Publish Date:Jun 21, 2022
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ డొల్ల తనం తమిళనాడు టెన్త్ పరీక్షా ఫలితాల విడుదలతో మరోసారి బట్టబయలైంది. తమిళనాడులో టెన్త్ రిజల్ట్స్ విడుదల చేశారు. అక్కడ ఉత్తీర్ణత 90 శాతం. ఏపీలో టెన్త్ రిజల్ట్స్ లో ఉత్తీర్ణతా శాతం తక్కువగా నమోదవ్వడంతో విమర్శలు వెల్లువెత్తిన సందర్భంగా ఏపీ ప్రభుత్వం కరోనా కారణంగా విద్యార్థులు చదువులకు దూరం అయ్యారనీ, ఆ కారణంగానే కరోనా ముప్పు బయటపడిన తరువాత తొలిసారిగా జరిగిన పరీక్షలు కావడంతో ఉత్తీర్ణతా శాతం తక్కువగా వచ్చిందనీ సమర్ధించుకుంది.
ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగించడం వల్లలే పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయన్న విమర్శలను కొట్టి పారేసింది. ఇప్పుడు తమిళనాడులో టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 90 శాతం మంది ఉత్తీర్ణులు కావడంతో ఏపీలో ఉత్తీర్ణతా శాతం తగ్గుదల అంశంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రభుత్వ విధానాలు, వైఫల్యం వల్లనే టెన్త్ లో ఉత్తీర్ణతా శాతం గణనీయంగా తగ్గిపోయిందన్న విమర్శలలో వాస్తవం ఉందని తమిళనాడు టెన్త్ రిజల్ట్స్ ను ఉదాహరణగా చూపుతున్నారు.
తమిళనాడులో కరోనా లేదా? అని ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో టెన్త్, ఇంటర్ రిజల్ట్స్ సోమవారం విడుదలయ్యాయి. అక్కడ టెన్త్ లో90 శాతం, ఇంటర్ లో 93శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అక్కడ కూడా కరోనా కారణంగా గత రెండేళ్లూ పరీక్షలు జరగలేదు. అయితే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మెరుగుపడేందుకు కరోనా సమయంలో కూడా తమిళనాడు ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించింది. ఏపీ ప్రభుత్వం మాత్రం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. టెన్త్ లో ఉత్తీర్ణతా శాతం తగ్గడం అసాధరణం కాదని అంటోంది. నెపం కరోనాపై నెట్టేసి చేతులు దులుపుకుంటోంది. అయితే అసలు వాస్తవం విద్యా సంస్థల్లో టీచర్లు లేకపోవడమేనని, ప్రభుత్వం టీచర్లకు బోధనేతర పనులు అప్పగించడమేనని విపక్షాలే కాదు విద్యారంగ నిపుణులు కూడా విమర్శిస్తున్నారు.
అయితే ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. తమిళనాడు కాదు.. అంటే ఉత్తీర్ణతా శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ ఎంతో మెరుగు అంటూ చెప్పుకుంటోంది. ప్రభుత్వ తీరు విద్యార్థుల బవితను నాశనం చేసేదిగా ఉందంటూ విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెన్త్ లో ఉత్తీర్ణత గణనీయంగా తగ్గిపోవడానికి కారణాలను గుర్తించి, తన తప్పిదాలను అంగీకరించి, భవిష్యత్ లో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిదే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/10th-pass-percentage-90-in--tamilanadu--is-there-no-corona--39-138097.html
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.