Publish Date:Oct 30, 2024
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మూడు పార్టీల నేతల మధ్యా సయోధ్య చక్కగా కుదిరింది. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్ని నిర్ణయాలలోనూ సమష్టిగా ముందుకు సాగుతోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల మధ్య సయోధ్యం కుదిరింది. పాలన సజావుగా సాగుతోంది. అయితే క్షేత్ర స్థాయిలో ఆయా పార్టీల శ్రేణులు కార్యకర్తల మధ్య మాత్రం ఆటువంటి సయోధ్య కనిపించడం లేదే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. క్యాడర్ బలం అంతగా లేని బీజేపీని పక్కన పెడితే కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య కీచులాటలు మొదలయ్యాయి. సమష్టిగా పని చేయాలని రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమతమ పార్టీ క్యాడర్ కు స్పష్టమైన ఆదేశాలిచ్చానా పరిస్థితిలో మార్పు రావడం లేదు.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి కొలువుదీరి నాలుగు నెలలు పూర్తవుతోంది. తొలి రోజుల్లో ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగానే పరిస్థితులు కనిపించాయి. అయితే ఇటీవలి కాలంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్యా తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. సమష్టి తత్వం కనుమరుగైంది. రాష్ట్రం అంతటా పరిస్థితి ఇలాగే ఉందని కాదు కానీ, పలు చోట్ల ఇరు పార్టీల కార్యకర్తల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఒకటి రెండు చోట్ల ఇది బహిర్గతం అయ్యింది. ఇంకా పలు చోట్ల పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.
తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన దెందులూరు నియోజవర్గంలో తెలుగుదేశం జనసేన కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తెలుగుదేశం నాయకుడు సైదు గోవర్ధన్ ఇటీవల జనసేనానిపై చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయి, రాజకీయ రగడకు దారి తీశాయి. స్థానిక నాయకులు సర్ది చెప్పినా ఫలితం లేకపోయింది. క్షణమే టీడీపీ నేతను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన నేతలు పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు రెడీ అవుతున్నారు.
ఇక ఉమ్మడి ఒంగోలు లోనూ తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇటీవల జిల్లాలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జనసేనలోకి వలసలు జరిగాయి. అయితే జనసేనాని కూటమి ధర్మాన్ని విస్మరించి బాలినేనిని వంటి నేతలను పార్టీలో చేర్చుకోవడాన్ని తెలుగుదేశం శ్రేణులు తప్పుపడుతున్నాయి. అలాగే అనంతపురం అర్బన్ లో కూడా జనసేన, తలుగు దేశం పార్టీల విభేదాలు రచ్చకెక్కాయి. వీటిని చక్కదిద్దుకోకుంటే మున్ముంది మరిన్ని సమస్యలు ఉత్పన్నమవ్వడం ఖాయమన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rift-between-tdp-and-janasena-cadre-39-187668.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.