రాంనాథ్ వారసుల ఎన్నికలో ప్రముఖులు వీరే

Publish Date:Jan 25, 2022

Advertisement

మన దేశంలో ప్రతి ఎన్నిక కూడా చాలా ఇంట్రస్ట్ ను క్రియేట్ చేసేదే. అందులోనూ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎన్నిక సమీపిస్తుందంటే దాని చుట్టూ నడిచే స్పెక్యులేషన్స్ సంగతి చెప్పనే అక్కర్లేదు. ప్రణబ్ ముఖర్జీ వారసుడిగా వచ్చిన కోవింద్ ఎన్నికకు ముందు 2017లో  అలాంటి  స్పెక్యులేషన్సే  నడిచాయి. ఇప్పుడాయన టర్మ్ కి వచ్చే జులైతో ఎండ్ కార్డు పడుతుంది. దీంతో రాంనాథ్ కోవింద్ వారసుడెవరన్నది ఆసక్తికరంగా మారింది. అంతకన్నా ఎక్కువగా... ఆయన తరువాత వారసుడు వస్తాడా లేక వారసురాలా అనేది మరింత క్యూరియాసిటీ సృష్టిస్తోంది. ఈసారి కేంద్రంలోని బీజేపీ పెద్దలు వారసురాలికే కాస్త ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే 2007లో కాంగ్రెస్ తరఫున ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు చేపట్టిన ప్రతిభా పాటిల్ తరువాత.. ఆ అవకాశం ఎవర్ని వరిస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.

అయితే బీజేపీ పెద్దల పరిశీలనలో ఇప్పటికే దేశమంతా సుపరిచితురాలైన నిర్మలా సీతారామన్ పేరున్నట్టు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. నిర్మల ఇంతకుముందు రక్షణ శాఖ మంత్రిగా, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దక్షిణాది నుంచి అగ్రవర్ణ శాఖకు చెందిన నిర్మల బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరిగా ఎదిగారు. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ల సరసన నిర్మల పేరు వినిపిస్తుంటుంది. మంచి రూపం, మంచి భాష, సంప్రదాయపూర్వకమైన  ఆహార్యంతో పాటు ధైర్య సాహసాలు ప్రదర్శించే వనితగా పేరు సంపాదించుకున్నారు నిర్మల. రక్షణ శాఖ మంత్రి హోదాలో దేశ సరిహద్దుల్లో పర్యటించి అందరిచేతా శభాష్ అనిపించుకున్నారు. అసలామె బీజేపీలోకి రావడమే విచిత్రంగా జరిగింది. ఎన్డీయే హయాంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్న ఆమె బీజేపీ నేతల దృష్టిలో పడింది. ఫలితంగా ఆమె 2006లో బీజేపీలో చేరి  అంచెలంచెలుగా ఎదిగారు. 

ఇక నిర్మలతో పాటు మరో ఆప్షన్ గా ప్రస్తుత రాజ్యసభ ఎంపీ, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్  గొగోయ్ పేరు కూడా వినిపిస్తోంది. దక్షిణ భారతంతో పాటు మహిళకు ప్రాధాన్యతనిచ్చే క్రమంలో నిర్మల పేరును పరిశీలిస్తున్నట్టే... సెవెన్ సిస్టర్స్ గా పేరున్న ఈశాన్య రాష్ట్రాలకు అంతే ప్రాధాన్యతనిచ్చే క్రమంలో  రంజన్ గొగోయ్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా బీజేపీ ఈశాన్య రాష్ట్రాలను కూడా సమాన ప్రాధాన్యతాంశంగా ఎంచుకుంది. రంజన్ గొగోయ్ హయాంలోనే రాంమందిర్ వంటి కీలకమైన తీర్పును దేశప్రజలు పొందగలిగారు. బీజేపీ ఐడియాలజీతో  ఏనాడూ  పెద్దగా పొసగని గొగోయ్ తన తీర్పుతో బీజేపీ నేతల దృష్టిని ఆకర్షించడం విశేషం. పలు సంచలనాత్మకమైన  తీర్పులే కాక, కొన్ని సందర్భాల్లో వివాదాలకూ కారణమైన గొగోయ్ కి బీజేపీ అధిక ప్రాధాన్యతనిస్తుండడం చెప్పుకోదగ్గ అంశం. 

ఇక రాష్ట్రపతి కోటాలో ఈశాన్య రాష్ట్రాల నుంచి గొగోయ్ కి గనుక అవకాశం ఇస్తే ఉపరాష్ట్రపతిగా మళ్లీ దక్షిణాదికే ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు అవకాశం కల్పించడంపై  చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి బీజేపీ పెద్దలు ఈసారి ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల నుంచి అత్యున్నతమైన రాజ్యంగ పదవులకు ప్రాధాన్యత కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

ఇక 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో రాంనాథ్ కోవింద్ చేతిలో కాంగ్రెస్ తరఫున లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి అదే సామాజికవర్గానికి చెందిన మల్లికార్జున  ఖర్గేను  రాష్ట్రపతి ఎన్నికకు రంగంలోకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఖర్గే కర్నాటకకు చెందిన సీనియర్ నేత కావడం ఆయనకు బాగా కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఐదు  రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడతాయి. ఆ తరువాత  బీజేపీ, కాంగ్రెస్ లు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించి వారి అభ్యర్థులను  ప్రకటించే అవకాశం ఉంది. 

By
en-us Political News

  
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనాచౌదరి విజయం సునాయాసమేనని తెలుగుదేశం కూటమి శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. సుజనా చౌదరి విజయం కోసం కూటమి భాగస్వామ్యపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి పని చేస్తున్నాయి.
తెలంగాణలో ఎండలు చండప్రచండంగా ఉన్నాయి. ఉదయం ఏడున్నర గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (మే2) శ్రీవారిని మొత్తం 65వేల 313 మంది దర్శించుకున్నారు.
జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది. ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు.
కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది.
ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని
చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వున్న రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్‌ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
నిందితులంతా ఆర్థికంగా, రాజ‌కీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్‌లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.