Publish Date:Jun 21, 2022
యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలలో ఉత్సాహంగా సామూహిక యోగా కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. ఐక్యరాజ్యసమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించిన సంగతి విదితమే. యోగా డే సందర్భంగా సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య పాల్గొన్నారు. మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ యోగా డే ఘనంగా జరిగింది.
యోగా ఎంతో ప్రాచీనమైనదైనా దోషం పట్టనిదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన సోమవారం యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌడ్స్లో నిర్వహించిన ప్రత్యేక కార్య క్రమంలో పాల్గొని ప్రసంగించారు. యోగా కుల మతాలకు అతీతమని, ఇంద్రియాలను, ఆత్మశక్తిని ఏకం చేయడమే యోగా అని తెలియజేశారు. యోగాను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన ప్రధాని మోడీకి ఈ సందర్భంగా వెంకయ్య ధన్యవాదాలు తెలియజేశారు.
ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు చెప్పారని, ప్రాశ్చాత్య వ్యామోహంతో వచ్చిన మార్పులతో యోగా విశిష్టత మరింత పెరిగిందన్నారు. యోగా చేసి దేశాన్ని ఆరోగ్య వంతం చేద్దామని, యోగా సాధనతో ప్రపంచ శాంతి చేకూర్చుకుందామని పిలుపు నిచ్చారు. యోగా స్ట్రెస్, టెన్షన్ను పోగొడుతుందన్నారు. ఇంతపెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చి యోగా మహోత్సవ్ను విజయవంతం చేసినందుకు ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరు లు పాల్గొన్నారు.
ఇక ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మైసూరు ప్యాలెస్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా మన విశ్వానికి శాంతిని తెస్తుం దని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా సాధన జరుగుతోందని ఈ సందర్భంగా ప్రధాని తెలియజేశారు. విశ్వమానవాళి ఆరో గ్యమే లక్ష్యంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యోగా చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నా రు. యోగాతో క్రమ శిక్షణ, ఏకాగ్రత లభిస్తాయని ప్రధాని మోదీ వివరించారు. యోగాను అదనపు పనిగా భావించరాదని, రోజూవారీ పనుల్లో ఎంత వొత్తిడికి గురయినప్పటికీ ధ్యానం వల్ల గొప్ప ప్రశాంతత లభిస్తుం దని, యోగాను జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని ప్రధాని సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయూష్ మంత్రి శర్వానంద సోనోవాల్, కర్ణాటక గవర్నర్ ఘెహ్లాట్, కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్. బొమ్మయ్ పాల్గొన్నారు.
ఇదిలా వుండగా, ప్రపంచ వ్యాప్తంగా యోగా డే ఉత్సవాలు జరిగాయి.దేశవ్యాప్తంగా 75 నగరాల్లో యోగా డే వేడుకలు జరిగాయి. ఈ ఏడాది ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ నినాదంతో యోగా డే ఉత్సవాలు జరిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/yoga-brings-peace-to-world-says-modo-39-138101.html
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.