Publish Date:Mar 10, 2025
వారసులను పక్కన పెట్టే యోచనలో వైసీపీ సీనియర్లు..
వైసీపీలోని కొందరు సీనియర్లు తమ మనస్సు మార్చుకుంటున్నారట. గడచిన ఎన్నికల్లో తమకు ఈ రాజకీయాలు వద్దు.. తమ వారసులకు టిక్కెట్లివ్వండని ఆ పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చి మరీ తమ వారసులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇప్పించుకున్నారు. గత ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణ స్వామి, పేర్ని నాని వంటి వారు తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు. ఇలా వారసులకు టిక్కెట్లు ఇప్పించుకున్న వారిలో కొందరు తిరిగి తామే పోటీ చేయడానికి సిద్దమవుతున్నట్టు సమాచారం. గడచిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలవడంతో పాటు.. వారసులెవరూ తాము అనుకున్న విధంగా రాణించ లేకపోతున్నారు. దీంతో మళ్లీ రంగంలోకి దిగాలని రాజకీయాలకు దూరం అని గతంలో చెప్పుకున్న కొందరు నేతలు భావిస్తున్నారట.
తిరుపతి నుంచి భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, గంగాధర నె ల్లూరు నుంచి కృపాలక్ష్మీ, బందరు నుంచి పేర్ని కిట్టు పోటీ చేశారు. వీళ్లంతా సైకిల్ స్పీడును, గాజు గ్లాస్ కోతను తట్టుకోలేకపోయారు.. అల్లాడిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. తాము జోక్యం చేసుకోకపోతే.. తమ కుటుంబాల రాజకీయ భవిష్యత్ కు ఇక్కడితోనే ఫుల్ స్టాప్ పడేట్టుందనే ఆందోళన ఆయా పుత్ర రత్నాల తండ్రులలో వ్యక్తమౌతోందట. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వారసుల కంటే.. తండ్రులే ఎక్కువగా రాజకీయం చేస్తున్నారు. తెలుగుదేశం నేతలతో.. ఎమ్మెల్యేలతో ఢీ అంటే ఢీ అంటున్న పరిస్థితి కన్పిస్తోంది. గంగాధర నెల్లూరు మినహా.. వారసులు పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ తండ్రులే తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు.
ఇలా ఆలోచించే వారిలో ముఖ్యంగా పేర్ని నాని ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బందరు నుంచి తానే రంగంలోకి దిగాలని దాదాపు డిసైడైనట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పేర్ని నాని తన సన్నిహితుల వద్ద కూడా చెబుతున్నట్టు తెలుస్తోంది. తన వారసుడు పేర్ని కిట్టునే మళ్లీ పోటీ చేస్తే.. గెలవడం కష్టమేమోననే ఆందోళవతో ఉన్నారట పేర్ని నాని. గడచిన ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచే తాను రాజకీయాలకు దూరంగా వెళ్లిపోతానని.. ఈ రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని..ఇలా చాలానే చెప్పారు పేర్ని నాని. ఇంత త్వరగా రాజకీయాల నుంచి నిష్క్రమించడం కరెక్ట్ కాదని.. చాలా మంది చెప్పి చూశారు. కానీ పేర్ని నాని నాడు వినలేదు. తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందారు. ఇప్పుడు మారిన పరిణామాలతో పేర్ని నాని తిరిగి పోటీ చేయడానికి దాదాపు డిసైడ్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద కూడా పేర్ని నాని ప్రస్తావిస్తున్నారని సమాచారం.
పేర్ని నాని తరహాలోనే మరి కొందరు కూడా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 2024 ఎన్నికల్లో కూడా తాము సునాయాసంగా గెలిచేస్తామనే ఓవర్ కాన్ఫిడెన్సుతో వారసులను రంగంలోకి దించారు.. కొందరు వైసీపీ నేతలు. దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలనే థియరీని అనుసరించి.. వారసులకే టిక్కెట్లు ఇప్పించుకున్నారు. కానీ.. వారు అనుకున్నదొకటైతే.. దేవుడి స్క్రిప్ట్ మరో రకంగా ఉంది. వారసులను పొలిటికల్ గా సెటిల్ చేద్దామనుకుంటే.. ఏకంగా ఫ్యామిలీయే రాజకీయాలకు దూరమైపోయే పరిస్థితులు వచ్చేలా చేస్తున్నారు పుత్ర రత్నాలు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి వారసులను పక్కన పెట్టి.. మళ్లీ తామే రంగంలోకి దిగాలని భావిస్తున్నారట సదురు తండ్రులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-seniors-back-into-action-39-194165.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.