ఏపీలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ కుట్ర.!

Publish Date:Jul 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాయలసీమ వ్యాప్తంగా ప్రధాన పార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో   ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మధుసూదన్ రెడి మాట్లాడారు.  రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించి ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని మధుసూదన్ రెడ్డి అన్నారు.   

ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి,  ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా బట్టకాల్చి మీదేసే రాజకీయాల వల్ల ప్రజల్లో నేతలపై నమ్మకం సడలిపోతుందన్నారు.

గతంలో కాపు సామాజిక వర్గంలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు, ఆ తర్వాత దళిత క్రైస్తవ అంశాలను తెరపైకి తెచ్చి అలజడులు సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ వరుస ఎపిసోడ్లను నడిపిందన్న ఆయన..  ఇప్పుడు రాప్తాడు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో పరిటాల సునీత కుటుంబం, స్థానిక ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఒకేసారి దాడులకు దిగడం వెనుక రాజకీయ వైరుధ్యాన్ని శాంతిభద్రతల సమస్యగా మార్చే కుట్ర దాగి ఉందన్నారు. అహోబిలం దేవస్థానం సొమ్ముపై గంగుల కుటుంబం చేస్తున్న ఆరోపణలు కూడా ఇందులో భాగమేనని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటికీ కాంట్రాక్ట్ పనులు, లిక్కర్ వ్యాపారాల్లో అవినీతి ఇంకా పూర్తిగా సమసిపోలేదన్న మధఉసూదన్ రెడ్డి.. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో జరుగుతున్న సీసీ రోడ్ల పనుల్లో కూడా కొందరు ప్రభుత్వ అధికారులు ఏడు శాతం వరకూ లంచాలు డిమాండ్ చేస్తున్నారని, ఈ విషయమై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్   దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరిట సొంత వారికి కట్టబెట్టిన గాలేరు, నగరి, హంద్రీనీవా పనుల్లో జాప్యం వల్లే ఈ వివాదాలు తలెత్తుతున్నాయని స్పష్టం చేశారు.

ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం మీడియా ముందుకు వచ్చి సవాళ్లు విసురుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, నాలుగు మసాలా వార్తలు వినా నిజాలు బయటకు రావన్నారు. ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే..  బాధితులు తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. చట్టపరమైన విచారణ జరిపించి, ఆధారాలు చూపని వారిని కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి పోకడలకు అడ్డుకట్ట పడుతుందన్నారు.

రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ప్రశాంతమైన వాతావరణం కొనసాగాలన్నా కూటమి ప్రభుత్వం అలజడులు సృష్టించే శక్తులపై ఉక్కుపాదం మోపాలని మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలనను గౌరవిస్తూ తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఏపీలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటాయని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని విశ్లేషించారు.

AP Politics Analysis,  MS Raju vs Thopudurthi Prakash Reddy,  Rayalaseema Political Riots, Kutami Government Law and Order

By
en-us Political News

  
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.