`బిగ్ బాస్` సెగ నాగార్జునకు తగలనుందా??
on Jul 17, 2019
`బిగ్ బాస్-3` ఏ మూహూర్తాన మొదలెట్టాలనుకున్నారో కానీ, ప్రారంభం కాక ముందే రచ్చ మొదలైంది. ఇటీవల శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా లు `` అది బిగ్ బాస్ హౌసా, లేక బ్రోతల్ హౌసా అంటూ `` కామెంట్స్ చేస్తూ కేసులు పెట్టడం దాకా వెళ్లారు. ఇక ఈ వివాదం కాస్త చల్లబడుతుందిలే అనుకుంటోన్న క్రమంలో ఓయూ స్టూడెంట్స్ కూడా బిగ్ బాస్ ను ఆపాలంటూ మండిపడుతున్నారు. దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఇలాంటి షోస్ వల్ల యువత చెడిపోతుందంటూ బిగ్ బాస్ షో పై ఇప్పటికే కేస్ ఫైల్ చేసాడట. దీనికి ఓయూ విద్యార్థులు వంతపాడుతూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక సో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుండటంతో నాగార్జున , బిగ్ బాస్ కార్యాలయాలను ముట్టడించాలన్న చూస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో బిగ్ బాస్ నిర్వాహకుల్లో టెన్షన్ మొదలైందట. కాకుంటే హై కోర్టు వీరికి ఊరటనిస్తూ `నిర్వాహకులను అరెస్ట్ చేయాడాలు లాంటివి ఏమి చేయవద్దని` తీర్పు వెలువరించింది. విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులకు ఊరట లభించినట్టైంది. మరి ఇన్ని వివాదాల నడుమ బిగ్ బాస్ 3 అనుకున్న సమయానికి స్టార్ట్ అవుతుందా? లేదా అన్నది చూడాలి మరి.
Also Read