిండిని ఉపయోగించండి. సగ్గుబియ్యానికి చిక్‌పీస్, పనీర్ లేదా బఠానీలను జోడించండి. దోస/ఇడ్లీ: త్వరిత, రుచికరమైన ప్రోటీన్ బూస్ట్ కోసం మీ దోస లేదా ఇడ్లీని వేరుశెనగ చట్నీతో జత చేయండి. వేరుశెనగ, బఠానీలు, పనీర్, చిక్‌పీస్‌తో సహా ఈ పదార్ధాలలో ప్రతి ఒక్కటి శాఖాహార ప్రోటీన్ యొక్క మంచి మూలాలు. వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వేరుశెనగలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటిపండు: అరటిపండ్లలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కానీ కేలరీలు తక్కువగా ఉంటాయి. అరటిపండ్లు చక్కెరతో కూడిన అల్పాహార తృణధాన్యాలకు గొప్ప ప్రత్యామ్నాయం.  ఇవి ఉదయం మీ తీపి కోరికలను తీర్చగలవు. పండ్లు,  కూరగాయల నుండి ఫైబర్ తీసుకోవడం బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. అధికబరువు, బెల్లిఫ్యాట్ తో బాధపడుతున్నవారు ఉదయం అల్పాహారంలో పైన పేర్కొన్న ఆహారాలను చేర్చినట్లయితే..కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవచ్చు.  

ఈ సమయంలో పండ్లు తింటే సులభంగా బరువు తగ్గుతారు..!!     మన ఆహారం, జీవనశైలిలో పండ్ల వినియోగం చాలా అవసరం. కానీ పండ్లు సరైన మోతాదులో, సరైన సమయంలో తీసుకోవాలి. కానీ క్యాలరీలు, ఫైబర్, గ్లూకోజ్ అధికంగా ఉండే పండ్లు, తప్పుడు సమయంలో తప్పుడు కాంబినేషన్‌లో తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి బదులుగా మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రయోజనం ఉండదు.  కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. అయితే పండ్లు ఈ సమయంలో తింటే బరువు సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పండ్లను ఎంచుకోండి: పోషకాహార నిపుణులు బెర్రీలు, చెర్రీస్, యాపిల్స్, బేరి వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను ఎంచుకోవాలని సూచించారు. ఈ పండ్లు చక్కెరను రక్తప్రవాహంలోకి నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు పెరగడానికి దారితీసే స్పైక్‌లను నివారిస్తుంది. పండ్లను ప్రోటీన్‌తో జత చేయండి: మీ పండ్ల తీసుకోవడం మరింత సమతుల్యంగా, సంతృప్తికరంగా చేయడానికి, వాటిని ప్రోటీన్ తో తీసుకోండి. గ్రీక్ పెరుగు, కాటేజ్ చీజ్ లేదా కొన్ని డ్రై ఫ్రూట్స్ వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని పండ్లతో పాటు తినడం వల్ల ఆకలిని అరికట్టవచ్చు. మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలి లేకుండా కడుపు నిండుగా ఉంచుతుంది. ఖాళీ కడుపుతో పండ్లు తినకూడదు: పండ్లు పుష్టికరమైనవి అయినప్పటికీ, వాటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. దీనిని నివారించడానికి, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, తృణధాన్యాలు కలిగి ఉన్న సమతుల్య భోజనం లేదా చిరుతిండిలో భాగంగా పండ్లను తినమని పోషకాహార నిపుణుల సూచిస్తున్నారు. సమతుల్య ఆహారంలో పండ్లను చేర్చండి:  కేవలం చిరుతిండిగా పండ్లపై ఆధారపడకుండా, అదనపు పోషకాలు, ఫైబర్ కోసం వాటిని మీ భోజనంలో చేర్చుకోండి. సలాడ్‌లకు పండ్లను జోడించండి, వాటిని స్మూతీస్‌లో కలపండి లేదా తృణధాన్యాలు లేదా వోట్మీల్ కోసం వాటిని టాపింగ్స్‌గా ఉపయోగించండి. జ్యూస్‌లు తాగడం కంటే పండ్లను తినండి: పండ్ల రసాలు తాగేందుకు సౌకర్యవంతగా ఉన్నప్పటికీ..., అవి తరచుగా మొత్తం పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్‌ను కలిగి ఉండవు. చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉండవచ్చు. ఫైబర్ నుండి ప్రయోజనం పొందడానికి మొత్తం పండ్లను తినడం ఉత్తమం. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి, మార్కెట్‌లోని అన్ని కాలానుగుణ పండ్లలో అత్యంత పోషక ప్రయోజనాలను పొందండి.

మహిళల ఫిట్నెస్ మొత్తం పాడుచేసే ఒకే ఒక్క సమస్య ఇదే! ఆహారం అమృతం అనే మాట అందరికీ తెలిసిందే. మనం తినే ఆహారమే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే అతి అన్నది అన్ని విషయాలలో అనర్థాన్నే మిగులుస్తుంది. చాలామంది మహిళలు అతిగా తినే సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాగని తాము అతిగా తింటున్నాం అనే విషయం వారికి మింగుడు పడదు. ఎంత తిన్నా కడుపు నిండినట్టు అనిపించకపోవడం, తిన్న కొంతసేపటికే మళ్లీ ఆకలికావడం. వంటి పరిస్థితులు పదే పదే ఎదురవుతూ ఉంటాయి. దీనివల్ల అతిగా తినడం జరుగుతుంది. అతిగా తిని లావైపోయిన వారు బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. తిండి తగ్గించాలని అనుకుంటారు కానీ అది సాధ్యం కాదు. బరువు తగ్గడానికి వాకింగ్ చేయడం, వ్యాయామాలు చేయడం మొదలుపెడతారు. కానీ అది కూడా సత్పలితాలను ఇవ్వదు. ఇలా  భీభత్సంగా ఆకలి కావడానికి, అతిగా తినడానికి  కారణం డిప్రెషన్ ఈటింగ్ అనే సమస్య. డిప్రెషన్ ఈటింగ్ మూలాన మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయం మహిళలను కలవరపెడుతుంది. కానీ ఈ సమస్య ఎందుకొస్తుందో తెలుసుకుని అధిగమించడం వల్ల దీని కారణంగా ఎదురయ్యే ఇతర సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మహిళల్లో తినడం అనేది భావోద్వేగ విషయాలతో సంబంధం కలిగి ఉంటుందని చాలామంది చెబుతారు. అందుకే చాలామంది మహిళలు  కోపం, ఆవేశం, బాధ మొదలయిన పరిస్థితులలో ఉన్నప్పుడు సాధారణంగా తినేదానికన్నా ఎక్కువగా తింటుంటారు. ఇది నాణేనికి ఒక కోణం అయితే మరొక కోణంలో మహిళలు డిప్రెషన్ ఈటింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎంత తిన్నా సాటిసిఫాక్షన్ లేకపోవడం ఒకటైతే, భావోద్వేగాల కారణంగా తినడంలో తృప్తి లభించకపోవడం మరొకటి. ఇవి రెండూ ఒకదానికొకటి సంబంధమై ఉంటాయి. వీటిని సాటిసిపై చేసే ఉద్దేశంలో తినడమనే ప్రాసెస్ సాగుతూ ఉంటుంది. నిజానికి ఇలా జరగడానికి కారణం కార్టిసాల్ హార్మోన్.   శరీరంలో ధీర్ఘకాలిక ఒత్తిడి కొనసాగినప్పుడు ఈ కార్టిసాల్ విడుదల వేగం అవుతుంది. ఇది ముఖ్యంగా ఆకలిని పెంచుతుంది. ఎంత తిన్నా సాటిసిపై కాకపోవడానిక ఇదే కారణం. అధికశాతం మంది మహిళలు ఉబకాయం, అధికబరువు సమస్యకు  గురికావడానికి ఇదే ప్రధాన కారణం. చాలామంది ఆకలైన ప్రతిసారి తినడమనే పని చేసి తృప్తి పడుతూ ఉంటారు. మరికొందరు తమ ఆకలిని గమనించుకుని దాన్ని కంట్రోల్ చేయలేక ఆహారానికి లొంగిపోతుంటారు. కానీ ఎవరూ దీనికి మూలాన్ని గురించి ఆలోచించరు. మూలాన్ని పరిష్కరించుకోవాలని ప్రయత్నించరు.  అందుకే ఈ సమస్య కష్టమైనదిగానూ, అధిగమించలేనిది గానూ అనిపిస్తుంది. డిప్రెషన్ ఈటింగ్ అధిగమించాలంటే.. డిప్రెషన్ ఈటింగ్ కు ప్రధాన కారణం ఒత్తిడి. మానసిక ఒత్తిడి ద్వారా మొదలయ్యే ఈ సమస్య శారీరక సమస్యగా మారుతుంది. దీన్ని అధిగమించాలంటే మానసికంగానూ, శారీరంకగానూ నియంత్రణ సాధించడం చాలా  ముఖ్యం. తిండి మీద నియంత్రణ సాధించాలంటే ఆకలిపేరుతో ఎడా పెడా తినేయకుండా తినేముందు నిజంగానే ఆకలిగా ఉందా? లేక కేవలం మనసుకు అలా అనిపిస్తోందా? అనే విషయాన్ని ఆలోచించడం చాలా ముఖ్యం. దీని వల్ల మానసికంగా కాస్త నియంత్రణకు ఓ మార్గం దొరికినట్టవుతుంది.  ప్రతి రోజూ ఏ సమయంలో ఏ ఆహారం ఎంత మొత్తంలో తింటున్నారో ఒక చిన్న నోట్ లో రాసుకోవడం మంచిది. దీనివల్ల ఆహారం మీద అవగాహన కలుగుతుంది.  తినే ఆహారంలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్స్ మొదలయినవి లేకుండా జాగ్రత్త పడాలి. వాటిని అందుబాటులో ఉంచుకోకూడదు. ఆకలి వేసినప్పుడల్లా పచ్చిగా తినగలిగే కూరగాయలు, పండ్లు, ఫైబర్ అధికంగా ఉన్న  ఆహారాలు, కేలరీలు ఎక్కువలేకుండా ఉండే ఫుడ్స్ తినడం మంచిది. ఇవి చేస్తూ కార్టిసాల్ హార్మోన్ ను నియంత్రించడానికి ప్రయత్నించాలి. హార్మోన్లను నియంత్రించడం అనేది ఎప్పుడూ  మనిషి చేతుల్లో చాలావరకూ ఉంటుంది. ప్రతిరోజు ధ్యానం, వ్యాయామం, యోగా, ఉదయం , సాయంత్రం  చిన్నపాటి నడక  మొదలయినవి ఫాలో అయితే  క్రమంగా శరీరంలోని హార్మోన్లను నియంత్రణలోకి తీసుకురావచ్చు.  సాధారణ వైద్యుల నుండి ఆయుర్వేదం వరకు.. పోషకాహార నిపుణుల నుండి ఫిట్నెల్ ట్రైనర్ల వరకు  చాలామంది ఆహారనికి, మహిళలలో ఒత్తిడికి చాలా దగ్గర సంబంధముందని చెబుతున్నారు. మహిళలలో వివిధ దశలలో మారే హార్మోన్లు, ఆ సమయాల్లో మహిళల శరీరంలో కలిగే మార్పులు ఇందుకు ఉదాహరణ.                                                          *నిశ్శబ్ద.

1. ఆపిల్: రోజుకో ఆపిల్‌ పండు తింటే డాక్టరుకు దూరం అనేది నిజం. దీనిలో కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థాలు ఎక్కువే. చక్కెర శాతం తక్కువ. దీన్ని మధుమేహులు కూడా తినవచ్చు. దీనిలో శక్తినిచ్చే పదార్థమే కాకుండా దీనిలో పోషక విలువలు కూడా చాలా ఉన్నాయి. 2. అరటి: శక్తిని వెంటనే అందించే సామర్థ్యం దీని సొంతం. పొటాషియమ్‌, విటమిన్‌ సి, బి కాంప్లెక్స్‌ కూడా ఉన్నాయి. మలబద్ధకం ఉన్న వాళ్ళు రోజూ రాత్రి రెండు అరటిపళ్ళు తింటే విరేచనం సాఫీగా అవుతుంది. పిల్లలకు బాగా మెత్తగా పండిన పండు మేలు చేస్తుంది. త్వరగా అనారోగ్యం నుండి కోలుకుంటారు. 3. పైనాపిల్: ఎనర్జీని అందించడంలో మరో అద్భుతమైన పండు. అంతే కాదు శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ ను పుష్కలంగా అందిస్తుంది. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. 4. మామిడి: విటమిన్‌ ఎ, బిటాకెరోటిన్‌, బి కాంప్లెక్స్‌, విటమిన్‌ సి, ఐరన్‌, కాల్షియమ్‌, పొటాషియమ్‌, రోగనిరోధక శక్తి ఎక్కువ చేసే యాంటి ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. శక్తిని వెంటనే అందజేస్తుంది. దీనిలో పీచు (ఫైబర్‌) ఉండడం వల్ల, రక్త ప్రసరణకు, సాఫీగా విరేచనం కావడానికి తోడ్పడుతుంది. 5. బెర్రీస్: బెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దాంతో అవసరమైన క్యాలొరీలను పొందవచ్చు. ఒక కప్పు స్ట్రాబెర్రీ జ్యూస్ తాగడం వల్ల వెంటనే తాజా అనుభూతిని పొందవచ్చు. 6. ఆరెంజ్: వీటిలో విటమిన్‌ c, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీర సౌందర్యానికి కూడా చాలా మంచిది. పొటాషియమ్‌ ఎక్కువగా ఉండడం వల్ల అలసిపోయిన కండరాలకు, గుండెకు మేలు చేస్తుంది. దీన్ని మధుమేహ వ్యాధిగ్రస్థులు పుష్కలంగా వాడవచ్చు. ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వలన జీర్ణప్రక్రియకు, మలబద్ధకం నివారించేందుకు చాలా ఉపయోగపడుతుంది. 7. పుచ్చకాయ: వీటిలో పీచు పదార్థం జీర్ణప్రక్రియను సరిగ్గా ఉంచుతుంది. విటమిన్‌ సి, ఎ, ఐరన్‌, పొటాషియం, ఒక రకమైన తీపి పదార్థం ఉండడం వల్ల శక్తినిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరచి కాపాడుతోంది. దీన్ని మధుమేహం ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా తినవచ్చు. దీనిలో నీటి శాతం 90-95 శాతం వరకూ ఉంటుంది. ఎండాకాలంలో నీటి దప్పికకు ఇది గొప్ప ఉపశమనం. 8. బొప్పాయి: బొప్పాయిలో ఐరన్‌, పొటాషియమ్‌, కాల్షియమ్‌, విటమిన్‌ ఎ, సి, బి కాంప్లెక్స్‌ చాలా ఎక్కువగా ఉన్నాయి. మధుమేహులు కూడా వాడవచ్చు. రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది.

ఆడవారు ఈ నాలుగు పాటిస్తే.. అద్భుతమైన ఆరోగ్యం సొంతమవుతుంది! ఆడవారి ఆరోగ్యం ప్రతి ఇంటికి పెద్ద బలం. ఆడవారు తమ ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకుంటే ఇళ్లలో ఎన్నో పనులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతాయి. రోజువారీ జీవితంలో ఆడవారు ఫాలో అయ్యే కొన్ని విషయాలు మహిళల ఆరోగ్యాన్ని పాడు చేస్తే.. మరికొన్ని విషయాలు శారీరకంగా, మానసికంగా ఆడవారిని బలంగా మారుస్తాయి. ఆడవారు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి అంటే నాలుగు విషయాలు గుర్తుపెట్టుకొని, వాటిలో రోజూ పాటించాలి. కేవలం ఈ నాలుగు విషయాలు మొత్తం జీవన గతిని మార్చేసి అద్భుతమైన ప్రయాణానికి దోహదం చేస్తాయి.  ఆహారం ఫుల్లుగా తినొద్దు.. ఆడవారు ఎక్కువ పని చేస్తారు కానీ బాగా తినాలి అని అందరూ చెప్పేమాట. అయితే ఆహారం ఫుల్ గా తినడం వల్ల ఆడవారిలో ఊబకాయం, మధుమేహం తొందరగా వస్తాయి. అందుకే కేలరీల పరంగా తక్కువ కేలరీలు గల ఆహారాన్ని తీసుకోవాలి.  దీనివల్ల హృదయనాళాల ఆరోగ్యం బాగుంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తక్కువగానే ఉంటుంది.  వాకింగ్ పెంచాలి.. నడక అనేది తక్కువ ప్రభావ వ్యాయామం. దీని ఫలితాలు మాత్రం చాలా అగొప్పగా ఉంటాయి.  ఏ వ్యాయామం లేకపోయినా రోజూ వాకింగ్ చేసేవారి ఫిజికల్ స్ట్రేంగ్త్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, కేలరీలను బర్న్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. సాధారణ నడక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది, అభిజ్ఞా పనితీరును పెంచుతుంది. నవ్వు గొప్ప ఔషధం.. నవ్వు నాలుగు విధాల చేటు అనే మాట ఎప్పుడో తీరిపోయింది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున నవ్వును తరచుగా ఉత్తమ ఔషధంగా సూచిస్తారు. ఇది ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి, మానసిక స్థితిని పెంచడానికి, మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అదనంగా, నవ్వు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది, ఇది అనారోగ్యాన్ని నివారించడానికి సహాయపడుతుంది. నవ్వుతూ ఉంటే మానసిక ఒత్తిడులు క్రమంగా తగ్గిపోతాయి. కాబట్టి నవ్వు గొప్ప ఔషధం. అందరినీ ప్రేమించాలి.. ప్రేమించడం అనే మాటకు ఎప్పుడూ ఒకే అర్థం తీయకూడదు. సాటి మనుషులుగా అందరినీ అందరూ ప్రేమించవచ్చు. ఆ ప్రేమలో జాలి, కరుణ, బాధ్యత, ఒకానొక సమత్వ భావన తొంగిచూస్తాయి. సాధారణ పనులలో నిమగ్నమైన వ్యక్తులలో ఒత్తిడి స్థాయిలను తగ్గించడం, మానసిక ఆరోగ్యం మెరుగుపరచడం, అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడం ఇలాంటి ప్రేమ వల్లనే సాధ్యమవుతుంది. ఇతరులలో ఒంటరితనం పోగొట్టి జీవితం మీద ఆశను కల్పించడంలో ఈ ప్రేమ  పాత్ర చాలా గొప్పది. కాబట్టి ఎదుటి వారితో ఆనందంగా, సంతృప్తిగా, సంతోషంగా మాట్లాడుతూ వారిని గౌరవించాలి. ఈ నాలుగు పనులు చేస్తే ఆడవారి ఆరోగ్యం పదికాలలపాటు పధిలంగా ఉంటుంది.                                    ◆నిశ్శబ్ద

మహిళలు ఫిట్ గా ఉండాలంటే కీ పాయింట్స్ ఇవే! ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతారు. అయితే దురదృష్టవశాత్తు ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడే మహిళలు అధికం. ఆడవారి జీవితంలో పెళ్లి తరువాత పిల్లలు, వారి బాగోగులు, భర్త, అత్తమామలకు సపర్యలు చేయడం. వీటితో కాలం గడిచిపోతూ ఉంటుంది. తలనొప్పో.. నడుమునొప్పో వస్తే ఓ నొప్పి మాత్ర వేసుకుని సమస్యను బుజ్జగించడం మహిళలకు వెన్నతో పెట్టిన విద్య. తరచుగా పిల్లల ఆరోగ్యం వారి జీవితాలకు సంబంధించిన ప్రతిదానిని తల్లులు జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ స్వంత ఆరోగ్యం విషయానికి వస్తే, చాలా  నిర్లక్ష్యంగా ఉంటారు. చాలా సార్లు, పిల్లలు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు, తల్లి ఎంతో గాభరా పడుతుంది. , ఆమె ఇంటి చిట్కాల  నుండి డాక్టర్ ఇచ్చే చికిత్స వరకు అన్నీ పాటిస్తుంది.  భర్త అనారోగ్యం పాలైనప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. కానీ తన విషయంలో మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యమే. ఆడవారి ఆరోగ్యం తొందరగా పాడవ్వడానికి అసలు కారణాలు ఈ నిర్లక్ష్యమేనంటున్నారు వైద్యులు. మహిళలు ఫిట్ గా ఉండాలంటే.. ఇవి తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.  ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేవరకు కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరిగినట్టు ఉంటుంది ఆడవారి పరిస్థితి. భర్తకు, పిల్లలకు వేడివేడిగా కాఫీని, పాలను అందించడం మొదలు రాత్రి వారు నిద్రపోయేవరకు పరుగులే. ఉద్యోగం చేసే మహిళలకు ఈ సమస్య మరింత అధికం. మహిళలు ఫిట్ గా ఉండాలంటే వీటిని పాటించాలి. ముందు మీరే ముఖ్యం.. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్యమైన కీ ఏదైనా ఉందంటే అదే ప్రాధాన్యత. పిల్లలకు, భర్తకు, అత్తమామలకు చివరికి  అతిథులకు కూడా ప్రాధాన్యత ఇస్తారేమో కానీ తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకోవడం తక్కువ. ఖరీదైన చీరల్లోనో.. నగల్లోనో ఆరోగ్యం దాగుంటుందా?? వెన్నపూసి వదిలే మాటల్లోనూ.. ఖరీదైన వస్తువుల్లోనూ ఆరోగ్యం ఉంటుందంటే ఒప్పుకుంటారా?? ఇవన్నీ కాదు ఆడవారు తమకు తాము ప్రాధాన్యం ఇచ్చుకోవాలి. ఏ విషయంలో ప్రాధాన్యతలు ఇవ్వాలంటే..  ఆహారం.. వేడివేడిగా అందరికీ వడ్డించి చివరగా తాను తినే మహిళ.. ఆ ఆహారం తనకెంతమాత్రం పోషకాలను అందిస్తోందో ఆలోచించాలి. భర్త పార్టీలో తిన్నానని, పిల్లలు బయట తిన్నారని ఇంట్లో తినడం మనేసినప్పుడు.. రాత్రి, మరుసటిరోజు ఉదయం కూడా మిగిలిన దాంతో కడుపు నింపుకుంటారు కానీ పోషకాలను మాత్రం అందించలేరు. అందుకే తాజాగా, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.  వ్యాయామం.. ఉదయం నుండి రాత్రి వరకు ఇంటి పని చేస్తున్నాం సరిపోదా అని అందరూ అనుకుంటే పొరపాటు. ఆడవారికి వ్యాయామం ఉండాలి. ముఖ్యంగా మహిళలకు గర్భసంచి బాగుంటే ఎన్నో రకాల సమస్యలు దరిచేరవు. హార్మోన్ల సమతుల్యత ఉంటే అన్ని విధాలా బాగుంటారు. వ్యాయామం ఆడవారి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. బ్రేక్ లు భలే చిట్కాలు.. ఇంటి పని కావొచ్చు, ఆఫీసు పని కావొచ్చు.. రెండింటినీ డీల్ చేయడం పెద్ద టాస్క్ అనిపిస్తుంది. కానీ ప్రతి పనిలో గంటకోసారి 5 నిమిషాల రిలాక్సేషన్ మనిషిని అలసిపోనీయదు. అలాగని 5 నిమిషాల కోసం బ్రేక్ తీసుకుని అరగంట కూర్చుంటే మాత్రం పనులు నడవవు.  ఆత్మవిశ్వాసం.. వంట దగ్గర నుండి ఇంట్లో పనుల వరకు మీరు సమర్థవంతంగా చేయగలరనే ఆత్మవిశ్వాసంతో మొదలిపెట్టాలి. ఇలా మొదలుపెడితే అరగంట పని కాస్తా 15 నుండి 20 నిమిషాల్లో తెగ్గొట్టేయచ్చు.  మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి, మిమ్మల్ని మీరు నమ్మాలి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి.                                 ◆నిశ్శబ్ద.

  పనితోపాటు ఆహారమూ ముఖ్యమే ఉద్యోగం చేసే ఆడవారు ఇంట్లో, బయటా పని ఒత్తిడితో తమ ఆహారం విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టరు. దాంతో వయసు పెరిగినకొద్దీ అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. రోజువారీ తీసుకునే ఆహారం విషయంలో చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. సాధారణంగా రెండుపూటలా తీసుకునే ఆహారంతోపాటు మధ్యమధ్యలో తప్పనిసరిగా ఏదో ఒకటి తింటుండాలిట. అయితే ఆ ఏదో ఒకటి అధిక క్యాలరీలని పెంచేది కాక ఆరోగ్యాన్నీ, శక్తినీ ఇచ్చేది అయితే మంచిది అంటూ కొన్ని సూచనలు చేస్తున్నారు. 1. సాయంత్రం వేళ ఆకలిగా అనిపించినప్పుడు సలాడ్ల వంటివి తీసుకోవాలి. సలాడ్ల వల్ల శరీరానికి తక్కువ కేలరీలు అందుతాయి. ఆకలి తీరుతుంది కూడా. అందులోనూ క్యాబేజీని సలాడ్‌లో కలిపి తీసుకుంటే దీనిలోని ‘గ్లాటామైన్’ అనే అమినో యాసిడ్ చిన్న పేగు ఆరోగ్యంగా పనిచేసేట్టు చూస్తుంది. డైజేషన్ ఇబ్బందుల వంటివి తగ్గుతాయి. 2. బాదం, జీడిపప్పు తదితర డ్రై ఫ్రూట్స్ నేరుగా తీసుకోవడం వల్ల  కొలెస్ట్రాల్ సమస్య వుండదు. వీటిలో విటమిన్ ‘ఇ’తోపాటు మాంనీస్, విటమిన్ బి2, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్ ఉంటాయి. డ్రై ఫ్రూట్ర్‌ని మధ్యాహ్నం వేళ తీసుకుంటే శక్తి లభిస్తుంది. 3. వేరుశనగలు కూడా ఆరోగ్యానికి మంచివి. వీటిలో మాంసకృత్తులతోపాటు బి3, కాపర్, మాంగనీస్ వంటి పోషక విలువలు సమృద్ధిగా వుంటాయి. కాబట్టి వేరుశనగలని వేయించి లేదా ఉడికించి ఓ చిన్న బాక్సులో వేసుకుని ఆకలి అనిపించినప్పుడు నాలుగు గింజలు నోట్లు వేసుకుంటే చాలు ఆకలి తీరుతుంది. ఓపిక వస్తుంది. 4. ఇక పండ్లు తింటే శరీరంలోకి అనవసర కేలరీలు చేరవు. ఆకలి అదుపులో వుంటుంది. అరటిపండుని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు తీసుకుంటే రోజంతటికీ కావలసిన శక్తి లభించినట్టే. ఎందుకంటే అరటిపండ్లలోని కాల్షియం, ప్రొటీన్లు, ఐరన్‌లతోపాటు కార్బొహైడ్రేట్లు త్వరితగతిన శక్తినిస్తాయి. ఇక ఆపిల్స్‌లోని విటమిన్ ‘ఎ’, ఐరన్, బొప్పాయిలోని విటమిన్ ఎ, కె, ఇ తదితర పోషకాలు శక్తినివ్వడమే కాకుండా ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. 5. మొలకెత్తిన గింజల్ని ఓ గుప్పెడు నోట్లో వేసుకుంటే చాలు వీటిలో సమృద్ధిగా లభించే మాంసకృత్తులు శరీరానికి శక్తినిస్తాయి. చురుగ్గా వుంచుతాయి. ఇలా రోజు మొత్తంలో అప్పుడప్పుడు ఏదో ఒకటి నోట్లో వేసుకుంటే ఓపిక లేకపోవడం అన్న సమస్య వుండదు. బరువు పెరుగుతామనే భయమూ వుండదు. చలాకీగా రోజువారీ పనులు ఏ ఆటంకం లేకుండా చేసుకోవచ్చు. -రమ

మెనోపాజ్ సమయంలో మహిళలు ఈ ఆహారం తప్పక తీసుకోవాలి! అమ్మాయిలలో 10 ఏళ్ల తరువాత మొదలయ్యే ఋతుచక్రం దాదాపు40 నుండి  45 ఏళ్ల వయసు వరకు కొనసాగుతుంది. ఈ ఋతుచక్రం ముగిసే సమయాన్ని మెనోపాజ్ అని చెబుతారు. ఈ సమయంలో  శరీరం అనేక హార్మోన్ల మార్పులకు లోనవుతుంది. ఈ మార్పుల వల్ల శరీరంలో వేడి ఆవిర్లు, రాత్రి సమయాల్లో చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్‌లు, యోని పొడిగా మారిపోవడం, , ఆందోళన, బరువు పెరగడం, నిద్రకు రుగ్మతలు వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి.వీటికి  అనుగుణంగా ఉండటానికి, మహిళలు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అందుకోసం ఈ కింది ఆహారాలు తీసుకోవాలి. సోయా.. టోఫు,  సోయా పాలు వంటి సోయా ఉత్పత్తులలో ఐసోఫ్లేవోన్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ పనితీరును అనుకరించే ఒక రకమైన మొక్కల పదార్థం. ఈ ఐసోఫ్లేవోన్‌లు రుతుక్రమం ఆగిన లక్షణాలను ఉపశమనం చేస్తాయి. హృదయ సంబంధ వ్యాధులు, బోలు ఎముకల వ్యాధి, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. సోయాలో మొక్కల ప్రోటీన్లు కూడా ఉంటాయి, ఇవి వృద్ధాప్యం కారణంగా క్షీణిస్తున్న కండరాలను బలపరుస్తాయి. పండ్లు, కూరగాయలు తాజా పండ్లు, కూరగాయలు మెనోపాజ్ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి.  బచ్చలికూర బ్రోకలీ వంటి ఆకుకూరలలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. యాపిల్స్, సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ సంశ్లేషణలో సహాయపడుతుంది చర్మంలో వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలలో లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఒమేగా-3 మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తృణధాన్యాలు.. బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ వంటి తృణధాన్యాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది గుండె జబ్బులు, హార్మోన్ల అసమతుల్యత, మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తృణధాన్యాలలో విటమిన్ బి, విటమిన్ ఇ మెగ్నీషియంతో సహా అవసరమైన విటమిన్లు ఎన్నో ఉన్నాయి, ఇవి శక్తి స్థాయిలను పెంచుతాయి, ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. నట్స్.. నట్స్ లో కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి, ఇవి కడుపు నిండుగా ఉండేలా చేసి అతిగా తినే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిలో  ఫైటోఈస్ట్రోజెన్‌లు ఉంటాయి, ఇవి శరీరంలో వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు పట్టడం, మానసిక కల్లోలం వంటి రుతుక్రమం ఆగిన లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమైన మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం కూడా వీటిలో ఉంటాయి.  కాల్షియం.. విటమిన్ డి.. మెనోపాజ్ సమయంలో ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు కాల్షియం, విటమిన్ డి అవసరమైన పోషకాలు. కాల్షియం పాలు, జున్ను, పెరుగు బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆకు కూరలలో లభిస్తుంది. చర్మం సూర్యరశ్మికి గురైనప్పుడు విటమిన్ D సంశ్లేషణ చెందుతుంది మరియు బలవర్థకమైన పాల ఉత్పత్తులు చేపలలో కూడా విటమిన్ డి ఉంటుంది.                                          ◆నిశ్శబ్ద.