సుబ్బారావు వెనుక సుబ్బారెడ్డి! బాలినేనికి వైవీ చెక్? గుప్తాతో గూడుపుఠాని!

Publish Date:Jan 25, 2022

Advertisement

ఎక్కడైనా బావే.. కానీ వంగతోట కాడ కాదంటారు. అలాగే ఎక్కడైనా బావే.. కానీ రాజకీయంగా కాదంటారు టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. త‌న బావ‌ బాలినేని శ్రీనివాసరెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనేందుకు టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎంత చేయాలో అంత చేస్తున్నారనే టాక్ అయితే ప్రకాశం జిల్లాలో యమ స్పీడ్‌గా నడుస్తోందీ. శత్రువుకు శత్రువు.. మనకు మిత్రుడు అనే కాన్సెప్ట్‌ను ఎంచుకున్న వైవీ సుబ్బారెడ్డి.. ఆ దిశగా తనదైన స్టైల్‌లో ముందుకు వెళ్తున్నారని సమాచారం. 

ఆ క్రమంలో ఒంగోలుకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సుబ్బారావు గుప్తాను ఇటీవల తెరపైకీ తీసుకు వచ్చి.. తిరుమల వెంకన్న సాక్షిగా నీకు అండ.. దండ.. నేను ఉన్నానంటూ అతడికి వైవీ సుబ్బారెడ్డి భరోసా ఇచ్చారనే టాక్ అయితే ఒంగోలు మహానగరంలో చక్కర్లు కొడుతోంది. అందులో భాగంగానే టీటీడీ బోర్డు చైర్మన్‌ వారి ఆశీస్సులతోనే సుబ్బారావు గుప్తా... అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో మీడియా సాక్షిగా ప్రెస్ మీట్లు పెట్టీ మరీ చెలరేగిపోతున్నారని తెలుస్తోందీ. 

గతేడాది డిసెంబర్ 12న వైవీ సుబ్బారెడ్డి బావ.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఒంగోలులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జగన్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల.. భవిష్యత్తులో తామంతా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యలు.. మంత్రి బాలినేని వాసన్న మనస్సులో అలజడిని రేపాయి. దీంతో బాలినేని వాసన్న గ్యాంగ్ రంగంలోకి దిగి.. ప్రాణ భయంతో గుంటూరులో దాక్కున్న సుబ్బారావు గుప్తాపై వాసన్న రైట్ హ్యాండ్ సుభానీ దాడి చేసి.. మొకాళ్ల మీద కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించడం.. ఆ తర్వాత మంత్రి బాలినేని స్వయంగా సుబ్బారావు గుప్తాకు కేకు తినిపించడం వరకు మొత్తం ఎపిసోడ్ వీడియో అంతా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.  అయితే ఈ దాడిపై ఆర్యవైశ్య సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. అయినా జగన్ పార్టీకి జరగాల్సిన నష్టమంతా అప్పటికే జరిగిపోయిందీ. 

కానీ ఈ ఎపిసోడ్ మొత్తంలో దెబ్బలు తిని బాధితుడిగా మారిన సుబ్బారావు గుప్తా మాత్రం జనంలో హీరో అయ్యారు. ఆ  తర్వాత సుబ్బారావు గుప్తా.. విజయవాడ వేదికగా ఆర్య వైశ్య సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం... రాష్ట్రమంతా పర్యటించి... తనపై జరిగిన దాడిని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తానని ప్రకటించడం.. అందులో భాగంగా స్వయంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ముఖ్యంగా మంత్రుల తీరును బహిరంగంగానే ఎండగట్టడం.. తమ ఎమ్మెల్యే, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంచి నాయకుడు, కమలహాసన్‌లా మంచి నటుడంటూ కితాబు ఇవ్వడం.. ఆయన వద్దకు వచ్చి.. క్లాసులు చెప్పించుకోవాలంటూ మంత్రి కొడాలి నానికీ సుబ్బారావు గుప్తా మీడియా సాక్షిగా సూచించడం.. 2024 ఎన్నికల్లో గుడివాడ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగుతానంటూ.. బల్లగుద్దీ మరీ సుబ్బారావు గుప్తా ప్రకటించడం.. ఈ మొత్తం వ్యవహారమంతా.. బాలినేని వాసన్న బావమరిది టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందనే టాక్ అయితే ప్రకాశం జిల్లాలోనే కాదు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వైరల్ అవుతోంది. 

గతేడాది డిసెంబర్ 12వ తేదీ వరకు జగన్ పార్టీలో ఓ సాధారణ కార్యకర్తగా ఉండడమే కాకుండా.... మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే భయం భక్తి కలిగిన ఓ పార్టీ కార్యకర్తగా... మంత్రి బాలినేని ముఖ్య  అనుచరుడుగా ఉండి.. బయట ప్రపంచానికి అంతగా తెలియని.. ఈ సుబ్బారావు గుప్తా.. జస్ట్ 50 అంటే 50 రోజుల్లో ఇంతగా.. ఇంతలా ధైర్యంగా అధికార పార్టీ మంత్రులనే  టార్గెట్ చేస్తూ వారిపై ఇలా చెలరేగిపోవడం వెనక కచ్చితంగా పెద్దల హస్తం తప్పకుండా ఉందని ఆర్య వైశ్య సంఘం నేతలు గుసగుసలాడుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

ఏదీ ఏమైనా ఈ సుబ్బారావు గుప్తా వెనక ఉన్నది ఏవరన్నదీ మాత్రం ఆ దేవదేవుడు తిరుమల వెంకన్నకే ఎరుక అని సోషల్ మీడియాలో అయితే కామంట్లు వస్తున్నాయి. అయితే 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా వైయస్ఆర్ సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి గెలవగా.. అదే ఎన్నికల్లో అదే అసెంబ్లీ  స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటికే ఈ బావ, బావమరుదుల మధ్య గ్యాప్ ఉంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య దూరం చాలా చాలా బాగా పెరిగిందీ. ఒకానొక సమయంలో వీరి మధ్య ఏర్పాడిన గ్యాప్ తగ్గించేందుకు నాటి ప్రతిపక్షనేత వైయస్ జగన్ జోక్యం చేసుకున్న ఫలితం లేకపోయిందని ఆ పార్టీ నేతలే ఇప్పటికీ చెప్పుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. 

ఆ క్రమంలోనే వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టేటట్లు.. బాలినేని శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించేటట్లు.. ముందుగానే వైయస్ జగన్ సాక్షిగా వీరిద్దరి మధ్య ఓ డీల్ అయితే గతంలోనే  కుదిరిందనే టాక్ ప్రకాశం జిల్లా సరిహద్దులోని గిద్దలూరులో సైతం ప్రచారంలో ఉంది. మరి మంత్రి బాలినేని వారికి ఇంతలా చెక్ పెట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి వారు కాకుంటే ఇంకెవరైనా ఉండి ఉంటారా? అని ప్రకాశం జిల్లా వాసులు ఆలోచిస్తున్నారు. ఏదీ ఏమైనా ఇంతకీ సుబ్బారావు గుప్తాను ఆడిస్తుందీ ఎవరనేది మాత్రం ఆ పెరుమాళ్ల వారకే ఎరుక.

By
en-us Political News

  
ఏపీలో అల్లర్లపై 13 మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం వహిస్తారు.
తెలంగాణ సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి, ఆంధ్రులపై వ్యతిరేకతను తిరగదోడి ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగిలాయి. బిఆర్ఎస్ నేతలు ఇతర పార్టీలలోకి జంప్ అయిన సమయంలో హైకోర్టు తీర్పు ప్రకారం బిఆర్ఎష్ ఎమ్మెల్సీ దండె విఠల్ చెల్లదు. కానీ లోకసభ ఎన్నికల తర్వాత మాత్రం హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 
శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ ఆశలకు కాంగ్రెస్ భారీ గండి కొట్టింది. దీంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడి విజయం నల్లేరు మీద బండి నడకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అదృశ్యమయ్యారు. వారు కనిపించడం లేదంటూ గన్​మెన్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది. అరెస్టు భయంతోనే అదృశ్యమయ్యారనే చర్చ నడుస్తోంది.
ఆనాడు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో ఎలాంటివాడో, ఇప్పుడు రాష్ట్రం అట్టుడికిపోతుంటే పట్టించుకోకుండా విహారయాత్రకు వెళ్తున్న జగన్ కూడా అలాంటివాడే.
పర్యాటకరంగం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి వారధిగా, సాంస్కృతిక వారధిగా వ్యవహరించాలని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.
నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరులో కేరళ తీరం తాకనున్నాయని వెదర్ రిపోర్ట్ వచ్చిన రోజే అంటే గురువారం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షం దంచి కొట్టడంతో ట్రాపిక్ జామ్ అయ్యింది. నేడు రెండో రోజు కూడా వర్షం నగరాన్ని ముంచెత్తనుంది. 
వివేకా హత్య కేసుపై ఎన్నికలు పూర్తయ్యే వరకూ మాట్లాడవద్దంటూ కడప హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కడప కోర్టు తన ఉత్తర్వులలో డాక్టర్ సునీత , షర్మిల సహా కొందరు విపక్ష నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ వారెవరూ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా వివేకా హత్య కేసు విషయాన్ని ప్రస్తావించకూడదంటే ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇలాంటి సందర్భాల్లో సీపీఆర్ అందించగలిగితే ప్రాణాలు నిలబడతాయి. అందుకే అందరికీ సీపీఆర్ మీద అవగాహన వుండాలి. సీపీఆర్ నేర్చుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో మహాభారత యుద్ధాన్ని తలపించిన ఎన్నికల రణం ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈ ఎన్నికలలో ప్రధానంగా అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి మధ్యే పోరు జరిగింది. పోలింగ్ పూర్తయిన తరువాత ఆయా పార్టీల నేతల భాష్, బాడీ లాంగ్వేజ్ ని బట్టి గెలుపు ఎవరిది, ఓటమి పాలయ్యేది ఎవరు అన్నది జనాలకు స్పష్టంగా తేలిపోయింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఊచలు లెక్కబెడుతున్న మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయను స్వంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు కలవడానికి పెద్దగా ఆసక్తికనబరచడం లేదు.
ముఖ్యమంత్రిగానే కాదు, ఆపద్ధమర్మ ముఖ్యమంత్రిగా కూడా జగన్ మోసాలు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు గతంలో బటన్ నొక్కేశాను, ఆ డబ్బులు ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాలలో అర్జంటుగా జమ చేసేయండి అంటూ తనకు తైనాతీగా వ్యవహరిస్తున్న సీఎస్ ను ఆదేశించారు. దీంతో సీఎస్ జవహరర్ రెడ్డి తక్షణం ఆ పని చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీచేసేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.