విజయమ్మ లేఖ ఎఫెక్ట్ .. జగన్ కు దూరం జరుగుతున్న వైఎస్ అభిమానులు!

Publish Date:Oct 30, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబపరంగానూ, రాజకీయంగానూ పూర్తిగా ఒంటరి అయిపోయారు. ఆయన కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ పార్టీని స్థాపించినప్పుడు ఆయనకు రాజకీయాలకు అతీతంగా వైఎస్ అభిమానులందరి మద్దతూ లభించింది. ఇటు కుటుంబం కూడా ఆయన వెన్నంటి నడిచింది. ఇలా అన్ని వైపుల నుంచీ, అందరి నుంచీ మద్దతు లభించడం వల్లనే  ఆయన తన వైసీపీ పార్టీని ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లూ నడపగలిగారు, 2019 ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగలిగారనడంలో సందేహం లేదు. అందుకే ఆయన విపక్షంలో ఉన్నప్పుడు ఎంత అడ్డగోలు విమర్శలు చేసినా, మంచీ మర్యాదా వదిలేసి అప్పటి ముఖ్యమంత్రిపై దుడుకుగా, దురుసుగా విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో అనుమతించలేని, అనుమతించరాని బెదరింపులకు పాల్పడ్డారు. 

ఇక 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత అధికారం అండతో ఆయన చెలరేగిపోయారు. ఇంత కాలం తనకు అండగా నిలిచిన కుటుంబాన్నీ కాదనుకున్నారు. చెల్లి షర్మిలను పార్టీ నుంచి బయటకు పంపేశారు. తల్లి విజయమ్మను పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి సాగనంపారు. తండ్రి వైఎస్ మరణం తరువాత ఆయన మరణం ద్వారా వచ్చిన సానుభూతిని నమ్ముకుని జగన్ రాజకీయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు. అయితే తండ్రి మరణం తరువాత 2014 లో జరిగిన ఎన్నికలలో జగన్ పార్టీ పరాజయం పాలైంది. రాష్ట్ర విభజన కారణంగా ఆ పరాజయం ఎదురైందని సర్ది చెప్పుకున్న జగన్.. ఆ తరువాత ఐదేళ్లూ కూడా సీఎం పీఠం అధిరోహించడమే లక్ష్యంగా పని చేశారు. 2019 ఎన్నికలలో జగన్ పార్టీ ఘన విజయం సాధించింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే జగన్ తన పార్టీ సిద్ధాంతాలను నమ్ముకోలేదు. అడ్డగోలుగా హామీలు ఇచ్చేసి, ఐప్యాక్ సహకారంతో విధ్వంస, విద్వేష వ్యూహాలను అమలు చేసి విజయం సాధించారు.

కోడికత్తి దాడి, సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య ద్వారా వచ్చిన సానుభూతిని అలంబనగా చేసుకుని జగన్ అధికార పీఠం అధిరోహించారు.  అయితే 2024 ఎన్నికలు వచ్చే సరికి జగన్ కు నాడు సానుభూతి వెల్లువెత్త విజయం సాధించడంలో కీలకంగా ఉన్న రెండు సంఘటనల్లోనూ జగన్ కుట్ర ఉందన్న అనుమానాలు బలపడ్డాయి. ఆ రెండు కేసుల దర్యాప్తులోనూ జగన్ మేలు కోసం ఆయన పార్టీకి చెందిన వారి ప్రోద్బలం, ప్రమేయంతోనే ఈ ఘటనలు జరిగాయని నిర్ధారణ అయ్యింది.  సొంత తల్లి, చెల్లీ కూడా జగన్ కు ఆయన పార్టీకీ దూరమయ్యారు. అరాచక పాలన కారణంగా ఐదేళ్ల కిందట బ్రహ్మరథం పట్టిన జనం ఛీకొట్టారు.  దాంతో ఘోర పరాజయం ఎదుర్కొన్నారు. అధికారం కోల్పోయారు. 
ఇప్పుడు తాజాగా షర్మిల విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరుతో వైఎస్ కుమారుడిగా ఆయనను అభిమానిస్తున్న వారు కూడా దూరం అవుతున్నారు. వైఎస్ అనుయాయులుగా, ఆయనకు అత్యంత విధేయులైన పలువురు నేతలు గతంలో జగన్ కు అండగా నిలిచారు. పార్టీ పరాజయం తరువాత కూడా వారు వైఎస్ మీద అభిమానంతో జగన్ తోనే ట్రావెల్ చేస్తున్నారు.

ఎప్పుడైతే ఆస్తుల వివాదంలో జగన్ షర్మిల మధ్య వివాదం రచ్చకెక్కిందో, సొంత చెల్లిపై కూడా జగన్ మీడియా విమర్శల దాడి చేయడం ప్రారంభించిందో వారు జగన్ కు దూరం కావాలని నిర్ణయించుకున్నారు.  ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్ప‌నున్నారు. ఆయన దారిలోనే పలువురు నేతలు ఉన్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఆస్తుల వివాదంలో షర్మిలకు మద్దతుగా నిలబడి విజయమ్మ ఎప్పుడైతే జగన్ నమ్మకద్రోహాన్ని లోకానికి చాటుతూ బహిరంగ లేఖ రాసిన తరువాత జగన్ కూ దురం అయ్యే వైఎస్ అభిమానుల సంఖ్య బాగా పెరిగింది. ఇక రాజకీయంగా జగన్ కు ఎటువంటి మద్దతూ ఇచ్చే ప్రశక్తి లేదని వారు బాహాటంగానే చెబుతున్నారు. 

By
en-us Political News

  
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.