వెలగపూడిని దెబ్బకొట్టేందుకు వైసీపీ కుయుక్తి.. ఓట్ల గల్లంతు

Publish Date:Jul 23, 2023

Advertisement

 ఎలాగైనా మరోసారి అధికారం దక్కించుకోవాలి.. సామ దాన దండోపాయాలను ఉపయోగించి అయినా మళ్ళీ అధికారం పీఠంపై కూర్చోవాలి. ఇదీ ఇప్పుడు ఏపీలో వైసీపీ, జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. ఇందుకోసం కంకణం కట్టుకున్నారు. అభివృద్ధి అనేది పూర్తిగా పక్కకు పెట్టేసి బడుగు బలహీన వర్గాలకు పప్పు బెల్లాలు పంచుతూ అవే ఓట్టుగా మారుతాయని భావిస్తున్న జగన్  సామజిక వర్గాల వారీగా, మత ప్రాతిపదికన కూడా గాలమేసి పట్టుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీని దెబ్బతీసే మరికొన్ని ప్రయోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో ప్రధానమైన అంశం.. రాష్ట్రంలో భారీ ఎత్తున ఓట్ల గల్లంతు.. ఓట్ల బదిలీ. ఈ అంశంపై ప్రతిపక్షాలు భారీగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కీలకమైన, టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గాలలో ఈ ఓట్ల గల్లంతు ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

ఇందుకు ఉదాహరణ విశాఖ తూర్పు నియోజకవర్గం. ఈ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనడం ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 2009లో ఏర్పాటైన ఈ  నియోజకవర్గం ఆనాటి నుంచి ఈనాటి వరకూ టీడీపీనే గెలుస్తున్నది. ఇప్పటి వరకు ఈ స్థానంలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే మూడుసార్లూ టీడీపీయే గెలిచింది. ఈ మూడు సార్లూ కూడా ఆ నియోజకవర్గం నుంచి  వెలగపూడి రామకృష్ణబాబే గెలిచారు. టీడీపీ కఠిన పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రత్యర్థులకు ఎదురు నిలబడే రామకృష్ణ బాబుకు ఆయన నియోజకవర్గంలో కూడా అదే పేరుంది. అందుకే ఆయన ఓటమి అనేది ఎరుగరు. నిజానికి ఆయనది విశాఖ జిల్లా కూడా కాదు. ఎక్కడో విజయవాడ నుంచి విశాఖకు వచ్చి వ్యాపారం చేసుకుంటున్న ఆయన నందమూరి బాలకృష్ణకు ఆప్తుడిగా పేరుంది. బాలయ్య సిఫార్సు మేరకే 2009లో తొలిసారి సీటు దక్కించుకున్నారు.

బాలకృష్ణ సిఫార్సు అయితే చేశారు కానీ ఎన్నికలలో గెలిచింది మాత్రం ఆయనే. 2009లో ప్రజారాజ్యం పార్టీ భారీగా ఇక్కడ ఓట్లు చీల్చినా వెలగపూడి తట్టుకొని నిలబడ్డారు. ఆ తర్వాత 2014లో ఆయనకు ఏపీలో రెండవ అతి పెద్ద మెజారిటీ దాదాపుగా 47 వేల పై చిలుకు వచ్చిందంటే ఆయన ఛరిస్మా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక, 2019లో జగన్ ఒక్క ఛాన్స్ వేవ్ లో కూడా తట్టుకొని నిలబడిన వెలగపూడి.. అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ దాడి చేసే సమయంలో.. వెలగపూడి చంద్రబాబు ముందు నిలబడి సవాల్ విసిరి తన గౌరవాన్ని మరింత పెంచుకున్నారు. అందుకే వైసీపీ కన్ను ఈ స్థానంపై పడింది. చట్టబద్దంగా అయితే ఈ నియోజకవర్గాన్ని ఏమీ చేయలేరు కనుక ఇక్కడ భారీగా టీడీపీ సానుభూతిపరుల ఓట్ల గల్లంతుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 వేలకు పై చిలుకు ఓట్లను తొలగించేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

తన నియోజకవర్గంలో మొత్తం 40 వేల ఓట్లు గల్లంతు అయ్యాయని వెలగపూడి తీవ్రమైన ఆరోపణ చేశారు. 2019లో ఉన్న ఓట్లు ఇప్పుడు ఎలా మాయమవుతాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనిని అధికారులు కూడా దృవీకరిస్తున్నారట. ఓట్లను తొలగించిన మాట వాస్తవేమని.. అయితే, తాత్కాలికంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తున్నామని చెబుతున్నారట. దీంతో పాటు ఒకే కుటుంబంలో ఉన్న వారిని వేరు వేరు బూతులలోకి బదిలీ చేస్తున్నారట. ఇప్పటికే ఇలా ఓట్లు కోల్పోయిన వారు, బదిలీ అయిన వారు అధికారులను కలిసినా ఉపయోగం లేకుండా పోయిందట. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.