Publish Date:Apr 16, 2026
హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. డాక్టర్ సురేష్ అనే యువ వైద్యుడు హాస్టల్ గదిలో మృతిచెందిన స్థితిలో కనిపించడంతో వైద్య వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మారుమూల గ్రామానికి చెందిన సురేష్ కష్టపడి ఎంబీబీఎస్ సీట్ సాధించి, ప్రస్తుతం పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పెద్ద డాక్టర్గా ఎదిగి తన గ్రామానికి సేవ చేయాలన్నది అతని లక్ష్యం. అయితే ఏమి జరిగిందో తెలియని పరిస్థితుల్లో అతను ఈ దారుణ నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్కు గురిచేసింది.
సమాచారం ప్రకారం, సురేష్ జనరల్ సర్జరీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆ సీటు రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని తోటి డాక్టర్లు చెబుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న సురేష్ను సహచరులు గుర్తించి వెంటనే చికిత్సకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఇదిలా ఉండగా, సురేష్ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ, పూర్తి స్థాయి విచారణ జరిపి తమ కుమారుడి మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సురేష్ తమ గ్రామం నుంచి వైద్య విద్యలో అడుగుపెట్టిన తొలి వ్యక్తి కావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పీజీ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/young-doctor-commits-suicide-at-osmania-hospital-36-217514.html
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.